ఎన్నికలు అనగానే నాయకులు.. ఏం చెబుతారో పెద్దగా ఊహించాల్సిన అసవరం లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్తే అక్కడి పాటే పాడుతున్నారు. పైగా పోటీ తీవ్రంగా ఉన్న తెలంగాణలో అయితే.. మరింతగా ఎక్కువగా నాయకులు ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా సీఎం కేసీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కాపోణ్నే.. నేను కూడా వ్యవసాయం చేస్తా. వరి నాటేస్తా.. నాకు రైతుల కష్టాలు తెలుసు! …
Read More »కాంగ్రెస్ డేరింగ్ స్టెప్
పోలింగుకు వారం రోజులముందు పార్టీలోని కొందరు నేతలను బహిష్కరించటం అంటే ఊహించలేం. అధికారికంగా పోటీచేస్తున్న అభ్యర్ధులకు సహకరించటంలేదని తెలిసినా మామూలుగా ఏ పార్టీ కూడా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోదు. ఎందుకంటే పార్టీ నష్టంచేస్తున్న నేతలపై యాక్షన్ తీసుకుంటే ఇంకెంత కంపుచేస్తారో అనే భయం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి భయాలు పెట్టుకోకుండా వెంటనే కొందరిపై బహష్కరణ అస్త్రాన్ని ప్రయోగించేసింది. దాంతో మిగిలిన జిల్లాల్లోని కొందరు అసంతృప్తనేతలు దారికి వస్తున్నట్లు …
Read More »ఎన్నిసార్లు ఓడినా తగ్గేదేలే
ఏ రాష్ట్రంలో అయినా రాజకీయాలు ఇప్పుడు ఖరీదై పోయాయి. పైగా పోటీ కూడా పెరిగిపోయింది. దీంతో రాజకీయాల్లో నాయకులు నిలదొక్కుకోవడం కష్టతరంగా మారింది. ఇక, ఎన్నికలు అనగానే మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కోట్లకు కోట్లు కుమ్మరించాల్సి ఉంటుంది. ఏదో ప్రయాస పడి.. పోటీ చేసినా.. ఒక్క ఓటమితోనే కుప్పకూలే నాయకులు చాలా మంది ఉన్నారు. “చాలు బ్రో! చేతి చమురు వదిలిపోయింది” అనే కామెంట్లు వినిపించేవి. కానీ, ఇప్పుడు …
Read More »నన్ను తిడితే.. కేసీఆర్ పార్టీ చేసుకుంటారు: మోడీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ఏర్పాటు చేసిన సకలజనుల విజయ సంకల్ప సభలో మాట్లాడారు. బీఆర్ ఎస్ విముక్త తెలంగా ణ లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని చెప్పారు. బీఆర్ ఎస్ను తరిమి కొట్టడమే లక్ష్యంగా ఇక్కడి ప్రజలు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. అదేసమయంలో …
Read More »పీవీ గురించి ప్రియాంకా గాంధీకేం తెలుసు?: కేటీఆర్
తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసేందుకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కొనుగోళ్లు చేయడం అలవాటేనంటూ ఓటుకు నోటు కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని …
Read More »తెలంగాణలో హంగ్.. ఏం జరుగుతుంది…?
అత్యంత తీవ్రంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఒకవైపు.. ప్రజానాడి అందని దుస్థితి మరోవైపు.. ఇదీ ఇతమిత్థంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ నలుగురు చర్చించుకున్నా వినిపిస్తున్న టాక్. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. 119 నియోజకవర్గాల్లో దాదాపు 3 వేల మందికిపైగా అభ్యర్థులు తలపడుతున్నారు. వీటిలో ప్రధాన పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ-జనసేన, సహా బీఎస్పీ వంటి పార్టీలు ఉన్నాయి. వీటితో పాటు.. మరో రెండు చిన్నాచితకా పార్టీలు స్వతంత్రులు …
Read More »కేసీఆర్కు టెస్ట్ పెడుతున్న కాంగ్రెస్ అభ్యర్థులు!!
రాజకీయాలు రాజకీయాలే! అవి ఎవరివైనా కావొచ్చు. తెలగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రచారంలో జరుగుతున్న వ్యూహాలు.. సీఎం కేసీఆర్కు టెస్ట్ మ్యాచ్గా మారాయని అంటున్నారు పరిశీలకులు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితి డోలాయమానంగా ఉందనే టాక్ సర్వేల ద్వారా వినిపిస్తోంది. అలాగని .. అక్కడి బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా.. పాజిటివ్ టాక్ లేదట. అంతేకాదు.. ఆయా కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల …
Read More »మేం వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దే: అమిత్ షా
బీజేపీ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో అమలు చేస్తున్న ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడే ఉన్న ఆయన.. శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే 4శాతం ముస్లిం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. వరికివెయ్యి బోనస్ బీజేపీకి …
Read More »‘నీ ఎన్నికల గుర్తు కంటే.. నువ్వే అందంగా ఉన్నావ్!’
మహిళలపై భౌతిక దాడులేకాదు.. మానసిక దాడులు కూడా కొనసాగుతున్నాయనేందుకు.. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఒకవైపు మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. దేశం ముందుకు సాగు తుంటే.. మరోవైపు వారిని అవమానించే క్రతువులు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల బరిలో నిలిచి.. ప్రజల మధ్య జై కొట్టించుకుని చట్టసభల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నవారి విషయంలోనే అవమానాలు.. ఎదురవుతున్నాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగిన మహిళా అభ్యర్థి …
Read More »కదులుతున్ననారా కుటుంబం.. పక్కా ప్లాన్ ఇదే!
2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ.. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ రెడీ చేసుకుంది. ఎన్నిఅవాంతరాలు వచ్చినా.. ఇబ్బందులు వచ్చినా.. ప్రజల్లోకి వెళ్లడమే ధ్యేయంగా ప్లాన్ చేసుకోవడం గమనార్హం. ఈ నెల 27 నుంచి నారా లోకేష్ పాదయాత్రను పునః ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో నిలిపివేసిన పాదయాత్రను అక్కడ నుంచి ఆయన తిరిగి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర వచ్చే ఏడాది జనవరి రెండో వారం …
Read More »ఇంకోసారి ఇలా మాట్లాడితే పార్టీనే రద్దు చేస్తాం: ఈసీ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం నిప్పులు చెరిగింది. ఇలా ఇంకోసారి మాట్లాడితే.. చర్యలు తప్పవు. అవసరమైతే.. పార్టీని సైతం రద్దు చేస్తాం! అంటూ.. ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం పొద్దు పోయాక.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రగతి భవన్కు లేఖ అందింది. ఈ లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం పలు విషయాలను …
Read More »బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫెయిలయ్యాయా ?
తొందరలో జరగబోతున్న ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫెయిలైనట్లే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ మీద మండిపోతున్న ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ కు మద్దతివ్వాలని డిసైడ్ చేశారు. ముస్లిం మైనారిటి సంఘం, జమాత్ ఏ హింద్ సంస్ధలు కాంగ్రెస్ కు మద్దతుగా ఓట్లేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ సంస్ధలు తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ కు షాకనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం 119 నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 40 …
Read More »