Trends

చెప్పుతో కొట్టి.. చివరకు కాళ్ళ బేరానికి..

బెంగళూరులో ఓ మహిళ ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన శనివారం జరిగింది. పంఖూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా, ఆటో డ్రైవర్ తన పాదంపై చక్రం నడిపాడని ఆరోపించారు. అనంతరం ఆమె ఆటో డ్రైవర్‌ను హిందీలో దూషించి, ఫోన్‌లో వీడియో తీస్తున్నాడని కోపంతో చెప్పుతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను …

Read More »

ఐపీఎల్ ఫైనల్.. ఆకాశం ఏమంటోంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2025 ఫైనల్‌ ఎలాంటి బ్రేక్ లేకుండా జరగాలనే భావంతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఒక్కటే ప్రశ్న.. ఇంతకీ ఆకాశం ఏమంటుంది? ఫైనల్ మ్యాచ్ కు వరుణ దేవుడు అడ్డు పడతాడా అనే సందేహాలు గట్టిగానే వస్తున్నాయి. ఎందుకంటే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వాతావరణం గురుత్వంగా మారుతోంది. జూన్ 3న జరగాల్సిన ఈ ఫైనల్‌కు వర్షం రాకుండా …

Read More »

ఇండియాలో టెస్లా ఉంటుంది.. కానీ..

భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ వచ్చే అవకాశం లేదంటూ కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సాహక పథకాలు అందిస్తున్నా కూడా, టెస్లా మాత్రం ఎలాంటి ఉత్సాహం చూపడం లేదని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా టెస్లా షోరూమ్‌లు మాత్రం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవీ పరిశ్రమ అభివృద్ధిపై నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ, టెస్లా ఈవీ తయారీకి ముందుగా ఉన్నట్టు …

Read More »

కాటేరమ్మ కొడుకు.. బూమ్ లో ఉండగా ఎండ్ కార్డ్!

సాధారణంగా క్రికెట్ ప్లేయర్స్ 36 తరువాత రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ సౌత్ ఆఫ్రికా పవర్ఫుల్ ప్లేయర్ ఊహించని విదంగా 33 లోనే ఇంటర్నేషనల్ ఆటకు గుడ్ బై చెప్పడం షాకింగ్. ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన  హైన్రిచ్ క్లాసెన్ హడావుడి లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఈ నిర్ణయాన్ని స్వయంగా క్లాసెన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం మంచి …

Read More »

అయ్యర్, కోహ్లీ..డైలమాలో రాజమౌళి

‘‘బుమ్రా, బౌల్ట్ వేసిన యార్కర్లను అయ్యర్ థర్డ్ మ్యాన్ బౌండరీకి తరలించిన తీరు అత్యద్భుతం….ఢిల్లీని ఫైనల్ తీసుకువెళ్లిన అయ్యర్, ఆ తర్వాత కోల్ కతాకు కప్ అందించాడు..అయినా ఆ తర్వాత టీమ్ నుంచి డ్రాప్ చేశారు…పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్ ను ఫైనల్ కు చేర్చాడు…’’అంటూ టాలీవుడ్ కు చెందిన ప్రముఖుడు ఒకరు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్ ను హీరో వెంకటేష్ లా …

Read More »

తెలుగోడి దెబ్బకు సహనం కోల్పోయిన నెంబర్ వన్ చెస్ ప్లేయర్

ఇది నార్వే టోర్నీలో చోటుచేసుకున్న అద్భుతమైన క్షణం. ప్ర‌పంచ నంబ‌ర్‌వ‌న్ మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌ను ఓడించడం అంటే సాధారణ విషయం కాదు. కానీ భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఇది సాధించేశాడు. చెస్ ప్రపంచంలో దీన్ని ‘టర్నింగ్ పాయింట్’గా అభివర్ణించొచ్చు. ఈ విజయంతో గుకేశ్ ప్ర‌త్యక్షంగా ప్రపంచ స్థాయిలో తనను తాను నిలబెట్టుకున్నాడు. ఆరు రౌండ్లలో కీలకంగా నిలిచిన ఈ పోరులో గుకేశ్ ఆటలో ఓ వృద్ధి స్పష్టంగా కనిపించింది. …

Read More »

వీడియో వైరల్: అంబానీ రాణికి షాక్ ఇచ్చిన అయ్యర్

ఆఖరి వరకూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2 పోరులో ముంబయి ఇండియన్స్ ఓటమి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. మరీ ముఖ్యంగా, శ్రేయస్ అయ్యర్ పంజాబ్ తరఫున అసాధారణ ఇన్నింగ్స్ ఆడి ముంబయిని ఇంటికే పంపేసిన తర్వాత, అంబానీ కుటుంబం నుంచి వచ్చిన రియాక్షన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నితా అంబానీ ముఖభావాలు ప్రత్యేకంగా చర్చకు వస్తున్నాయి. మ్యాచ్ సందర్భంగా …

Read More »

IPL2025: ఇది నెవ్వర్ బిఫోర్ ఫైనల్!

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ఇప్పుడు మరువలేని ఓ ఫైనల్‌కు సాక్ష్యం ఇవ్వబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) Vs పంజాబ్ కింగ్స్ (PBKS) ఫైనల్ మ్యాచ్ ఈసారి ఇరు వర్గాల అభిమానులకి నిజంగా గుండెలు బరువు చేసే మ్యాచ్‌గా మారింది. ఇన్నేళ్లుగా టైటిల్‌ సాధించలేకపోయిన రెండు జట్లూ.. ఒకే లక్ష్యంతో తలపడనున్నాయి. ఇది గోల్డెన్ ఛాన్స్. RCB ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్ చేరిన జట్టు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ …

Read More »

పంజాబ్ కింగ్స్.. భారీ పెట్టుబడి వృధా కాలేదు

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఒక రివైవల్ చరిత్రను రాసింది. మెగా వేలంలో భారీగా పెట్టుబడి పెట్టిన ఫలితం ఇప్పుడు అందరికీ కనపడుతోంది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు కొనుగోలు చేయడం పెద్ద సంచలనం అయ్యింది. అలాగే ప్రధాన బౌలర్ ఆర్షదీప్ సింగ్‌ను రూ.18 కోట్లకు రీటైన్ చేయడం కూడా కీలక నిర్ణయం. ఇప్పుడు ఆ ఇద్దరూ తమ విలువను అసాధారణంగా నిరూపించారు. అయ్యర్ క్వాలిఫయర్-2లో ముంబయిని చిత్తుచేసే …

Read More »

మిస్ వ‌రల్డ్‌.. థాయిల్యాండ్‌!

మిస్ వ‌రల్డ్ పోటీల్లో భారత్ మిస్ అయింది. భార‌త్ నుంచి ఎన్నో ఆశ‌ల‌తో బ‌రిలో ఉన్న నందిని గుప్తా.. ఆఖ‌రి ద‌శ టెస్టులో ఎలిమినేట్ అయింది. హైద‌రాబాద్‌లో అత్యంత ఆడంబ‌రంగా జ‌రుగుతున్న మిస్ వ‌రల్డ్ పోటీల్లో భార‌త సుంద‌రి.. చంద‌మామ‌ను త‌ల‌పించే నంద‌నీ గుప్తా.. టాప్ 8లో ఉన్నారు. అయితే.. ఖండాల వారీగా ఇద్ద‌రేసి చొప్పున తుది ద‌శ‌కుఎంపిక చేసిన వారిలో ఒక్కొక్క‌రి చొప్పున చివ‌రి రౌండ్ కు ఎలిమినేట్ …

Read More »

రిటైర్డ్ ఉద్యోగికి జాక్ పాట్ లాటరీ!

చెన్నైకి చెందిన శ్రీరాం రాజగోపాలన్ అనే రిటైర్డ్ ఇంజినీర్‌ జీవితం ఒక్కసారిగా మలుపు తిప్పింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్వహించిన ‘ఎమిరేట్స్ డ్రా మెగా7’ లాటరీలో ఏకంగా రూ.231 కోట్ల భారీ బహుమతిని గెలుచుకుని ఒక్కరోజులో కోటీశ్వరుడిగా మారిపోయారు. అసలు ఈ టికెట్‌ను ఆయన తన జన్మదినం సందర్భంగా సరదాగా కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇప్పుడు అదే సరదా జీవితం మొత్తాన్ని శాశ్వతంగా మార్చేసింది. మార్చి 16న తన …

Read More »

పదేళ్లు నో ప్లేఆఫ్స్.. ఇప్పుడు నంబర్‌వన్

ప్రతి సంవత్సరం ఐపీఎల్ మొద‌ల‌వుతుంటే.. కప్పు ఎవరు గెలుస్తారు.. ఏ జట్లు ప్లేఆఫ్స్ చేరతాయి, ఏ జట్లు ముందే నిష్క్రమిస్తాయి అని అంచనాలు కడుతుంటారు అభిమానులు. ఈసారి సీజన్ ఆరంభమవుతుండగా.. పంజాబ్ కింగ్స్ అనే జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఎవ్వరైనా ఊహించి ఉంటారా? అసలు ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందని నమ్మిన వాళ్లు చాలా తక్కువమందే అయ్యుంటారు. ఎందుకంటే లీగ్‌ చరిత్రలో ఆ జట్టు ప్రదర్శన అలాంటిది. …

Read More »