దేశంలో ప్రధాన మంత్రి పీఠం అధిరోహించేందుకు లెక్కకు మిక్కిలిగా నాయకులు పోటీ పడుతున్నారు. ఒకరికిమించి ఎక్కువగానే ఈ జాబితా ఉంది. ఈ కారణంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం గా కూటమి కట్టే ఆలోచనలకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నాయి. గతంలోనూ ఇలానే తృతీయ పక్షం ఏర్పాటుకు ప్రధాని పీఠమే అడ్డంకిగా మారిందనే చర్చ నడిచింది. ప్రాంతీయ స్థాయిలో బలంగా ఉన్న నాయకులు కేంద్రంలో చక్రం తిప్పాలని భావించడమే దీనికి కారణం. …
Read More »తెలంగాణ కాంగ్రెస్ – గట్టి ప్లానింగే !
ఈనెల 26వ తేదీన తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ అధిష్టానం పిలిపించింది. అందరినీ ఢిల్లీకి రమ్మని ఆదేశించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధి, ప్రియాంకగాంధి తదితరులు తెలంగాణా నేతలతో భేటీ అవటానికే రమ్మని ఆదేశించారు. తొందరలో జరగబోతున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు, దిశానిర్దేశం చేసేందుకే కీలకమైన భేటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన …
Read More »భారత్ జోడో యాత్ర సక్సెస్.. రాహుల్ ఫెయిల్!
దేశంలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి రావాలని ఉవ్వి ళ్లూరుతున్న కాంగ్రెస్ పార్టీలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పార్టీని గాడిలో పెట్టేందుకు.. మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ అగ్రనేతరాహుల్గాంధీ భారత్ జోడో వంటి యాత్రలు చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రజల్లో సానుభూతి పెరిగి.. పార్టీ పుంజుకుంటుందని ఆయన వేసిన అంచనాలు నిజమయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు రెండు దశల్లో చేసిన భారత్ …
Read More »ఏపీకి మళ్లీ అప్పు.. నెలన్నరలో 13,500 కోట్లకు చేరిన రుణం!!
అప్పు చేసి పప్పు కూడు తినరా.. ఓ నరుడా! అన్న సూత్రం ఏపీకి బాగానే వర్తిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) ప్రారంభమై.. కేవలం నెలన్నరే అయింది(ఏప్రిల్-మే15). అయితే.. ఈనెలన్నర కాలంలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 13,500 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చింది. తాజాగా దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్బీఐ మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఇచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా …
Read More »పొత్తులు లేకుంటే అంతే.. బీజేపీ నేతల గుసగుస…!
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే.. అన్నో ఇన్నో అసెంబ్లీ.. ఒకటో రెండో పార్లమెంటు స్థానాల్లోనూ విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ నాయకులు తలపోస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం కమల నాథులతో కలిసి నడుస్తున్న జనసేన కూడా అదే అభిప్రాయంతో ఉంది. మీరు బతకండి.. మమ్మల్ని బతికించండి.. అందరం కలిసి అధికారంలోకి వద్దాం.. అని చెబుతోంది. అయితే.. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఎటూ …
Read More »చంద్రబాబు పై పీక్స్కు చేరుకున్న మౌత్ పబ్లిసిటీ..
వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకపోయినా.. తెలుగు దేశం పార్టీ సునాయాసంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని మేధావులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు సమయం చేరువ అవడంతో ఏ పార్టీ విజయం దక్కించుకుంటుంది..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రస్తుతం ఉన్న అంచనాలు ఏంటి? అనేవి చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా ప్రతిపక్షం టీడీపీ పుంజుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా …
Read More »మారని తీరు.. కేశినేనిని టీడీపీ వదిలేస్తుందా…!
ఒక రోజు ఒక విధంగా ఉన్నా.. మరుసటి రోజైనా మార్పు అనేది రావాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విజయం దక్కించుకునేందుకు నాయకులు ముఖ్యంగా ఈ సూత్రాన్ని అవలంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే.. విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని విషయంలో పార్టీ ఆశలు ఆవిరి అవుతున్నాయనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఒకవైపు వైసీపీ పై కత్తికట్టినట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. వైసీపీ వైఫల్యాలు అంటూ ప్రజల మద్య …
Read More »ఆ నలుగురికి తలంటిన అధిష్టానం
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాది లోపే జరుగుతున్న వేళ బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నలుగురి వల్ల వస్తున్న అనర్థాలను అరికట్టే చర్యలు చేపట్టింది. ఎక్కడా నోరు మెదపవద్దని, పార్టీ లైన్ ను మాత్రమే ప్రచారం చేసేందుకు వారి సేవలను వినియోగించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దానితో వాళ్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. నిజానికి వైసీపీ పాలనా వైఫల్యాల పై గాకుండా టీడీపీ పై విమర్శలు చేయడం …
Read More »ఈ సారి కూడా టీడీపీ ఓడిపోతే..
ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే.. పాలన ప్రారంభించి నాలుగేళ్లు జరిగిపోయినా.. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్దీ లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అదేసమయంలో లెక్కకు మించిన అప్పులు చేస్తున్నారని.. మద్య నిషేధం చేస్తామని నమ్మించి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని.. విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక, రాజధాని …
Read More »రూ.2 లక్షల కోట్లు డిపాజిట్ అవుతాయా..
ప్రభుత్వం ప్రకటించిన ఒక నిర్ణయం ఇప్పుడు దేశ ప్రజల్లో గుబులు రేపుతోంది. తమ దగ్గరున్న రూ.2 వేల రూపాయల నోట్లను వదిలించుకునేందుకు జనం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవ్వాల్టి నుంచి ( మంగళరవారం) జనం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. రోజుకు 20 వేలకు మించి మార్చుకునే అవకాశం లేదని చెప్పడంతో చాలా మంది రోజూ బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రాబోతోంది. పైగా యాభై వేల డిపాజిట్ …
Read More »‘దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకుంటున్నారు’
ఏపీ ప్రతిపక్ష నాయకులపై వైసీపీ అదినేత, సీఎం జగన్ విరుచుకుపడ్డారు. దేవుడు చేస్తున్న యజ్ఞాన్ని (సంక్షేమ పథకాలు) రాక్షసులు(ప్రతిపక్షాలు) అడ్డుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. పేదలకు పంచబోయే భూమిని సమాధులతో పోలుస్తారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. అలాంటి మానవత్వం లేని, వికృత ఆలోచనలను ఉన్న వ్యక్తులకు మద్దతు ఇస్తారా? అంటూ సోమవారం మచిలీపట్నం బహిరంగ సభ …
Read More »కమ్మ.. రెడ్డి..కాపులు ఒక్కరే.. షాకిచ్చే నిజాన్ని చెప్పిన పెద్దాయన
తెలుగు రాజకీయాల గురించి ఒక్క మాట మాట్లాడాల్సి వచ్చినా ఆ వెంటనే వచ్చే పదాల్లో ముఖ్యమైనవి కాపు.. కమ్మ.. రెడ్డి. ఈ మూడు పేర్లు పలకకుండా రాజకీయాల గురించి మాట్లాడలేని పరిస్థితి. తెలుగు ప్రజల జీవితాల్లో అంతలా పెవేసుకున్న ఈ మూడు కులాల నేపథ్యం ఏమిటి? ఇంతకీ ఈ మూడు కులాలకు ఉన్న తేడా ఏమిటి? అసలీ మూడు కులాల ఉనికి ఎప్పటి నుంచి ఉండేదన్న దానికి సంబంధించి సంచలన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates