దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో అధికార పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు. మొత్తం ఏడు స్థానాల్లో ఒక్కటి తప్ప ఆరు చోట్ల అధికార పార్టీ వైపు ప్రజలు అండగా నిలిచారు. 1) తెలంగాణ: ఇక్కడ మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ ఎస్ విజయం దక్కించుకుంది. అధికారపార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 97 వేల …
Read More »మంత్రులకు చుక్కలు చూపిస్తున్నమునుగోడు పోల్ ఫలితాలు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా మారింది మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలుగా పేరును సొంతం చేసుకున్న ఈ ఎన్నికల్లో విజయం తమకు తధ్యమని టీఆర్ఎస్ నేతలు ధీమాగా చెప్పటం తెలిసందే. చెప్పిన మాటలకు.. ఈవీఎంలు ఓపెన్ అయ్యాక వస్తున్న ఫలితాలకు పొంతనే లేని పరిస్థితి. నాలుగైదు రౌండ్లు పోయేసరికి.. విజయగర్వంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి ఉంటుందన్న అంచనాలకు భిన్నంగా ఫలితాలు …
Read More »ఆధిక్యంలో టీఆర్ఎస్.. బీజేపీలో హై టెన్షన్?
రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలలో.. టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆరో రౌండ్లోనూ అధికారపార్టీ జోరు చూపించింది. ఫలితంగా 2,169 ఓట్ల ఆధిక్యంతో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి దూసుకుపోతున్నారు. టీఆర్ ఎస్కు 38,521 ఓట్లు రాగా..బీజేపీకి 36,352 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 11,894 ఓట్లు మాత్రమే వచ్చాయి. రౌండ్ రౌండ్లోనూ టీఆర్ ఎస్ అభ్యర్థి దూకుడు ప్రదర్శిస్తుండడంతో బీజేపీలో హై టెన్షన్ …
Read More »దేశంలో మళ్లీ బీజేపీదే హవా.. నాలుగు చోట్ల కమలం ముందంజ
దేశ వ్యాప్తంగా ఈ నెల 3న జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో బీజేపీ జోరు కొనసాగిస్తోంది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుజరిగాయి. ఆయా స్థానాల్లో ఒకటి తెలంగాణలోని మునుగోడును పక్కన పెడితే.. మిగిలిన ఆరు స్థానాల్లో నాలుగు చోట్ల బీజేపీ పుంజుకుని.. ప్రత్యర్థులపై పైచేయి సాధించే పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోలా గోక్రానాథ్ నియోజకవర్గం, హర్యానా రాష్ట్రంలోని ఆదంపూర్ అసెంబ్లీ …
Read More »చౌటుప్పల్ ముంచేసింది: కోమటిరెడ్డి బ్లాస్ట్
హోరాహోరీగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బ్లాస్ట్ అయ్యారు. కీలకమైన మండలంలో తాము దెబ్బతిన్నామని చెప్పారు. చౌటుప్పల్లో తాము ఊహించిన స్థాయిలో ఓట్లు రాలేదని, ఈ మండలం ముంచేసిందని వ్యాఖ్యానించారు. అయితే, మిగిలిన మండలాల్లోనూ పోరు హోరాహోరీగా సాగనుందని వివరించారు. ఏం జరిగింది? మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి రెండు పరిణామాలు టీఆర్ఎస్, బీజేపీలను కలవరపాటుకు గురిచేశాయి. తొలి రౌండ్లో చౌటుప్పల్ …
Read More »ఓట్ల లెక్కింపు వేళలోనూ కేఏపాల్ కామెడీ ఆగలేదుగా?
గంభీరంగా ఉండే రాజకీయాలకు తనదైన మార్కు అద్దటం ద్వారా.. తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని సైతం కామెడీగా మార్చేసే విలక్షణ వ్యక్తిత్వం ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ సొంతంగా చెప్పాలి. చాలామంది ఆయన్ను కామెడీగా తీసుకుంటారు. కానీ.. ఆయన మాటల్నిసీరియస్ గా విన్న వారెవరూ కూడా ఆయన్ను కామెడీ పీస్ గా ఫీల్ కారు. ఆయనలో చతురత ఎక్కువ. ఏదైనా ప్రశ్న అడగాలే కానీ.. అస్సలు వెనక్కి తగ్గరు. ఇబ్బంది …
Read More »రౌండ్ రౌండుకు ఉత్కంఠ.. మునుగోడు ఫలితం ఎవరిది?
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో ఆధిక్యం కనబరిచిన టీఆర్ఎస్…ఆ వెంటనే వెనుకబడి.. తిరిగి మళ్లీ వెంటనే పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్… బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ మండలంలో తొలి రౌండ్ లో …
Read More »మునుగోడు వార్ వన్ సైడ్ కాదు..
ఎగ్జిట్ పోల్స్ దగ్గర నుంచి సగటు ఓటరు వరకు మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అంటే.. టీఆర్ఎస్ ది అంటూ ఆత్మవిశ్వాసంతో చెప్పటం తెలిసిందే. ముందు అనుకున్నట్లు కాకున్నా.. ఉప ఎన్నిక ప్రచారం సాగిన కొద్దీ.. టీఆర్ఎస్ అన్ని విభాగాల్లో సంపూర్ణ అధిక్యతను ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే ఎగ్జిట్ పోల్స్ సైతం టీఆర్ఎస్ కు విజయం ఖాయమని స్పష్టం చేయటం తెలిసిందే. ఇక.. ముఖ్యమంత్రికి అందిన ప్రత్యేక …
Read More »గుంటూరు వైసీపీలో మరో ముసలం.. సుచరిత ఆగ్రహం!
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికార పార్టీకి తలనొప్పులు వదలడం లేదు. కనీసం పది నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తులు తెరమీదికి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు తాడికొండ నియోజకవర్గంలో సెగలు పొగలు కక్కిన అసంతృప్తి.. తర్వాత.. పొన్నూరుకు పాకింది. ఇక, అక్కడ నుంచి రేపల్లె, సత్తెనపల్లి, పెదకూర పాడు, వినుకొండ, చిలకలూరిపేట ఇలా పది నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఎక్కడికక్కడ నాయకుల మధ్య ఆధిపత్య …
Read More »ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఆ ఆరుగురు మహిళలు
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ను ఆయన సొంత అల్లుడు వెన్నుపోటు పొడిచారంటూ జరిగే ప్రచారానికి సంబంధించిన వాదనలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే.. ఇది ఏ మాత్రం వెన్నుపోటు కాదు అన్న విషయాన్ని చంద్రబాబుకు సన్నిహితంగా ఉండేవారు.. నాటి రాజకీయ పరిస్థితుల గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు చెబుతుంటారు. అయినప్పటికి ఆ వాదనను ఏకీభవించకుండా అది ముమ్మాటికి వెన్నుపోటే అని తేల్చేసే వారు కనిపిస్తారు. అయితే.. చంద్రబాబు తన …
Read More »పవన్ను సైతం ప్రశ్నిస్తున్న జనాలు!
పశ్నిస్తానంటూ పార్టీ పెట్టి రాజకీయంగా రెండోసారి(తొలిసారి ప్రజారాజ్యం) అరంగేట్రం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్.. తరచుగా ఏపీ సర్కారుపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కౌలు రైతు సమస్యల నుంచి రహదారుల దుస్థితి వరకు ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. వాటిపై ప్రభుత్వాన్ని నిలదీశా రు. భవిష్యత్తులోనూ నిలదీస్తానని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఇటీవల విశాఖ ఘటన విషయంలోనూ తీవ్రస్థాయిలో సర్కారుపై నిప్పులు చెరిగారు. అయితే, ప్రశ్నించేవాడికే ప్రశ్నలు అన్నట్టుగా తాజాగా …
Read More »గుంతలు పూడ్చరు.. రోడ్లు విస్తరిస్తారా.. సిగ్గుందా?
జనసేనాని పవన్ కళ్యాణ్ ఏదైనా కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారంటే మొత్తం మీడియా దృష్టి అటు వెళ్లిపోతోంది. ఆ రోజుకు వార్తల్లో వ్యక్తి ఆయనే అవుతున్నారు. శనివారం కూడా అదే జరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి సమీపంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చిన ఘటన సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. రోడ్డు విస్తరణ పేరు చెప్పి ఇప్పటంలో పదుల సంఖ్యలో ఇళ్లు కూలగొట్టిస్తున్నారు. పైకి రోడ్డు విస్తరణ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates