Political News

వైసీపీ బ్యాచ్ కు దణ్ణం పెడుతున్న టీడీపీ

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టికెట్లు దొరకని అసంతృప్తులు పార్టీలు మారడం మామూలుగా జరిగేది. అటు వాళ్లు ఇటు,ఇటు వాళ్లు అటు మారడం కూడా సాదారణ విషయమే. వచ్చిన వారిలో కొందరి వల్ల పార్టీకి ప్రయోజనం కలిగితే, కాలక్రమేణా కొందరు మోయలేని అదనపు లగేజీగా మారతారు.వీళ్లని చేర్చుకుని తప్పు చేశామన్న ఫీలింగ్ పార్టీ అధినాయకత్వానికి కలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి అదేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి… 35 మంది జంప్ …

Read More »

సెంట్ర‌ల్ బ‌డ్జెట్‌: ఇంత‌కీ జ‌గ‌న్ సాధించిందేంటి?

బ‌డ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. ప్ర‌వేశ‌పెట్టారు. సుదీర్ఘ ప్ర‌సంగం.. కొన్ని చ‌లోక్తులు.. మ‌రి కొన్ని స్వోత్క‌ర్ష‌లు మిన‌హా.. ఈ బ‌డ్జెట్‌లో రాష్ట్రాల ప్ర‌స్తావ‌న పెద్ద‌గా లేదు. అయితే.. ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ఏపీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే.. బ‌డ్జెట్ వంట‌కానికి ముందు దాదాపు మూడు మాసాల నుంచి కూడా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఢిల్లీలోనే మ‌కాం వేశారు. ఆర్థిక శాఖ టు.. …

Read More »

బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

చంద్రబాబు, బాలకృష్ణల పేరు వింటేనే విమర్శల బాణాలు ఎక్కుపెట్టే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా మీడియా ముఖంగా బాలకృష్ణకు కృతజ్ఞతలు చెప్పారు. వినడానికి విచిత్రంగా అనిపించినా, ఏమాత్రం నమ్మశక్యంగా లేకపోయినా ఇది నూటికి నూరుపాళ్లు నిజం. నారా లోకేశ్ పాదయాత్ర సమయంలో తీవ్రమైన గుండెపోటుకు గురయిన నందమూరి తారకరత్న నాలుగు రోజులుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ను చూసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారు. …

Read More »

షర్మిలకు పొంగులేటి ఫైనాన్స్

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతులు, ఆగ్రహాలు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకుని, సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ జిల్లాపై బీఆర్ఎస్ కు పెద్దగా పట్టు లేదు. గెలిచిన నేతలను తమ వైపుకు తిప్పుకునే టాలెంట్ తో బీఆర్ఎస్ ఇంతకాలం పాలిటిక్స్ చేసింది. ఇప్పుడు జిల్లా పార్టీలో అసంతృప్తి పెరిగిపోయి వారు పక్క చూపులు చూస్తున్నారు. అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అగ్రగణ్యులనే చెప్పాలి. బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై ఆయన …

Read More »

టార్గెట్ కోటంరెడ్డి.. వైసీపీ యుద్ధం స్టార్ట్‌!

తాజాగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ స‌హా పార్టీ పెద్ద‌ల‌పై విరుచుకుప‌డ్డ సీనియ‌ర్ నాయ‌కుడు, నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిపై వైసీపీ అధిష్టానం కూడా అదే రేంజ్‌లో దూకుడు పెంచేసింది. ఆయ‌న మీడియా స‌మావేశం ముగిసీ ముగియ‌గానే వైసీపీ అధిష్టానం ఆదేశాల‌తో నాయ‌కులు రంగంలోకి దిగిపోయారు. కోటంరెడ్డికి కౌంట‌ర్లు ఇవ్వ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో కోటంరెడ్డి ఆరోపణలపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణా …

Read More »

చిరు వ్యాపారుల‌ను వ‌దల్లేదు!

కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో కొన్ని నిర్ణ‌యాలు ఆస‌క్తిగాను, ఆశ్చ‌ర్య‌క‌రంగా కూడా ఉన్నాయి. తాజాగా ఇప్ప‌టి వ‌ర‌కు లేని విధంగా చిరువ్యాపారుల‌కు పాన్ కార్డును త‌ప్ప‌నిస‌రి చేసింది. త‌ద్వారా.. వారి లావాదేవీల‌పై కూడా ఐటీ క‌న్ను ప‌డ‌నుంది. అదే స‌మ‌యంలో వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు లభించ‌నుంది. వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లింక్ త‌ప్ప‌నిస‌రి. విద్యుత్ రంగానికి విదిలింపు.. 35 వేల …

Read More »

వేతన జీవుల‌పై నిర్మ‌ల‌మ్మ క‌రుణ..

ఆదాయ ప‌న్ను ప‌రిమితి పెంచుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌.. తీసుకున్న నిర్ణ‌యం వేత‌న జీవుల‌కు ఒకింత ఊర‌ట క‌ల్పించింద‌నే చెప్పాలి. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి. అదే స‌మ‌యంలో వేతనజీవులకు కేంద్రం ఊరట లభించింది. …

Read More »

లోకేష్ యువ‌గ‌ళానికి భారీ క్రేజ్‌… ఇది ఓట్లుగా మారితే…!

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర కుప్పం నుంచి జ‌న‌వ‌రి 27న భారీ ప్ర‌జా మ‌ద్ద‌తుతో అడుగులు ముందుకు వేసింది. రోజు రోజుకు ఈయాత్ర‌కు మద్ద‌తు పెరుగుతోంది. మూడు రోజులు కుప్పంలోనే పాద‌యాత్ర చేసిన నారా లోకేష్ అనేక వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వారిసాధ‌క బాధ‌లు కూడా విన్నారు. కొన్ని న‌మోదు చేసుకున్నారు. కొంద‌రికి అభ‌యం కూడా ఇచ్చారు. కుప్పంలో కూర‌గాయ‌ల …

Read More »

వైసీపీలో ఉండదలచుకోలేదు.. తేల్చేసిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనసులో మాట చేప్పేశారు. అధికార వైసీపీలో ఉండదలచుకోలేదని నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. మౌనంగా తప్పుకోదలచుకున్నానని వెల్లడించారు.భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానన్నారు. కొంతకాలంగా ఆయన పార్టీ పట్ల, జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక ప్రకటనలిస్తున్నారు. కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి మాట్లాడినా ఆయన మెత్తబడలేదు. అన్ని విషయాలు మాట్లాడుకుందామన్నా.. వెనక్కి తగ్గేది …

Read More »

మ‌రిదిపై వ‌దిన పోటీ.. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కొత్త ఎత్తు!

రాజ‌కీయాల్లో పేకాట త‌ర‌హా సూక్తులు వినిపించ‌డం కొత్త‌కాదు. అన్న‌మీద త‌మ్ముడు.. అక్క‌పై చెల్లి పోటీ చేసిన సంద‌ర్భాలు ఈ దేశంలో కామ‌న్‌. అలానే తండ్రి, త‌న‌యులు కూడా పోటీ చేసిన సంద‌ర్భాలు ఏపీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకుంటోంది. కర్ణాటకలో క‌ళ్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష‌ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన మైనింగ్ కింగ్‌ గాలి జనార్దన రెడ్డి.. తన తమ్ముడిపై భార్యను పోటీకి …

Read More »

జ‌గ‌న్ యాక్ష‌న్‌.. ర‌ఘురామ రియాక్ష‌న్‌.. అదిరిపోయిందిగా!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు.. ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యం తెలిసిం దే. ఇప్ప‌టికే ర‌ఘురామ‌.. సీఎం జ‌గ‌న్ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని ఒక‌సారి కోర్టులో కేసు వేశారు. ఇక‌, ర‌ఘురామ‌ను అరెస్టు చేయించి కొట్టించార‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు తాజాగా సీఎం జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై ర‌ఘురామ రియాక్ట్ అయ్యారు. జ‌గ‌న్ యాక్ష‌న్ అంటే..ర‌ఘురామ రియాక్ష‌న్ అన్నారు. …

Read More »

బ‌ల‌మైన జిల్లాల్లో బ‌ల‌హీన‌మవుతున్న వైసీపీ..!

గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజృంభించిన విష‌యం తెలిసిందే. టీడీపీకి కంచుకోట‌లు వంటి జిల్లాల్లోనూ వైసీపీ ఫ్యాన్ భారీ ఎత్తున వీచింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా.. పార్టీ పుంజుకుంది. ఉభ‌య గోదావ‌రులు, నెల్లూరు, క‌ర్నూలు, గుంటూరు వంటి జిల్లాల్లో టీడీపీ ఓటు బ్యాంకును ఛిన్నాభిన్నం చేసుకుని మ‌రీ .. వైసీపీ దూసుకుపోయింది. ఇక‌, క‌డ‌ప‌లో క్లీన్ స్వీప్ చేసేసింది. అదేవిధంగా నెల్లూరు , క‌ర్నూలలోనూ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. ఇది …

Read More »