Political News

విజయసాయిని వెక్కిరిస్తున్న పాత ట్వీట్లు

కాలు జారినా ఫర్లేదు కానీ మాట జారకూడదని పెద్దోళ్లు ఊరికే అనలేదేమో మన పెద్దోళ్లు. నోటి వెంట వచ్చే మాట ప్రభావం చాలానే ఉంటుంది. ఇక.. రాత అంటారా? అక్షరం బలి కోరుకుంటుందన్న మాటను మరవలేం. మరి.. నోటి వెంట వచ్చే మాటను అక్షరం రూపంలోకి తెచ్చి ట్వీట్ రూపంలో సంధిస్తే ఎలా ఉంటుంది? ఆయుధం ఎలాంటిదైనా తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అప్పటివరకూ బాగానే ఉన్నా.. ఆ ఆయుధాన్ని …

Read More »

ఏమిటీ ఎదురుదెబ్బలు.. జగన్ పార్టీ నేతల్లో అంతర్మధనం

కొన్నిసార్లు అంతే.. ఏం చేసినా అడ్డే ఉండదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తిరుగు ఉండనట్లుగా ఉంటుంది. కానీ.. ఒక్కసారి సీన్ మారిపోతుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన షాకులతో పాటు.. తాజాగా ఎదురవుతున్న సవాళ్లతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పుడు ఏపీ అధికార పక్షానికి అలాంటి పరిస్థితే నెలకొని ఉంది. అన్ని వైపుల నుంచి ఏదో ఒక ఒత్తిడి రావటం.. ఇప్పటివరకూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నది లేదన్న మాట వైఎస్సార్ …

Read More »

పోలీసులకు ఓ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు

ఇటీవల కాలంలో ఏపీలోని పోలీసుల తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెనుకా ముందు లేకుండా రూల్ బుక్ వదిలేసి.. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్న తీరు పలు సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా అలాంటి ఉదంతమే తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి తన భర్త.. న్యాయవాది అయిన సుభాష్ చంద్రబోస్ ను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు.. ఏలేశ్వరం పోలీసులు అక్రమంగానిర్బంధంలోని తీసుకున్నారని.. ఇంటి తలుపులు పగలగొట్టి దౌర్జన్యంగా …

Read More »

కొర‌టాల కౌంట‌ర్‌.. మ‌న సీఎంల సంగ‌తేంటి?

ఇండియాలో క‌రోనా తీవ్ర‌త రోజు రోజుకూ పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. రోజూ వేల‌ల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఏపీలో అయితే గ‌త కొన్ని రోజులుగా 4-5 వేల మధ్య క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. అయినా స‌రే.. ఇప్ప‌టికీ జ‌నాలు అజాగ్ర‌త్త‌గానే ఉంటున్నారు. మాస్క్ ధ‌రించ‌డం, శానిటైజ‌ర్లు వాడ‌టంతో అలక్ష్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్ల‌కు ఎంత చెప్పినా ఫ‌లితం ఉండ‌ట్లేదు. దీంతో ద‌ర్శ‌కుడు కొర‌టాల …

Read More »

జగన్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన శిరోముండన ఘటన

అధికారం చేతిలో ఉంది కదా అని చెలరేగిపోయే వారిని అదుపులోకి పెట్టుకోకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి తాజా శిరోముండన ఉదంతం. అంతేకాదు.. పార్టీ నేతలు కొందరు చెలరేగిపోతున్న తీరు కళ్లకు కట్టేలా తాజా ఉదంతం మారింది. మంగళవారం ఏపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దళిత …

Read More »

గుంటూరు జిల్లా క‌లెక్ట‌రుకు క‌రోనా

చిన్నా పెద్దా.. రాజు పేద తేడా ఏమీ లేకుండా అంద‌రినీ అంటుకుంటూ పోతోంది క‌రోనా. ఎన్ని జాగ్ర‌త్తలు తీసుకున్నా.. ఏ స్థాయిలో ఉన్నా.. క‌రోనా మిన‌హాయింపులేమీ ఇవ్వ‌ట్లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఫిలిం సెల‌బ్రెటీలు.. ఇలా చాలామంది ప్ర‌ముఖుల్ని క‌రోనా ప‌ల‌క‌రించింది. తాజాగా ఏపీలో ఓ క‌లెక్ట‌రు సైతం క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న పేరు.. శామ్యూల్ ఆనంద్ కుమార్. గుంటూరు జిల్లా క‌లెక్ట‌రుగా కోవిడ్ నియంత్ర‌ణ కోసం క‌ష్ట‌ప‌డుతున్న …

Read More »

విజ‌య‌సాయిరెడ్డికి క‌రోనా పాజిటివ్?

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మ‌రోమారు ఆస‌క్తిక‌ర అప్‌డేట్‌తో వార్తల్లోకి ఎక్కారు. గ‌త కొద్దిరోజులుగా వైసీపీ అంత‌ర్గ‌త‌ రాజ‌కీయాలు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆయ‌న్ను దూరం పెడుతున్నార‌నే ప్ర‌చారంతో మీడియా దృష్టిని ఆక‌ర్షించిన విజ‌యసాయిరెడ్డి తాజాగా క‌రోనా పాజిటివ్ అనే ప్ర‌చారంతో మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. విజ‌య‌సాయిరెడ్డి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు వార్త‌లు ప్ర‌సారం చేశాయి. దివంగ‌త సీఎం వైఎస్సార్ జయంతి సందర్భంగా మంత్రి …

Read More »

విలేకరుల ముందు పురుగుల మందు తాగిన వైసీపీ మహిళా నేత

విజయవాడలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. విలేకరుల సమావేశం పెట్టిన ఓ మహిళా నేత.. ఆ సమావేశంలో అందరూ చూస్తుండగా పురుగుల మందు తాగి విస్మయానికి గురి చేసింది. ఈ పరిణామం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆమె పేరు జోని కుమారి. ఆమె వైసీపీ దళిత విభాగంలో రాష్ట్ర స్థాయి నేతగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన బోని కుమారి జిల్లా విజిలెన్స్‌ …

Read More »

జగన్ ముందు మాస్క్ పెట్టుకో, తర్వాత జనానికి చెప్పు – చంద్రబాబు

నిమ్మగడ్డ ఎఫెక్టో ఏంటో గాని కోవిడ్ 19 వచ్చినప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏనాడూ దానిని లెక్క చేయలేదు. ముందు నుంచి దానిని ఆయన సీరియస్ గా తీసుకోవడం లేదు. టెస్టులు పెంచుతున్నారు, ఆస్పత్రులు పెంచుతున్నారు. చికిత్సలు పెంచుతున్నారు. కానీ కోవిడ్ అందరికీ వచ్చేదే, ఏమీ భయపడకండి అన్ని సదుపాయాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా మాస్కుల గురించి అధికారికంగా ప్రతిఒక్కరు వేసుకోవాలని జగన్ ఆర్డరు కూడా వేశారు. ఏపీ సర్కారు …

Read More »

వివేకా మర్డర్ పై రఘురామరాజు వ్యాఖ్యలు

ఏపీలో ఇపుడు రఘురామరాజు మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్, మోస్ట్ పాపులర్ పొలిటీషియన్. ఆయన అప్ డేట్ గురించి అటు జనం, ఇటు మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. దానికి తగినట్టే ఆయన అంతే ఆసక్తికరంగా స్పందిస్తూ తన క్రేజును లైవ్ గా ఉంచుతున్నారు. ఈ ఉదయం తన భద్రత గురించి రాష్ట్రపతిని కలుస్తానని చెప్పిన రఘురామరాజు కలిశాక అమరావతిపై ప్రత్యేక వినతి పత్రం ఇవ్వడం సంచలనం అయ్యింది. అంతకుమించి ఆసక్తికరమైన విషయం …

Read More »

వ్యాక్సిన్ తయారవుతుంది సరే.. అందేదెప్పుడు?

భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ మొదలైపోయాయి.. ఇక వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడమే తరువాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వాళ్ల వ్యాక్సిన్ క్లినియల్ ట్రయల్స్ చివరి దశకు వచ్చేశాయి. ఫలితాలు బాగున్నాయి. వ్యాక్సిన్ రెడీ అయిపోయినట్లే. రష్యా వ్యాక్సిన్ అన్ని ప్రక్రియలూ పూర్తి చేసుకుంది. వచ్చే నెలలోనే మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఇలా రోజుకో వార్త చదువుతున్నాం. వ్యాక్సిన్ కోసం ఆశగా చూస్తున్నాం. కానీ నిజంగా వ్యాక్సిన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది. మనం వ్యాక్సిన్ …

Read More »

వరవరరావు పరిస్థితి ఏమంత బాలేదు

బీమాకోరేగావ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ రెండేళ్లుగా మహారాష్ట్ర జైలులో ఉంటూ ఇటీవల కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన విప్లవ రచయితల సంఘం (విరసం) నేత, కవి వరవరరావు పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన అంపశయ్యపై ఉన్నారని.. ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతారని అంటున్నారు. స్వయంగా ఆయన తరఫున లాయర్ సుదీప్ పస్బోలా కోర్టుకు ఈ విషయాన్ని తెలియజేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 80 ఏళ్ల వరవరరావు.. ఇటీవల …

Read More »