Political News

జగన్ స్కూల్లో ఏ మంత్రికి ఎన్ని మార్కులు?

స్కూళ్లలో పిల్లలకు టీచర్లు పరీక్షలు పెట్టడం…మార్కులు వేయడం….ఆ సంవత్సరం ప్రోగ్రెస్ కార్డుల్లో పర్ ఫార్మెన్స్ ని బట్టి తర్వాతి తరగతులకు ప్రమోట్ చేయడం…లేదంటే డిమోట్ చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు….ఫస్ట్ ర్యాంకులు సాధించి బెస్ట్ పిల్లలు పరేషాన్ అవుతుంటారు. ఇదే తరహాలో ఇకపై ఏపీలోని వైసీపీ పొలిటికల్ స్కూల్లో మంత్రులకు మార్కులు వేయబోతున్నారట సీఎం జగన్. టీచర్ అవతారమెత్తబోతోన్న జగన్ తన మంత్రి వర్గ సభ్యులను …

Read More »

మోడీతో జిన్ పింగ్ భేటీ…సర్వత్రా ఉత్కంఠ

కొంతకాలంగా భారత్ , చైనా ల సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన కాల్పుల్లో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ తర్వాత కూడా చైనా భారత సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వస్తూనే ఉంది. తూర్పు లడఖ్‌లో చైనాకు చెందిన పీఎల్‌ఏ దళాలు భారత భూభాగం వైపు దూసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ కవ్వింపు చర్యలతో గాలిలో …

Read More »

హథ్రస్ అల్లర్ల వెనుక అంతర్జాతీయ కుట్ర ?

ఉత్తర ప్రదేశ్ లోని హథ్రస్ జిల్లాలో జరిగిన అల్లర్ల వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందా ? అవుననే అంటున్నారు యూపీ పోలీసులు. ఓ దళిత యువతిపై నలుగురు యువకులు హత్యాచారం చేసిన విషయం (యూపీ పోలీసులు దాడి అని మాత్రమే అంటున్నారు) అందరికీ తెలిసిందే. ఘటన తర్వాత పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా రాజకీయ పార్టీలతో నేరుగానే ఢీ కొన్న విషయం అందరు చూసిందే. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన …

Read More »

చైనాకు భారత్ స్మార్ట్షాక్…డ్రాగన్ కు చుక్కలే

కొంతకాలంగా భారత్ , చైనా ల సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. పాంగాంగ్‌, లడఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా సేనల కవ్వింపు చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు భారత సైన్యం కూడా అదనపు దళాలను మోహరించింన సంగతి తెలిసిందే. డ్రాగన్ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం కూడా భూతల, గగన తల, సముద్ర మార్గాల్లో అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సముద్ర తలంలో డ్రాగన్ …

Read More »

బాగా ఆలస్యమైపోయింది రాహుల్!

హాథ్‌రస్‌లో దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు, ఆమె మృతదేహాన్ని రాత్రికిరాత్రికి పోలీసులు దహనం చేసిన తరువాత యోగి ప్రభుత్వంపై ముందెన్నడూ లేనంత విమర్శలు వచ్చాయి. ఈ దేశంలో మోదీకి, యోగి ఆదిత్యనాథ్‌కు విమర్శలు కొత్తేమీ కానప్పటికీ ఈసారి రాహుల్ గాంధీకి కాస్త మైలేజ్ రావడం.. నిన్న రాహుల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కొద్ది నిమిషాలకే యోగి ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో రాహుల్ ప్రభావం కనిపించింది. …

Read More »

ఢిల్లీ చేరిన జ‌ల జ‌గ‌డం.. కేంద్రం మొగ్గు ఎటు?!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య క‌త్తులు నూరుతున్న జ‌ల వివాదం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. మంగ‌ళ‌వా‌రం (ఈ నెల 6) కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు .. జ‌గ‌న్‌, కేసీఆర్‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. నిజానికి ఇది ఏపీలోనో.. తెలంగాణ‌లోనో.. జ‌రిగితే.. ఇంపాక్ట్ వేరేగా ఉండేది. కానీ, నేరుగా ఢిల్లాలోనే వెబినార్‌లో నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఏపీ ప్ర‌భుత్వం క‌రువు పీడిత …

Read More »

మోస్ట్ వాంటెడ్ పీకే

పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్. దేశ రాజకీయాలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్నవారికి ఈ పేరు తెలిసే ఉంటుంది. రాజకీయ వ్యూహకర్తగా పీకే ఎన్నో పార్టీలను గెలిపించి….మరెందరినో గెలుపు గుర్రాలెక్కించారు. తన టీం 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూటమి, 2015లో బిహార్‌లో మహా ఘట్ బంధన్‌, 2017లో పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్, 2019 ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్…ఇవన్నీ పీకే విజయగాథలు. 2017లో …

Read More »

ఎన్డీఏకి ఎల్జేపీ షాక్…పాశ్వాన్ వేరు కుంపటి

బీహార్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్డీఏకి ఎల్జేపీ పెద్ద షాకే ఇచ్చింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమితో కలిసి పోటి చేయటానికి తమకు ఇష్టం లేదని లోక్ జనశక్తిపార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. చిరాగ్ తండ్రి, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆపరేషన్ చేయించుకుని ఆసుపత్రిలో ఉన్న సమయంలో చిరాగ్ ఇటువంటి నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 243 అసెబ్లీ …

Read More »

చైనా, పాకిస్దాన్ దుస్సాహసం..భారత్ కు ఇబ్బందులే

మనదేశాన్ని ఇబ్బందులు పెట్టటానికి డ్రాగన్, పాకిస్ధాన్ దేశాలు సంయుక్తంగా భారీ కుట్ర మొదలుపెట్టాయి. ఇండియా-చైనా-పాకిస్దాన్ మధ్య ఉన్న ఎవరికీ చెందని ప్రాంతం(నో మ్యాన్స్ ల్యాండ్) గిల్గిత్-బాల్టిస్ధాన్ ప్రాంతాన్ని పాకిస్ధాన్ లోని భూభాగంగా కలిపేసుకునేందుకు కుట్రలు మొదలయ్యాయి. వేలాది కిలోమీటర్లలో విస్తరించున్న ఈ ప్రాంతాన్ని విలీనం చేసుకోవటానికి పాకిస్ధాన్ లాంఛనంగా పనులు మొదలుపెట్టింది. ఇది జరిగితే మనదేశానికి ఇబ్బందులు తప్పవని కేంద్రప్రభుత్వంతో పాటు రక్షణ రంగంలోని నిపుణులు కూడా తీవ్ర ఆందోళన …

Read More »

ఫైర్ బ్రాండ్లు.. సైలెంట్‌.. టీడీపీలోనే ఎందుకిలా?

రాజ‌కీయాల‌న్నాక‌.. వివాదాల‌కు దూరంగా.. నిర్మాణాత్మ‌కంగా ఉండే రోజులు పోయాయి. ఇప్పుడంతా.. నువ్వు ఒక‌టంటే.. నేరెండెంటా? అనే నాయ‌కులు పెరిగిపోయారు. ప్ర‌జ‌ల్లో చాలా మంది కూడా ఇదే త‌ర‌హా రాజ‌కీయాల‌కు అల‌వాటు ప‌డ్డారు. ఫైర్ బ్రాండ్లు చేసే వ్యాఖ్య‌ల‌కు, వేసే కౌంట‌ర్ల‌కు సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి రాజ‌కీయ ప‌రిశీల‌కుల వ‌ర‌కు కూడా ఫాలోయింగ్ ఎక్కువ‌. ఆన్‌లైన్‌, యూట్యూబ్‌, సోష‌ల్ మీడియాల్లోనూ వీరికి రేటింగ్ ఎక్కువ‌. అందుకే.. ఎప్పుడు ఏ పార్టీలో అయినా …

Read More »

క్షమాపణ చెప్పిన సబ్బం : రియలైజేషన్ మంచిదే

రాజకీయాల్లో హుందాతనం పూర్తిగా కనుమరుగైపోతోంది. ప్రస్తుత రాజకీయాలు ఎలాగున్నాయంటే ప్రత్యర్ధులపై దుమ్మెత్తిపోయటం, నోటికొచ్చినట్లు బూతులు తిట్టేయటం, ఎక్కడైనా డిబేట్ జరుగుతోందంటే ప్రత్యర్ధుల నోళ్ళను మూయించే ప్రయత్నం చేయటం అన్నట్లే ఉంది. రెండు రోజుల క్రితం వైజాగ్ లో మాజీ ఎంపి సబ్బంహరి చేసింది కూడా ఇదే. తనింటి కాంపౌండ్ వాల్ ను కూల్చేసినందుకు జీవీఎంసి ఉన్నతాధికారులతో కలిపి జగన్మోహన్ రెడ్డిని కూడా నోటికొచ్చినట్లు తిట్టేశారు. ముఖ్యమంత్రితో పాటు ఉన్నతాధికారులను సబ్బం …

Read More »

పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టాలి.. ఏం చేస్తారో తెలీదు.. టీడీపీ మాస్ట‌ర్ ప్లాన్‌

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు ఎప్పుడు ఎలా తెర‌మీదికి వ‌స్తారో తెలియ‌దు. అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే. ఈ విష‌యంలో చంద్ర‌బాబు అదే వైఖ‌రిని అవ‌లంబిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల కాలంలో టీడీపీ ప్ర‌ధానంగా టార్గెట్ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌ల‌ను రాజ‌కీయంగా వాడుకున్న చంద్ర‌బాబు వాటి వెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నార‌ని ప‌దే ప‌దే ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కుమారుడు, వైసీపీ …

Read More »