నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో దుబాయిలోనే, లేదంటే… ఇంకే దేశంలోనో కాదు… మన దేశంలోని వ్యవసాయ రాష్ట్రం పంజాబ్ కు చెందిన లారీ డ్రైవర్ ఒకరు రాత్రికి రాత్రి ఇలా కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఆ లారీ డ్రైవర్ కేవలం రూ.500 పెట్టి కొన్న ఓ లాటరీ టికెట్ అతడికి ఏకంగా రూ.10 కోట్లను ఆర్జించి …
Read More »ట్రంప్ లెగ్గు మయం.. 7 లక్షల కోట్లు ఆవిరి!
ప్రపంచ స్టాక్ మార్కెట్ పై అమెరికా కొత్త అధ్యక్షత ప్రభావం గట్టిగానే ఉంటుందని ముందు నుంచే సంకేతాలు వచ్చాయి. ఇక భారత స్టాక్ మార్కెట్ ట్రంప్ ప్రభావం గట్టిగానే పడింది. అతని రాకతో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. వివిధ కారణాల ఎన్ని ఉన్నా కూడా ట్రంప్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. దాదాపు రూ.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా …
Read More »నెంబర్ వన్ రికార్డుకి సిద్ధమైన ఇండియన్ బౌలర్
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్కు ముందు అర్ష్దీప్ సింగ్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో బుధవారం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అర్ష్దీప్ తన కెరీర్లో అత్యున్నత ఘనత సాధించేందుకు సిద్ధమయ్యాడు. టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవడానికి అతడికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ప్రస్తుతం ఈ రికార్డ్ లెగ్ స్పిన్నర్ …
Read More »ఇదేం పద్ధతి?.. ట్రంప్ నిర్ణయంపై చైనా విసుర్లు!
అగ్ర రాజ్యం అమెరికాకు నూతన అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఆదిలోనే అదిరిపోయే నిర్ణయాలతో యావత్తు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తున్నారు. సోమవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో దేశ అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేసిన మరుక్షణమే తనదైన శైలి దూకుడును మొదలుపెట్టిన ట్రంప్…ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో పనిచేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అమెరికా వైదొలగుతున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ …
Read More »జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి: ఏపీ జవాను వీరమరణం
జమ్మూకశ్మీర్ లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడి భారత్ ఆర్మీకి తీరని నష్టాన్ని కలిగించింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కదలికలను గుర్తించి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాను పంగల కార్తీక్ (29) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, మంగళవారం ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలోని రాగి మానుపెంట గ్రామానికి …
Read More »ఎలాన్ మస్క్ : అప్పుడు ట్విట్టర్… ఇప్పుడు టిక్ టాక్…
అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు వేస్తున్నారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లాను విశ్వవ్యాప్తం చేసే దిశగా చురుగ్గా కదులుతున్న మస్క్… ఎక్కడా కూడా వెనక్కు తగ్గని రీతిలో సాగుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా సోమవారం రాత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కు ఆది నుంచి వెన్నుదన్నుగా …
Read More »మృగాడికి జీవిత ఖైదు…హంతకురాలికి మరణ దండన
భారత న్యాయ వ్యవస్థలో సోమవారానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పాలి. సోమవారం ఒకే రోజు రెండు కీలక కేసుల్లో దేశ కోర్టుల నుంచి సంచలన తీర్పులు వెలువడ్డాయి. వీటిలో యావత్తు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోల్ కతా ఆర్డీ ఖర్ ఆసుపత్రి వైద్యురాలిపై జరిగిన హత్యాచార కేసు కాగా… మరొకటి కేరళలో ప్రేమించిన యువకుడిని వంచించి అతడిపై విష ప్రయోగానికి పాల్పడి అతడిని దారుణంగా అంతమొందించిన ప్రియురాలి …
Read More »అమెరికాలోకి టిక్ టాక్ రీ ఎంట్రీ పక్కా!!
టిక్ టాక్… చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ గా రికార్డులకెక్కింది. చాన్నాళ్లుగా అగ్ర రాజ్యం అన్న ట్యాగ్ ను అలా అలా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్న అమెరికా గుత్తాధిపత్యం సాగిస్తోందంటూ చైనా ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ వ్యాఖ్యలతో ఆ దేశం అమెరికాకు తాను యాంటీ అని కూడా చెప్పకనే చెప్పింది. …
Read More »మహా కుంభ మేళాలో అగ్ని ప్రమాదం.. ఎవరిది తప్పు?
ఉత్తరప్రదేశ్లోని త్రివేణీ సంగమం(గంగ, యమున, సరస్వతి నదులు సంగమించే చోటు)లో ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ మేళా వచ్చే నెల 26వ తేదీ వరకు జరగనుంది. దీనిని యూపీ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది. అయితే.. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. మానవ తప్పిదాల కారణంగా మహా కుంభమేళాలో తాజాగా భారీ …
Read More »ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: టీమిండియా ఫైనల్ టీమ్ ఇదే!
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. నేడు ముంబయిలో జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ, 15 మందితో కూడిన బలమైన జట్టును ఖరారు చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరడం ప్రధాన ఆకర్షణగా …
Read More »సంక్రాంతి రద్దీతో ఏపీఎస్ఆర్టీసీకి డబ్బే డబ్బు
ఈ సంక్రాంతి ఏపీకి వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే… పండుగకు ముందు ప్రభుత్వం మారింది. కూటమి కొత్త సర్కారు పాలన మొదలు కాగానే… రాష్ట్రంలో ఓ నూతన ఒరవడి కనిపించింది. పాలనలో దూకుడుతో వెళుతున్న కూటమి సర్కారు ఎక్కడిక్కడ తనదైన శైలి నిర్ణయాలు తీసుకుంటోంది. ఫలితంగా రాష్ట్రంలో కొత్త ఉత్సాహం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అదే ఉత్సాహం సంక్రాంతి వేడుకల్లో కనిపించింది. బుధవారంతో సంక్రాంతి వేడుకలు పూర్తీ …
Read More »ఆకాశంలో మరో అద్బుతం.. గెట్ రెడీ!
ఈ నెల 25న ఆకాశంలో అరుదైన ప్లానెట్స్ పరేడ్ జరగనుంది. సూర్యవ్యవస్థలోని ఆరు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చే ఈ అద్భుతం, ఖగోళ ప్రేమికులకు విజువల్ ట్రీట్గా నిలుస్తుంది. అమెరికా సహా కొన్ని దేశాల్లో ఈ అద్భుత దృశ్యం స్పష్టంగా కనిపించనుంది. అంగారకుడు, శుక్రుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ వంటి ఆరు గ్రహాలు ఒకే రేఖలో కనిపిస్తాయి. ఇది చాలా అరుదుగా జరుగుతుందనే విషయం తెలిసిందే. జనవరి 25న …
Read More »