టెస్ట్ క్రికెట్కు గర్వకారణమైన డబ్ల్యూటీసీ ఫైనల్స్ నిర్వహణపై భారత్ కలలు మరోసారి నెరవేరకుండానే ఆగిపోయాయి. ఐసీసీ కొత్త ఛైర్మన్గా బీసీసీఐ కార్యదర్శి జై షా బాధ్యతలు చేపట్టినప్పటికీ, రాబోయే మూడు వరుస టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు భారత్కు ఆతిథ్య హక్కులు దక్కలేదు. బీసీసీఐ నూతన శక్తితో అధికారంలోకి వచ్చిన ఈ సమయంలోనూ, ప్రపంచ టెస్ట్ పోటీలకు లార్డ్స్ వేదికగా నిర్ణయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే 2021, 2023, 2025 …
Read More »ఛాయ్ తాగండి… బేడీల బాధ వినండి!
వరకట్న వేధింపుల కేసుతో మానసికంగా కుంగిపోయిన ఓ యువకుడు వినూత్న రీతిలో న్యాయ పోరాటం మొదలుపెట్టాడు. రాజస్థాన్లోని అంటా పట్టణంలో కృష్ణ కుమార్ ధాకడ్ అనే వ్యక్తి తన అత్తవారింటి వీధిలోనే ‘498ఏ టీ కేఫ్’ అనే పేరుతో టీ దుకాణం ప్రారంభించాడు. చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముతున్న ఈ అల్లుడు, తనపై పెట్టిన కేసులు, న్యాయ వ్యవస్థలో జరిగే జాప్యం వల్ల ఎదుర్కొంటున్న బాధను చాటుతూ నిరసన …
Read More »11A సీటు మిస్టరీ.. 1998లో కూడా ఇలానే..
బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేశ్ 11A సీటులో కూర్చుండడం ఓ వింత విషయంగా మారింది. కానీ ఇదే సీటు నంబరులో 26 ఏళ్ల క్రితం మరో ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి ఉన్నారని తెలిసి ఇప్పుడు అంతా విస్తుపోతున్నారు. థాయ్లాండ్కు చెందిన ప్రముఖ గాయకుడు రుయాంగ్సాక్ జేమ్స్ లోయ్చుసాక్ ఈ అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో …
Read More »విమాన ప్రమాదంతో మార్కెట్ పై ఎఫెక్ట్
ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గందరగోళానికి గురయ్యాయి. AI171 పేరిట ప్రయాణించిన ఈ విమానంలో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించడమే కాకుండా, పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచింది. 242 మంది ప్రయాణికులు మరణించినట్టు తెలిసిన వెంటనే మార్కెట్ నెగటివ్ ట్రెండ్లోకి వెళ్లింది. టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే విమానం కుప్పకూలిన వార్తలు పంజా విసురుతుండగా, …
Read More »ప్లేన్ క్రాష్.. వారం ముందే పోస్టు
ఇండియాలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదంగా.. నిన్నటి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ను చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. కేవలం నిమిషంలోపే జనావాసాల మధ్య కుప్పకూలిపోవడం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఉండడం గమనార్హం. ఈ విషాదం చాలదన్నట్లు విమానం కూలిన …
Read More »ఉగ్రవాదులు-ఇంజన్-సిగ్నల్-పక్షులు.. విమాన ప్రమాదంపై భిన్నవాదన!
గుజరాత్లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది తుడిచి పెట్టుకుపోయారు. కనీసం వారిని గుర్తించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయిన వారికి మాంసపు ముద్దలు అందించడం తప్ప ఏమీ మిగల్లేదు. ఇంత ఘోర విషాదం జరిగి గంటలు గడిచినా.. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే విషయం పై మాత్రం కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. పైగా.. అనేక వాదనలు ప్రముఖ నిపుణుల నుంచే వినిపిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. …
Read More »దేశంలో… ఇదే అతి పెద్ద రెండో విమాన ప్రమాదం!
గుజరాత్ పారిశ్రామిక రాజధాని అహ్మదాబాద్ నుంచి లండన్కు టేకాఫ్ అయిన.. బోయింగ్ 171 విమానం గురువారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో కుప్పకూలి పోయింది. ఘటన జరిగిన 30 నిమిషాల వరకు కూడా.. బాహ్య ప్రపంచానికి తెలియరాలేదు. ఆ తర్వాత.. వెలుగు చూసిన ఈ ఘోర విషాదంలో 242 మంది(మొత్తం సిబ్బంది, ప్రయాణికులు కూడా) మాంసపు ముద్దలుగా మిగిలారు. అయితే.. దేశంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇదే రెండో అతి …
Read More »మృత్యుంజయుడు… మంటల్లో నుంచి నడిచొచ్చాడు
గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు ఆవల జనావాసాలపై కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అందరూ మృత్యువాత పడ్డట్టు పోలీస్ కమిషనర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అదే అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ మరికాసేపటికే మరో ప్రకటన చేశారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి బతికి బట్ట కట్టాడని, అతడు ప్రమాద మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చాడని ఆయన తెలిపారు. వెరసి …
Read More »విషాదం.. మాజీ సీఎం సహా 242 మంది మృతి
గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో యావత్తు ప్రపంచ దేశాలను హడలెత్తించింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం ప్రయాణికులు, సిబ్బంది కలిసి 242 మంది మృత్యువాత పడ్డారన్న వార్తలు అందరి హృదయాలను కలిచివేస్తున్నాయి. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అధికారికంగా ధృవీకరించారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్ లోని …
Read More »గుజరాత్ విమాన ప్రమాదంలో 100 మంది మృతి?
గుజరాత్ లో విమానం కుప్పకూలిన దుర్ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. జనావాసాల మధ్య విమానం కూలడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉండడం కలచివేస్తోంది. ముఖ్యంగా బీజే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలడంతో అక్కడ ఉన్న పలువురు విద్యార్థులు మరణించారని తెలుస్తోంది. మధ్యాహ్న భోజన సమయం కావడంతో చాలామంది పీజీ వైద్య విద్యార్థులు హాస్టల్ లోని డైనింగ్ హాల్ …
Read More »విమాన ప్రమాదంలో మాజీ సీఎం
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు,10 మంది విమాన సిబ్బంది, ప్రయాణికులు 242 మంది ఉన్నారు. అయితే, ఆ ప్రయాణికులలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రకారం రూపానీ పేరు ఉన్న ఎయిరిండియా విమానం ప్యాసెంజర్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. రూపానీతోపాటు పలువురు రాజకీయ నాయకులు, వీఐపీలు ఆ …
Read More »బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ వద్ద క్రాష్ ల్యాండింగ్ అయింది. టేకాఫ్ సమయంలో విమానం వెనుక భాగం చెట్టును ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అహ్మదాబాద్ నుండి లండన్ కు 242 మంది ప్రయాణికులతో ఈ విమానం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates