Political News

రోజాకు నాగబాబు అదిరిపోయే పంచ్

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు.. ప్రతిపక్ష జనసేన నాయకులకు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలోనే వాదోపవాదాలు, విమర్శలు ప్రతి విమర్శలు సాగుతున్నాయి కొంత కాలంగా. ఈ మధ్య జనసేన నాయకులు, కార్యకర్తలు వైసీపీ నేతలు, మద్దతుదారులను ఢీ అంటే ఢీ అన్నట్లు ఎదుర్కొంటున్నారు. వాళ్లొక పంచ్ వేస్తే వీళ్లు రెండు అన్నట్లు సాగుతోంది వ్యవహారం. మెగా ఫ్యామిలీతో ఒకప్పుడు సన్నిహితంగానే ఉన్న వైసీపీ మంత్రి రోజా.. …

Read More »

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌.. ఎంపీ కుమారుడి అరెస్టుకు కార‌ణాలు ?

దేశాన్ని కుదిపేస్తున్న కీల‌క కేసుల్లో ఇప్పుడు ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం మొద‌టి వ‌రుస‌లో చేరింది. ఈ కేసులో తాజాగా ఏపీకి చెందిన ఒంగోలు అధికార పార్టీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘ‌వ‌రెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే.. ఆయ‌న‌కు ఈ కేసుకు సంబంధం ఏంటి? ఎందుకు అరెస్టు చేశారు. అస‌లు ఢిల్లీలో జ‌రిగిన స్కామ్‌కు ఒంగోలులో ఎందుకు తీగ క‌దిలింది? అనే అంశాలు ఆస‌క్తిగా …

Read More »

ఆళ్ల‌గ‌డ్డ పోయే… అఖిల‌ప్రియ బాధ‌లు చూడండ‌బ్బా…!

త‌న‌కు త‌నే స‌ర్టిఫికెట్లు ఇచ్చుకునే నాయ‌కులు ఎంతో మంది ఉన్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని అంచనా వేయ‌డంలో మాత్రం వారు విఫ‌ల‌మ‌వుతున్నారు. ఇలాంటివారిలో మాజీ మంత్రి అఖిల ప్రియ ఒక‌రు. టీడీపీలో త‌ను ఫైర్‌బ్రాండ్ అని ఆమె ప‌దే ప‌దే చెప్పుకొంటారు. కానీ, వాస్త‌వం ఏంటంటే.. 2014లో అమ్మ సింప‌తీతో విజ‌యం ద‌క్కించుకున్న ఆమె 2019లో చ‌తికిల ప‌డ్డారు. ఈ విష‌యాన్ని మాత్రం మ‌రిచిపోతున్నారు. పైకి మాత్రం చాలా గంభీరంగా.. …

Read More »

కేసీఆర్ క‌ల‌ల స‌చివాల‌యానికి బ్రేక్‌.. ముహూర్తం వాయిదా!

తెలంగాణ ముఖ్యమంత్రి.. కేసీఆర్ క‌ల‌ల సచివాల‌యం.. అంబేడ్క‌ర్ సెక్ర‌టేరియెట్‌ను ఈ నెల 17న ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. మంచి ముహూర్తం కూడా కావ‌డంతో..ఆరు నూరైనా.. దీనిని ప్రారంభించి.. జాతికి అంకితం చేయాల‌ని భావించారు. దీనికి సంబంధించి ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. మాజీ ముఖ్యమంత్రుల‌ను కూడా కేసీఆర్ ఆహ్వానించారు. దీనికి పెద్ద హంగామానే సృష్టించారు. దీని ప్రారంభం అనంత‌రం.. సికింద్రాబాద్‌లో భారీ స‌భ కూడా ఏర్పాటు చేశారు. అయితే..అనూహ్యంగా ఈ ముహూర్తం వాయిదా …

Read More »

తాజా వికెట్ – మాగుంట అరెస్టు

ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ దక్షిణాది వైపు వేగవంతమైంది. సౌత్ గ్రూపుపై సీబీఐ ప్రత్యేక దృష్టి సారించింది. అరెస్టుల పర్వం కొనసాగిస్తూ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల పంజాబ్ కు చెందిన ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన ఈడీ.. అతనిచ్చిన సమాచారం ఆధారంగానే నిన్న రాఘవరెడ్డిని విచారణకు పిలించింది సాయంత్రం అదుపులోకి …

Read More »

సాయిరెడ్డికే కీల‌క‌ బాధ్య‌త‌లు.. మ‌రోసారి కీ రోల్‌కు రెడీ…!

“ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో పాగా వేయాలి. సీమ‌లో ఫ‌ర్వాలేదు. ఇక‌, కోస్తాలో ఎంత చించుకున్నా.. ఫిఫ్టీ -ఫిఫ్టీ అయితే.. చాలు”- ఇదీ.. వైసీపీ అధినేత ..సీఎం జ‌గ‌న్ విధానం.. నినాదంగా ఉంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాంధ్ర‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాలని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి బాధ్య‌త‌ల‌ను పార్టీలో నెంబ‌ర్‌2గా ఉన్న‌(అప్ప‌ట్లో) విజ‌య‌సాయిరెడ్డి చూసుకునేవారు. దీంతో పార్టీ ప‌రుగులు పెట్టింది. విశాఖ మేయ‌ర్ పీఠాన్ని కూడా వైసీపీ …

Read More »

నెల్లూరు పెద్దారెడ్ల మూడ్ మారిందా..?

నెల్లూరు పెద్దారెడ్లు! ఈ మాట అన‌గానే.. వారంతా .. జ‌గ‌న్ మ‌నుషులు.. వైసీపీ నాయ‌కులు అనే మాటే విని పిస్తుంది. దీనికి కార‌ణం.. గ‌తంలో జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌లో సీమ‌స‌హా కోస్తాలో అయిన ఖ‌ర్చంతా వారే భ‌రించార‌ట‌. పైకి క‌నిపించే నాయ‌కుల‌ను కూడా తెర‌వెనుక ఉండి న‌డిపించేది ఈ రెడ్లే న‌ని రాజ‌కీయాల్లో బ‌లంగా న‌మ్ముతారు. ఇదినిజం కూడా! ముఖ్యంగా జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకున్న రెడ్డి వ‌ర్గంలో నెల్లూరు …

Read More »

పలాస జనసేనకు.. శిరీష కౌన్సిల్‌కు?

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఒక్క టెర్మ్‌కే పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకున్నారన్నది అందరి నోటా వినిపిస్తున్న మాట. అయితే… అక్కడ టీడీపీ నేత గౌతు శిరీష ఆ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నారన్నది టీడీపీ నేతల మాట. రీసెంటుగా పలాసలో పార్టీ పరిస్థితి గురించి టీడీపీ పెద్దలు అంతర్గతంగా అక్కడి కొందరు నేతలతో మాట్లాడినప్పుడు ఇదే అభిప్రాయం వ్యక్తమైందని తెలుస్తోంది. సీనియర్ నేత గౌతు …

Read More »

పొంగులేటి.. షర్మిలకు పెద్ద బలమే

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఎర్ఎస్ లో రెబెల్ స్టార్ గా మారారు. ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణ అంతటా ఇప్పుడాయన హాట్ టాపిక్ అయ్యారు. తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పిగా మారారు. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. వైరా నియోజకవర్గంలో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో భేటీ అయినందుకు కొందరినీ …

Read More »

లోకేష్ పాదయాత్రను ఆపుతారా.. ?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలై పక్షం రోజులు దాటిపోయింది. లోకేష్ ను చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆరు నూరైన 400 రోజుల వరకు యాత్ర నిరాటంకంగా కొనసాగుతుందని లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు యాత్రపై నీలినీడలు అలుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాత్ర కొనసాగించడం అనుమానమేనని వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల …

Read More »

కోటంరెడ్డి ఎఫెక్ట్‌.. దిగొచ్చిన జ‌గ‌న్‌.. ఏం చేశారంటే!

ఒక‌వైపు ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి. మ‌రో వైపు అధికార పార్టీలో నేత‌ల మ‌ధ్య విభేదాలు.. వివాదాలు రోజుకోర‌కంగా తెర మీదికి వ‌స్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు. ప్ర‌ధానంగా సీఎం జ‌గ‌న్‌కు ఆత్మీయుడిగా పేరున్న కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి బ‌య‌ట‌ప‌డిపోయారు. దీంతో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేల‌కు క‌నీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌ని సీఎం జ‌గ‌న్ ఇప్పుడు దిగి వ‌చ్చారు. ఎమ్మెల్యేల సాధ‌క బాధ‌లు వినేందుకు రెడీ అయ్యారు. …

Read More »

జ‌గ‌నాసుర ర‌క్త చ‌రిత్ర‌..

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఒక పుస్త‌కాన్ని విడుద‌ల చేసింది. జ‌గ‌నాసు ర ర‌క్త చ‌రిత్ర‌ పేరుతో రాసిన ఈ పుస్త‌కాన్ని తాజాగా పార్టీ ఆవిష్క‌రించింది. సీఎం జ‌గ‌న్ సొంత బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు సంబంధించి.. రాసిన ఈ పుస్త‌కంలో అనేక సంచ‌ల‌న విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ఆది నుంచి ఈ ఘ‌ట‌న‌లో జ‌రిగిన అనేక విష‌యాలు స‌హా.. అనేక మ‌లుపులను కూడా పేర్కొన్నారు. …

Read More »