తెలంగాణలో కాంగ్రెస్ను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది భారతీయ జనతా పార్టీ. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి షాకిచ్చిన ఉత్సాహంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రోజుకో హాట్ కామెంట్తో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. …
Read More »నాగబాబు గారూ.. నాకు తెలుగొచ్చు, మీ భాష రాదు
ఎన్నికలు జరుగుతోంది తెలంగాణలో. అది కూడా జీహెచ్ఎంసీ పీఠం కోసం. అందుకోసం టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. మాటల యుద్ధాలు సాగిస్తున్నాయి. కానీ ఈ ఎన్నికలతో సంబంధం లేని ఇద్దరు వ్యక్తుల మధ్య రచ్చ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్కు.. మెగా బ్రదర్ నాగబాబుకు అనుకోని వివాదం తలెత్తి సోషల్ మీడియాలో దాని గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో భాగంగా అనుకోకుండా పవన్ …
Read More »గ్రేటర్ లో 90 సీట్లు టిఆర్ఎస్ వే?
మంగళవారం జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలకు సంబంధించి కొన్ని మీడియా హౌసులతో పాటు ఇంటెలిజెన్స్ సర్వేల ప్రకారం కారు జోరు బాగానే ఉన్నట్లు సమాచారం. సర్వేలో అధికార టీఆర్ఎస్ ఖాతాలో సుమారుగా 90 ప్లస్ డివిజన్లు పడనున్నట్లు తెలిసిందని సమాచారం. ఇక ఎంఐఎంకు కాస్త అటు ఇటుగా ఓ 30 డివిజన్లలో గెలుపు ఖాయమని తేలిందట. ప్రచారంలో గ్రేటర్ మొత్తం మీద రచ్చ రచ్చ చేసేసిన …
Read More »తిరుపతిలో బీజేపీ-పవన్ల సత్తా ఎంత?
తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాకపోయినా.. పార్టీలు తమ అభ్యర్థుల విషయంలో ముమ్మర కసరత్తు ప్రారంభించాయి. ముఖ్యంగా బీజేపీ-జన సేన పార్టీలు తమ అభ్యర్థి అంటే.. తమ అభ్యర్థి అంటూ.. ఇక్కడ అప్పుడే రాజకీయాలకు తెరదీశాయి. మేం గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని మీకు ప్రచారం చేస్తున్నాం కాబట్టి.. మీరు మాకు తిరుపతి వదిలేయాలంటూ.. జనసేన అధినేత పవన్ …
Read More »అసెంబ్లీ సమావేశాలంటేనే టీడీపీలో టెన్షన్ పెరిగిపోతోందా ?
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే ఉంది. మామూలుగా అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్షాలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఎందుకంటే అనేక సమస్యలపై అదికారపక్షాన్ని ఉతికి ఆరేసేందుకు. కానీ రాష్ట్రంలో మాత్రం రాజకీయం రివర్సు గేరులో నడుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సమస్యలంటు పెద్దగా లేవనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా మిగిలిన అంశాలన్నీ వెనకబడిపోయాయి. నవంబర్ 30 తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరపాలని …
Read More »కేసీయార్ ముందు షాకింగ్ రిపోర్టులు ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల తీరు కేసీయార్ కు షాక్ తప్పేలా లేదని సమాచారం. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న విధానంపై సర్వే చేయించుకున్న సీఎంకు అందిన రిపోర్టు ప్రకారం పెద్ద షాక్ తగటం ఖాయమని ప్రచారం పెరిగిపోతోంది. అందరికన్నా ముందే అభ్యర్ధులను సెట్ చేసుకుని ఒక్కసారిగా గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేట్లుగా అధికారపార్టీ వ్యూహం రచించింది. అయితే రోజులు గడిచేకొద్దీ వ్యూహం రివర్సవుతున్నట్లు కేసీయార్ కు స్పష్టంగా …
Read More »కేసీయార్ ను రావద్దని చెప్పేసిన మోడి
ప్రధానమంత్రి నరేంద్రమోడి హైదరాబాద్ పర్యటన వివాదాస్సదమవుతోంది. కరోనా వైరస్ కు విరుగుడుగా తయారు చేస్తున్న టీకా అభివృద్ధిని స్వయంగా పరీక్షించేందుకు మోడి ఈరోజు మూడు నగరాల్లో ఉన్న ఫార్మా కంపెనీలను సందర్శించనున్న విషయం తెలిసిందే. మొదటగా గుజరాత్ లోని జైడస్ క్యాడిలా ఫ్యాక్టరీని సందర్శిస్తారు. తర్వాత పూణేలోని సీరమ్ కంపెనీకి వెళతారు. ఆ తర్వాత చివరకు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ఫ్యాక్టరీకి చేరుకుంటారు. హైదరాబాద్ కు మధ్యాహ్నం సుమారు …
Read More »టీడీపీ కోటలో పాగా వేశారు.. కూలగొట్టుకుంటున్నారు!
అవును! ఏపీలోని చాలా జిల్లాల్లో ఇదే మాట వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోటలుగా దశాబ్దాల పాటు.. సైకిల్ను పరుగులు పెట్టించిన జిల్లాల్లో వైసీపీ పాగా వేసింది. అనూహ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాలను తనవైపు తిప్పుకొని విజయం సాధించింది. ఇది జరిగి ఏడాదిన్నరే అయింది. వాస్తవవానికి వైసీపీకి పట్టులేనిచోట ఆ పార్టీ నేతలు గెలిచారంటే.. రీజనేంటి? అప్పటికే ఉన్న టీడీపీనేతలపై ఎక్కడో ప్రజల్లో అసంతృప్తి ఉండబట్టే కదా! ఈ గ్యాప్ను వైసీపీ భర్తీ చేస్తుందనే …
Read More »రాజధానిని మార్చే అధికారం అసెంబ్లీకి ఎందుకు లేదు ?
‘రాజధానిగా అమరావతిని నిర్ణయించే అధికారం అసెంబ్లీకి ఉన్నపుడు ఇదే అసెంబ్లీకి రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదు’ ? ఇది తాజాగా హైకోర్టు ధర్మాసనం లాయర్లకు వేసిన సూటి ప్రశ్న. పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దు తదితరాలపై జరిగిన విచారణలో పిటీషనర్ల తరపు లాయర్లను ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదని, సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేసే అధికారం లేదని, విభజన చట్టంలో …
Read More »మళ్లీ కామెడీ అయిపోయిన బండి సంజయ్
కొన్ని రోజుల ముందు వరకు భారతీయ జనతా పార్టీకి బలం అనుకున్న వ్యక్తి ఇప్పుడు పెద్ద బలహీనతగా మారిపోతున్నాడు. సీనియర్ నాయకుడు లక్ష్మణ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. పగ్గాలు చేపట్టాక కొన్ని నెలలు బాగానే పని చేశారు. దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీలో ఉత్సాహం తీసుకొచ్చారు. దుబ్బాక ఎన్నికల్లో కూడా ఆయన దూకుడు సానుకూల ఫలితాలే ఇచ్చింది. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో …
Read More »మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ ఉండరా?
తెలివి ఏ ఒక్కడి సొత్తు కాదు. ఇప్పుడీ విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్నిచూస్తే ఇట్టే అర్థం కాక మానదు. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి.. తెలంగాణ అధికారపక్షం ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పక్కా ప్లాన్ సిద్దం చేసుకొని.. రోడ్ మ్యాప్ వేసుకున్న గులాబీ బాస్ కు.. కమలనాథులు ఇస్తున్న షాకులు భారీగా తగులుతున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు గాలి వాటంగా వచ్చిందే తప్పించి.. కేసీఆర్ …
Read More »మళ్ళీ లాక్ డౌన్ పరిస్ధితి వస్తోందా ?
దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అని కాదు థర్డ్ వేవ్ అని మరికొందరు అంటున్నారు కానీ విషయం ఏదైనా మళ్ళీ కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్-5 ఏదో పేరుకి అమలవుతోంది కానీ దేశం మొత్తం ఫ్రీ అయిపోయింది ఎప్పుడో. ఎప్పుడయితే నిబంధనలను ఉల్లంఘించి జనాలు రోడ్లమీదకు వచ్చేశారో అప్పటి నుండే కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతున్నాయి. …
Read More »