Political News

ఖమ్మం సభ.. చంద్రబాబు మోదీకి పంపిన సిగ్నల్

తెలంగాణలో ఎలాగైనా గెలవాలన్నది బీజేపీ లక్ష్యం.. అయితే, తమ సొంత బలం ఒక్కటే అప్పుడే సరిపోదన్న సత్యమూ ఆ పార్టీకి తెలుసు. కానీ, బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేలా బీజేపీ బలాన్ని రెట్టింపు చేయగలిగే పార్టీ అక్కడ ఇంతవరకు ఇంకేదీ లేదు. ఆ క్రమంలోనే కొందరు బీజేపీ తెలంగాణ నేతలు టీడీపీని మళ్లీ యాక్టివేట్ చేసి పొత్తు పెట్టుకోవాలని సూచించినా అదే తెలంగాణ బీజేపీలోని ఇంకొందరు దానికి అడ్డుపడుతుండడంతో దిల్లీలోని బీజేపీ అధిష్ఠానం …

Read More »

రాహుల్ జోడో యాత్ర‌కు కేంద్రం బ్రేక్‌.. రీజ‌న్ ఇదే!

చైనాలో విజృంభిస్తున్న క‌రోనా.. కొత్త వేరియెంట్ల ఫ‌లితంగా.. భార‌త్‌లోనూ ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే తాజాగా దేశంలో మ‌ళ్లీ మాస్కులు ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఇది లాంటే.. కరోనా నిబంధ‌న‌ల పేరుతో.. కాంగ్రెస్‌పైనా.. కేంద్రం వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించే పరిస్థితి లేకుంటే భారత్‌ జోడో యాత్రను నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రం కాంగ్రెస్‌కు సూచించింది. ఈ మేరకు రాహుల్‌ గాంధీ, రాజస్థాన్ …

Read More »

తెలంగాణపై బాబు టోన్ మారలేదు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీనేన‌ని చంద్ర‌బాబు అన్నారు. పార్టీకి పూర్వవైభవంతోపాటు శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడమే లక్ష్యంగా పార్టీ నాయ‌కులు ప‌నిచేయాల‌ని బాబు సూచించారు. అనేక అభివృద్ధి ప‌నుల‌తో తెలంగాణ‌ను తీర్చిదిద్దామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ రోజు హైద‌రాబాద్ పురోగామి ప‌థంలో ప‌య‌నిస్తోందంటే.. దీనికి టీడీపీనే కార‌ణ‌మ‌ని …

Read More »

‘జగన్ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా కష్టమే’

గత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 151 స్థానాలు చేజిక్కించుకుని అఖండ విజయాన్నందుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో 151 ఏంటి.. మొత్తంగా 175 సీట్లనూ మనమే గెలిచేద్దాం అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉపదేశం చేస్తున్నారు సీఎం జగన్. కానీ వైకాపాలోనే ఉన్న మాజీ మంత్రి, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన డీఎల్ రవీంద్రా రెడ్డి మాత్రం 2024 ఎన్నికల్లో అధికార …

Read More »

క్రైస్తవం లేకపోతే ఇండియాకు మార్గమే లేదు – హెల్త్ డైరెక్టర్

తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ అంటే.. రాష్ట్రం మొత్తం వైద్య శాఖ‌కు మంత్రి త‌ర్వాత మంత్రి లెక్క క‌దా! కానీ, ఈయ‌న ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో త‌ల‌దూరుస్తున్నాడ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. చ‌ర్య‌ల‌తో ఆయ‌న త‌ర‌చుగా మీడియాలోనూ క‌నిపిస్తున్నారు. తాజాగా ఆయ‌న క‌రోనా మ‌హ‌మ్మారిపై చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేశాయి. ప్ర‌పంచం నుంచి క‌రోనా పోయిందంటే.. అది ఏసు ప్ర‌భువు ద‌య‌వ‌ల్లేన‌ని ఆయ‌న …

Read More »

జగన్ ను ఇరుకున పడేసిన అంబటి

ఏపీ మంత్రి అంబటికి కష్టకాలం వచ్చేసింది. ఆయనపై ఆరోపణలు రావటం.. తనకున్న వాయిస్ బేస్ తో తన మీద వచ్చే విమర్శల్ని.. ఆరోపణల్ని కొట్టిపారేస్తుంటారు. అదే సమయంలో అధినేతకు నచ్చిన రీతిలో రాజకీయ ప్రత్యర్థులపై మసాలా గుప్పించి మరీ విమర్శలు చేస్తూ మనసును దోచేస్తుంటారు. అలాంటి ఆయనకు.. ఆయన్ను అభిమానించే సీఎం జగన్ కు కష్టకాలం వచ్చినట్లుగా చెప్పక తప్పదు. తాజాగా ఒక ఉదంతంలో చిక్కుకుపోయిన అంబటి ఉక్కిరిబిక్కిరి అయ్యే …

Read More »

ఈ ‘ర‌క్తం’ ఏఖాతాలో?

ఏపీలో చిత్ర‌మైన ర‌క్త‌దానానికి తెర‌దీసింది ప్ర‌భుత్వం. ర‌క్త‌దానం.. అంటేనే పేరులో ఉన్న‌ట్టు స్వ‌చ్ఛందంగా ఎవ‌రికి వారు ముందుకు వ‌చ్చి చేసే దానం. దీనిలో ఎవ‌రి బ‌ల‌వంతం కూడా ఉండ‌దు. ఇచ్చేవారి ఇష్టం.. ఆధారంగా చేసుకునే తీసుకునేవారు ముందుకు రావాలి. అయితే, ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా ప్ర‌భుత్వ‌మే బ‌ల‌వంత‌పు ర‌క్త దానానికి తెర‌దీయ‌డం.. ఆశ్చ‌ర్యంగానేకాదు.. ఆవేద‌న‌కు కూడా దారితీస్తోంది. ఈ నెల 21(బుధ‌వారం) సీఎం జ‌గ‌న్ 50వ పుట్టిన రోజు. …

Read More »

‘జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌ను మా పై రుద్దకండి’

ఏపీ సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌ను త‌మ‌పై రుద్ద‌వ‌ద్దంటూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఘాటు రిప్ల‌య్ ఇచ్చింది. జ‌గ‌న్ పేరు ఎత్త‌కుండానే దుమ్ముదులిపేసింది. “ఏపీ సీఎం ఆలోచ‌న‌లు ఆయ‌న‌కు ఉంటాయి. అవి మేం పుణికి పుచ్చుకున్నామ‌ని ఎవ‌రు చెప్పారు? అలా అనుకుంటే..దేశంలో 30 మంది ముఖ్య‌మంత్రులు ఉన్నా రు. వారు చేస్తున్న‌వ‌న్నీ కేంద్రం చేస్తుందా? మీ ఆలోచ‌న త‌ప్పు” అని కేంద్రం వైసీపీ ఎంపీల‌కు త‌గిన విధంగా స‌మాధానం చెప్పింది. ఇంత‌కీ …

Read More »

జ‌గ‌న్ పుట్టిన రోజు కానుక‌.. ఇక‌, ‘ఆ మాట’ మాట్లాడొద్దు!

ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు నిజంగానే షాకిస్తున్నాయి. ఏ ఉద్దేశంతో వీటిని తీసుకుం టున్నారో.. ప్ర‌బుత్వానికి అయినా తెలుసో లేదో.. కానీ, వీటి వ‌ల్ల వివాదాలే ఎక్కువగా తెర‌మీదికి వ‌స్తున్నాయి. కొన్నాళ్ల కింద‌ట‌.. క‌న్యాశుల్కం నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌పైనే నిషేధం విధించారు. అదేమంటే వైశ్యుల మ‌నోభావా లు దెబ్బ‌తినేలా ఉన్నాయంటూ.. వారి డిమాండ్‌మేర‌కు ఈ నిషేధం విధించిన‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. వాస్తవానికి బ‌లిజేప‌ల్లి ల‌క్ష్మీకాంతం క‌వి రాసిన క‌న్యాశుల్కంలో సామాజిక …

Read More »

రాజకీయంలో తెలంగానం.. వ్యాపారం ఆంధ్రోళ్లతోనా?

ఢిల్లీ మద్యం కేసు ఏమో కానీ కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. ఏదైనా మాట్లాడినంతనే ఆంధ్రా.. తెలంగాణ అంటూ పాయింట్ల మీద పాయింట్లు తెర మీదకు తీసుకొచ్చే కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పటికి తెలంగాణ అంటే తమ పార్టీనేనని.. తమ పార్టీనే తెలంగాణ అన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే. మాటల్లో వినిపించే తెలంగానం చేతల్లో ఎందుకు మిస్ అవుతుందన్నది ప్రశ్న. తెలంగాణ ప్రయోజనాల కోసం అహరహం శ్రమించే కల్వకుంట్ల ఫ్యామిలీకి.. ఈడీ ఛార్జిషీట్లో కవిత …

Read More »

అన్న‌కు.. ‘అమ్మ’ ఆశీర్వాదం క‌రువయ్యిందే!

జ‌గ‌న‌న్న పుట్టిన రోజు సంద‌ర్భంగా.. ఆ పార్టీ నేత‌లు చాలానే ఆశించారు. పార్టీ అధిష్టానం కూడా.. పెద్ద ఎత్తున సంబ‌రాలు చేయాల‌ని పిలుపునిచ్చింది. ఇక‌, ఈ నేప‌థ్యంలో టీటీడీ చైర్మ‌న్‌, వైసీపీ ముఖ్య నాయ‌కులు, సీఎం జ‌గ‌న్‌కు సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి దంప‌తులు.. స్వ‌యంగా తాడేప‌ల్లి వ‌చ్చి.. సీఎం జ‌గ‌న్‌కు శ్రీవారి ప్ర‌సాదాల‌ను అందించి.. ఆశీర్వ‌దించారు. ఇక‌, క్రైస్త‌వ బోధ‌కులు సైతం.. వ‌చ్చి సీఎం జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించారు. ఇక‌, …

Read More »

ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 10 లక్షల కోట్లు

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డులను దాటి పోతోంది. పాత అప్పులు తీర్చలేకపోగా, సరికొత్త అప్పులు చేస్తూ.. జనాన్ని రుణగ్రస్తులను చేస్తోంది. ప్రభుత్వ రోజువారీ ఖర్చులకు సైతం అప్పులు చేయక తప్పడం లేదు. జగన్ ప్రభుత్వం అధికారానికి వచ్చే నాటికి ఏపీకి రూ.3,62,375 కోట్ల అప్పులున్నాయి. గత మూడేళ్లలో వైసీపీ సర్కారు మరో రూ. 6,37,064 కోట్ల అప్పు చేసింది. అంటే ప్రస్తుతం ఏపీ అప్పులు రూ. 9,99,439 కోట్లన్నమాట. ఇంకో …

Read More »