Political News

వైసీపీలో గుబులు రేపుతున్న సుప్రీం వ్యాఖ్య‌లు

కొన్ని కొన్ని విష‌యాలు ఎక్క‌డో జ‌రుగుతుంటాయి. కానీ, వాటితాలూకు మూలాలు మాత్రం ఏపీలో క‌నిపిస్తు న్నాయి. దీంతో అధికార పార్టీ నేత‌ల‌కు ఒకింత గుబులు రేగుతోంది. త‌మ ప‌రిస్థితి ఏంటి? అనే చ‌ర్చ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. తాజాగా దేశ‌వ్యాప్తంగా.. రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇస్తున్న ఉచిత హామీలు.. త‌ర్వాత‌.. ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత సంక్షేమం వంటి అంశాల‌పై దేశ …

Read More »

డిసెంబర్ కి టార్గెట్ పూర్తయిపోతుందా ?

అధికార పార్టీలో అభ్యర్థుల ఎంపిక దాదాపు డిసెంబర్ కల్లా పూర్తయిపోతుందని సమాచారం. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొన్నిచోట్ల అభ్యర్ధులను ప్రకటించేశారు. అలాగే మరికొన్ని చోట్ల సమన్వయకర్తలను కూడా ప్రకటిస్తున్నారు. మామూలుగా అయితే ఎంఎల్ఏలు లేని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తలుగా నేతలనో లేకపోతే ఓడిపోయిన ఎంఎల్ఏలనో నియమించటం సాధారణం. కానీ ఇక్కడ జగన్ ఏమి చేస్తున్నారంటే ఎంఎల్ఏలున్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా అదనపు సమన్వయకర్తల పేరుతో …

Read More »

అందరికీ బీజేపీ వార్నింగ్ ఇచ్చిందా ?

బీజేపీ అగ్రనాయకత్వం నేతలందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందా ? గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజాసింగ్ ను పార్టీ సస్పెండ్ చేస్తుందని ఎవరు అనుకోలేదు. సంవత్సరాల తరబడి హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో బీజేపీకి కేరాఫ్ అడ్రస్ అంటే ఎంఎల్ఏ మాత్రమే అనేట్లుగా ఉండేది. 2018 ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసిన బీజేపీ గెలిచింది కేవలం గోషామహల్ నియోజకవర్గంలో మాత్రమే. నియోజకవర్గంలో ఎంఎల్ఏకి …

Read More »

ఈ ఎంపీ సీట్లలో మార్పులు తప్పదా?

YS Jagan Mohan Reddy

వచ్చే ఎన్నికల్లో 25కి 25 పార్లమెంటు సీట్లను గెలుచుకునే ఉద్దేశ్యంతో జగన్మోహన్ రెడ్డి పెద్ద వ్యూహాలే రచిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ కారణాలతో సుమారు 12 మంది ఎంపీలను మార్చేయాలని డిసైడ్ అయ్యారట. వ్యక్తిగతంగా ఆరోపణలను ఎదుర్కొంటున్న వారు, జనాలు, క్యాడర్ తో సరైన సంబంధాలు మైన్ టైన్ చేయని తదితరాలను కారణాలుగా చూపించి ఎంపీలను మార్చేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. వీరిలో కొందరు ఎంపీలను ఎంఎల్ఏలుగా పోటీ చేయించబోతున్నారట. ఇదే …

Read More »

వైసీపీకి పొంచి ఉన్న పెను ప్ర‌మాదం.. ఎలాగంటే!

ఏపీ అధికార పార్టీలో ధీమా క‌నిపిస్తోంది.తాము అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను మ‌రోసారి గ‌ద్దెనెక్కేలా చేస్తాయ‌ని.. నాయ‌కులు భావిస్తున్నారు. మంచిదే. అయితే.. అదేస‌మ‌యంలో ఈ సంక్షేమం ఎంత‌మందికి అందుతోంది?  ఎంత మంది హ్యాపీగా ఫీల‌వుతున్నారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. వైసీపీకి డేంజర్ బెల్స్ ఎందుకు మోగుతున్నాయ‌ని అంటున్నారో.. తెలుస్తుంది. ఏపీలో మొత్తం 4.95 కోట్ల మంది జ‌నాభా ఉన్నారు.   వీరిలో ఉద్యోగాలు చేసేవారు.. 2 కోట్ల కుటుంబాలు …

Read More »

అన్న క్యాంటీన్ల సెంటిమెంట్‌.. ఏం జరుగుతుందో?

రాష్ట్రంలో పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నాన్ని అతిత‌క్కువ ధ‌ర‌కే అందించే అన్న క్యాంటీన్ల సెంటిమెంటు అధికార పార్టీలోనూ క‌నిపిస్తోంది. దీంతో వైసీపీ నేత‌లు కూడా అన్న క్యాంటీన్ల బాట ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు సుమారు ఏడాది ముందు.. అప్ప‌టి సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. అన్న క్యాంటీన్ల‌ను ప్రారంభించారు. రూ.5 కే ఉద‌యం టిఫిన్‌, రూ.5కే మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం అందించేలా.. అక్ష‌య పాత్ర సంస్థ‌తో ఒప్పందం చేసుకుని.. ఈ కార్య‌క్ర‌మాన్ని ఎన్నిక‌ల …

Read More »

జ‌గ‌న్ ఇలాకాలో టీడీపీ గెలుపు ఖాయం

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం రాజంపేట‌. ప్ర‌స్తుతం ఇక్క‌డ నుంచి మేడా మ‌ల్లికార్జున రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. క‌డ‌ప జిల్లా మొత్తంలో రాజంపేట‌లో టీడీపీ బ‌లం ఎక్కువ‌గా ఉంది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌వ‌నాలు.. సంకేతాలు మారుతున్నా య‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్కడ‌ టీడీపీ ఘ‌న విజయం ద‌క్కించుకుని తీరుతుంద‌ని.. అంచ‌నాలు …

Read More »

టీడీపీలోకి ఆనం.. ఆత్మ‌కూరు క‌న్ఫ‌ర్మ్‌!

ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి రిటైర్ అవుతున్నారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌డం లేదా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో ఆస‌క్తిగా మారిన విష‌యం. ప్ర‌స్తుతం ఆయ‌న నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. పార్టీలో త‌న‌కు ప్రాధాన్యంద‌క్క‌డం లేద‌ని.. ఎమ్మెల్యేగా కూడా త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వాని కి ఆయ‌న జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌విని …

Read More »

ఏపీలో చ‌వితి రాజ‌కీయం

ఒక‌ప్పుడు.. కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైన వినాయ‌క చ‌వితి వేడుక‌లు.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా.. గ‌ల్లీ నుంచి అన్న‌ట్టుగా.. అన్ని ప్రాంతాల్లో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. నిజానికి చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రంలో ఎక్క‌డైనా వినాయ‌క చ‌వితి పందిళ్లు వేసుకునేందుకు ప‌ర్మిష‌న్లు ఇచ్చేవారు. అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌..క‌రోనా …

Read More »

ప‌వ‌న్‌కు ఇదే ల‌క్ష్య‌మైతే.. క‌ష్ట‌మా?

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు.. ప్ర‌జ‌ల నాడినిప‌ట్టుకోవాల్సిందే. ప్ర‌జ‌ల‌ను మెప్పించేలా త‌మ వ్యూహాలు ఉండాలి. ఈ వ్యూహాల్లో ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. తీవ్ర‌మైన దెబ్బ‌ప‌డిపోతుంది. దీనిని గ్ర‌హించ‌క‌పోతే. క‌ష్ట‌మే.! ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కొన్ని రోజులుగా.. ఒక మాట చెబుతున్నారు. త‌మ ల‌క్ష్యం.. వైసీపీ విముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని! అంటే.. వైసీపీ లేని ఏపీ కావాల‌ని. ఈ ల‌క్ష్యం కోస‌మే.. …

Read More »

తార‌క్‌ను మ‌భ్య‌పెట్టిన బీజేపీ..?

బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి అమిత్ షా.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో భేటీ అయింది.. కేవ‌లం 45 నిముషాలే అయిన‌ప్ప‌టికీ.. ఈ ఎఫెక్ట్ మాత్రం 48 గంట‌లు గ‌డిచినా కూడా పొలిటీషియ‌న్ల‌ను విడిచి పెట్ట‌డం లేదు. ఏం జ‌రిగింది? ఏ చ‌ర్చించి ఉంటారు?  జూనియ‌ర్ రాజ‌కీయంగా ముందుకు వ‌స్తున్నారా?  వ‌స్తే.. ఎవ‌రి కండువా క‌ప్పుకొంటారు?  ఎవ‌రికి ప్ర‌చారం చేస్తారు? వంటిఅనేక అంశాల‌పై.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆరాలు తీస్తున్నారు. ఈ …

Read More »

కుప్పంపై బాబు మ‌ళ్లీ పోస్టు మార్టం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం కుప్పం. చిత్తూరు జిల్లాలో త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుల వెంట ఉంటే ఈ నియోజ‌క‌వ‌ర్గంపై వైసీపీ క‌న్నేసింది. దీంతో రాజ‌కీయా్లో ప‌రిస్థితులు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌లేమ‌న్న‌ట్టుగా.. ఇక్క‌డ టీడీపీ ప‌రిస్థితి డోలాయ మానంలో ప‌డిపోయింది. కుప్పంను మినీ మునిసిపాలిటీ చేయ‌డం.. అభివృద్ధి దిశ‌గా ప‌రుగులు పెట్టించ‌డం.. ఇటీవ‌లే 66 కోట్ల రూపాయ‌ల‌ను స‌ర్కారు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో .. కుప్పం …

Read More »