Trends

ఐసీసీ వీడియో.. ఇది మరీ టూమచ్

దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ ఇటీవలే ఐసీసీ ప్రపంచ ట్రోఫీని సాధించింది దక్షిణాఫ్రికా. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్‌లో ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమైన ఆ జట్టు.. ఎట్టకేలకు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో గెలిచి సుదీర్ఘ ఫార్మాట్లో ప్రపంచ విజేతగా నిలిచింది. దీంతో ఆ దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఆ జట్టుకు ప్రపంచవ్యాప్తంగా భారీ మద్దతు లభించింది. ఈ అద్భుత ఘట్టం గురించి ఐసీసీ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో …

Read More »

కొత్త టెక్నాలజీ.. విమానం కూలినా అందరూ సేఫ్

అహ్మదాబాద్‌లో ఇటీవలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశంలో తీవ్ర విషాదాన్నే నింపింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ప్రయాణమైన నిమిషం లోపే విమానం కూలిపోవడంతో ప్లేన్లో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా దుర్మరణం పాలయ్యారు. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా మిరాకిల్ అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘోర విమాన ప్రమాదాలు ఎన్నో జరిగాయి. ప్రతి సందర్భంలోనూ విమానాల్లో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోవడమే జరుగుతుంటుంది. ఐతే …

Read More »

పైలట్ ఆఖరి మాట!.. నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్!

అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం.. ఎయిర్ పోర్టు దాటగానే కుప్పకూలిపోవడానికి గల కారణాలేమిటన్న దానిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే విమానం బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందాలు అందులో దాగి ఉన్న వివరాలను డీకోడ్ చేసే పనిలో ఉన్నాయి. ప్రస్తుతానికి విమానం కూలిపోవడానికి ముందు విమానం పైలట్ సుమిత్ సభర్వాల్ చెప్పిన మాటలు వెలుగులోకి వచ్చాయి. సుమిత్ మాటలు విమానం ప్రమాదాన్ని …

Read More »

రూ.కోటికి అదనంగా మరో రూ. 25 లక్షల పరిహారం

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఇవ్వనున్న పరిహారం మరింగా పెరిగింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా సన్స్ తరఫున ఒక్కో మృతుడికి రూ.1 కోటి పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రమాదం జరిగిన రోజే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ ప్రకటన చేశారు. తాజాగా ఎయిర్ ఇండియా శనివారం మరో …

Read More »

జై షా ఉన్నా ఐసీసీ లెక్క చేయలేదా?

టెస్ట్ క్రికెట్‌కు గర్వకారణమైన డబ్ల్యూటీసీ ఫైనల్స్ నిర్వహణపై భారత్ కలలు మరోసారి నెరవేరకుండానే ఆగిపోయాయి. ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా బాధ్యతలు చేపట్టినప్పటికీ, రాబోయే మూడు వరుస టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కలేదు. బీసీసీఐ నూతన శక్తితో అధికారంలోకి వచ్చిన ఈ సమయంలోనూ, ప్రపంచ టెస్ట్ పోటీలకు లార్డ్స్ వేదికగా నిర్ణయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే 2021, 2023, 2025 …

Read More »

ఛాయ్ తాగండి… బేడీల బాధ వినండి!

వరకట్న వేధింపుల కేసుతో మానసికంగా కుంగిపోయిన ఓ యువకుడు వినూత్న రీతిలో న్యాయ పోరాటం మొదలుపెట్టాడు. రాజస్థాన్‌లోని అంటా పట్టణంలో కృష్ణ కుమార్ ధాకడ్ అనే వ్యక్తి తన అత్తవారింటి వీధిలోనే ‘498ఏ టీ కేఫ్’ అనే పేరుతో టీ దుకాణం ప్రారంభించాడు. చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముతున్న ఈ అల్లుడు, తనపై పెట్టిన కేసులు, న్యాయ వ్యవస్థలో జరిగే జాప్యం వల్ల ఎదుర్కొంటున్న బాధను చాటుతూ నిరసన …

Read More »

11A సీటు మిస్టరీ.. 1998లో కూడా ఇలానే..

బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేశ్ 11A సీటులో కూర్చుండడం ఓ వింత విషయంగా మారింది. కానీ ఇదే సీటు నంబరులో 26 ఏళ్ల క్రితం మరో ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తి ఉన్నారని తెలిసి ఇప్పుడు అంతా విస్తుపోతున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు రుయాంగ్‌సాక్ జేమ్స్ లోయ్‌చుసాక్ ఈ అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో …

Read More »

విమాన ప్రమాదంతో మార్కెట్ పై ఎఫెక్ట్

ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన కొద్ది నిమిషాలకే కూలిపోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గందరగోళానికి గురయ్యాయి. AI171 పేరిట ప్రయాణించిన ఈ విమానంలో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించడమే కాకుండా, పెట్టుబడిదారుల్లో భయాన్ని పెంచింది. 242 మంది ప్రయాణికులు మరణించినట్టు తెలిసిన వెంటనే మార్కెట్ నెగటివ్ ట్రెండ్‌లోకి వెళ్లింది. టేకాఫ్ అయిన 30 సెకన్లలోనే విమానం కుప్పకూలిన వార్తలు పంజా విసురుతుండగా, …

Read More »

ప్లేన్ క్రాష్.. వారం ముందే పోస్టు

ఇండియాలో జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదంగా.. నిన్నటి అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్‌ను చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. కేవలం నిమిషంలోపే జనావాసాల మధ్య కుప్పకూలిపోవడం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విమానంలో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా ఉండడం గమనార్హం. ఈ విషాదం చాలదన్నట్లు విమానం కూలిన …

Read More »

ఉగ్ర‌వాదులు-ఇంజ‌న్‌-సిగ్న‌ల్‌-ప‌క్షులు.. విమాన‌ ప్ర‌మాదంపై భిన్న‌వాద‌న‌!

గుజ‌రాత్‌లో సంభ‌వించిన ఘోర విమాన ప్ర‌మాదంలో 242 మంది తుడిచి పెట్టుకుపోయారు. క‌నీసం వారిని గుర్తించే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. అయిన వారికి మాంస‌పు ముద్ద‌లు అందించ‌డం తప్ప ఏమీ మిగ‌ల్లేదు. ఇంత ఘోర విషాదం జ‌రిగి గంట‌లు గ‌డిచినా.. ఈ ప్ర‌మాదం ఎలా సంభ‌వించింద‌నే విష‌యం పై మాత్రం కార‌ణాలు స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు. పైగా.. అనేక వాద‌న‌లు ప్ర‌ముఖ నిపుణుల నుంచే వినిపిస్తుండ‌డం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. …

Read More »

దేశంలో… ఇదే అతి పెద్ద రెండో విమాన ప్ర‌మాదం!

గుజ‌రాత్ పారిశ్రామిక రాజ‌ధాని అహ్మ‌దాబాద్ నుంచి లండ‌న్‌కు టేకాఫ్ అయిన‌.. బోయింగ్ 171 విమానం గురువారం మ‌ధ్యాహ్నం 1.20 గంట‌ల స‌మ‌యంలో కుప్ప‌కూలి పోయింది. ఘ‌ట‌న జ‌రిగిన 30 నిమిషాల వ‌ర‌కు కూడా.. బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌రాలేదు. ఆ త‌ర్వాత‌.. వెలుగు చూసిన ఈ ఘోర విషాదంలో 242 మంది(మొత్తం సిబ్బంది, ప్ర‌యాణికులు కూడా) మాంసపు ముద్ద‌లుగా మిగిలారు. అయితే.. దేశంలో జ‌రిగిన విమాన ప్ర‌మాదాల్లో ఇదే రెండో అతి …

Read More »

మృత్యుంజయుడు… మంటల్లో నుంచి నడిచొచ్చాడు

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు ఆవల జనావాసాలపై కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అందరూ మృత్యువాత పడ్డట్టు పోలీస్ కమిషనర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అదే అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ మరికాసేపటికే మరో ప్రకటన చేశారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి బతికి బట్ట కట్టాడని, అతడు ప్రమాద మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చాడని ఆయన తెలిపారు. వెరసి …

Read More »