Political News

సోష‌ల్ టాక్‌: సీఎం పుట్టిన రోజుకు ఇంత హ‌డావుడా?

ఏపీ సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయ‌కులు భారీ ఎత్తున సంబ రాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విష‌యంలో త‌ప్పులేదు. అయితే, దీనికి సంబంధించి అధికారులను, ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని కూడా వినియోగించుకోవ‌డ‌మే ఇప్పుడు ఇబ్బందిగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించేందు కు వైసీపీ నాయ‌కులు రెండు రోజులుగా తీరిక లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ …

Read More »

బ్రిటన్ను వణికించేస్తున్న కొత్తరకం కరోనా వైరస్

కరోనా వైరస్ కు యాంటీ వ్యాక్సిన్ వచ్చేస్తోందని ఆనందిస్తున్న వేళ బ్రిటన్లో కొత్త వణుకు మొదలైంది. కరోనా వైరస్సే తన రూపాన్ని మార్చుకుని మరింత ప్రమాదకరంగా విజృంభిస్తోందని బ్రిటన్ శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో బ్రిటన్ ప్రభుత్వం కూడా ముందుజాగ్రత్తగా రెండు వారాల పాటు లాక్ డౌన్ విధించేసింది. అంతేకాకుండా బ్రిటన్ నుండి ఇతర ఐరోపా దేశాలకు విమాన సేవలను రద్దు చేసేసింది. విదేశీయులెవరు తమ …

Read More »

జగన్ అభిమానుల బదులు తీర్చేసిన పవన్ ఫ్యాన్స్

సోషల్ మీడియాలో తమ అభిమాన హీరో లేదా నాయకుడి మీద వారి అభిమానులు చూపించే ప్రేమ కంటే.. వాళ్లకు యాంటీ అనిపించే హీరో లేదా రాజకీయ నాయకుడి మీద ద్వేషం ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యక్తుల్ని డీగ్రేడ్ చేసేలా హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రెండ్ చేయడం చాలా ఏళ్లుగా చూస్తున్న వ్యవహారమే. ఈ మధ్య అది మరీ శ్రుతి మించి పోతోంది. ఒక హీరో లేదా రాజకీయ నాయకుడి పుట్టిన …

Read More »

బెంగాల్ రాజకీయపార్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో బీజేపీ ఒక్కసారిగా అన్నీ రాజకీయపార్టీలపైనా ఏకకాలంలో సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఊహించని రీతిలో కమలం పార్టీ చేసిన స్ట్రైక్ తో అన్నీ పార్టీలు బిత్తరపోయాయి. మిగిలిన పార్టీల మాటెలాగున్నా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బపడిందనే చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు ఎంఎల్ఏలు, ఓ ఎంపితో పాటు పదిమంది కీలక నేతలు పార్టీని వదిలేసి బీజేపీలో చేరిపోయారు. వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా …

Read More »

ప‌త్తికొండ రాజ‌కీయం యూట‌ర్న్‌.. ఎందుకిలా?

క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. జిల్లాలోని మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ దూకుడును త‌ట్టుకుని టీడీపీ విజ‌యం సాధించిన సంద‌ర్భాలు ఉన్నా.. త‌ర్వాత కాలంలో మాత్రం.. ఓడుతూ వ‌చ్చింది. కానీ, ప‌త్తికొండ‌లో మాత్రం 1994 ఎన్నిక‌ల నుంచి 2014 ఎన్నిక‌ల వ‌ర‌కు టీడీపీ విజ‌యం సాధించింది. నాయ‌కులు మారినా.. పార్టీ పునాదులు ఎక్క‌డా స‌డ‌లిపోలేదు. 1994 నుంచి 2004 వ‌ర‌కు ఎస్వీ సుబ్బారెడ్డి విజ‌యం సాధించారు. 2009, …

Read More »

ఏబీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

సస్పెన్షన్ లో ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా తనకున్న అధికారాలను అప్పటి ప్రతిపక్షం వైసీపీ ప్రజాప్రతినిధులను, నేతలను ఇబ్బందులు పెట్టడానికే ఉపయోగించారనే ఆరోపణలు వినబడ్డాయి. అంతటి అదికారాలతో చెలరేగిపోయిన ఏబీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుండి కష్టాల్లో పడిపోయారు. టీడీపీ హయాంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన అత్యంతాధునిక కమ్యూనికేషన్ సాంకేతిక పరికరాలను, టెలిఫోన్ భద్రతా పరకరాల కొనుగోలు …

Read More »

మమతకు వరుస షాకులు తగులుతున్నాయే

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. రెండు రోజుల్లో ముగ్గురు ఎంఎల్ఏలు రాజీనామాలు చేశారు. బారక్ పూర్ ఎంఎల్ఏ శీలభద్ర దత్తా రాజీనామా చేశారు. అంతకు ముందు జితేంద్ర తివారి, సువేందు అధికారి రాజీనామాతో తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎంఎల్ఏల సంఖ్య మూడుకు చేరింది. వీరందరు పార్టీకి రాజీనామా చేశారే గానీ ఎంఎల్ఏ పదవులకు కాదు. రాజీనామాలు చేసిన ముగ్గురిలో మమతకు …

Read More »

ఆ ఒక్క‌టీ తప్ప‌.. జ‌గ‌న్‌కు మోడీ అభ‌యం!?

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు కేంద్రంలోని పెద్ద‌లు స‌హ‌క‌రిస్తున్నార‌నడంలో ఎలాంటి సందేహం లేద‌ని ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మ‌చారం. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు కూడా దీనికి బ‌లాన్ని చేకూరుస్తున్నాయి. కీల‌క‌మైన హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బ‌దిలీ నుంచి అనేక విష‌యాల్లో జ‌గ‌న్‌కు అనుకూల ప‌రిణామాలు జ‌రుగుతుండ‌డాన్ని బ‌ట్టి.. కేంద్రం సంపూర్ణంగా స‌హ‌క‌రిస్తోంద‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుతోంది. కొత్త‌ జిల్లాల ఏర్పాటుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అదేవిధంగా …

Read More »

అచ్చెన్న దూకుడుకు మంచి మార్కులే… కానీ?!

Atchannaidu Kinjarapu

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు.. దూకుడుకు మంచి మార్కులు ప‌డుతున్నాయి. రాష్ట్ర పార్టీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి చాలా త‌క్కువ స‌మ‌య‌మే అయినా.. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. గంభీర‌మైన వాయిస్‌తో కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌పైనా విరుచుకుప‌డుతున్నారు. అయితే.. కీల‌క‌మైన వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేయాల‌నే ఆయ‌న దూకుడు మాత్రం స‌క్సెస్ కావ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. టీడీపీకి కొర‌క‌రాని కొయ్య‌గా మారిన మంత్రి కొడాలి నాని …

Read More »

ముందు వేలు.. త‌ర్వాత త‌ల‌‌.. ఇప్పుడు ఏకంగా క‌బ్జా.. రాపాక స్ట‌యిలే వేరు!

జ‌న‌సేన త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన రాపాక స్ట‌యిలే.. వేరుగా ఉంద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. జన‌సేన త‌ర‌ఫున గెలిచిన త‌ర్వాత‌.. కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే ఆయ‌న వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. కేవ‌లం కండువా మాత్ర‌మే క‌ప్పుకోలేదు కానీ.. వైసీపీ ఎమ్మెల్యేల కంటే.. కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికే ఆయ‌న వైసీపీ నేత‌గా చ‌లామ‌ణి అవుతూ.. …

Read More »

తిరుపతిలో పారని బీజేపీ పాచిక

దుబ్బాక ఉపఎన్నికలో అయినా గ్రేటర్ ఎన్నికలో అయినా బీజేపీకి ప్రధాన ఆయుధం భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం. తనకు అలవాటైన పాచికను విసరటం ద్వారా రెండు ఎన్నికల్లోను కమలంపార్టీ నేతలు సక్సెస్ అయ్యారు. దుబ్బాకలో కన్నా గ్రేటర్ ఎన్నికల్లో ఈ పాచిక పర్ఫెక్టుగా సెట్టయ్యింది. ఎలాగంటే గ్రేటర్లోనే ఓల్డ్ సిటి ఉండటం, అక్కడ ముస్లింల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉందని అందరికీ తెలుసు. ముస్లింలకు ఏకైక ప్రతినిధిగా ఎంఐఎం దశాబ్దాల తరబడి వ్యవహరిస్తోంది. …

Read More »

ఆ నియోజ‌క‌వ‌ర్గాల‌ను అక్కా త‌మ్ముళ్లు పంచేసుకున్నారే!

పార్టీని బ‌లోపేతం చేయండి.. అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపును క‌ర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం నుంచి వ‌చ్చిన భూమా అఖిల ప్రియ మ‌రో రూపంలో అర్ధం చేసుకున్నారో.. ఏమో.. ఆమె త‌న‌దైన త‌ర‌హాలో చ‌క్రం తిప్పుతున్నారు. త‌న‌ను తాను బ‌లోపేతం చేసుకోవ‌డంతోపాటు.. నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా పంచేసుకున్నార‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆది నుంచి కూడా అఖిల ప్రియ ఓ విష‌యం చెబుతున్నారు. …

Read More »