Political News

ప్లాన్ ప్ర‌కార‌మే అల‌జ‌డి.. వారంతా వైసీపీ రైతులే!

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. ప‌క్కా ప్లాన్‌తో వ్య‌వ‌హ‌రించార‌ని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాకే చెందిన వైసీపీ మాజీ స‌ర్పంచ్ ప్ర‌కాష్ రెడ్డికి 25 ఎక‌రాల మామిడి తోట ఉంద‌ని.. ఆయ‌న గ‌తంలోనే చాలా వ‌ర‌కు కాయ‌ల‌ను కిలో 4 రూపాయ‌ల చొప్పున అమ్మేసుకున్నార‌ని చెప్పారు. అయితే.. జ‌గ‌న్ వస్తున్నాడ‌ని తెలిసి.. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ఐదు ట్రాక్ట‌ర్ల‌లో మామిడికాయ‌ల‌ను త‌ర‌లించి.. న‌డిరోడ్డుపై పోసి.. ప్ర‌భుత్వానికి …

Read More »

ఏపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌.. ఢిల్లీకి బాబు!

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన పలు అనుమతులు, నిధుల విషయంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు ఈనెల 14న ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ పై గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. కానీ ఎటువంటి క్లారిటీ రావడం లేదు. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మంత్రివర్గంలోకి వస్తారని ప్రచారం జరిగింది. దీనికి ముఖ్య మంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనే ప్రధాన కారణం. ఓ …

Read More »

త్వరలో రిటైర్ అయిపోతానన్న షా

అమిత్ షా. కేంద్ర హోం శాఖ మంత్రి. ఆయ‌న గురించి అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో గుజ‌రాత్ రాష్ట్ర హోం శాఖ మంత్రిగా, ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సీఎంగా ప‌నిచేశారు. ఈ ద్వ‌యం 2014 నుంచి కేంద్రంలో ప్ర‌ధాని-హోం శాఖ మంత్రులుగా ప‌నిచేస్తున్నారు. ప్ర‌స్తుతం 60 ఏళ్ల వ‌య‌సులో ఉన్న అమిత్ షాపై త‌ర‌చుగా ఒక ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌ధానిగా ఉన్న న‌రేంద్ర మోడీ రిటైర్ అయితే..(అంటే.. 75 ఏళ్ల …

Read More »

ఆ ఏపీ మంత్రులిద్ద‌రు మ‌న‌స్సు దోచేశారుగా… !

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గంలో 25 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో కొంతమంది మంచి మంత్రులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఇద్దరు మంత్రుల గురించి సీఎం చంద్రబాబు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారే అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి వరుస విజయం దక్కించుకున్న పయ్యావుల కేశవ్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతున్న వివాదాస్పద రహితంగా వ్యవహరించే నాయకుడిగా పేరు తెచ్చుకున్న నిమ్మల …

Read More »

ప్ర‌శాంతిరెడ్డికి అండ‌గా.. నంద‌మూరి అక్కాచెలెళ్లు!

వైసీపీ నాయ‌కుడు, నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి.. టీడీపీ నాయ‌కురాలు.. ఇదే నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌స్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్య‌ల‌ను పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ఖండిస్తున్నారు. కూట‌మి నాయ‌కులు స‌హా.. క‌మ్యూనిస్టు నేత‌లు కూడా.. ప్ర‌స‌న్న కుమార్‌రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా నంద‌మూరి కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు.. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, నారా భువ‌నేశ్వ‌రి స్పందించారు. ప్రసన్నకుమార్ రెడ్డి …

Read More »

మా మంచి ఎంపీ: అనుభ‌వం లేకున్నా అల్లుకుపోతున్నారే.. !

ఆయన ఓ ఎంపీ. అంతే కాదు కేంద్రంలో మంత్రి కూడా. తొలిసారి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని దక్కించుకున్నారు. టిడిపికి కంచుకోటగా భావించే గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్నారు. ఆయ‌నే పెమ్మ‌సాని చంద్రశేఖర్. వృత్తిరీత్యా వైద్యుడు. అమెరికాలో వైద్యశాలలతో పాటు అక్కడ వైద్య వ్యాపారంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు పిలుపుతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన …

Read More »

చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా 200 ఈ-మెయిళ్లు?

ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు, అదేవిధంగా ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టే వారికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే, రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా నిలువరించేలా, పెట్టుబడులు పెట్టే …

Read More »

తూర్పు-ప‌డ‌మ‌ర‌ను త‌ల‌పిస్తున్న బీఆర్ఎస్ పాలిటిక్స్‌!

తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ రాజ‌కీయాలు తూర్పు-ప‌డమ‌ర అన్న‌ట్టుగా సాగుతున్నాయ‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఈ పార్టీకి చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు.. ఎవ‌రికి వారుగా రాజ‌కీయాలు చేసుకుంటారు. ఒకే రోజు ఇద్ద‌రూ విభిన్న కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. అయితే.. ఇరువురూ క‌లిసి ఈ కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా బీఆర్ఎస్ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వారే.. …

Read More »

సెల్ ఫోన్ ప‌ట్టిన చంద్ర‌బాబు.. ఫ‌స్ట్ టైమ్ ఏం చేశారంటే!

ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే ఎంతసేపు అభివృద్ధి, పెట్టుబడులు.. మౌలిక సదుపాయాల కల్పన, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న‌ను మ‌లిచింది కూడా ఇలాంటి ప‌నులే. అయితే.. చేతిలో అప్పుడప్పుడు కొన్ని ఫైళ్లు మాత్రం కనిపిస్తాయి. కానీ సెల్ ఫోన్ పట్టుకొని కనిపించిన సందర్భాలు ఎప్పుడూ లేవు. పర్సనల్‌గా ఉన్నా.. …

Read More »

ఏపీలో మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సులు.. రూల్స్ ఇవే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ‘సూప‌ర్ 6’ ప‌థ‌కాల అమ‌లుకు ప‌దును పెంచుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా కీల‌క‌మైన మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణానికి సంబంధించి అధికారులు క‌స‌ర‌త్తు పూర్తి చేశారు. వ‌చ్చే ఆగ‌స్టు 15 నుంచి ఈ ప‌థ‌కాన్ని రాష్ట్రంలో అమ‌లు చేయ‌నున్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రులు కూడా క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం చేస్తున్నారు. ఆగ‌స్టు 15 నుంచి మ‌హిళ‌ల జీవితాల్లో కొత్త మార్పు …

Read More »

ఇక‌, ‘గంటా’ వంతు.. కూట‌మిపై రుస‌రుస‌లు!

కూట‌మి ప్ర‌భుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న‌వారు.. కీల‌క ప‌ద‌వులు అనుభ‌వించిన అనుభ‌వం ఉన్న‌వారు.. త‌మ అసంతృప్తిని, ఆవేద‌న‌ను వెలిబుచ్చుతున్నారు. అయితే.. దీనిని ప‌నిరూపంలో చేసి.. చంద్ర‌బాబు ను మెప్పించే విధంగా వ్య‌వ‌హ‌రిస్తే.. బాగుంటుంది. కానీ.. నోటికి ప‌నిచెబుతూ.. ప్ర‌భుత్వాన్ని ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ.. చుల‌క‌న వ్యాఖ్య‌ల‌తో ప‌రువు తీస్తున్నారు. ఇటీవ‌ల.. జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూట‌మి ప్ర‌భుత్వంపైనా.. కూట‌మిపైనా విమ‌ర్శ‌లు చేశారు. ఇక‌, తాజాగా ఈ జాబితాలో మాజీ మంత్రి, …

Read More »

రౌడీ షీట్లే: వైసీపీకి ఎస్పీ ఘాటు హెచ్చ‌రిక‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. బుధ‌వారం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించేందుకు రెడీ అయ్యా రు. ఈ జిల్లాలోని బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌ను ఆయ‌న సంద‌ర్శించ‌నున్నారు. తోతాపురి మామిడి కాయ‌ల రైతులు ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను ఆయ‌న విన‌నున్నారు. వారికి గిట్టుబాట ధ‌ర క‌ల్పించ‌క‌పోవ డంపై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌నున్న‌రు. అదేవిధంగా రైతుల‌కు సంబంధించి స‌మ‌స్య‌ల‌ను కూడా విన‌నున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాన్ని వైసీపీ ప్లాన్ చేసింది. ఈ …

Read More »