Political News

దివ్యాంగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన బాబు

ఏపీలో కొన్నిరోజులుగా పలు ప్రాంతాల్లో దివ్యాంగులు తమ పెన్షన్లు రద్దు అయిపోయాయని రోడ్డెక్కిన వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దివ్యాంగుల పెన్షన్లలో చాలా మంది తమ వైకల్య శాతాన్ని చూపేందుకు తాత్కాలిక సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇలాంటి వారి పెన్షన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వైకల్య శాతాన్ని చూపే పర్మినెంట్ సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్లను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే వైకల్య శాతాన్ని నిర్ధారించే సదేరాం క్యాంపుల ఏర్పాటు, బాధితులు వైద్యుల వద్దకు వెళ్లడం ఒకింత సమయాభావంతో కూడుకున్న …

Read More »

ఐఏఎస్ శ్రీల‌క్ష్మి.. ఓ తాట‌కి: భూమ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వైసీపీ సీనియ‌ర్ నేత‌, తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి.. రాజ‌కీయ నేత‌ల‌పై త‌ర‌చుగా విమర్శ‌లు చేయ‌డం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయ‌న ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి శ్రీల‌క్ష్మిపై విరుచు కుప‌డ్డారు. ఆమెను ఏకంగా `తాట‌కి` అంటూ సంబోధించారు. తాజాగా సెల్ఫీ వీడియో విడ‌ద‌ల చేసిన భూమ‌న‌.. ఆర్థిక శాఖ స‌హా మైనింగ్ ఇత‌ర శాఖ‌ల‌కు కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి శ్రీల‌క్ష్మిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం …

Read More »

వైసీపీ ఎఫెక్ట్… జైలుకు ఐపీఎస్ సంజయ్

2019లో ఏపీలో అధికారం చేపట్టిన వైసీపీ… తాను చెప్పినట్టుగా వినే అధికారులను అందలమెక్కించి… ఆ పనులు పూర్తి అయ్యాక వారు కోరిన శాఖలకు బదిలీ చేసి అందిన కాడికి దోచుకోండి అంటూ వదిలేశారని చాలా ఆరోపణలే ఉన్నాయి. అందులో భాగంగా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూటమి సర్కారు వచ్చాక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డీజీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టై విడుదల కాగా… తాజాగా మంగళవారం …

Read More »

వైసీపీ మరో తప్పు.. అలా వద్దంటున్న నేతలు..!

ఏపీ ప్రతిపక్షం వైసీపీలో తప్పులపై తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు వలంటీర్లను నమ్ముకుని నిండా మునిగారు. అప్పట్లో నాయకులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో పార్టీ పరిస్థితి ఎన్నికల నాటికి ఇబ్బందిగా మారిపోయింది. అంతేకాదు, నమ్ముకున్న వలంటీర్లు యూటర్న్ తీసుకున్నారు. దీనిని అప్పట్లోనే నాయకులు హెచ్చరించారు. తమకు ప్రాధాన్యం లేకుండా వలంటీర్లకే సర్వాధికారులు ఇస్తున్నారని వగర్చారు. అయినా అధినేత పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టేందుకు, …

Read More »

బొట్టు బొట్టుకు లెక్క: డేంజర్‌లో వైసీపీ..!

Delhi Liquor Scam : CBi Charge Sheet Revelas Shocking Details

వైసిపి హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో కూపీ లాగుతున్నకొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బొట్టు బొట్టుకు లెక్క కట్టి అప్పట్లో సొమ్ములు చేసుకున్నారనేది తాజాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్నారు. ఇటీవల వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణస్వామిని విచారించినప్పుడు కొన్ని విషయాలు ఆయన స్పష్టంగా వెల్లడించారు. ఈ క్రమంలో మద్యానికి సంబంధించి బొట్టు బొట్టుకు …

Read More »

వైసీపీ ఫైర్ బ్రాండ్లు.. మ‌రో మూడేళ్లు ఇంతే..!

వైసీపీలో కొంతమంది నాయకుల పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వారు వ్యవహరించిన తీరు కావచ్చు, వారి నోటి దురుసు కావచ్చు.. కారణాలు ఏవైనా మరో మూడు సంవత్సరాల వరకు వారు బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కొంతమంది నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలపై వ్యక్తిగత దూష‌ణ‌లకు దిగడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, అదేవిధంగా బూతులతో విరుచుకుప‌డ‌డం వంటివి తెలిసిందే. తద్వారా వారు సాధించింది ఏమీ …

Read More »

మంత్రుల వెనుకబాటు.. రీజన్లు ఇవేనా..!

చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న టిడిపి నాయకులకు ఇటీవల ర్యాంకులు కేటాయించారు. వీటిలో పాలకొల్లు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామానాయుడు మొదటి స్థానంలో ఉండగా, కృష్ణా జిల్లాకు చెందిన కొల్లు రవీంద్ర, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చం నాయుడు, అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్ వంటి వారు చివరి స్థానాల్లో నిలబడ్డారు. దీంతో అసలు మంత్రులు ఎందుకు వెనుకపడుతున్నారు, దీనికి కారణాలు ఏంటి అన్న విషయంపై పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ …

Read More »

ప్లీజింగ్ పాలిటిక్స్‌: టీడీపీకి మేలేనా..!

బుజ్జగింపు రాజకీయాలు టిడిపికి సరిపోతాయా? నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తున్న పొరపాట్లు కావచ్చు, తప్పులు కావచ్చు, వాటిపై పార్టీ అధినేత వ్యవహరిస్తున్న తీరు బుజ్జగింపు రాజకీయాలని తలపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు చాలామంది లక్ష్మణ రేఖలను దాటేశారన్నది అందరికీ తెలిసిందే. కొందరు కోవర్టులుగా మారి ప్రతిపక్షానికి సమాచారం చేరవేశారనేది కూడా కొన్నాళ్ల కిందట చర్చకు వచ్చింది. ఇక వ్యక్తిగతంగా వారు …

Read More »

ఓడితే.. రాజ్య‌స‌భే

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి త‌ర‌ఫున అభ్య‌ర్థిగా నిల‌బ‌డ్డ‌.. మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీ. సుద‌ర్శ‌న్ రెడ్డిని గెలిపించుకునేందుకు కూట‌మి పార్టీలు శ‌త విధాల ప్ర‌యత్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. త‌మ కూట‌మిలోని మిత్ర‌ప‌క్షాలు ఏక‌గ్రీవంగా ఎంపిక చేయ‌డంతో వారితో పాటు.. ఎన్డీయే కూట‌మిలోని కొన్నిపార్టీల‌ను కూడా మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. వీరితోపాటు.. ఎన్డీయే-ఇండియా కూట‌ముల్లో లేని.. త‌ట‌స్థ పార్టీలు(వైసీపీ, బీజేడీ(ఒడిశా), అవామీ, త‌దిత‌ర పార్టీల‌ను మ‌చ్చిక చేసుకుని …

Read More »

రిజ‌ర్వేష‌న్ల‌పై ముందుకే..: కాంగ్రెస్ కీల‌క నిర్ణ‌యం

బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే విష‌యంలో ముందుకే వెళ్లాల‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇప్పటి వ‌ర‌కు దీనిపై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేయ‌క‌పోయినా.. గ‌వ‌ర్న‌ర్ ఆర్డినెన్సుకు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోక‌పోయినా.. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో దీనిని అమ‌లు చేసి తీరాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో అమ‌లుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు చెప్పారు. న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు …

Read More »

మ‌హిళ‌లు మావైపే: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తో మ‌హిళలు త‌మ వైపే ఉన్నార‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. త‌ల్లికి వంద‌నం ప‌ధ‌కం కింద‌.. ల‌బ్ధిదారులైన‌ ప్ర‌తి మ‌హిళ‌కు ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇచ్చామ‌న్నారు. ఇప్పుడు స్త్రీ శ‌క్తి ద్వారా ఉచిత ఆర్టీసీ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నా మ‌ని.. ఈ రెండు ప‌థ‌కాలపై …

Read More »

జనసేనలో స్థాయి ఏదైనా కట్టు దాటితే వేటే!

జనసేన… తెలుగు నేలలోని దాదాపుగా అన్ని పార్టీల కంటే కూడా చిన్న వయసు కలిగిన పార్టీగానే చెప్పాలి. అయినా కూడా పార్టీ నియావళిని పకడ్బందీగా అమలు చేసే విషయంలో అధిష్ఠానం ఓ స్పష్టమైన గీత గీసుకున్నట్టుంది. పార్టీ నియమావళి దాటిన వారు పెద్ద వారైనా, చిన్నవారైనా… అసలు పార్టీలో వారి స్థాయి ఏదైనా కూడా సస్పెన్షన్ వేసేయాల్సిందేనని ఆ పార్టీ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది కట్టుదాటిన …

Read More »