కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఒక ఈవెంట్లో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు వేదికపైనే గొడవ పడటం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. నాగ్పూర్లో జరిగిన కార్యక్రమంలో, ఆ ఇద్దరు ఆఫీసర్లు ఒకరినొకరు తోసుకోవడం, గిల్లుకోవడం వంటివి చేయడంతో, పక్కనే ఉన్న గడ్కరీ కూడా షాకైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. సర్వీసులో సీనియర్ హోదాల్లో ఉన్న అధికారులు ఇలా …
Read More »తప్పు ఒప్పుకున్న జోగి రమేష్!
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన శాసన సభ సమావేశాల్లో నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై, చంద్రబాబు కుటుంబ సభ్యులపై జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. అయినా సరే, తన వ్యాఖ్యలపై జోగి రమేష్ ఏనాడూ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జోగి …
Read More »శ్రీవారి పరకామణి చోరీపై సీఐడీ: హైకోర్టు కీలక నిర్ణయం
2021-22 మధ్య తిరుమల శ్రీవారి కానుకల హుండీ(పరకామణి) లెక్కింపు సమయంలో విదేశీ కరెన్సీ దొంగ తనం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై తాజాగా హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై అత్యంత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. “శ్రీవారిపై అపార నమ్మకంతో భక్తులు సమర్పించిన కానుకల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించరు. ఇది తీవ్ర పరిణామం“ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ …
Read More »ఉద్యమాలే వేరు.. రాజకీయాలు వేరుగా బ్రదర్…!
ఉద్యమాల్లో ఉన్నవారు.. రాజకీయాల్లోకి రావడం అరుదేనని చెప్పాలి. గతంలో లోకాయుక్త కోసం ఉద్యమించిన అన్నాహజారే.. సారా రహిత రాష్ట్రం కోసం ఉద్యమించిన దూబగుంట పార్వతమ్మ (నెల్లూరు).. ఇలా చాలా మంది రాజకీయాల్లోకి రావాలని ఆఫర్లు వచ్చినా.. రాలేదు. ఎందుకంటే.. ఉద్యమం వేరు. రాజకీయాలు వేరు. అంతెందుకు.. దేశ స్వాతంత్య్రం కోసం పనిచేసిన మహాత్ముడు కూడా.. రాజకీయాల్లోకి రాలేదు. ఎందుకంటే.. ఉద్యమంలో ఉన్నప్పుడు ఉన్న స్వేచ్ఛ.. రాజకీయాల్లోకి వచ్చాక సహజంగానే ఉండదు. …
Read More »ఆల్మట్టి ఎత్తు: తెలుగు రాష్ట్రాల ‘పైఎత్తు’ ఎక్కడ?
రెండు తెలుగు రాష్ట్రాలకూ అత్యంత కీలకమైన కృష్ణానది గురించి.. ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులు ప్రసంగాలు దంచి కొడుతుంటారు. అంతేకాదు.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. నాగార్జున సాగర్ నీటి విషయంలో లడాయి పడుతున్న విషయం కూడా తెలిసిందే. దీనికి కృష్ణానదే ఆధారం అన్నదీ తెలిసిందే. అయితే.. అసలు నాగార్జున సాగర్వరకు కృష్ణమ్మ రావాలంటే.. పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్రభుత్వం ఈ కృష్నానదిని స్వేచ్ఛగా వదిలి పెట్టాలి. తమ హక్కులుగా …
Read More »జూబ్లీహిల్స్ : అంతు చిక్కని ఓటరు నాడి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అనేది ఇంకా సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే ప్రజల నాడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలకు కూడా రోజుకో రకంగా సమాచారం వస్తోంది. కొన్ని చోట్ల సానుభూతి వర్కవుట్ అవుతుండగా, మరికొన్ని చోట్ల సర్కారు పథకాల జోరు పై చర్చ సాగుతోంది. కొన్ని చోట్ల మోడీ మానియా కూడా కనిపిస్తోంది. ఇలా, అటు బీఆర్ ఎస్, ఇటు కాంగ్రెస్, అటు …
Read More »కర్నూలు ఘోరం: సీఎం చొరవతో అంతా కదిలారు
ఆపద రావడం ఒక ఎత్తు.. ఆపద అనంతరం ప్రభుత్వాలు, నాయకులు, వ్యక్తులు, అధికారులు వ్యవహరించే తీరు మరొక ఎత్తు. తాజాగా కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వేమూరి కావేరీ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వారిని గుర్తించడానికి కూడా పరిస్థితి మారిపోయింది. ఎక్కడెక్కడి వారు బెన్గలూరుకు వెళ్తున్నారో తెలియదు. వీరిలో …
Read More »ఈసీ ఎఫెక్ట్: సోషల్ మీడియా ప్రభావం అంతంతే!
బీహార్ అసెంబ్లీ సహా, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనున్నాయి. నవంబరు 9, 11 తేదీల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జమ్ము కశ్మీర్లోని సీఎం ఒమర్ అబ్దుల్లా నియోజకవర్గం బుడ్గమ్ నియోజకవర్గానికి, అదేవిధంగా మరొక నియోజకవర్గం నగ్రోతాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇక బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కూడా …
Read More »కవిత ‘వయసు’ వ్యాఖ్యలు.. ఏం చెప్పాలని?
రాజకీయాల్లో ఉన్నవారే కాదు.. సహజం ఏ మహిళ కూడా తన వయసును బయటకు వెల్లడించరు. ఇక, పురుషులు కూడా ఇటీవల కాలంలో వయసును చెప్పడానికి మొహమాట పడుతున్నారు. ఏదైనా పెద్ద అవసరం ఉంటే తప్ప.. ఎవరూ వయసు విషయంలో బయటకు చెప్పరు. ఇక, రాజకీయాల్లో ఉన్నవారు.. ఎన్నికల సమయంలో సమర్పించే అఫిడవిట్లలో తప్ప.. ఎక్కడా వయసును బయట పెట్టుకోరు. అలాంటిది జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె …
Read More »ఎస్! అందుకే లొంగిపోయాం: మావోయిస్టు ఆశన్న వీడియో
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకుడు, సిద్ధాంత కర్తల్లో ఒకరుగా గుర్తింపు పొందిన మల్లోజుల వేణుగోపాల రావు, అదేవిధంగా తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలు.. ఇటీవల ప్రభుత్వాలకు లొంగిపోయారు. మల్లోజుల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ముందు, ఆశన్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందు.. భారీ బలగాలతో వచ్చి.. లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వందలాది తుపాకులు, మందుగుండు సామగ్రిని కూడా పోలీసులకు స్వాధీనం చేశారు. ఈ ఘటన తర్వాత.. వారికి …
Read More »అమరావతికి కీలక సంస్థ… జగన్ వెనక్కి తగ్గాల్సిందే!
ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే తన నిర్ణయమే కరెక్ట్ అన్న ధోరణితో ఉన్నారు. ఈ విషయం ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కూడా స్పష్టమైంది. నిజానికి కాలం మారుతోంది. ప్రజల ఆలోచనా ధోరణులు కూడా మారుతున్నాయి. ఒకప్పటి మాదిరిగా.. నాయకులు మంకు పట్టు పడితే.. కుదరదు. ఒక సందర్భంలో కాకపోతే.. మరో సందర్భంలో అయినా.. ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి. కానీ, ఈ …
Read More »హైకోర్టు ఎఫెక్ట్: ‘లిక్కర్’ టెండర్లపై డోలాయమానం
హమ్మయ్య.. లిక్కర్ టెండర్ల వ్యవహారం పూర్తయింది.. సర్కారుకు 2 వేల కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం సమకూరిందని తెలంగాణ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. కానీ, అసలు తంతు ఇప్పుడే స్టార్టయింది. ఈ వ్యవహారంపై లెక్కకు మిక్కిలిగా రెండు కారణాలతో హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారులు.. ఈ పిటిషన్లపై తాజాగా శనివారం హోరా హోరీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్నలు సంధించింది. లిక్కర్ షాపులకు సంబంధించిన టెండర్ల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates