Political News

ఆదివారం చికెన్.. మటన్.. బ్యాన్

Andhra Pradesh

కరోనా కావొచ్చు.. దాని బాబాయ్ కావొచ్చు. వేళ ఏదైనా.. సందర్భం మరేదైనా సరే. ఆదివారం వస్తే చాలు.. కాసింత చికనో.. మటనో తింటే అదో లెక్క. ఎంత లాక్ డౌన్ అయితే మాత్రం పస్తులుంటామా? కరోనా పుణ్యమా అని బయటకు వెళ్లలేని వేళ.. ఇళ్లల్లోనే బంధీలుగా మారిపోయిన దుస్థితి. కలలో కూడా ఊహించని రీతిలో వారాలకు తరబడి ఇళ్లలోనే ఉంటున్న వారికి.. వారాంతం వస్తే చాలు.. కూసింత చికనో.. కాసింత …

Read More »

చరిత్రలో తొలిసారి ఈనాడులో అలా జరిగిందట

Eenadu

ఊహించని పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది కరోనా. యావత్ ప్రపంచం స్తంభించిపోయేలా చేయటంలో ఈ మాయదారి వైరస్ తీరు వేరుగా చెప్పక తప్పదు. ఒక్క బుల్లెట్ పేలకుండా.. ఒక్క బాంబు విసరకుండా ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ లోకి వెళ్లిపోయేలా చేసిన ఘనత కరోనాకే దక్కుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోని పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. …

Read More »

తెలంగాణలో మళ్లీ డేంజర్ బెల్ మోగింది

వరుసగా సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతూ వస్తున్న తెలంగాణలో ఈ రోజు ఒక్కసారిగా 22 కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజులుగా మరణాలు సంభవించలేదు. ఈరోజు ఏకంగా ముగ్గురు చనిపోయారు. వీరంతా హైదరాబాదుకు చెందినవారే. అయితే, ఆ ముగ్గురుకి ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. వారం తర్వాత కేసుల విజృంభణతో మళ్లీ ఇక్కడ కంగారు మొదలైంది. అయితే, చిన్న ఆశావహ పరిణామం ఏంటంటే…. ఈరోజు …

Read More »

కాషాయం పులిమేసుకుంటున్న ప‌వ‌న్

భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తు ఇరువురికీ ఉభయ తారకంగా ఉంటుందని అంతా అనుకున్నారు. పరస్పర సహకారంతో రెండు పార్టీలు బలపడతాయని.. జగన్ సర్కారును దీటుగా ఎదుర్కొంటాయని భావించారు. కానీ బీజేపీకి సహకరించే విషయంలో పవన్ ఎంతో సిన్సియర్‌గా కనిపిస్తున్నప్పటికీ.. ఆ పార్టీ నుంచి పవన్‌కు, జనసేనకు ఏమాత్రం సహకారం అందుతోందన్నది ముందు నుంచి సందేహంగానే ఉంది. పవన్ చేసే పోరాటాలకు భాజపా రాష్ట్ర స్థాయి నుంచి కానీ, కేంద్ర …

Read More »

కరోనా వేళ.. మరో రంగుల రచ్చలో ఏపీ సర్కార్?

మిగిలిన రోజుల్లో రాజకీయం ఎలా ఉన్నా.. అత్యవసర వేళల్లో అందునా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి విమర్శలు వెల్లువెత్తేలా అవకాశం ఇవ్వటంతోపాటు..ఏపీ సర్కారుకు కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ మధ్యనే పంచాయితీ కార్యాలయాలకు ఏపీ అధికారపక్ష జెండా రంగుల్ని పోలి ఉండేలా రంగులు వేయటాన్ని హైకోర్టు తప్పు పట్టింది. …

Read More »

ఏపీలో 1400 దాటిన పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఒక్క కర్నూలు జిల్లాలోనే 43 కేసులు నమోదవడం కలవరపెడుతోంది. కర్నూలులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 386కు చేరుకుంది. అయితే,కేసుల సంఖ్యలో కర్నూలుతో పోటీపడుతోన్న గుంటూరు జిల్లాలో కేవలం 4 కేసులే నమోదు కావడం ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో …

Read More »

టీవీ5మూర్తి అరెస్టుకు రంగం సిద్ధం?

Tv5 Murthy

అంద‌రూ క‌రోనా గురించే చ‌ర్చించుకుంటున్న స‌మ‌యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. టీవీ-5 న్యూస్ ఛానెల్ ముఖ చిత్రం అన‌ద‌గ్గ అగ్ర‌శ్రేణి తెలుగు న్యూస్ యాంక‌ర్ మూర్తిని అరెస్టు చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కారు రంగం సిద్ధం చేసింది. ఆయ‌న్ని అరెస్టు చేసేందుకు ప్ర‌త్యేక సీఐడీ బృందాన్ని ఏర్పాటు చుఏసింది. ఈ బృందం మూర్తిని అరెస్టు చేసేందుకు హైద‌రాబాద్ బ‌య‌ల్దేరిన‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ స‌ర్కారు అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని …

Read More »

పొట్టి దుస్తుల వల్లే కరోనా… మతపెద్ద

మహిళల్లో పెరుగుతున్న అశ్లీలత, వస్త్రధారణ వల్లే కరోనా వంటి విపత్తులు వస్తున్నాయని పాకిస్థాన్ లోని ప్రముఖ మత పెద్ద, మౌలానా తారిఖ్ జమీల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. దాంతోపాటు, మీడియా అబద్దాలు చెబుతోందని, నిజాన్ని నిర్భయంగా చెప్పే మీడియా సంస్థలు లేవని, అక్కడి న్యాయస్థానాలు దుర్మార్గమై పోయాయని తారిఖ్ జమీల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘ఎహ్సాస్‌ టెలిథాన్’‌ అనే నిధుల సేకరణకు సంబంధించిన టెలివిజన్‌ లైవ్‌ …

Read More »

లాక్ డౌన్ వేళ… మంత్రిగారి హంగామా చూశారా?

ప్రాణాంతక వైరస్ కరోనా విజృంభణ నేపథ్యంలో యావత్తు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది. ఎక్కడికక్కడ కరోనాను కట్టడి చేసేందుకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ముఖానికి మాస్క లేకపోయినా, అనవసరంగా బయటకు వచ్చినా, నిత్యావసర సరుకుల కొనుగోలులో భౌతిక దూరం పాటించకపోయినా… కఠిన చర్యలేనంటూ అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోడై కూస్తున్నాయి. నిబంధన అమలులో కఠినంగానూ వ్యవహరిస్తామంటూ అధికార పార్టీలకు …

Read More »

ద గ్రేట్ మూర్తి నోట… కరోనాతో సహజీవనం తప్పదట

Infy Narayana Murthy

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిన తర్వాత మన జీవన విధానం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర కామెంట్లు లెక్కలేనన్ని వినిపిస్తున్నాయి. ఇలాంటి కామెంట్లలో కొన్ని కామెంట్లు ఆయా రంగాలకు చెందిన కీలక వ్యక్తులు చేస్తున్నవి కూడా కొన్ని ఉన్నాయి. అవి అమితాసక్తి రేకెత్తించేవే. ఇలాంటి కామెంట్లలో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన కామెంట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. …

Read More »

ఇవన్నీ సెట్ చేశాకే.. ఎవరి ఊళ్లకు వారిని పంపిస్తారట

ఇంటర్వ్యూకు వచ్చి ఒకరు.. ఎగ్జామ్ కు వచ్చి మరొకరు.. ఫంక్షన్ కు వచ్చి ఇంకొకరు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. దేశంలోని లక్షలాది మంది లాక్ డౌన్ పుణ్యమా అని ఊరు కాని ఊళ్లో చిక్కుకుపోవటం తెలిసిందే. ఇంటికి దూరంగా.. ఇన్నేసి రోజులు ఉండని ఎంతోమంది ఇబ్బందిగా ఉన్నా.. తప్పనిసరిగా తమకేమాత్రం అనుకూలంగా లేని చోట్ల ఉండిపోవాల్సిన దుస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉపాధి కోసం ఒకరాష్ట్రం నుంచి వేరే …

Read More »

కేటీఆర్ ఐడియాను బీజేపీ హైజాక్ చేసిందా?

క‌రోనా కారణంగా దేశంలోని అన్ని రంగాలు ప్ర‌భావితం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి పుట్టుకకు మూల కార‌ణంగా విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్న చైనాను ప్ర‌పంచంలోని అన్ని దేశాలు టార్గెట్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని దేశాలు త‌మ పెట్టు‌బ‌డుల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించేశాయి. చైనా నుంచి ఇలా కంపెనీలు ఎగ్జిట్ అయ్యే ప్లాన్‌ను భార‌త్ కైవ‌సం చేసుకుంనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, ఈ క్ర‌మంలో తెలం‌గాణ ఐటీ వాఖ మంత్రి కేటీఆర్ కీల‌క …

Read More »