ప్రస్తుతం ఏదీ దాగదు.. సోషల్ మీడియా పవర్ పుల్గా ఉంది.. ప్రధాన మీడియా అయితే.. విస్తృతంగా ఉందని చెప్పుకొంటాం కదా!. కానీ.. కొన్ని కొన్ని కీలక విషయాలు ఇప్పటికీ ఎవరో ఒకరు బయట పెడితే తప్ప తెలియడం లేదు. తాజాగా ఇలాంటి ‘షాకింగ్ న్యూస్’ ఒకటి.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి స్వయంగా బయటకు వెల్లడిస్తే.. తప్ప.. వెలుగు చూడలేదు. అంతేకాదు.. ఇది తెలిసిన తర్వాత.. అందరూ …
Read More »నష్టం పూడ్చడానికి ఢిల్లీకి బాబు
ప్రస్తుతం తలెత్తిన తుఫాను నష్టాన్ని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రాథమికంగా 5625 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. ఇక పూర్తిస్థాయిలో నష్టాన్ని రెండు మూడురోజుల్లోనే అంచనా వేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సాయం తీసుకువచ్చి రాష్ట్రంలో తుఫాను ప్రభావిత బాధితులకు అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ దఫా లేఖలు రాసినా ఆయనే స్వయంగా ఢిల్లీకి వెళ్లనున్నారని సీఎంవో వర్గాలు …
Read More »రేపటి నుంచి సీఎం చంద్రబాబు లండన్ టూర్
ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవలే.. దుబాయ్లో మూడు రోజుల పాటు పర్యటించారు. పెట్టుబడుల వేటలో ఉన్న ఆయన.. గల్ఫ్ దేశాల్లో సుడిగాలి పర్యటనలు చేసి.. పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా దుబాయ్ మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ప్రవాసాంధ్రులను కలిసి.. పీ-4లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇలా.. మూడు రోజుల పాటు అనేక మందిని కలిసి పెట్టుబడులపై చర్చించారు. ఈ క్రమంలో మరోసారి …
Read More »అనే.. నేను: మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం
భారత మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాజ్భవన్లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. కాగా, 1963, ఫిబ్రవరి 8న హైదరాబాద్లో జన్మించిన అజారుద్దీన్.. భారత క్రికెట్ దిగ్గజంగా పేరు తెచ్చుకున్నారు. క్రికెట్ నుంచి …
Read More »టీడీపీ మేయర్ కపుల్ మర్డర్: ఐదుగురికి ఉరి శిక్ష
ఏపీలో జరిగిన మేయర్ దంపతుల దారుణ హత్య కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషులుగా తేలిన ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. అదేవిధంగా ఈ కేసులో ఏ1గా ఉన్న దోషికి ఏకంగా 70 లక్షల రూపాయల జరిమానా విధించిన కోర్టు.. దీనిలో 50 లక్షల రూపాయలను బాధిత కుటుంబానికి అందించాలని, మరో 20 లక్షల రూపాయలను గాయపడిన వ్యక్తికి ఇవ్వాలని జిల్లా స్థాయి కోర్టు జడ్జి సంచలన …
Read More »వందేమాతరాన్ని కూడా కాంగ్రెస్ అవమానించింది: మోడీ
వందేమాతరం గీతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శిం చారు. స్వాతంత్య్ర సంగ్రామంలో వందేమాతరం నినాదం కీలక భూమిక పోషించిందన్నారు. అదేవిధంగా జాతి ఐక్యతకు, సంఘీభావానికి వందేమాతరం ప్రతీకగా నిలిచిందని తెలిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీ దీనిని కూడా అవమానించిందని.. వందేమాతరంలోని కొన్నిపంక్తులను తొలగించిందని విమర్శించారు. దేశ మాజీ ఉప ప్రధాని, ఐక్యతా మూర్తి… సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని …
Read More »ఈ ఏపీ లీడర్లు ఆ మెజారిటీని నిలబెట్టుకుంటే చాలు ..!
గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మందికి 30-50 వేల ఓట్ల మెజారిటీ లభించింది. ఈ మెజారిటీని నిలబెట్టుకుంటున్నారా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. ఎన్నికల సమయానికి ప్రజల్లో వచ్చే భావోద్వేగాలు కీలక రోల్ పోషిస్తున్నాయి. దీంతో పార్టీలకు పార్టీలను ఓటర్లు పక్కన పెడుతున్నారు. సహజంగా ఒకప్పుడు ఓడిన పార్టీకి కూడా గౌరవ ప్రదమైన స్థానాలు దక్కేవి. కానీ, ఏపీలో పరిస్థితి దీనికి భిన్నంగా మారుతోంది. ఓడిపోయిన …
Read More »పరిస్థితి బాలేదు.. రేవంత్ గారూ.. కదలాలి మీరు!
ఈ మాట ఎవరో కాదు.. పార్టీనాయకులు, కార్యకర్తలే కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని.. రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని.. కొందరు నేతలు సోషల్ మీడియాలో సంబంధిత వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఇక ప్రధాన మీడియా కూడా ఇలాంటి వార్తలను ప్రస్తావిస్తోంది. దీంతో పరిస్థితి చేయి దాటకముందే… సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి.. అన్నదాతలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందనే మాట సర్వత్రా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏం జరిగింది? …
Read More »టీటీడీ లడ్డూ: కిలో నెయ్యికి రూ.25 కమీషన్!
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం.. కల్తీ అయిందని.. జంతువుల కొవ్వు కలిసిందని.. ఇదంతా వైసీపీ హయాంలోనే జరిగిందని.. గత ఏడాది జూలై- ఆగస్టుమధ్య పెను వివాదం తెరమీదకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది.. కేవలం రాష్ట్రాన్నే కాకుండా.. దేశాన్ని కూడా కుదిపేసింది. వేలాది మంది శ్రీవారి భక్తులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ప్రస్తుతం …
Read More »తుఫానును ఆపలేదు.. కానీ: చంద్రబాబు
తాజాగా వచ్చిన మొంథా తుఫాను, అనంతరం జరిగిన నష్టం.. కష్టంపై సీఎం చంద్రబాబు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులతో సమీక్షలపై సమీక్షలు నిర్వహించారు. ప్రతి ప్రాంతం, మండలం సహా గ్రామాల నుంచి సమాచారం సేకరించారు. ఎంత నష్టం వచ్చింది.. ఎంత కష్టం మిగిలింది ? అనే అంశాలను ఆయన కూలంకషంగా చర్చించారు. సాగు, రహదారుల నష్టంపై పక్కా క్లారిటీని తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫానును …
Read More »ఆ 40 శాతం కోసమైనా చేసిందేముంది.. జగన్ ..!
గత ఎన్నికల్లో తమకు 40 శాతం మేరకు ప్రజలు ఓట్లు వేశారని వైసీపీ అధినేత జగన్ తరచుగా చెబుతున్నారు. అందుకోసమైనా.. వారి తరఫున ప్రశ్నించేందుకైనా.. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన ఇటీవల కూడా ప్రభుత్వాన్ని, స్పీకర్ను కూడా కోరారు. ఇదిలావుంటే.. మొంథా తుఫాను సమయంలో జగన్ అందుబాటలో లేని విషయం తెలిసిందే. తాను బెంగళూరులో ఉన్నానని.. విమాన సేవలు నిలిపివేయడంతో రాలేక పోయానని చెప్పారు. కానీ, పార్టీ …
Read More »వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పొలంబాట పట్టారు. తుఫాను ప్రభావంతో భారీగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పొలాలను ఆయన పరిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం పర్యటించిన పవన్ కల్యాణ్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతులను పరామర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి పైరు పరిశీలించారు. బురదలోనే నడుస్తూ.. పొలం మధ్యకు వెళ్లి పరిశీలించారు. రైతుల సమస్యలను ఓపికగా విన్నారు. వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates