తిమిరి ఇసుకన తైలంబు తీయవచ్చు.. అని భతృహరి శుభాషితం చెబుతున్నా.. బట్టతలపై వెంట్రుకలు మొలిపించడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదనేది అందరికీ తెలిసిందే. లేకపోతే.. ప్రపంచ కుబేరులు సైతం.. బట్టతలతోనే ఎందుకు బతుకుతారు? అనేది ప్రశ్న. కోట్లకు పడగలెత్తిన వారుకూడా.. విగ్గులను ఎందుకు ఆశ్రయిస్తారన్నది మరో ప్రశ్న. సో.. బట్టతల పై వెంట్రుకలు మొలిపించడం అన్నది సాధ్యం కాదు. ఈ విషయం తెలిసి కూడా.. కొందరు మోసపోతూనే ఉన్నారు. మోసకారులు …
Read More »రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి… చంద్రబాబు దిగ్భ్రాంతి
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జిల్లా కేంద్రానికి వెళుతున్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిణి దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా అన్నమయ్య జిల్లా పరిధికి సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా సుగాలి రమ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని పీలేరు కేంద్రంగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం …
Read More »సన్ రైజర్స్.. ఎవరయ్యా ఈ సిమర్జీత్ సింగ్?
ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బోర్లా పడుతోందనే విషయం తెలిసిందే. వరుస ఓటములతో ప్లే ఆఫ్స్ రేస్లో బలహీనంగా మారిన ఆరెంజ్ ఆర్మీ, నిన్న గుజరాత్ టైటాన్స్తో జరిగిన హోం మ్యాచ్లో మరోసారి తడిసిముద్దైంది. అయితే ఈ మ్యాచ్లో ఓటమికి ప్రధాన కారణం ఒక్క బౌలర్గా హైలైట్ అయ్యాడు.. అతనే సిమర్జీత్ సింగ్. మొదటి ఐదు ఓవర్లలో పట్టు సాధించిన హైదరాబాద్ బౌలింగ్ ఒక్క ఓవర్తో మొత్తం …
Read More »మార్కెట్ దారుణంగా పడిన వేళలో.. బఫెట్ ఆస్తి రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తున్నాయో తెలిసిందే.ఆయన తీసుకుంటున్న దూకుడు నిర్ణయాల కారణంగా స్టాక్ మార్కెట్ ఆగమాగం అవుతోంది. ఓవైపు యుద్ధ భయాలు. మరోవైపు ట్రంప్ ప్రతీకార సుంకాల హెచ్చరికలతో ప్రపంచంలో తోపు కంపెనీల షేర్లు సైతం దారుణంగా నష్టపోవటం తెలిసిందే. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల స్టాక్ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటూ.. నష్టాల బాట పట్టిన …
Read More »సెలబ్రేషన్కి ఫైన్.. నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాథి మరోసారి తన వివాదాస్పద నోట్బుక్ సెలబ్రేషన్తో వార్తల్లోకెక్కాడు. ముంబయి ఇండియన్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో నామన్ ధీర్ వికెట్ తీసిన అనంతరం ఆయన మళ్లీ అదే సెలబ్రేషన్ చేశారు. గతంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత రాథి ఇదే పద్ధతిలో సెలబ్రేట్ చేయగా, బీసీసీఐ అతడిపై 25 శాతం మ్యాచ్ ఫీజు …
Read More »క్రికెట్ ఫ్యాన్స్ ను కొట్టబోయిన పాక్ ఆటగాడు
పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల ఆగ్రహం తారాస్థాయికి చేరింది. అయితే ఓటమికి బాధపడటం ఒక వైపు ఉంటే, ఆ క్షోభను కంట్రోల్ చేయలేకపోయిన పాకిస్థాన్ ఆటగాడు ఖుష్దిల్ షా ఇంకొక వైపు వార్తల్లో నిలిచాడు. మ్యాచ్ అనంతరం అతని ప్రవర్తన క్రికెట్ అభిమాని సమాజాన్ని కలవరపరచింది. మూడో వన్డే ముగిసిన వెంటనే ఖుష్దిల్ షా …
Read More »కాటేరమ్మ కొడుకులు.. ఈసారి ఏం చేస్తారో?
ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ తరవాత పూర్తిగా తడబడింది. వరుసగా మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరికి జారింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో కేవలం ఒకటి మాత్రమే గెలవడంతో రెండు పాయింట్లకే పరిమితమైంది. నేడు గుజరాత్ టైటన్స్తో హోం గ్రౌండ్లో తలపడబోతుండగా, ఈ మ్యాచ్లో విజయం అత్యంత కీలకం. బ్యాటింగ్లో ఒక్క మ్యాచ్ తప్ప …
Read More »ట్రంప్ సుంకాలు.. అమెరికాకు మేలా, ముప్పా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ చేసిన తాజా అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుత స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు (GDP) 1.3 శాతంగా ఉన్న అమెరికా, ఈ ఏడాది చివరి నాటికి మైనస్ 0.3 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్ …
Read More »3D ప్లేయర్ ని కావాలనే అవుట్ చేయలేదా..?
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న విజయ్ శంకర్ పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో శంకర్ 54 బంతుల్లో 69 పరుగులు చేసినా, ఆ ఇన్నింగ్స్ చెన్నై ఓటమికి కారణమయ్యిందన్న అభిప్రాయంతో సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అతడి స్లో బ్యాటింగ్, స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటమే మ్యాచ్ దారి తీర్చి పెట్టిందని అభిమానులు చెబుతున్నారు. ఈ …
Read More »ట్రెండింగ్ : పచ్చళ్ళ పంచాయితీతో సినిమా ప్రమోషన్లు
కాదేది కవితకు అనర్హం అన్నారో మహాకవి. సోషల్ మీడియా ప్రపంచంలో కవిత తీసేసి దాని స్థానంలో వైరల్ టాపిక్ అని పెట్టాలి. ఆ మధ్య కుమారి అంటి అనే ఒకావిడ నాన్ వెజ్ మీల్స్ కోసం ముగ్గురికి వెయ్యి రూపాయలు బిల్లయ్యిందని చెప్పిన వీడియో ఎంత దూరం వెళ్లిందో చూశాం. వేలాది జనాలు, వందలాది మీడియా జర్నలిస్టులు ఆమె దగ్గరికెళ్లి భోజనం చేసే దాకా పబ్లిసిటీ జరిగింది. అక్కడితో ఆగకుండా …
Read More »ఐపీఎల్: క్రేజ్ ఉంది కానీ.. ఫామ్ లేదు!
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఓ వర్గం అభిమానుల్లో నిరాశ మొదలైంది. ఎక్కువ అంచనాల మధ్య బరిలోకి దిగిన స్టార్ క్రికెటర్లు తాము చూపించిన ఆటతీరుతో మాత్రం పిచ్పై కాస్తా ఒత్తిడిని కలిగిస్తున్నారు. పేరు మోగిన ఆటగాళ్ల నుంచి ఊహించిన విధంగా ఆట లేదు. దీనివల్ల ఫ్యాన్స్ కూడా ప్రశ్నలు వేస్తున్నారు.. స్టార్లు మరీ ఇంత తేలిగ్గా వెనకబడతారా? అనేలా కామెంట్స్ వస్తున్నాయి. భారీ మొత్తాలకు వేలంలో …
Read More »‘ఎక్స్’ను ఊపేస్తున్న పికిల్స్ గొడవ
అలేఖ్య చిట్టి పికిల్స్.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి దీని గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రాజమండ్రికి చెందిన ముగ్గురు సిస్టర్స్ కలిసి మొదలుపెట్టిన ఈ వ్యాపారం సూపర్ సక్సెస్ అయింది. కేవలం సోషల్ మీడియా ప్రమోషన్తోనే ఈ అక్క చెల్లెల్లు ఈ బిజినెస్ను చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. ఆ ముగ్గురు సిస్టర్స్లో ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెర్స్ కూడా. వారికి మాంచి ఫాలోయింగ్ కూడా ఉంది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates