Political News

రూ.500 నోటు కంటే రూ.200 నోటుకే ఎక్కువ ఖర్చా?

ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సమాచార హక్కు చట్టం కింద భారత రిజర్వు బ్యాంకును జలగం సుధీర్ అనే పెద్ద మనిషి తన బుర్రలో ఉన్న సందేహాల్ని ఒక పేపర్ మీద రాసేసి పంపారు? కరెన్సీ నోట్లకు సంబంధించిన సమాచారం తెలసుకునేలా ఆయన అడిగిన ప్రశ్నలకు.. భారత రిజర్వు బ్యాంకు తాజాగా సమాధానాలు ఇచ్చింది. అడిగిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వటమే తప్పించి? కారణాల్ని వివరించటం లాంటివి చేయాలన్న రూల్ లేకపోవటంతో.. …

Read More »

మోదీకి కేటీఆర్ మ‌ద్ద‌తు…ష‌ర‌తు‌లు వ‌ర్తిస్తాయి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య మాల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీ ఈ క్ర‌మంలో అందివ‌చ్చే ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటోంది. మ‌రో వైపు టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీని టార్గెట్ చేయ‌డంలో ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. తాజాగా బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అయోధ్య‌లో రామ‌మందిరం విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి …

Read More »

ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజుకు అన్ని మ‌ర‌ణాలా?

Corona Deaths

క‌రోనా కేసుల సంఖ్య‌.. మ‌ర‌ణాల లెక్క‌లు చూసి వామ్మో అనుకునే రోజులు పోయాయి. ఒక‌ప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు వంద కేసులు న‌మోద‌య్యాయి.. ఐదారుగురు చ‌నిపోయారు అంటేనే చాలా భ‌య‌ప‌డిపోతూ మాట్లాడుకునే వాళ్లం కానీ ఇప్పుడు వేల‌ల్లో కేసులు.. ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ‌లో వాస్త‌వ కేసులు, మ‌ర‌ణాల లెక్క‌ల విష‌యంలో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ఇక్క‌డితో పోలిస్తే ఐదారు రెట్ల సంఖ్య‌లో కేసులుంటున్నాయి. …

Read More »

నిజమా.. హైద‌రాబాద్‌లో క‌రోనా అదుపులోకి వ‌చ్చేస్తోందా?

Corona Hyderabad

తెలంగాణ‌లో నెల కింద‌ట్నుంచి రోజూ వెయ్యికి త‌క్కువ కాకుండా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. అందులో మెజారిటీ హైద‌రాబాద్ ప‌రిధిలోనివే. ఈ మ‌ధ్య అయితే రోజూ హైద‌రాబాద్ ప‌రిధిలోనే 1000-1500 మ‌ధ్య కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ సంఖ్య ఎంత‌కీ త‌గ్గ‌ట్లేదు. మ‌ర‌ణాల సంఖ్య కూడా ఆందోళ‌నక‌ర స్థాయిలోనే ఉంటోంది. ప్ర‌భుత్వం అటు ఇటుగా రోజుకు 10 మ‌ర‌ణాలంటోంది కానీ.. క్షేత్ర స్థాయిలో ప‌రిశీలిస్తే ఆ నంబ‌ర్ ఎక్కువే అని మీడియా …

Read More »

మొన్న కోటి.. ఇప్పుడు రూ.50 లక్షలు..పరిహారంతో సరా?

పోయిన ప్రాణానికి నిమిషాల్లో వెల కట్టే కొత్త సంప్రదాయం ఈ మధ్యన పెరుగుతోంది. ప్రాణం పోవటానికి కారణాలు తెలుసుకునే కన్నా.. ఫలానా ఉదంతం జరిగింది.. బాధితులు ఎంతమంది? సరే.. ఇంత పరిహారం ఇచ్చేద్దామని డిసైడ్ కావటం.. దానికి సంబంధించిన ప్రకటన చేయటం ఈ మధ్యన రివాజుగా మారుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు బాధితులకు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించటం మామూలే. కాకపోతే మారిన కాలానికి తగ్గట్లు ప్రభుత్వం …

Read More »

వైసీపీలోకి గంటా… ఆయన వెంట ఎవరెవరో?

గంటా శ్రీనివాసరావు… తెలుగు నేల రాజకీయాల్లో పరిచయం ఎంతమాత్రం అక్కర్లేని పేరే. అధికారంలో ఏ పార్టీ ఉంటే… ఆ పార్టీలోకి ఇట్టే జంప్ చేసే సత్తా కలిగిన నేతల్లో గంటా అగ్రగణ్యుడనే చెప్పాలి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న గంటా… అధికార పార్టీగా ఉన్న వైసీపీలోకి జంప్ కొట్టేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీలో ఓ వర్గం ఆయన రాకను అడ్డుకుంటున్నా కూడా గంటా తనదైన మార్కు వ్యూహంతో వైసీపీ …

Read More »

జగన్ కోరినట్లే శంకుస్థాపనకు మోడీ వస్తారా?

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో జగన్ సర్కారు ఎంత కచ్ఛితంగా ఉందన్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా మూడు రాజధానుల మాటను వాస్తవరూపం దాల్చేలా చేయటంతో పాటు.. అమరావతి నుంచి విశాఖకు రాజధానిని మార్చాలన్న పట్టుదలతో యువ సీఎం ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ తన ప్రభుత్వ ఎజెండాగా ఉన్న మూడు రాజధానులకు.. మోడీ ఆమోదముద్ర ఉందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నంలో పడ్డారా? అంటే అవునని చెప్పాలి. తన తాజా …

Read More »

ఏపీలో ఆసుపత్రులు లేవా? హైదరాబాద్ కే రావాలా?

ఏపీలో చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా వైద్యం అద్భుతంగా సాగుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో వైద్య వ్యవస్థలో భారీ ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నట్లుగా ఆ మధ్యన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేయటాన్ని మర్చిపోలేం. అలాంటి ఆయనే.. తనకు కరోనాపాజిటివ్ అన్న విషయం తేలిన వెంటనే హైదరాబాద్ కు వచ్చేసి.. కార్పొరేట్ ఆసుపత్రిలో చేరిపోయారు. సామాన్య ప్రజలకు.. …

Read More »

విమానాన్ని పేలకుండా ఆపిందేంటి?

విమానం కూలిందంటే అందులోంచి మంట‌లు రావాల్సిందే. పేలుడు లాంటిది జరిగి అందులో ఉన్న ప్ర‌యాణికుల్లో మెజారిటీ ప్రాణాలు కోల్పోవ‌డం స‌హ‌జం. కానీ కేర‌ళ‌లోని కోళికోడ్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో విమానం రెండు ముక్క‌లైంది కానీ అందులోంచి మంట‌లు రాలేదు. పొగ ఛాయ‌లు సైతం లేవు. ఇది చాలామంది నిపుణుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచిన విష‌యం. విమానం ల్యాండ్ అయ్యే స‌మ‌యానికి ఓ మోస్త‌రుగానే ఇంధ‌నం ఉంటుంది కాబ‌ట్టి.. అది కూలిన‌పుడు మంట‌లు చెల‌రేగ‌డం …

Read More »

గ్రామ వలంటీర్ వ్యవస్థ ఫెయిల్ – రఘురామరాజు

గడిచిన కొద్ది రోజులుగా ఏపీ అధికారపక్షానికి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ పట్ల వీర విధేయతను ప్రదర్శించే మిగిలిన నేతలకు భిన్నంగా రఘురామ మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వింటే జగన్ పరివారానికి ఒళ్లు మండిపోవటం ఖాయం. ఓపక్క తమను..తమ అధినేతను పొగుడుతున్న వేళ.. …

Read More »

బీజేపీతో దోస్తానా… పవన్ అడ్డంగా బుక్కైనట్టేనా?

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ ఓటమి నుంచి కాస్తంత ఊరట పొందుదామనుకున్నారో, ఏమో తెలియదు గానీ… ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తీ కట్టేశారు. అయితే బీజేపీతో దోస్తానాతో ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్నట్టుగానే కనిపించినా… మొత్తంగా ఇప్పుడు పవన్ అడ్డంగా బుక్కైపోయారన్న వాదనలు కాస్తంత గట్టిగానే వినిపిస్తున్నాయి. అది …

Read More »

జగన్ విజ్ఝప్తికి మోదీ ఓకే… డిసెంబర్ దాకా సీఎస్ గా సాహ్నినే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని ఈ ఏడాది చివరి దాకా కొనసాగనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఓ మూడు నెలల పాటు నీలం సాహ్ని పదవీ కాలాన్ని పెంచుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు వచ్చే నెలాఖరు (సెప్టెంబర్ 30)తో …

Read More »