Political News

తెలుగు సినిమాలపై కేసీఆర్ పంచ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుగు సినిమాల తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. తెలుగు చిత్రాల్లో తెలంగాణ యాస వాడుక గురించి ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను హాస్యాస్పదంగా చూపించేవారని.. విలన్ పాత్రలకు, కమెడియన్లకు తెలంగాణ స్లాంగ్ వాడేవారని.. కానీ ఇప్పుడు హీరోలకు ఈ స్లాంగ్ పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. కేసీఆర్ చెప్పిన మాట వాస్తవమే. తెలుగు సినిమాల్లో ఈ మార్పు ఇప్పుడు స్పష్టంగా …

Read More »

కేసీఆర్‌కు దీదీ పిలుపు.. మ‌రి జ‌గ‌న్‌కు?

ప్ర‌స్తుత జాతీయ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌ర మలుపుల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. వ‌రుస‌గా రెండు సార్లు గెలిచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాల‌న‌పై బీజేపీయేత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. త‌మ రాష్ట్రాల‌కు ప్ర‌ధాని మోడీ తీవ్ర అన్యాయం చేస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీకి వ్య‌తిరేక పార్టీలన్నీ క‌లిసి ఒక కూట‌మి ఏర్పాటు చేసే దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవ‌ల తెలంగాణ సీఎం …

Read More »

పంజాబ్ కూడా పాయే?

అధికారంలో లేని పార్టీలు ఎలాగైనా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి గ‌ద్దెనెక్కాల‌ని శ్ర‌మిస్తాయి. రాష్ట్రాల్లో అయినా కేంద్రంలో అయినా పార్టీల ముఖ్య ల‌క్ష్యం ఇదే. కానీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా క‌నిపిస్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇత‌ర రాష్ట్రాల్లో అధికారం ద‌క్క‌డం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. చేతిలో ఉన్న రాష్ట్రాల‌ను కూడా చేజాతులారా వ‌దిలేసుకోవ‌డం ఆ పార్టీకే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఎగ్జిట్ పోల్ స‌ర్వేల ప్ర‌కారం పంజాబ్ …

Read More »

దేశంలో ఈ పరిణామాలు తప్పవు

ఎన్నికల ఫలితాలు వెలువడనున్న ఐదు రాష్ట్రాలపై అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలాగున్నా గోవాలో మాత్రం అప్పుడే క్యాంపు రాజకీయాలు మొదలైపోయాయి. గోవాలో మొన్నటి ఎన్నికల తర్వాత కూడా బాగా అనిశ్చితి ఏర్పడిన సంగతి తెలిసిందే. చివరకు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న కారణంగా బీజేపీ గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఎంఎల్ఏల సంఖ్యాపరంగా తీసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే …

Read More »

బాధిత ముఖ్యమంత్రులతో తొందరలోనే సమావేశం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తొందరలోనే ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం చేతిలో వివక్షకు గురవుతున్న, బాధిత ముఖ్యమంత్రులను ఆహ్వానించబోతున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాల ముఖ్యమంత్రులతో తమ అధినేత్రి సమావేశం నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తృణమూల్ సీనియర్ నేతలు చెప్పారు. జాతీయ స్ధాయిలో బలమైన ప్రత్యామ్నాయం లేనందునే కేంద్రంలో బీజేపీ అధికారంలో కంటిన్యూ అవుతోందని …

Read More »

జ‌గ‌న్‌పై ఆర్య వైశ్యుల ఫైర్‌.. రీజ‌న్ ఇదే!

సీఎం జగన్‌పై ఆర్యవైశ్య నేతలు బాబు, సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య‌కు అసెంబ్లీ‎లో సంతాపం ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి‎కు మాత్రమే సంతాపం తెలిపారన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే రోశయ్యకు సంతాపం తెలపలేదని ఆరోపించారు. సీఎంగా , గవర్నర్‎గా సీనియర్ నేత రోశయ్య  పని చేశారని, రోశయ్య మృతి చెందినప్పుడు కూడా జగన్ కనీసం నివాళులు …

Read More »

కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాండు.. మ‌రి జ‌గ‌న్ !

రేపు ప‌ది గంటల‌కు అసెంబ్లీలో కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తానంటూ తెలంగాణ సీఎం చంద్ర‌శేఖ‌ర రావు వెల్ల‌డించారు. ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి తీపి క‌బురు ఒక‌టి వెల్ల‌డిస్తాన‌ని అన్నారు. ఇవాళ వ‌న‌ప‌ర్తిలో నిర్వ‌హించిన సభ‌లో ఆయ‌నీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఇప్పుడు అంద‌రి ఆస‌క్తీ రేపటి పైనే ! దీంతో టీపీపీఎస్సీ కి సంబంధించి ప్ర‌క్రియ ఎలా ఉండ‌నుంది అన్న ఆశ కూడా ఉంది. వివిధ కార్యాల‌యాల్లో నెల‌కొన్న ఖాళీలు ఏ …

Read More »

ఏపీ గవర్నర్ పై సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు

జగన్ సర్కార్ కు ఏపీ గ‌వ‌ర్న‌ర్‌ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న అసెంబ్లీలో సైతం గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలని, ఏపీలో అభివృద్ధే లేదని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్ తీరుకు నిరసనగా టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా గవర్నర్ హరిచందన్ పై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ వివాదాస్పద వ్యాఖ్యలు …

Read More »

సీఎం జగన్.. పక్కా క్రిమినల్ మైండెడ్: చంద్ర‌బాబు

ఏపీ సీఎం జగన్.. పక్కా క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్… అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఇరుచుకుప‌డ్డారు. త్వరలోనే ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో సీఎం జగన్‌ ఉన్నారని  అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని.. వ్యతిరేకత ఇంకా పెరగవచ్చనే ఉద్దేశంతో ఎన్నికల యోచనలో జగన్ ఉన్నారన్నారు. మద్యపాన నిషేధం పేరిట నాసిరకం బ్రాండ్లు తెచ్చి.. మహిళల మంగళసూత్రాలు తెంచే జగన్‌కు మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత …

Read More »

జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీలు మరింత సమగ్రంగా విచారణ జరపాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొద్ది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఆ పిటిషన్ పై హైకోర్టు రిజిస్ట్రి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నెంబర్ కేటాయించలేదు. దీంతో రఘురామ మరోసారి పిటిషన్ వేశారు. తాజాగా దానిని పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. రఘురామ పిటీషన్ విచారణ అర్హత తేల్చేందుకుగానూ వెంటనే ఆ …

Read More »

ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్‌లకు ఆఫర్ ఉందట

మొత్తానికి ఎదురు చూపులు ఫలించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని థియేటర్లలో టికెట్ల ధరలను సవరించింది. మరీ కనీస స్థాయిలో ఉన్న ధరలను పెంచింది. సినీ పరిశ్రమ తెలంగాణతో సమానంగా రేట్లు ఇంకా ఎక్కువే ఉండాలని ఆశించినా.. ఈ మాత్రమైనా చేశారు చాలు అని చాలామంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కొత్త చిత్రాలకు ఇది కచ్చితంగా ఊరటనిచ్చే విషయమే. ఎందుకంటే గత వారం వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా, తొలి …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేకు మావోల వార్నింగ్

వైసీపీ మహిళా నేత, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి మావోయిస్టులు హెచ్చరిక లేఖ రాశారు. లేటరైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలను భాగ్యలక్ష్మి ప్రోత్సహిస్తున్నారని మావోలు ఆ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. భాగ్యలక్ష్మి వెంటనే తన పదవికి రాజీనామా చేసి మన్యం విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. మన్యంలోని జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆపేయాలని హెచ్చరించారు. తమ వార్నింగ్ ను భాగ్యలక్ష్మి పట్టించుకోకపోతే …

Read More »