Political News

కొత్త అద్దె బిల్లు: చెప్పినట్లు ఇల్లు ఖాళీ చేయకుంటే డబుల్ అద్దె

తమ హయాంలో పలు కొత్త చట్టాల్ని తీసుకొస్తున్న మోడీ సర్కారు.. తాజాగా ప్రజలందరూ ప్రభావితమయ్యే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా కొత్త అద్దె చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ముసాయిదానుతాజాగా విడుదల చేసి.. అభ్యంతరాల్ని వెల్లడించాల్సిందిగా కోరుతున్నారు. కేంద్రం తీసుకురావాలని భావిస్తున్న ఈ కొత్త అద్దె చట్టాన్ని పరిశీలించి.. రాష్ట్రాలు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కేంద్రం కోరింది. ఇళ్లను అద్దెకు ఇచ్చే …

Read More »

మంత్రి వెల్లంపల్లికి సీరియస్

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు సీరియస్ గా ఉంది. అందుకే అర్జంటుగా విజయవాడ నుండి హైదరాబాద్ లోని అపోలో ఆసుప్రతికి తరలించారు. దాదాపు 15 రోజులుగా వెల్లంపల్లి కరోనా వైరస్ కు చికిత్స చేయించుకుంటున్నారు. అయితే ఆరోగ్య పరిస్ధితిలో ఎటువంటి డెవలప్మెంట్ కనబడలేదని సమాచారం. పురోగతి కనబడకపోగా మరింత క్షీణించినట్లు డాక్టర్లు గుర్తించారు. దాంతో విజయవాడలో లాభం లేదనుకున్న డాక్టర్లు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత …

Read More »

ఏపీ కాంగ్రెస్… ఉలుకులేదు, పలుకులేదు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేనా? మునుప‌టి ప్రాభ‌వంలో పావ‌లా వంతైనా ద‌క్కేనా? ఇదీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌ను వేధిస్తున్న కీల‌క ప్ర‌శ్న‌. ఒక‌ప్పుడు దాదాపు ప్ర‌తి ఇంటిపై ఎగిరిన కాంగ్రెస్ జెండా, అజెండా కూడా.. ఇప్పుడు వీధుల్లోనూ క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ఏపీలో పుంజుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెండు ప్ర‌యోగాలు చేసింది. 2012లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. పార్టీని ముందుకు న‌డిపించే వ్యూహంలో సీమ ప్రాంతానికి పెద్ద‌పీట …

Read More »

విన్నారా? ఆ గ్రామంలో వరదకూ వార్షికోత్సవరమట

వివాహ వార్షికోత్సవం….ఏదైనా సంస్థ వార్షికోత్సవం….ప్రైవేటు పాఠశాలల వార్షికోత్సవం…ఇలా ఎన్నో రకాల వార్షికోత్సవాల గురించి విన్నాం. ఈ వార్షికోత్సవాలన్నీ సంతోషంతో జరుపుకునేవి. అయితే, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం దగ్గరలో ఉన్న గొల్లప్రోలు గ్రామ ప్రజలు మాత్రం బాధతో ఓ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అంతేకాదు, ఆ వార్షికోత్సవానికి విచ్చేస్తున్న ప్రజా ప్రతినిధులకు స్వాగతం పలుకుతున్నారు. గత 30 సంవత్సరాలుగా తమ గ్రామం వరదనీటిలో మునిగిపోతుందని, ఈ ఏడాది కూడా మునిగిపోయిందని ఆ గ్రామస్థులు …

Read More »

రెడ్ల బాట‌లో నెల్లూరు టీడీపీ.. క‌మ్మ‌ల‌ను ప‌క్క‌న పెడుతున్నారా?

ఏ రోటికాడ ఆ పాటే! అనే సామెత రాజ‌కీయాల‌కు స‌రిగ్గా న‌ప్పుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు రాజ‌కీయాల్లో సామాజిక వ‌ర్గాల ప్ర‌భావం ఎక్కువైపోయింది. ఒక‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన సామాజిక వ‌ర్గాల హ‌డావుడి.. స‌మీక‌ర‌ణ‌లు ఇప్పుడు జిల్లాల‌కు కూడా వ్యాపించింది. ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లా అంటే.. రెడ్డి సామాజిక వ‌ర్గానికి కంచుకోట అనేక ప‌రిస్థితి కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అధికార వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరును క్లీన్ స్వీప్ చేసింది. …

Read More »

‘దొనకొండ‘ బంగారు కొండ కానుందా?

రాష్ట్రంలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో ఒకటైన పల్నాడు ప్రాంతంలోని దొనకొండ పేరు కొద్ది సంవత్సరాల క్రితం వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. ప్రభుత్వ భూములు, అటవీ భూములు కలిపి…దాదాపు 50 వేల ఎకరాలు భూములున్న ఈ ప్రాంతంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు కాబోతోందని గత ప్రభుత్వం హయాంలో విపరీతమైన ప్రచారం జరిగింది. దీంతో, దొనకొండ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో విస్తారంగా అటవీ, ప్రభుత్వ భూములు ఉన్న …

Read More »

హైదరాబాద్ 150 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టనుందా?

తెలంగాణలో బాగా వర్షాలు పడే నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఈ సిటీలో ఏటా భారీ వర్షాలే పడుతుంటాయి. తెలంగాణలో వర్షాలు పడ్డాయంటే హైదరాబాద్‌లో కచ్చితంగా సగటు వర్షపాతం కంటే ఎక్కువే నమోదవుతుంది. ఈసారి వర్షాలు మరీ భారీగా పడుతున్నాయి. ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో కొన్ని రోజుల పాటు వదలకుండా వర్షాలు కమ్ముకున్నాయి. మొదటి రోజు వర్షాల్ని బాగా ఆస్వాదించిన వాళ్లు.. రెండు మూడు రోజుల తర్వాత …

Read More »

బీజేపీలోకి వైసీపీ నేత‌.. మంత‌నాలు షురూ!

ఏమాటకామాటే చెప్పుకొవాలి. రెడ్డి సామాజిక వ‌ర్గం అంటే.. చెవులు కోసుకునే నాయ‌కుల్లో చాలా మంది మాటేమో కానీ.. గుంటూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన మోదుగుల వేణుగోపాల రెడ్డి.. మ‌న‌సు మారింద‌ని అంటున్నారు జిల్లాకు చెందిన రాజ‌కీయ పండితులు. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌గా సుప‌రిచితులైన మోదుగుల‌కు మిగిలిన రెడ్ల కంటే కూడా రెడ్డి సామాజిక వ‌ర్గంపై ఎన‌లేని మ‌క్కువ‌. అయినా.. ఆయ‌న రాజ‌కీయాలు టీడీపీతో ప్రారంభించారు. 2009లో గుంటూరు …

Read More »

ఏపిలో రాష్ట్రపతి పాలన ?

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా ? అవుననే అంటున్నారు వైసీపీ తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘరామ కృష్ణంరాజు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ, చట్ట వ్యతిరేక విధానాలను చూస్తుంటే తనకు ఏపిలో రాష్ట్రపతి పలన విధించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నట్లు అనుమానంగా ఉందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా శాసన, కార్యనిర్వహక వ్యవస్ధలను భ్రష్టుపట్టిస్తోందంటూ మండిపోయారు. తనపై ఉన్న కేసుల నుండి తనను తాను రక్షించేకునే ప్రయత్నంలో …

Read More »

ప్రవాసులకు సవాలుగా మారిన ఆస్తుల నమోదు

తెలంగాణ రాష్ట్రంలోని వారంతా తమ ఆస్తుల్ని నమోదు చేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వటం.. అందుకోసం భారీ కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యవసాయేతర ఆస్తుల్ని నమోదు చేసుకుంటే.. వారికి బ్రౌన్ కలర్ బుక్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ అవకాశం ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. స్థానికులు పలువురికి ఆస్తుల నమోదులో బోలెడన్ని …

Read More »

బిహార్ లో గెలుపు ఎవరిదో చెప్పిన తాజా సర్వే

దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్న అంశాల్లో బిహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు. మూడు దశల్లో జరిగే ఈ ఎన్నికల మీద అన్ని పార్టీలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఆ రాష్ట్రంలో సొంతంగా పాగా వేయాలని బీజేపీ భావించినా..సాధ్యంకావటం లేదు. నితీశ్ పార్టీతో జత కట్టిన బీజేపీ.. తన సొంత బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో అయినా గెలిచి తమ సత్తా చాటాలని మహాకూటమి ఆరాటపడుతోంది. ఇలాంటివేళ.. ప్రముఖ మీడియా …

Read More »

బీజేపీకి-ఖుష్పూకు కెమిస్ట్రీ కుదిరేనా? రీజ‌నేంటంటే!

త‌మిళ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా.. ఎంత‌టి వారిపైనైనా.. విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించే నేత‌గా గుర్తింపు పొందిన ప్ర‌ముఖ న‌టి.. ఖుష్బూ.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనూహ్య రీతిలో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం.. క్ష‌ణాల వ్య‌వ‌ధిలో పార్టీ మారిన తీరు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ఆమె అనుచ‌రులుగా ఉన్న‌వారికికూడా చిత్రంగాను, విచిత్రంగాను అనిపించింది. దీనికి కార‌ణం.. ముస్లిం మైనార్టీ వ‌ర్గానికి చెందిన ఖుష్బూ.. …

Read More »