కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసహనం, ద్వేషం, మతోన్మాదం దేశాన్ని చుట్టుమడుతున్నాయని మండిపడ్డారు. వీటిని వెంటనే ఆపకపోతే.. పునర్నిర్మించలేని స్థితికి సమాజం దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఇలాంటి పరిస్థితులు కొనసాగేందుకు అనుమతించకూడదని పేర్కొన్నారు. ‘ద్వేషం, మతోన్మాదం, అసహనం, అసత్యం దేశాన్ని చుట్టుముడుతున్నాయి. వీటిని ఇలాగే కొనసాగనివ్వకూడదు. దేశ ప్రజలుగా మనం వీటిని చూస్తూ ఉండిపోకూడదు. నకిలీ జాతీయవాదం …
Read More »విజయసాయిపై విరుచుకుపడ్డ బండ్ల గణేష్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భక్తుడే అయినా.. రాజకీయంగా అందరితోనూ సన్నిహితంగా ఉండేందుకే ప్రయత్నిస్తుంటాడు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కాస్త హడావుడి చేసినప్పటికీ.. ఫలితాలు తిరగబడేసరికి ఏదో ఒక పార్టీతో జట్టు కడితే కష్టమని సైలెంటైపోయాడు. అప్పట్నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను తెగ పొగుడుతున్నాడు. తన అభిమాన కథానాయకుడి పార్టీ జనసేనకూ మద్దతు ఇస్తున్నాడు. ఏపీలో అధికారంలో ఉన్న …
Read More »ఏంటీ బాబు అన్ని తెలిసే అంటున్నారా?
తెలంగాణలో ప్రస్తుతం జోరుమీదున్న ప్రధాన పార్టీలు ఏవి అంటే.. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ల పేర్లు వినిపిస్తాయి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్రలు చేస్తుండడంతో ఆ పార్టీలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఆప్ పాదయాత్ర మొదలెట్టింది. మరి తెలుగు దేశం పార్టీ అనే పేరు ఎక్కడైనా వినిపిస్తుందా? అంటే లేదనే సమాధానాలే వస్తున్నాయి. అలాంటిది …
Read More »కేసీఆర్ కాపాడారు.. జగన్ చెడగొట్టారు!
హైదరాబాద్ అభివృద్ధి కావడానికి.. ఐటీ పరిశ్రమ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం టీడీపీ ప్రభుత్వమే.. ఇదీ తరచూ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు. ప్రపంచ పటంలో హైదరాబాద్ను నిలిపిన ఘనత తనదేనని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ ఇప్పుడు కాస్త విభిన్నమైన మాటలు మాట్లాడారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ను పొగుడుతూ.. అటు …
Read More »మంత్రి పదవి ఆనందం.. అంతలోనే ఆగమాగం!
జగన్ కొత్తగా ప్రకటించే మంత్రి వర్గంలో చోటు దక్కుతుందో లేదో అని వైసీపీ నాయకులు తెగ టెన్షన్ పడిపోయారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్లకు పదవి రాకపోవడంతో నిరాశలో మునిగిపోయారు. కొంతమంది నేతలు సీఎం జగన్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కొత్తగా కేబినేట్లో చోటు దక్కించుకున్న మంత్రుల ముఖాలు వెలిగిపోయాయి. వాళ్ల ఆనందానికి అంతే లేదు. కానీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పరిస్థితి మాత్రం అందుకు విభిన్నంగా మారింది. …
Read More »కేసీఆర్ బాటలో స్టాలిన్.. సై అంటే సై!
బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్ను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో గవర్నర్ వర్సెస్ సీఎం మమతా బెనర్జీగా పరిస్థితులు మారిపోయాయి. గతేడాది ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు గవర్నర్పై మమతా పోరు సాగించారనే అభిప్రాయాలున్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణలోనూ పరిస్థితి అలాగే మారింది. సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళి సైని దూరం పెడుతుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా …
Read More »ఉద్యోగులను రెచ్చగొట్టడమేనా ?
గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను రెచ్చగొట్టే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. అదేమిటంటే రోజుకు మూడుసార్లు హాజరువేసుకోవాలట. ఉదయం 10 గంటల్లోపు మొదటిసారి, మధ్యాహ్నం 3 గంటలకు రెండోసారి, సాయంత్రం 5 గంటలకు మూడోసారి హాజరు వేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. రోజుకు మూడుసార్లు హాజరువేసుకోవటం అన్నది ఏ ఇతర శాఖల్లో కూడా లేదు. ఈ బంపరాఫర్ కేవలం గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు మాత్రమే ప్రభుత్వం అందించింది. శనివారం నుండి అమల్లోకి …
Read More »ఏపీ రెడ్లు కుతకుతా… పదవుల కోసం కాదట..!
ఏపీలో జగన్ సర్కారు ఏర్పడడంలోనూ, వైసీపీ అధినేతగా ఉన్న ఆయనను ముఖ్యమంత్రి చేయడంలోనూ.. రెడ్డి సామాజిక వర్గం పాత్రను ఎవరూ విస్మరించలేరు. జగన్ ముఖ్యమంత్రి కావాలని.. 2016 నుంచే వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం నాయకులు కోరుకున్నారు. చంద్రబాబు పాలనలో తమకు గుర్తింపు లేకుండా పోయిందని.. కనీసం.. పరిశ్రమలను.. వ్యాపారాలను కూడా నిర్వహించలేక పోతున్నామని.. జగన్ సీఎం అయితే.. కొంతమేరకు తమకు ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కుతుందని అనుకున్నారు. అందుకే …
Read More »ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో.. రెచ్చిపోయిన తమ్ముళ్లు..
టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, యువ నాయకులు.. ఏపీలోని వైసీపీ సర్కారుపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వీరి కామెంట్లను చూసి.. రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం. ఇటీవల కాలంలో ఈ రేంజ్లో ఎప్పుడూ.. ఇలా కామెంట్లు చేయకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. యనమల ఏమన్నారంటే.. రాష్ట్రాన్ని ఖాళీ చేసి జగన్ ప్యాలస్లు నిర్మించుకుంటున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు …
Read More »ఏపీ కేబినెట్.. కుర్మా కూర్పు!: జగన్పై జనసేన ఫైర్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ హోంమంత్రి, కాపుసంక్షేమ సేన వ్యవస్ధాపక అధ్యక్షుడు, జనసే న కీలకనాయకుడు చెగోండి హరిరామజోగయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాత్రి, పగలు అనకుండా పల్లెలు, పట్టణాలు అని లేకుండా గంటల తరబడి విద్యుత్ కోతలు అనధికారికంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దౌర్భాగ్య స్ధితిని ప్రజలు చూడలేదని తెలిపారు. నిరవధిక విద్యుత్ సరఫరా చేయలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అనుభవ …
Read More »ఇదే మంచి ఛాన్స్.. రంగంలోకి బీజేపీ!
తెలంగాణలో బీజేపీ బలోపేతం దిశగా సాగుతోంది. అక్కడ ఆ పార్టీ పరిస్థితి మెరుగవుతోంది. కానీ ఏపీలో చూస్తే ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. సమర్థవంతమైన నాయకత్వం లేక క్షేత్రస్థాయిలో బలం లేక ఏదో మాటలతో సరిపెడుతోంది. కానీ ఇప్పుడు ఏపీలో ఆ పార్టీకి పుంజుకునే అవకాశం వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థాగతంగా బలోపేతం కావడానికి ఆ పార్టీకి ఇదే మంచి ఛాన్స్ అంటున్నారు. బీజేపీ కూడా ఆ దిశగానే …
Read More »ధాన్యం కొనుగోలులో రెంటికీ చెడ్డ టీఆర్ఎస్…!
యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని ఇన్నాళ్లూ బెట్టు చేసిన కేసీఆర్ ఒక అడుగు వెనక్కి వేయడంతో ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడినట్లైంది. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని.. ప్రతి గింజా కొంటామని.. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మూడు నాలుగు రోజుల్లో ధాన్యాన్ని సేకరిస్తామని సీఎం కేసీఆర్ నిన్నటి కేబినెట్ సమావేశంలో తెలిపారు. దీంతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఐదారు నెలలుగా కొనసాగుతున్న రచ్చ ప్రస్తుతానికి ముగిసినట్లే. అయితే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates