ప్రపంచ వాణిజ్య విఫణిలో భారత దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సత్తా చాటింది. గతంలో ఏ ఒక్క బారత కంపెనీకి దక్కని కీర్తి ప్రతిష్ఠలను ఒడిసిపట్టేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్… టాప్ బ్రాండింగ్ కంపెనీల్లో రెండో స్థానంలో నిలిచి భారతీయులకు గర్వ కారణంగా నిలిచింది. నిజంగానే రిలయన్స్ సాధించిన ఈ ఘనతతో ప్రతి భారతీయుడి ఛాతీ ఉప్పొంగిపోయిందని చెప్పక తప్పదు. నిన్నటిదాకా బ్రాండింగ్ లో తొలి స్థానంలో ఉన్న అమెరికా దిగ్గజం ఆపిల్ …
Read More »భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్ – టికెట్ల కోసం ఐసీసీ కొత్త ప్లాన్!
వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా మ్యాచ్లకు ప్రత్యేకంగా అదనపు టికెట్లు విడుదల చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ గ్రూప్-ఏలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో తలపడనుంది. భారత అభిమానుల నుంచి భారీ డిమాండ్ ఉన్నందున, ఈ అదనపు టికెట్లు అందుబాటులోకి తెచ్చామని ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీ …
Read More »ట్రాఫిక్ జామ్ : పరీక్ష కోసం ‘పక్షి’లా ఎగిరిన విద్యార్థి!
నిజమేనండోయ్… పరీక్షకు సకాలంలో హాజరయ్యేందుకు ఓ విద్యార్థి ఏకంగా పక్షిలా రెక్కలు కట్టుకుని మరీ గాల్లోకి ఎగిరాడు. సకాలంలోనే అతడు పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఎంచక్కా పరీక్ష రాశాడు. చూసే వాళ్లతో పాటు వినే వాళ్లను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అలా పరీక్ష హాల్ లోకి వెళుతున్న విద్యార్థులంతా గాల్లో నుంచి నేరుగా ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగుతున్న తమ మిత్రుడిని చూసి నోరెళ్లబెట్టేశారు. …
Read More »పవన్ వెళ్ళిన ప్రతిచోటా ‘OG’ ప్రకంపనలు
నిన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన తమన్ మ్యూజికల్ కన్సర్ట్ బ్లాక్ బస్టర్ సక్సెసయ్యింది. ఎన్నో పాటలతో తమన్ అదరగొట్టేశాడు. అయితే ఓజి టీజర్ లో వినిపించిన థీమ్ సాంగ్ ని ప్రత్యక్షంగా వేదిక మీద ప్లే చేస్తున్నప్పుడు గ్రౌండ్ లో ఉన్న యుఫోరియా వేరే స్థాయికి వెళ్ళిపోయింది. వేలల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు సందర్భం …
Read More »ఢిల్లీ రైల్వే స్టేషన్ వివాదం : మీడియాను తప్పుదోవ పట్టించారా?
ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోయినా.. కనీసం మీడియాకైనా సరైన సమాచారం ఇచ్చే విషయంలో రైల్వే శాఖ పాత్ర నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గతంలో రైల్వే ప్రకటనలు ముందు మీడియాకు చేరేవి. కానీ, ఇప్పుడు అంతా గోప్యం. “ఏదైనా ఉంటే.. మా వెబ్సైట్లో చెబుతాం“ అంటూ రైల్వే శాఖ ప్రకటించి మౌనం పాటిస్తోంది. పైగా.. కీలక విషయాల్లో అయితే.. మీడియాను చాలా తప్పుదోవ పట్టిస్తోంది. తాజాగా శనివారం జరిగిన ఢిల్లీ రైల్వే …
Read More »విషాదం: 20 నిమిషాల్లో 18 మంది ప్రాణాలు పోయాయి
దేశ రాజధానిలోని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో శనివారం రాత్రి జరగిన తొక్కిసలాటలో 18 మంది మృతి చెందగా.. మరో 30 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వదంతి, మరో చిన్న ప్రకటన…ఈ తొక్కిసలాటకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయన్న వదంతి, ఆ తర్వాత మరో ప్రత్యేక …
Read More »ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తోపులాట….
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉన్నట్టుండి కలకలం రేగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల మధ్య తోపులాట జరగగా… 15 మంది దాకా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తోపులాటతో అప్రమత్తమైన అధికారులు… క్షణాల్లో రంగంలోకి దిగిపోయారు. పరిస్థితిని చక్కదిద్దే యత్నాలను ప్రారంభించారు. ఫైరింజన్లు అక్కడకి పరుగులు పెట్టాయి. ఎంత వేగంగా తోపులాట జరిగిందో… అధికార యంత్రాంగం అప్రమత్తతో అంతే వేగంగా పరిస్థితి …
Read More »“నేను ఎక్కడికి పారిపోలేదు” : రణ్వీర్
రణవీర్ అహ్మదిబాదీ…ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు యువతీయువకులు గుమిగూడినా… ఇతడిపైనే చర్చ సాగుతోంది. ఆధునిక కాలం యువతకు ప్రతినిధిగా తనను తాను చెప్పుకునే రణవీర్.. హద్దు దాటి వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రుల శృంగారంపై అసందర్భ వ్యాఖ్యలు చేసి పెను వివాదంలో చిక్కుకున్నాడు. ఆపై తప్పు తెలుసుకుని బహిరగంగానే సారీ కూడా చెప్పాడు. రణవీర్ చెప్పిన సారీని జనం అంగీకరింంచలేకపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫలితంగా నిన్నటిదాకా …
Read More »ప్రభాస్ ‘స్పిరిట్’ లో పాత్ర కోసం మంచు విష్ణు అప్లికేషన్
కన్నప్ప వల్ల మంచు ఫ్యామిలీ, ప్రభాస్ మధ్య ఎంత స్నేహం ఉందో బయట ప్రపంచానికి తెలిసింది. ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా డార్లింగ్ అందులో ఫ్రీగా క్యామియో చేయడం చూస్తే బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. కన్నప్ప బిజినెస్ లో ప్రభాస్ పాత్ర కీలక పాత్ర పోషించబోవడం ఎవరూ కాదనలేరు. ముఖ్యంగా ఉత్తరాది మార్కెట్ కి ఇది చాలా కీలకం కానుంది. అయితే క్యారెక్టర్ తాలూకు తీరుతెన్నులు వగైరా …
Read More »మీ భార్య వేరే వ్యక్తిని ప్రేమించినా తప్పు కాదు: కోర్టు
సాధారణంగా భార్యా భర్త అన్నాక.. ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉండాలి. మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగుల అనుబంధానికి కూడా అదేఅర్థం.. పరమార్థంగా పెద్దలు చెబుతారు. 1980లలో దిగ్గజ దర్శకుడు బాపు తీసిన `రాధా కల్యాణం` సినిమాలోనూ ఇదే చూపించారు. పెళ్లి కానంత వరకు.. ఓ మహిళ.. లేదా పురుషుడు ఎవరినైనా ప్రేమించవచ్చు. వారితో ఒకవేళ పెళ్లికాకపోతే.. పెళ్లి అయిన వారినే ప్రేమించాలని.. జీవితాంతం వారితోనే తోడు-నీడగా …
Read More »లవర్ బ్లాక్ చేస్తే పోలీసు కాల్ చేస్తారా…
ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే… చాలా వింతగా అనిపిస్తోంది. ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో కూడా తెలియడం లేదు. ఇక యువత విషయానికి వస్తే.. తామేం చేస్తున్నారో, తమ చర్యలు సమాజానికి ఎలాంటి మెసేజ్ లు ఇస్తాయోనన్న ఆలోచన కూడా వారికి ఉండటం లేదు. అయినా ఎవరేం అనుకుంటే… తమకేంటీ తమ సమస్య పరిష్కారం కావాలంతే అన్న ధోరణిలో వారు సాగుతున్న తీరు నిజంగానే విస్తుగొలుపుతోంది. అనంతపురం …
Read More »ట్రంప్ ముంగిట అక్రమ వలసలపై మోడీ కీలక వ్యాఖ్యలు
అక్రమ వలసలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిసిన సందర్భంలో వారిద్దరు పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం ఉభయులు కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అక్రమ వలసలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు …
Read More »