Political News

వైసీపీలో ఆ మహిళా నేతలు….ఇద్దరూ ఇద్దరే

వైసీపీలో ప్రస్తుతం ఇద్దరు మహిళా నేతల తీరు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు వైసీపీలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరేమో చాలాకాలంగా వైసీపీలో కీలక మహిళా నేతగా ఉండగా….మరొకరేమో తొలి విడత ఎమ్మెల్యేగా ఎన్నికై తన హవా సాగిస్తున్నారు. అయితే, వీరిద్దరిలోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. తమ నియోజకవర్గాల్లో వేరే ఎమ్మెల్యేలు, ఎంపీలు…కనీసం స్థానికంగా ఇతర వైసీపీ నేతల …

Read More »

అయోధ్య భూమి పూజ ముహుర్తం బాలేదు – స్వరూపానంద

Ram Mandhir

కొందరి నోటి నుంచి కొన్ని మాటలు వచ్చాయంటే.. అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. దేశంలో చాలామందే స్వాములోళ్లు ఉన్నారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. వీరిలోనూ వీవీఐపీ స్వాములోళ్లు ఉన్నారు. అలాంటి వారిలో కొందరికి ఉండే ఇమేజ్ వేరుగా ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు శంకరాచార్య జ్యోతిష్య పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి. అయోధ్యలో రామమందిరం భూమిపూజ కోసం పెట్టిన ముహుర్తం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. …

Read More »

నిమ్మగడ్డ కేసు… నీలం సాహ్నికి చిక్కులు?

నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓ వైపు హైకోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరిండంతో పాటు నిమ్మగడ్డ నియామకంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. మరో వైపు హైకోర్టు తీర్పును అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో ఏపీ ఎస్ ఈసీగా నిమ్మగడ్డ నియామకం దాదాపుగా …

Read More »

నిమ్మగడ్డ కేసు – RRR ఘాటు స్పందన

ఏపీ ఎస్‌ఈసీ నియామకం వ్యవహారం ఇపుడు ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డను ఎందుకు ఎస్ ఈసీగా నియమించలేదంటూ సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ నియామకంపై ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌పై స్టే కోరిన ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురైంది. మరోసారి స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో జగన్ సర్కార్ కు మరో …

Read More »

పట్టాభిషేకానికి రంగం సిద్ధమవుతోందా?

మరో మూడు టర్మ్ లు మా నాయకుడు పాలించే సత్తా ఉందంటూ తరచూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిస్తుంటారు. ఆయన ఆ మాటలు అనే ప్రతి సందర్భంలోనూ కేటీఆర్ కు ముఖ్యమంత్రిపదవి బదిలీ చేసే ప్రక్రియ జోరుగా సాగుతుందన్న ప్రచారం జరగటాన్ని అండర్ లైన్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర యువరాజుగా టీఆర్ఎస్ దళాలు ముద్దుగా పిలుచుకునే కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గతంలో ఎప్పుడూ చూడనంత …

Read More »

అమరావతి ఎపిసోడ్ లోకి కేంద్రాన్ని తీసుకొచ్చిన హైకోర్టు

ఏపీ సర్కారుకు ఇబ్బందికర నిర్ణయం ఒకటి ఏపీ హైకోర్టు నుంచి వెలువడింది. తాము అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే ఏపీ రాజధాని అమరావతిని తరలించాలన్న నిర్ణయంతో పాటు సీఆర్డీఏ బిల్లును రద్దు చేస్తూ అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాల్ని జారీ చేసింది. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల్ని కౌంటర్ దాఖలు చేయాలని …

Read More »

ఎవరు ఆ ఛానల్ ప్రతినిధి? ఆసక్తికరంగా మారిన చర్చ

ప్రశ్నించటం పాత్రికేయుడు చేయాల్సిన పని. కానీ.. ఇప్పుడున్న వ్యవస్థలు.. వాటిని నడిపించే పెద్ద మనుషుల పుణ్యమా అని.. పాత్రికేయానికి కొత్త అర్థాలు చెప్పటమే కాదు.. వారికున్న హక్కుల్ని.. ప్రశ్నించే తత్త్వాన్ని తమకున్న అధికారంతో అడ్డుకుంటున్నారు. గడిచిన పదిహేనేళ్లలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారైనా సరే.. తమను కించిత్ మాట అన్నా ప్రశ్నించేవారు. తప్పు లేకుండా తమకు ఉద్దేశాలు ఆపాదిస్తే రిపోర్టర్లు ఊరుకునే వారు …

Read More »

జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో మరోసారి షాక్

ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఏపీ సర్కార్ కు ఇప్పటికే పలు మార్లు చుక్కెదురైన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ పదవీ కాలం కుదింపు, కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజు నియామకం కోసం జారీ చేసిన జీవో కొట్టివేత వంటి వ్యవహారాలతో జగన్ సర్కార్ హైకోర్టులో భంగపడింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. రమేష్ కుమార్ ను …

Read More »

కేసీఆర్ కలల సచివాలయంలో అంతా ‘6’

తాను కలలు కన్న తెలంగాణ నూతన సచివలయానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓకే చెప్పిన నమూనాకు కొన్ని మార్పులు చేర్పులు చేయటం తెలిసిందే. తాజాగా మరిన్ని మార్పుల్ని చేసినట్లుగా చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ కు అభిముఖంగా ఠీవీగా ఉండేలా సచివాలయాన్ని ప్లాన్ చేస్తున్నారు. అంతేనా.. సీఎం కేసీఆర్ తన లక్కీ నెంబరుగా భావించే ‘ఆరు’కు సచివాలయ నిర్మాణంలో పెద్ద పీట వేయనున్నారు. ప్రతి …

Read More »

తాజాగా అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్?

Ambati Rambabu

ఏపీ అధికారపక్షానికి టైం బాగున్నట్లుగా లేదు. వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే రెండు షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక దళిత యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శిరోముండనం చేసిన తీరు సంచలనంగా మారింది. దీనిపై విపక్షాలు మొదలు దళిత నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. …

Read More »

ఆన్ లైన్ క్లాసుల కోసం ఆవును అమ్మేశాడు

మహమ్మారి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దాదాపుగా అన్ని రంగాలపై తన పంజా విసిరిన కరోనా…ప్రత్యేకించి విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు పరీక్షలు రాయకుండానే కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అయితే, భారత్ లో కరోనా ఉధృతి తగ్గకపోవడంతో ఇప్పటికే ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్పరం ఆలస్యమైంది. మహమ్మారి తీవ్ర రూపం దాల్చనుండడంతో పాఠశాలలు, కళాశాలలు తెరవవద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ప్రభుత్వ …

Read More »

టీడీపీ, వైసీపీలు ‘రాజధాని’ కాన్సెప్ట్ అమ్ముకుంటున్నాయి: పవన్

ఏపీలో అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశం, శాసన మండలి రద్దు వంటి అంశాలపై చాలాకాలంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లులకు ఏపీ శాసన సభ ఆమోదం తెలుపగా…శాసన మండలి ఆమోదం తెలపాల్సి ఉంది. తాజాగా అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లు ఆమోదం కోసం గవర్నర్ దగ్గరకు చేరింది. ఈ నేపథ్యంలో ఏపీలో అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు, అమరావతి రైతుల ఆందోళన …

Read More »