గతంలో కడప జిల్లాను వైఎస్సార్ జిల్లాగా మారుస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్. తాజాగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబును ఒక వినతి చేశారు. గత ప్రభుత్వం అవగాహన లేని కారణంగా వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చిన నేపథ్యంలో.. వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ గెజిట్ విడుదల చేయాలని పేర్కొన్నారు. …
Read More »ఇక, వైసీపీ రెడ్ బుక్కులు.. !
రాష్ట్రంలో రెడ్ బుక్కుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇది టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్కు మాత్రమే పరిమితమైంది. ఆయన తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అనే పదాన్ని ప్రయోగించడంతోపాటు.. పుస్తకాన్ని కూడా పరిచయం చేశారు. అదే ఇప్పటికీ.. ఎక్కడ ఏకేసు పెట్టినా వినిపిస్తోంది. ఇక, టీడీపీలోనే మరో నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా తన దగ్గర కూడా రెడ్ …
Read More »నా భవనాలైనా కూల్చేయండి: రేవంత్కు కేపీవీ ఆఫర్
కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని దాదాపు ఈయనే నడిపించారన్న వాదన కూడా వినిపించింది. అయితే.. తాజాగా మరోసారి ఆయన తెరమీదికి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నేతృత్వంలో సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయాలకు కేవీపీ రామచంద్రరావు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా అన్ని వైపుల నుంచి హైడ్రాపై వ్యతిరేకత రావడం, సామాన్యుల నుంచి ఆగ్రహం కూడా …
Read More »నందిగం సురేష్కు బెయిల్.. ఎన్ని షరతులంటే!
వైసీపీ కీలక నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్న ఆయనకు హైకోర్టు కొంత మేరకు రిలీఫ్ ఇచ్చింది. అయితే.. అనేక షరతులు విధించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కార్యాలయం ధ్వంసమైంది. దీనిపై అప్పట్లోనే కేసులు నమోదు చేసినా కీలక వ్యక్తులను మాత్రం పక్కన …
Read More »జనసేన రైటిస్టు పార్టీగా మారిందా?: షర్మిల
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు.. ఓటర్లను అభ్యర్థించేందుకు లౌకిక వాద పార్టీగా ఉన్నజనసేన ఒక్కసారిగా ఇప్పుడు రైటిస్ట్ పార్టీగా మారిపోయిందా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత పవన్లో మార్పు వచ్చిందని ఆమె అన్నారు. ఆయన వేషం(కాషాయం కట్టుకోవడం), భాష(సనాతన ధర్మ పరిరక్షణ) కూడా మారిపోయాయని తెలిపారు. బాధ్యతా …
Read More »పవన్ – సనాతన ధర్మ పరిరక్షణ ప్రజలకు ఎంత వరకు ఎక్కింది..!
అతి సర్వత్ర వర్జయేత్! అంటుంది ‘సనాతన ధర్మం’. అతిగా ఏ విషయంపైనా స్పందించకూడదనేది ఈ ధర్మం చెబుతున్న మాట. అంతేకాదు.. ఓం శాంతి! శాంతి!! శాంతి!!– అనేది కూడా సనాతన ధర్మం చెప్పే అతి పెద్ద సూత్రం. ఒక్క సనాతన ధర్మంలో తప్ప ఈ మాట మరే ధర్మంలోనూ లేదనేది అందరికీ తెలిసిందే. అంతేకాదు.. సనాతన ధర్మం చెబుతున్న మరో కీలక మాట.. సహనాభవతు. సహనౌ భుణత్తు. సహవీర్యం కరవావహై!! …
Read More »అమ్మ చెప్పిన ‘కళ్యాణ్ కబుర్లు’
ఏదైనా సినిమా రిలీజ్ టైంలోనో ఇంకో సందర్భంలోనో మీడియా ముందు చిరంజీవి, పవన్ కళ్యాణ్ల గురించి పొడి పొడిగా రెండు మూడు మాటలు మాట్లాడ్డమే తప్ప మెగా మదర్ అంజనాదేవి ఇన్నేళ్లలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడామె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం ఆసక్తి రేకెత్తించే విషయం. అది కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడ్డానికే ఆమె ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో పవన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు అంజనా దేవి. …
Read More »జగన్ ప్రభుత్వ కుర్చీలు దొంగిలించాడు: లోకేష్
కొత్త సీసాలో పాత సారా! అనే సామెతను వైసీపీ, టీడీపీలు మరోసారి నిరూపిస్తున్నాయి. ఎన్నికల ఫలితా లు వచ్చిన జూన్ 4 తర్వాత తొలిసారి ఒక కీలక వివాదం తెరమీదికి వచ్చింది. ఫస్టు ఫస్టు.. ఈ వివాదంతోనే రెండు పార్టీలు విమర్శలు కూడా చేసుకున్నాయి. అదే.. ఫర్నిచర్ రగడ. అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వైసీపీ అధికారం దిగిపోయిన తర్వాత.. కోటిన్నర రూపాయల విలువ చేసే ఫర్నిచర్ను తన దగ్గరే …
Read More »అమాయకుడ్ని.. ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న సజ్జల రిక్వెస్టు
కాలం కంటే శక్తివంతమైనది మరొకటి ఉండదు. ఎలాంటి వాడినైనా ఇట్టే ప్రభావితం చేసే సత్తా దాని సొంతం. తమ మాటకే కాదు తన చూపుకు సైతం తిరుగులేనంత పవర్ ప్రదర్శించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిన వైనం వెలుగు చూసింది. తాను అమాయకుడినని.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టును అభ్యర్థిస్తున్న వైనం వెలుగు చూసింది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై మూకుమ్మడి దాడి …
Read More »లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు: సుప్రీం
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా గత ప్రభుత్వం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిందని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరగా..ఈ రోజు అందుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు …
Read More »ఈ మౌనం… దేనికి సిగ్నల్ రేవంతన్నా?!
ఒక వివాదం చెలరేగినప్పుడు వెంటనే స్పందించడం అనేది ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ కనిపిస్తోంది. ముఖ్యమంత్రులే ఆయా విషయాలపై స్పందిస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న, చేసే విమర్శలకు వెంటనేరియాక్ట్ కూడా అవుతున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే.. మరింత దూకుడుగా కౌంటర్ ఇస్తున్నారు. కానీ, మంత్రి కొండా సురేఖకు సంబంధించిన తాజా వివాదంపై మాత్రం రేవంత్ రెడ్డి ఎడతెగని మౌనం పాటిస్తున్నారు. నిజానికి సురేఖ …
Read More »సబిత ఫామ్హౌస్ కూలగొట్టాలా? వద్దా?: రేవంత్
బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫామ్ హౌస్లు కూడా ఆక్రమణల జోన్లో ఉన్నాయని.. వాటిని కూడా కూలగొట్టాలా? వద్దా? అని ఆయన ప్రశ్నించారు. “సబితమ్మ ముగ్గురు కొడుకులకు ఫామ్హౌస్లు లేవా?” అని ప్రశ్నించారు. అవి కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయని తనకు సమాచారం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వాటిని కూలగొట్టాల్నో వద్దో మీరే చెప్పండి అని …
Read More »