వైసీపీ నాయకుడు, సీనియర్ నేత పేర్ని నాని మరోసారి తీవ్ర వివాదానికి తెరదీశారు. నెల్లూరు జిల్లా కోవూ రు ఎమ్మెల్యే, టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై పేర్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా లో మైనింగ్ కార్యక్రమాలు అన్నీ కూడా ఆమె కనుసన్నల్లోనే జరుగుతున్నాయని.. ఆమె మూటలు అంది స్తున్నారని.. అవి తీసుకుంటున్న కొందరు మంత్రులు ఆమెపై ఈగవాల కుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. మీకు మూటలు అందిస్తోంది కాబట్టి.. …
Read More »బాబు యత్నం: అశోకగజపతి రాజు ఇక, గవర్నర్!
టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గిరీ దక్కింది. ఆయనను గోవా(అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం)కు గవర్నర్గా నియమిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న అశోక్ గజపతి రాజు అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి వచ్చారు. ఈయన సోదరుడు ఆనంద గజపతిరాజు కూడా కొన్నాళ్లు టీడీపీ లో పనిచేశారు. విజయనగర్ పార్లమెంటు, అసెంబ్లీ …
Read More »‘తీన్మార్’ కొత్త పార్టీ.. సంచలన ప్రకటన
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న చింతపండు నవీన్.. ఉరఫ్ తీన్మార్ మల్లన్న.. కొత్త పార్టీని స్థాపించనున్నట్టు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. బీసీ సామాజిక వర్గం కోసమే పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు. అయితే.. పార్టీ పేరు.. ఎప్పుడు పెట్టేది మాత్రం ఆయన సస్పెన్సులో ఉంచారు. తాజాగా బీఆర్ ఎస్ నాయకురాలు.. కవిత.. బీసీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు.. ఈ క్రమంలో ఆమెను …
Read More »మల్లన్నా – కవిత, ఏమిటీ గొడవ
తెలంగాణ జాగృతి సంస్థకు చెందిన కార్యకర్తలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచరులు, ఆయన గన్ మెన్ సైతం విరుచు కుపడ్డారు. తుపాకీతో బెదిరించడమే కాకుండా.. భౌతికంగా కూడా వారిపై దాడి చేశారు. బీసీ రిజర్వేషన్ వి షయంపై బీఆర్ ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి చీఫ్.. కవిత ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిజర్వేషన్ వ్యవహారం.. కాంగ్రెస్-కవితల మధ్య మాటల తూటాలు పేలుస్తోంది. అయితే.. ఈ వ్యవహారంలో కవితను …
Read More »వైసీపీ సెల్ఫ్ గోల్
ఆరేళ్ల ముందు 151 సీట్లతో అసాధారణ విజయం.. ఏడాది కిందట 11 సీట్లతో అనూహ్య పరాజయం.. ఈ రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెల్లాయి. అంతటి విజయం తర్వాత ఇంతటి పరాభవాన్ని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రతిపక్షంలోకి వచ్చాక దిద్దుబాటు చర్యలు చేపట్టి మళ్లీ అధికారం చేపట్టడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ వైసీపీ తీరు ఎంతమాత్రం మారడం లేదు. అధికారంలో ఉండగా చేసిన తప్పులనే …
Read More »వన్ టైం ఎమ్మెల్యే.. అయితేనేం
కోట శ్రీనివాసరావు.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. ఒకే ఫ్రేమ్ నవరసాలను ఒలికించగల దిట్ట. ఆదివారం తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన సినీ రంగంలో చేసిన పాత్రలు.. పక్క న పెడితే.. రాజకీయాల్లోనూ.. ఆయన తనదైన ముద్ర వేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు.. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం దక్కించుకు న్నారు. ఇలా.. పార్టీ కండువా కప్పుకొని …
Read More »మాట-చేత.. రెండింటిలోనూ ఈ రెడ్లు టాపే.. !
రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. రెడ్లు టాప్లోనే ఉంటారు. ఉన్నారు కూడా. మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్లు అయితే.. మాట, చేత రెండిట్లోనూ దూకుడుగానే ఉంటున్నారు. వైసీపీ హయాం నుంచి టీడీపీ హయాం వరకు కూడా రెడ్డి నేతలు.. దూకుడుగానే వ్యవహరిస్తు్న్నారు. ఇంకోరకంగా చెప్పాలంటే.. వైసీపీ హయాంలో కంటే కూడా.. టీడీపీ హయాంలోనే రెడ్డి నాయకులు దూకుడుగా …
Read More »రాజా ‘నిప్పు!’ ఇదే.. పెద్ద చిక్కు!!
తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేత, ప్రస్తుత ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను కూడా పార్టీ ఆమోదించింది. అయితే.. ఇప్పుడున్న రాజకీయాల్లో నాయకులు ఇలా రాజీనామా చేయకముందే.. అలా.. మరో పార్టీ చంకనెక్కించుకుంటోంది. అది ఏపీ అయినా.. తెలంగాణ అయినా.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా.. ప్రత్యర్థి పార్టీల నుంచి తాలూ తప్ప అనుకునే నాయకులకే భారీ డిమాండ్ ఉంది. …
Read More »వన్ వే ట్రాఫిక్లో మహిళా నేతలు.. !
రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. నిన్న ఉన్నట్టుగా నేడు ఉండదు. నేడు న్నట్టుగా రేపు ఉండదు. వ్యక్తిగతంగా ఎదిగేందుకు నాయకులు ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కసారి బెడిసి కొడుతుంది. దీంతో పార్టీలనే నమ్ముకోక తప్పని పరిస్థితి కూడా వారికి ఎదురవుతుంది. అయితే.. ఆ పార్టీలు తమకు అన్యాయం చేస్తున్నాయని.. తమకు గౌరవం ఇవ్వడం లేదని భావించే వారి సంఖ్య రానురాను పెరుగుతోంది. దీంతో కొందరు నాయకులు అటు-ఇటు అంటూ.. …
Read More »వైసీపీ వచ్చినా.. వలంటీర్లు రారు.. అదంతే.. !
ఈసారి కాలం కలిసి వచ్చి.. వైసీపీ అధికారంలోకి వస్తే తిరిగి వాలంటీర్లను తీసుకుంటారా? వైసిపి నియమించిన వాలంటీర్లను టిడిపి కూటమి తొలగించిన నేపథ్యంలో వారికి తిరిగి ఉపశమనం కలిగిస్తారా? అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. వాలంటీర్ల వల్లె తాము ఓడిపోయామని, వాలంటీర్ల కారణంగానే ప్రజలకు నాయకులకు మధ్య సంబంధాలు తెగిపోయాయని వైసిపి నాయకులు పదేపదే చెబుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి …
Read More »కూటమి సత్తా ఇదీ.. ఏడాదిలోనే ఐదు అవార్డులు!
ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండుకళ్లుగా ముందుకు సాగుతున్న సర్కారు… నగరాలు, పట్టణాల పరిశుభ్రతకు కూడా పెద్ద పీట వేస్తోంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో పేరుకుపోయిన 8 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేస్తున్న విషయం తెలిసిందే. దీని నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అదేసమయంలో చెత్త …
Read More »మా మంచి మహిళా నేత.. ఈసారి మంత్రి పోస్టు ఖాయం?
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వారిలో చాలా మంది మహిళా నాయకులు ఉన్నారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు కూడా ఉన్నారు. అయితే.. ఎంత మంది ప్రజలకు చేరువ అవుతున్నారు? ఎంత మంది సీఎం చంద్రబాబు దృష్టిలో ఉన్నారన్నది ప్రశ్న. ఇలా చూసుకుంటే.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నందిగామ నియోజవర్గం ఫస్ట్ ప్లేస్లో ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో తంగిరాల సౌమ్య విజయం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates