మరో రెండు నెలల్లో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్న చంద్రబాబు .. ఈ ఎన్నికలపై రాష్ట్ర పార్టీ నేతలతో ఆయన సమాలోచనలు జరుపుతున్నారు. ప్రస్తుతం గ్రేటర్లో ప్రభుత్వ వ్యతిరేక గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. కొన్నిరోజుల కిందట వచ్చిన తుఫాను కారణంగా భారీగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ పూర్తిగా మునిగిపోయింది. మనుషులుసైతం కొట్టుకుపోయి.. మృతి చెందారు. మనిషిలోతు …
Read More »ట్రంప్ నే తేజస్వి స్పూర్తిగా తీసుకున్నాడా ?
బీహార్లో జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని ఆర్జేడీ చీఫ్ తేజస్వీయాదవ్ తృటిలో మిస్సయిన విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి సాధించిన ఓట్లకు మహాగఠబంధన్ (ఎంజీబీ)కు పోలైన ఓట్లకు మధ్య తేడా కేవలం 12500 మాత్రమే. ఇంత తక్కువ మార్జిన్లో ఓడిపోవటాన్ని ఆర్జేడీ చీఫ్ తేజస్వి తట్టుకోలేకపోతున్నట్లుంది. అందుకనే ఎన్డీయే కూటమి విజయంపై కోర్టులో కేసులు వేస్తానంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు తేజస్వీ తీవ్రంగా మండిపోతున్నారు. …
Read More »గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ వ్యూహం ఇదేనా ?
దుబ్బాక ఉపఎన్నికలో అనూహ్యంగా గెలిచిన బీజేపీ తన తర్వాత టార్టెట్ గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఇన్చార్జీలను నియమించింది. వీరిలో నలుగురు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. మరొకరు కర్నాటక రాష్ట్రానికి చెందిన నేత కావటం గమనార్హం. నిజానికి జీహెచ్ఎంసి ఎన్నికల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందిన పరిశీలకులు చేయగలిగేదేమీ ఉండదు. కానీ …
Read More »అచ్చెన్నకు చంద్రబాబు షాక్ ఇచ్చారా ?
కొత్తగా రాష్ట్ర కమిటికి అధ్యక్షునిగా నామినేట్ అయిన మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు షాకిచ్చారా ? అవుననే అనిపిస్తోంది పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించాలని అనుకున్న రాష్ట్ర కమిటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వాయిదా పడిందట. దీపావళి పండుగకు ముందు తన ప్రమాణస్వీకారోత్సవం చేయాలని అచ్చెన్నాయుడు అనుకున్నారట. అనుకున్నదే తడవుగా ఇదే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడేందుకు ఫోన్ చేశారట. …
Read More »వైసీపీలో అంతర్గత కలహాలకు ఇదే రీజనా?
గుంటూరు జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గం తాడికొండ. రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ నియోజక వర్గం నుంచి గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ నాయకురాలిగా రంగంలోకి దిగిన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి విజయం సాధించారు. విద్యావంతురాలుగా, మంచి వైద్యురాలిగా గుర్తింపు ఉన్న శ్రీదేవి .. రాజకీయంగా మాత్రం విఫలమవుతున్నారని.. వైసీపీలోనే చర్చకు దారితీస్తోంది. దీనికి ప్రధాన కారణం.. ఆమె నిత్యం వివాదాలతోనే సహవాసం చేస్తుండడం.. కొన్నాళ్ల కిందట సీఐని బెదిరించిన …
Read More »సుగుణమ్మ రాజకీయాలు ముగిసినట్టేనా? బాబు వ్యూహం ఏంటి?
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కీలకమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక మార్పుల దిశగా చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇక్కడ నుంచి పార్టీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు చెక్ పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అంటున్నారు సుగుణమ్మ మద్దతు దారులు. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ కేవలం …
Read More »వైసీపీలో కొత్త జిల్లాల జోష్.. నిజంగానే అంత సీన్ ఉందా?
రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రజల్లో వ్యతిరేకత నానాటికీ పెరుగుతోందనే నిష్టుర సత్యాలు పార్టీని కలవరపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఈ వ్యతిరేకతను తగ్గిం చుకుని పార్టీని పుంజుకునేలా చేయాలని పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా పాతిక జిల్లాలు చేస్తానని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని.. …
Read More »చంద్రబాబు ఆలోచన మంచిదే.. వైసీపీనే తడబడుతోంది!
అవును! ఇప్పుడు ఈ మాటే సర్వత్రా వినిపిస్తోంది. అధికారంలో ఉన్న వైసీపీ నేతలు.. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలను సరిగా అర్ధం చేసుకోలేక పోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం.. మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలేనని అంటున్నారు. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇటీవల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన జరిగింది. దీనికి పోలీసుల వేధింపులే కారణమని అన్ని పక్షాల నాయకులు సహా స్థానిక …
Read More »రాంజీ రాకకు సర్వం సిద్ధం.. బాబు కూడా మౌనం!
అధికార వైసీపీ గూటికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు ఉరఫ్ మాగంటి బాబు కుమారుడు, ప్రస్తుత టీడీపీ జిల్లా యువత అధ్యక్షుడు మాగంటి రాంజీ రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మాగంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అలంకరించింది. అదేసమయంలో టీడీపీలోకి వచ్చిన తర్వాత కూడా ఎంపీగా బాబు …
Read More »రాజకీయాల నుండి ఈ సీనియర్ రిటైర్ అయినట్లేనా ?
తెలుగుదేశంపార్టీలోని అత్యంత సీనియర్ నేతల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. రాజమండ్రి నుండి ఈయన ఆరుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. ఎన్టీయార్ తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు అన్నగారి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. మధ్యలో రాజకీయ జీవితం కాస్త కుదుపులకు లోనైనా మళ్ళీ సర్దుకున్నది. తాజాగా మీడియా సమావేశం పెట్టిన బుచ్చయ్య తన రాజకీయ వారసుడిని ప్రకటించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన …
Read More »రేవంత్ కు ఇవ్వక తప్పదంటున్నారు
రేవంత్ రెడ్డికి తెలంగాణా కాంగ్రెస్ కమిటి అధ్యక్ష పదవిని అప్పగిస్తారా ? కాంగ్రెస్ పార్టీలో ఇదే విషయమై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్చొచ్చింది. బీజేపీ అభ్యర్ధి రఘునందనారావు అనూహ్యంగా విజయం సాధించారు. రెండో స్ధానంలో టీఆర్ఎస్ సరిపెట్టుకోగా హస్తంపార్టీ మాత్రం మూడోస్ధానంతో సర్దుకోవాల్సొచ్చింది. సరే దీనికి కారణాలు చాలానే ఉన్నా బాధ్యత మాత్రం పిసీసీ ప్రెసిడెంట్ దే అవుతుంది. ఇందులో భాగంగానే ప్రస్తుత అధ్యక్షుడు …
Read More »ఎవరిని ఎవరు వదిలేశారు ?
ఈ విషయమే తెలుగుదేశంపార్టీలో ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్టీ అధికారానికి దూరమైనా మాజీ మంత్రి, సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మాత్రం వైజాగ్ లో గెలిచారు. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండే గంటా తనదైన రాజకీయం మొదలుపెట్టేశారు. టీడీపీకి రాజీనామా చేస్తారని, వైసీపీలో చేరుతారనే ప్రచారం గంటా విషయంలో జరిగినట్లుగా మరే టీడీపీ నేతపైనా జరగలేదంటే …
Read More »