Political News

బెంగ‌ళూరులో చెవిరెడ్డి అడ్డగింత‌?

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని బెంగ‌ళూరులో విమానాశ్ర‌య అధికారులు అడ్డుకున్నారు. ఆయ‌న‌ను తిరిగి ఏపీకి పంపించారు. ఈ విష‌యాన్ని అక్క‌డి పోలీసులు నిర్ధారించారు. బెంగ‌ళూరు నుంచి శ్రీలంక రాజ‌ధాని కొలంబో వెళ్లే విమానం ఎక్కేందుకు ప్ర‌య‌త్నిస్తున్ స‌మ‌యంలో చెవిరెడ్డిని విమానాశ్ర‌య అధికారులు అడ్డుకున్నార‌ని చెప్పారు. ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో …

Read More »

నాడు ఏం చేశారో మ‌రిచిపోతే ఎలా జ‌గ‌న్‌?: టీడీపీ

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. బుధ‌వారం గుంటూరు జిల్లా ప‌ల్నాడులో ప‌ర్య‌టించేందుకు రెడీ అయ్యారు. ఇక్క‌డి స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు అనే పార్టీ కార్య‌క‌ర్త కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించనున్నారు. 2024లో ప్ర‌భుత్వం మారిన త‌ర్వాత‌.. జ‌గ‌న్ ఓట‌మిని త‌ట్టుకోలేక‌.. స‌ద‌రు నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. అప్ప‌టి నుంచి జ‌గ‌న్ త‌మ ఫ్యామిలీని ఆదుకోవాల‌ని బాధిత కుటుంబం కోరుతోంది. ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ ముందుకు వ‌చ్చారు. నాగ‌మ‌ల్లేశ్వ‌రరావు విగ్ర‌హాన్ని కూడా ఆయ‌న ఆవిష్క‌రించ‌నున్నారు. అయితే.. …

Read More »

మూల‌పాడుకు మ‌హ‌ర్ద‌శ‌.. అమ‌రావ‌తిలో గేమ్ ఛేంజ‌ర్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో కీల‌క‌మైన మూలపాడు గ్రామానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుందా? ఈ గ్రామం అమ‌రావ‌తికి ‘ఓపెన్ వే'(ముఖ ద్వారం) కానుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. అమ‌రావతి కోసం రైతుల నుంచి 34 వేల ఎక‌రాల‌కు పైగా ఇప్ప‌టికే స‌మీకరించారు. దీనిలో అమ‌రావ‌తి ప్ర‌ధాన మార్గాన్ని ఎక్క‌డ ఏర్పాటు చేయాల‌న్న చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు మూల‌పాడువైపు అధికారులు, ప్ర‌భుత్వం కూడా మొగ్గు చూపుతోంది. దీంతో రాజ‌ధాని ముఖద్వారాన్ని మూలపాడు గ్రామం …

Read More »

కుప్పం ఘ‌ట‌న‌పై ష‌ర్మిల సీరియ‌స్‌.. ఏమ‌న్నారంటే..

సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ఓ మ‌హిళ‌ను చెట్టుకు క‌ట్టేసి హింసించిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర‌క‌ల‌క‌లం సృష్టించింది. ఇది అనేక ప్ర‌శ్న‌ల‌కు దారి తీస్తోంది. తిమ్మ‌రాయ‌ప్ప అనే వ్య‌క్తి ముని క‌న్న‌ప్ప అనే వ్య‌క్తిద‌గ్గ‌ర 80 వేల రూపాయ‌లు అప్పుగా తీసుకున్నారు. దీనిని తీర్చ‌లేక‌.. ఆయ‌న పొరుగు ప్రాంతానికి వెళ్లిపోయాడు. దీంతో ఆయ‌న భార్య శిరీష కూడా.. ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్లి గుట్టుగా …

Read More »

పులివెందుల రాజ‌కీయాలు చేస్తే తోక‌లు క‌త్తిరిస్తా: బాబు

వైసీపీ నాయ‌కుల‌కు సీఎం చంద్ర‌బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల త‌ర‌హా రాజ‌కీయాలు చేయాల‌ని అనుకుంటే.. వారి తోక‌లు క‌త్తిరిస్తాన‌ని గ‌ట్టిగా చెప్పారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక డ్రామాలు ఆడార‌ని అన్నారు. బాబాయి గొడ్డ‌లి పోటును గుండె పోటుగా చెప్పార‌ని.. పైగా దాన్ని త‌న‌కు అంటించే ప్ర‌య‌త్నం చేశార‌ని అన్నారు. అయితే.. అప్ప‌ట్లో వైసీపీ ప‌న్నాగాల‌ను గ్ర‌హించ‌లేక పోయాన‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. అప్ప‌ట్లోనే వారిని జైలుకు పంపించి ఉంటే.. …

Read More »

సింప‌తీ కోసం కేటీఆర్ జైలు పాట‌: నెటిజ‌న్ల ట్రోల్స్‌

తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ ఎస్ నాయ‌కుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌.. తాజాగా జైలు-జైలు అంటూ పాట పాడిన విష‌యం తెలిసిందే. ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ – రేస్ వ్య‌వ‌హారంపై ఆయ‌న‌ను విచార‌ణ‌కు పిలిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. త‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని.. జైలుకు వెళ్లినా ఇబ్బంది లేద‌న్నారు. అయితే.. ఆయ‌న‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయ‌లేదు. విచార‌ణ అనంత‌రం బ‌య‌ట‌కు వ‌దిలేశారు. అయితే.. ఆ …

Read More »

మ‌రో రికార్డుకు చేరువ‌లో ఏపీ: చంద్ర‌బాబు

మ‌రో అరుదైన ప్ర‌పంచ రికార్డును సొంతం చేసుకునే దిశ‌గా ఏపీ వ‌డివ‌డిగా అడుగులు వేస్తోందని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. గ‌త ప‌దేళ్ల కింద‌ట నిర్వ‌హించిన‌ట్టుగా..ఇప్పుడు కూడా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని అంతకంటే ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న ట్టు ఆయ‌న తెలిపారు. ఈ నెల 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా.. ఈకార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు ఏర్పాటు చేస్తోంది. విశాఖ‌ప‌ట్నంలోని ప‌ర్యాట‌క ప్రాంతం ఆర్కే బీచ్ నుంచి భీమిలి అసెంబ్లీ …

Read More »

నిలబడలేకపోయిన హరీశ్… ఏం జరిగింది?

ఇటీవలి కాలంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పదేళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ విపక్షంలోకి మారగా… తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నర క్రితం కొత్తగా అదికారం చేపట్టింది. ఈ క్రమంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ సర్కారు…ఆయా అంశాలపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలతో సంబంధం ఉన్నా, లేకున్నా పార్టీ తరఫున పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు …

Read More »

మా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే కుట్ర‌: రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఓ కుటుంబం(కేసీఆర్‌) కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌దోసి తాము అధికారంలోకి వ‌చ్చేందుకు ఆది నుంచి కుట్ర‌లు ప‌న్నింద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఎప్పటిక‌ప్పుడు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో తాము ఆ కుట్ర‌ల‌ను ఛేదిస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని చూసి ఆ కుటుంబం జీర్ణించుకోలేక పోతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అందుకే.. ప్ర‌తి చిన్న విష‌యాన్నీరాజ‌కీయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంటే.. దానిపైనా విమ‌ర్శ‌లు …

Read More »

కేసుల సుడిలో పేర్ని… అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నానిని ఇప్పుడు కేసులు చుట్టుముట్టేశాయని చెప్పక తప్పదు. ఇప్పటికే నాని ఫ్యామిలీపై రేషన్ బియ్యం మాయం కేసుతో పాటు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా అధికారంలో ఉండగా… టీడీపీ కార్యకర్తలపై నాని పెట్టించిన కేసులో తానే అడ్డంగా బుక్కై ఏకంగా అరెస్టు వారెంటు దాకా పరిస్థితిని తెచ్చుకున్నారు. కోర్టు వాయిదాలకు హాజరు …

Read More »

9 గంటల విచారణ… ఫ్రాడ్ ఎక్కడుందన్న కేటీఆర్

ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఏసీబీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును అధికారులు ఏకంగా 9 గంటల పాటు విచారించారు. ఉదయం 10.30 గంటల సమయంలో మొదలైన ఈ విచారణ సుదీర్ఘంగా సాగగా… కేటీఆర్ ను ముగ్గురు అదికారులతో కూడిన విచారణ బృందం ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అయితే విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్… అసలు ఏసీబీ …

Read More »

హమ్మయ్యా… ఎట్టకేలకు కొమ్మినేని విడుదల

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన సాక్షి టీవీ ఇన్ పుట్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం జైలు నుంచి విడులయ్యారు. సాక్షి టీవీ చర్చా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వచ్చిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు.. అమరావతి మహిళలను కించపరిచే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నిలువరించాల్సిన యాంకర్ స్థానంలోని కొమ్మినేని ఆ మాటలకు నవ్వారు. దీంతో …

Read More »