ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన సాక్షి టీవీ ఇన్ పుట్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం జైలు నుంచి విడులయ్యారు. సాక్షి టీవీ చర్చా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వచ్చిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు.. అమరావతి మహిళలను కించపరిచే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నిలువరించాల్సిన యాంకర్ స్థానంలోని కొమ్మినేని ఆ మాటలకు నవ్వారు. దీంతో …
Read More »బాబు వాడే హెలికాప్టర్ పై ఇంత నిర్లక్ష్యమా..?
ఏపీ సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనల కోసం ప్రత్యేకంగా ఓ హెలికాప్టర్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయా జిల్లాల పర్యటనల్లో బాబు ఈ హెలికాప్టర్ లోనే ప్రయాణిస్తారు. అయితే ఈ హెలికాప్టర్ భద్రతపై మాత్రం అధికారులు అంతగా దృష్టి సారించడం లేదన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పుడప్పుడూ సాంకేతిక కారణాలు సహజమే గానీ.. మరీ తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నా అధికారులు …
Read More »చంద్రబాబుకు ‘వక్ఫ్’ భూముల కిరికిరి!
ఏపీలో కూటమి ప్రభుత్వం పెట్టుబడులకు పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వివిధ సంస్థలను ఏపీకి ఆహ్వానిస్తోంది. పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పలు సంస్థ లకు రాష్ట్రంలో భూములు కూడా కేటాయిస్తోంది. ఇలానే గుంటూరు జిల్లాలో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇది రాజధాని పరిధిలోనే ఉంటుందని గతంలో చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆయన పెట్టుబడులు కూడా సమీకరిస్తున్నారు. …
Read More »పొంగులేటీపై టీపీసీసీ చీఫ్ గుస్సా.. రీజనేంటి?
వారిద్దరూ తెలంగాణలోని అదికార పార్టీకి చెందిన వారే. ఒకరేమో మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరొకరేమో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బొమ్మా మహేశ్ కుమార్ గౌడ్. ఈ ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. వీరి మధ్య ఇప్పటిదాకా పెద్దగా విబేధాలన్న మాటే లేదు. అయితే ఒకే ఒక్క విషయం… పొంగులేటిపై మహేశ్ గౌడ్ అంతెత్తున ఎగిరి పడేలా చేసింది. ఇదేం ఆతృత? చూసుకొని మాట్లాడాలిగా… అంటూ ఆయన మంత్రిగారి …
Read More »జోగి ఇల్లు నేల మట్టం చేస్తాం: టీడీపీ ఎమ్మెల్యే
ఏపీలో ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు వేడి వేడిగా ఉన్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానీల మధ్య రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ వర్సెస్ మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు, వైసీపీ మాజీ నేత వసంత కృష్ణ ప్రసాద్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ రచ్చ తెరమీదికి వచ్చింది. …
Read More »కొడాలి నాని అరెస్టుపై పేర్ని నాని జోస్యం
2019-24 మధ్య వైసీసీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రెచ్చిపోయి వ్యవహరించిన నాయకులు, అధికారులను గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. ఒక పద్ధతి ప్రకారం వారి మీద కేసులు పెడుతూ.. వారికి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా చాలామంది వైసీపీ నేతలు చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఐతే ఇప్పటికే చాలామంది నాయకులను టార్గెట్ చేసినప్పటికీ.. …
Read More »తగ్గేదేలే… 30 సార్లైనా వస్తా: కేటీఆర్
ఫార్ములా ఈ కారు రేసుల కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణకు వెళ్లే మెుందు బీఆర్ఎస్ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడిన కేటీఆర్… విచారణలంటే తనకేమీ భయం లేదని, తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటిదాకా 3 నోటీసులు ఇచ్చారని, తాను ఓ సారి విచారణకు హాజరయ్యానన్న కేటీఆర్… ఇంకా …
Read More »తేడా వస్తే తప్పించుకుంటారా.. కమల నాథుల వ్యూహమేంటో..!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఈ ఏడాది కాలంలో జరిగిన పాలనపై రాష్ట్ర ప్రభుత్వం సంబరాలకు సిద్ధమైంది. ప్రధానంగా ప్రజలను కలుసుకోవడం ప్రజల సంతృప్తిని లెక్క వేసుకోవడం వారికి అనుకూలంగా మళ్లీ కార్యక్రమాలు నిర్వహించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. అయితే కూటమి పార్టీలుగా విజయం దక్కించుకున్న వాటిలో బీజేపీ కీలకమైంది. కేంద్రంలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఏర్పడడానికి రాష్ట్రంలో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం అత్యంత …
Read More »‘తల్లికి వందనం’.. ఆనందంపై చంద్రబాబు ఆరా!
ఏపీలో కూటమి ప్రభుత్వం పక్షాన ఇచ్చిన ‘సూపర్-6’ హామీల్లో కీలకమైన తల్లికి వందనం పథకాన్ని గత గురువారం ప్రారంభించారు. శుక్రవారం, శనివారాల్లో లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో రూ.13000 చొప్పున నిధులు జమ చేశారు. ఇంట్లో ఒక తల్లికి ఎంత మంది చదువుకునే చిన్నారులు ఉన్నా.. వారందరికీ ఈ సొమ్ములు జమ చేస్తామని చెప్పినట్టుగానే.. ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు. దాదాపు 85 శాతం మందికి ఈ నిధులు ఇచ్చేశారు. కుటుంబంలో ముగ్గురు …
Read More »`లీడర్`.. ఎవరి కోసం.. కవిత ఫ్యూచర్ ప్లానేనా?
బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. `లీడర్` పేరుతో ఆమె యువతకు ఆహ్వానం పలుకుతున్నారు. రాష్ట్ర స్తాయిలో యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా తెలంగాణ యువత, మహిళలకు రాజకీయ శిక్షణ అందించేందుకు తెలంగాణ జాగృతి ‘లీడర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభిం చారు. ఇప్పటి వరకు లేని ఈ కార్యక్రమానికి యువత నుంచి మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. …
Read More »జగన్.. 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తా: నారా లోకేష్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేశారు. “జగన్ గా రూ.. మీరు కడుపు మంటతో అల్లాడుతున్నారు. నాకు తెలుస్తోంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తా. నీళ్లలో కలుపుకొని తాగండి. కడుపు మంట తగ్గుతుంది.” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కీలకమైన సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లికి వందనంపథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకంలో లోపాలు ఉన్నాయంటూ.. …
Read More »15 రోజుల గడువు.. `కాంగ్రెస్` రెడీ అయ్యేనా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పైగా ప్రభుత్వానికి ఏడాదిన్నర కూడా దాటిపోయింది. ఈ క్రమంలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుడుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పేశారు. ఈ నెల ఆఖరు నాటికి నోటిఫికేషన్ ఇచ్చేసేలా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు.. ఆయనే స్వయంగా ఈ క్రతువుకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని వెల్లడించారు. ఈ స్వల్ప వ్యవధిలో పార్టీ పుంజుకుని.. స్థానిక …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates