Political News

ముగిసిన ‘వ‌సుంధ‌ర’ శ‌కం.. రాచ‌రికానికి స్వ‌స్తి!

వ‌సుంధ‌ర రాజే. ఈ పేరు చెప్ప‌గానే గుర్తుకు వ‌చ్చే పేరు రాజ‌స్థాన్‌. ఈ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా ఆమె త‌న‌దైన ముద్ర వేశారు. అంతేకాదు.. బీజేపీని న‌డుం క‌ట్టుకుని ముందుకు న‌డిపించిన చ‌రిత్ర కూడా సృష్టించారు. గ‌తంలో 2013-2018 మ‌ధ్య రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలోనూ.. ఆమె త‌న‌దైన పాల‌న‌తో ముద్ర వేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఇక‌, ఆమె శ‌కం ముగిసింది. ప్ర‌స్తుతం వ‌సుంధ‌ర‌రాజే వ‌య‌సు 70 సంవత్స‌రాలు. …

Read More »

జ‌న‌సేన‌, టీడీపీ నుంచి సిగ్న‌ల్ వ‌స్తే చాలు జంపింగ్‌కు రెడీ…!

వైసీపీలో ప‌రిణామాలు మారుతున్నాయి. ఎప్పుడు ఎవ‌రిని పార్టీ అధిష్టానం ప‌క్క‌న పెడుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఎవ‌రిని తోసిపుచ్చి.. కొత్త‌వారికి ప‌గ్గాలు అప్ప‌గిస్తుందో తెలియని వైనం. దీంతో నాయ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. తాజాగా పార్టీ అధిష్టానం ఉరుములు లేని పిడుగు మాదిరిగా తీసుకున్న ఇంచార్జుల మార్పు నిర్ణ‌యం.. పార్టీలో తీవ్ర చ‌ర్చకు దారితీసింది. ఒక‌వైపు రాజీనామాలు చేసే వారు చేస్తున్న స‌మ‌యంలో వారిని బుజ్జ‌గించ‌డ‌మో.. లాలించ‌డ‌మో.. వారి డిమండ్ల‌ను ప‌రిష్క‌రించే …

Read More »

ఈ సీట్లో టీడీపీ జెండా ఎగురుతుందా ?

ఇపుడిదే చర్చ పార్టీలో బాగా పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే కడప పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని చంద్రబాబునాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే అది సాధ్యమేనా అనే చర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే పార్టీ పెట్టినదగ్గర నుండి టీడీపీ 1984లో తప్ప ఇంకే ఎన్నికలోను గెలవలేదు. మొదట్లో కమ్యూనిస్టు అభ్యర్ధి వై ఈశ్వరరెడ్డి నాలుగు సార్లు గెలిచారు. తర్వాత కాంగ్రెస్ మూడు ఎన్నికల్లో …

Read More »

టార్గెట్ ఏపీ.. కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల మాస్ట‌ర్ ప్లాన్‌

తెలంగాణలో అధికారం ద‌క్కించుకోవాల‌న్న క‌ల‌ల‌ను సాకారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. స‌క్సెస్ అయింది. తాజాగా తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ఆలంబ‌న‌గా చేసుకుని ఏపీలో చ‌క్రం తిప్పేందుకు.. కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కులు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ప‌క్కా ప్లాన్ కూడా రెడీ చేసుకున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. …

Read More »

పవర్ పాయింటుకు రెడీ అవుతున్నారా ?

పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అప్పులపై అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి రేవంత్ వివిధ శాఖల పనితీరుపై సమీక్షలు చేస్తున్నారు. ఇందులో కూడా రెవిన్యు, ఫైనాన్స్ శాఖల ప్రభావం ఎక్కువగా ఉన్న శాఖలపైనే ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే విద్యుత్ శాఖ, ధరణి పోర్టల్ ను నిర్వహించే ఆర్ధికశాఖ, పరిశ్రమల్లాంటివి కీలకంగా ఉన్నాయి. ఈ …

Read More »

ష‌ర్మిల విష‌యంలో కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం?

Sharmila

తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తెస్తానంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ త‌న‌య ష‌ర్మిల పాదాల‌తో న‌డిచే పాద‌యాత్ర చేసినా.. పార్టీని పుంజుకునేలా చేయ‌డంలో ఒకింత వెనుక‌బ‌డ్డార‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో ఉభ‌యకుశ‌లోప‌రిగా.. ఆమె త‌న వ్యూహానికి ప‌దును పెట్టి.. ఎన్నిక‌ల వేళ పోటీ నుంచి త‌ప్పుకొని కాంగ్రెస్కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాను కూడా బ‌రిలో నిలిస్తే.. కేసీఆర్ మ‌ళ్లీ విజ‌యం ద‌క్కించుకుంటార‌ని.. అందుకే.. తాను పోటీ నుంచి …

Read More »

బీసీ బంధుకు బ్రేక్

గత ప్రభుత్వంలో ఎంతో వివాదాస్పదమైన పథకాల్లో ఒకటైన బీసీ బంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. పథకం అమలులో వచ్చిన అనేక ఆరోపణలపై సమీక్షలు జరిపేందుకే పథకాన్ని తాత్కాలికంగా నిలిపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పథకం అమలులో వచ్చిన ఆరోపణలను సమీక్షించి, ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. సమీక్షల సందర్భంగా ఆరోపణలను, ఫీడ్ బ్యాక్ ను చర్చించి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్నీ కోణాల్లో …

Read More »

బస్సు దెబ్బ మెట్రో మీద పడిందా ?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ప్రభావం మెట్రో ట్రైన్ మీద బాగానే పడినట్లుంది. రోజువారి ప్రయాణించే వారి సంఖ్య బాగానే తగ్గిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నివేల బస్సులున్నా రద్దీని తట్టుకోలేకపోతున్నాయి. ఎన్ని బస్సులున్నా ప్రయాణీకులకు సరిపోవటంలేదు. అందుకనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బాగా ఆలోచించి మెట్రో రైలు ప్రాజెక్టును ఓకే చేశారు. అయితే ప్రాజెక్టుకు డీపీఆర్ తయారై తొందరలోనే ప్రాజెక్టు …

Read More »

మాజీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ?

బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన ఎంఎల్ఏల్లో జీవన్ రెడ్డి కూడా ఒకరు. నిజామాబాద్ అసెంబ్లీ నుండి రెడ్డి పదేళ్ళు ఎంఎల్ఏగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో కేసీయార్ ఎందుకనో జీవన్ రెడ్దిని దూరంపెట్టారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే కొందరి బండారం బయటపడుతోంది. ఇందులో ముఖ్యంగా జీవన్ రెడ్డి వ్యవహారమంతా ఒక్కోటిగా వెలుగుచూస్తోంది. తాజాగా ఫైనాన్స్ కార్పొరేషన్ లో అప్పు తీసుకుని ఎగ్గొట్టిన విషయం బయటపడింది. ఇప్పటికే ఆర్టీసీ …

Read More »

నాయ‌కులా… పార్టీలా… ఈ సారి జై కొట్టేదెవ‌రికి… !

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌లు అత్యంత వాడివేడిగా సాగ‌నున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మించి.. ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కుతాయ‌ని.. ఎన్నిక‌లు స‌ల‌స‌ల మ‌రుగుతాయ‌ని అంటు న్నారు. ఇదిలావుంటే.. అస‌లు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌లు ఈ సారి ఎవ‌రిని ఎంచుకుంటారు? అనేది కీల‌క ప్ర‌శ్న‌గా మారింది. పార్టీల‌ను చూసి ఓటేస్తారా? లేక‌.. ఎమ్మెల్య అభ్య‌ర్థుల‌ను చూసి ఓటేస్తారా? లేక పార్టీల అధినేత‌ల‌ను బ‌ట్టి ఓటెత్తుతారా? అనేది కీల‌క చ‌ర్చ‌గా మారింది. …

Read More »

చీరాల హోరు మామూలుగా ఉండేలా లేదే..!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ద‌ఫా ఎన్నిక‌ల పోరు మామూలుగా ఉండేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తానికి భిన్నంగా ఇక్క‌డ రాజ‌కీయాలు తెర‌మీదికి రావ‌డం.. నాయ‌కులు మార‌డంతో పోరు తీవ్రంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. టీడీపీ ఇక్క‌డి టికెట్‌ను జ‌న‌సేన‌కు త్యాగం చేసింద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో చీరాలపై అంచ‌నాలు మ‌రింత పెరుగుతున్నాయి. ఇక‌, వైసీపీ కూడా యువ నాయ‌కుడికి టికెట్ ఇవ్వ‌డం ఖాయ‌మైంద‌ని అంటున్నారు. దీంతో ప్ర‌కాశం …

Read More »

వైసీపీపై ఇక యుద్ధ‌మే: ప‌వ‌న్ ఫైర్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీ అధికార పార్టీ వైసీపీపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “ఇక‌, యుద్ధం చేయ‌క త‌ప్ప‌దు” అని హెచ్చ‌రించారు. జ‌న‌సేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అరెస్టును ఆయ‌న‌ ఖండించారు. నాదెండ్ల అరెస్టు అప్రజాస్వామికమ‌ని, విశాఖలోని టైకూన్‌ జంక్షన్‌ వద్ద రోడ్డును తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా అని నిప్పులు చెరిగారు. జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని ప‌వ‌న్ …

Read More »