తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. అనుమతులేని వ్యక్తులు లేదా డిజిటల్ లోన్ యాప్లు రుణాలు ఇచ్చే ప్రక్రియను పూర్తిగా నిషేధించేలా ముసాయిదా బిల్లును ప్రతిపాదించింది. ఈ చట్టం ప్రకారం, అనుమతుల్లేకుండా రుణాలిచ్చే వారిపై పది ఏళ్ల జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. …
Read More »రామాయణం అరబిక్ రచయితను అభినందించిన మోడీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం కువైట్కు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అదేవిధంగా ఆయన మనసును హత్తుకునే సంఘటన కూడా జరిగింది. భారత పవిత్ర గ్రంధాలైన రామా యణ, మహాభారతాలను అరబిక్ భాషలోకి అనువదించిన రచయిత.. అబ్దుల్లా అల్ బారౌన్, ఈ పుస్తకాల ను ప్రచురించిన పబ్లిషర్ అబ్దుల్లా లతీఫ్ అల్ …
Read More »మాదాపూర్ బార్లో అగ్ని ప్రమాదం: భారీ ఆస్తి నష్టం!
హైదరాబాద్ మాదాపూర్లోని నాలెడ్జ్ సిటీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సత్వ ఎలిక్విర్ భవనంలోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా నాలుగో అంతస్తుకు వ్యాపించడంతో భవనంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బార్ అండ్ రెస్టారెంట్లో ఈ ప్రమాదం జరగడంతో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని …
Read More »యూఎస్ పౌరసత్వంలో భారతీయుల రికార్డు
ప్రతిసారి అమెరికా పౌరసత్వం పొందే విదేశీయుల సంఖ్యలో భారతీయుల వాటా క్రమక్రమంగా పెరుగుతుండటం విశేషం. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమెరికా పౌరసత్వం పొందిన వారిలో 49,700 మంది భారతీయులున్నారు. ఈ సంఖ్య యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆధారంగా వెల్లడించబడింది. అగ్రస్థానంలో మెక్సికో 13.1 శాతం వాటాతో కొనసాగగా, భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. మొత్తం పౌరసత్వం పొందిన విదేశీయులలో 6.1 శాతం భారతీయులే కావడం గమనార్హం. …
Read More »రాబిన్ ఉతప్ప పీఎఫ్ మోసం కేసు: అరెస్ట్ వారెంట్ జారీ!
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మోసం కేసులో అరెస్ట్ వారెంట్ జారీ కావడం సంచలనంగా మారింది. పీఎఫ్ రీజనల్ కమిషనర్ షడక్షరి గోపాల్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు, పులకేశినగర్ పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉతప్ప నిర్వహిస్తున్న సెంచరీస్ లైఫ్స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పీఎఫ్ చెల్లింపులలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలున్నాయి. కంపెనీ ఉద్యోగుల జీతాల నుంచి పీఎఫ్ కట్ చేసినా, …
Read More »ఏఐ టెక్నాలజీతో గంటలో స్వామి వారి దర్శనం!
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే, రద్దీ కారణంగా సామాన్య భక్తులు గంటలు తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. క్యూలైన్లో ఉన్న భక్తులకు పాలు, నీళ్లు, ఆహారం వంటి సౌకర్యాలను టీటీడీ అందిస్తున్నప్పటికీ కొన్నిసార్లు చాలా గంటలపాటు క్యూలో నిలబడటం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇకపై గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా …
Read More »బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం: మానవ తప్పిదమే..
2021 డిసెంబర్ 8న త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య మధులిక రావత్ అలాగే మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల ఈ ఘటనపై రక్షణ శాఖ స్థాయి సంఘం తన నివేదికను లోక్ సభలో …
Read More »పశ్చిమగోదావరిలో దారుణం: పార్శిల్లో మృతదేహం
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో దారుణం వెలుగుచూసింది. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న సాగి తులసి అనే మహిళ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోరగా, విద్యుత్ సామగ్రి పేరుతో పంపిన పార్శిల్లో మృతదేహం రావడం గ్రామస్తులను షాక్కు గురి చేసింది. తులసి క్షత్రియ సేవా సమితికి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవడంతో తొలి విడతలో టైల్స్ అందుకుంది. కానీ, ఇటీవల మరోసారి సాయం …
Read More »చట్టాలు భర్తను బెదిరించటానికి కాదు.. సుప్రీం కీలక వ్యాఖ్య
విడాకుల వేళ భార్యభర్తల మధ్య వచ్చే భరణం పేచీలతో పాటు. విడాకుల కేసుతో పాటు భర్త.. అతడి కుటుంబ సభ్యులపై నమోదయ్యే కేసులు.. అందులోనూ కొందరిపై నమోదయ్యే క్రిమినల్ ఛార్జ్ ల సంగతి తెలిసిందే. తాజాగా ఒక విడాకుల కేసుకు సంబంధించిన తుది ఆదేశాలు జారీ చేసే వేళ.. సంచలన వ్యాఖ్యలు చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అంతేకాదు.. చట్టాలు మహిళల సంక్షేమం కోసమే తప్పించి భర్తలను శిక్షించటానికి.. బెదిరించటానికి …
Read More »రిటైర్ అయ్యాక భారత్ కు కోహ్లీ వీడ్కోలు?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. కోహ్లీకి లండన్ ప్రత్యేకంగా ఇష్టమన్న విషయం అందరికీ తెలిసిందే. క్రికెట్ పర్యటనలలో భాగంగా కాకుండా, కుటుంబంతో కలిసి కూడా లండన్ వెళ్లడం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తుందట. తాజాగా కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత లండన్లో స్థిరపడాలని భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ …
Read More »భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించనున్నట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ ఈవెంట్లలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహిస్తారని ఐసీసీ పేర్కొంది. భద్రతా కారణాల వల్ల పాక్లో భారత జట్టు ఆడడం ఇబ్బందిగా మారడంతో, టోర్నీ నిర్వహణలో …
Read More »డాలర్ దెబ్బకు రికార్డు పతనంలో రూపాయి!
రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం ఆర్థిక రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో తగ్గింపు సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ, భారత రూపాయి క్షీణత ఆగలేదు. పెట్టుబడుల లోటు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు కరెన్సీపై అదనపు ఒత్తిడి తెచ్చాయి. గత కొన్ని నెలలుగా రూపాయి విలువ సార్వత్రికంగా పడిపోతోంది. రూ. 83 …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates