Political News

పొంగులేటి నా కొడుకుతో సమానం: వైఎస్ విజయమ్మ

తెలంగాణ రాజకీయాల్లో కొద్దితరోజులుగా సాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ కొత్త టర్న్ తీసుకుంటోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీఆర్ఎస్ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి స్వరం వినిపిస్తున్న ఈ మాజీ ఎంపీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా వైఎస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమివ్వగా పొంగులేటి మాత్రం విజయమ్మ మాటలను ఖండించారు.టీవీ చానల్‌తో మాట్లాడిన విజయమ్మ పొంగులేటి విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. …

Read More »

ఏపీ పోలీసుల‌కు వార్నింగ్‌ త‌ప్ప‌దా?!

అదేం ఖ‌ర్మ‌మో కానీ.. ఏపీ పోలీసులుకు ఇటు కోర్టుల నుంచి అటు కేంద్రం నుంచి కూడా విమ‌ర్శ‌లు త‌ప్ప డం లేదు. అనేక విష‌యాల్లో ఏపీ పోలీసులు అనుస‌రిస్తున్న వైఖ‌రి పై కోర్టులు ఇప్ప‌టికే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. అనేక సంద‌ర్భాల్లో పోలీసు ఉన్న‌తాధికారుల‌ను త‌మ వ‌ద్ద‌కు పిలుచుకుని వార్నింగులు కూడా ఇచ్చాయి. అయిన‌ప్ప‌టికీ.. వారిలో మార్పు మాత్రం రావ‌డం లేదు. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు …

Read More »

జమ్మలమడుగు నుంచి వైఎస్ భారతి పోటీ?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతి పోటీ చేస్తారన్న ప్రచారం కడప జిల్లాలో జరుగుతోంది. జగన్ సొంత జిల్లా అయిన కడపలోని జమ్మలమడుగు నుంచి ఆమె పోటీచేస్తారన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పులివెందుల నియోజకవర్గం జగన్ కుటుంబానికి కంచుకోట కాగా దానికి అదనంగా జమ్మలమడుగును కూడా కంచుకోటగా మార్చుకునేందుకు గాను పావులు కదుపుతున్నారని… అందులో భాగంగానే అక్కడి నుంచి భారతిని బరిలో దించుతారని తెలుస్తోంది. …

Read More »

23న టీడీపీలో చేరనున్న కన్నా లక్ష్మీ నారాయణ

రెండు రోజుల కిందట బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చాలామంది అనుకుంటున్నట్లు జనసేనలో చేరడం లేదట. ఆయన టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. ఫిబ్రవరి 23న ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారని అనుచరులు చెప్తున్నారు. మరోవైపు ఆదివారం ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. టీడీపీలో చేరితేనే కన్నా స్థాయికి గౌరవం దక్కుతుందని అనుచరులు కూడా అభిప్రాయపడడంతో ఆయన అనుచరుల నిర్ణయాన్ని అంగీకరిస్తూ టీడీపీలో …

Read More »

‘చంద్రబాబు, విజయసాయిరెడ్డి చేతిలో చేయి వేసి మాటామంతీ’

టీడీపీ అధినేత చంద్రబాబు పేరెత్తితే ఒంటి కాలు మీద లేస్తారు వైసీపీ నంబర్ 2 విజయసాయిరెడ్డి. చంద్రబాబు, తెలుగుదేశం నేతలు కూడా విజయసాయిరెడ్డిపై అంతే స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. ఈ ఇద్దరు నాయకులు కలిసిన సందర్భం, మాట్లాడుకున్న సందర్భం ఇంతవరకు ఎవరూ చూడలేదు. అలాంటిది నందమూరి తారకరత్న మృతి సందర్భంగా పరామర్శించేందుకు వచ్చిన ఈ ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో …

Read More »

తారకరత్నకు ఛాన్స్ ఇద్దామనుకున్నాం – చంద్రబాబు

సినిమా కెరీర్ మీద పూర్తిగా ఆశలు కోల్పోయాక.. రాజకీయాల వైపు అడుగులు వేసి.. అందులోనైనా విజయవంతం కావాలని, మంచి స్థాయిని అందుకోవాలని అనుకున్నాడు నందమూరి తారకరత్న. కానీ అతడి ప్రయాణం ఆరంభంలోనే ఆగిపోయింది. నారా లోకేష్ మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర తొలి రోజు తన బావతో కలిసి అడుగులు వేస్తున్న సమయంలో తారకరత్నకు గుండెపోటు రావడం.. ఆ తర్వాత ఆసుపత్రి పాలై మృత్యువుతో పోరాడడం.. చివరికి శివరాత్రి రోజు శివైక్యం …

Read More »

అప‌న‌మ్మ‌కం ఏపీలో ఏ పార్టీని ముంచేస్తుందో ?

ఏ రాజ‌కీయ పార్టీకైనా నాయ‌కులు చాలా ముఖ్యం క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్.. కీల‌క నేత‌ల స‌హ‌కారం.. లేక‌పోతే .. ఏ పార్టీ కూడా గెలుపు గుర్రం ఎక్కిన ప‌రిస్థితి లేదు. అందుకే.. పార్టీ ఏదైనా కూడా నాయ‌కుల విష‌యంలో ఒకింత ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌రిస్థితి ఉంది. ఇది గ‌తంలో ఉండేది. పార్టీలు నేత‌ల‌పై భారం వేచి ఊరుకునేవి. త‌మ ప‌ని తాము చేసుకునిపోయేవి. నిర్ణ‌యాలు తీసుకుని వ‌దిలేయ‌డం మిన‌హా.. నేత‌ల‌పై పెద్ద‌గా …

Read More »

షర్మిల అరెస్టు.. హైదరాబాద్ కు తరలింపు

అనుకున్నట్లే జరిగింది. వైఎస్సార్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. ఆమె పాదయాత్రను కూడా రద్దు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఫిబ్రవరి 18న మహబూబాబాద్ లో ఆమె నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ను పరుష పదజాలంతో దూషించారన్న ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆదివారం ఉదయం షర్మిల కారవాన్ వద్దకు …

Read More »

జంపింగులు పెరిగితే న‌ష్టం వైసీపీకా… టీడీపీకా…!

ఏపీలో జంప్ జిలానీలు ఇంకా పెరుగుతున్నార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీ రెండు పార్టీల్లోనూ జంప్ చేసే నేత‌ల సంఖ్య పెరుగుతోంద‌ని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ కంటే కూడా.. వైసీపీలో ఎక్కువ‌గా జంప్ చేసే నేత‌లు పెరుగుతున్నార‌ని పార్టీలోనే గుసగుస వినిపిస్తోంది. సీఎం జ‌గ‌న్‌పై మునుపు ఉన్న విశ్వాసం .. ఇప్పుడు నేత‌ల‌కు లేకుండా పోయింద‌ని కూడా అంటున్నారు. అయితే.. ఎవ‌రూ కూడా ఇప్ప‌టికిప్పుడు బ‌య‌ట‌ప‌డ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు …

Read More »

అంతా స‌జ్జ‌ల డైరెక్ష‌న్‌లోనే.. చంద్ర‌బాబు ఫైర్‌

త‌న ప‌ర్య‌ట‌న‌లో పోలీసులు అడుగ‌డుగునా ఉక్కుపాదం మోప‌డం, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేయడం.. స‌భ‌ను అడ్డుకోవ‌డం అన్నీ కూడా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి డైరెక్ష‌న్‌లోనే సాగుతున్నాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. “ప్రజల్లో వ్యతిరేకత గమనించే జ‌గ‌న్‌ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారు. ముందురోజు సభ నిర్వహణకు అనుమతి ఇచ్చి… అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారు. జగ్గంపేట, పెద్దాపురంలో …

Read More »

ఇక్కడ ప్రతిపక్ష నేతలను హీరోలను చేయబడును

కొన్ని నెలల కిందట విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఏం జరిగిందో గుర్తుందా? విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఏదో సభ పెట్టిన సందర్భంలోనే పవన్ తన పర్యటన పెట్టుకున్నారు. చాలా రోజుల ముందే షెడ్యూల్ చేసుకున్న పార్టీ కార్యక్రమం అది. మామూలుగా అయితే పవన్ వచ్చేవాడు. ఆ కార్యక్రమం ఏదో పూర్తి చేసుకుని వెళ్లిపోయేవాడు. మీడియాలో ఓ మోస్తరుగా కవరేజీ వచ్చేదంతే. కానీ ఆయన …

Read More »

జ‌గ‌న్ కేబినెట్లోకి కొడాలి నాని, తోట త్రిమూర్తులు…?

అంద‌రూ అనుకున్న విధంగానే.. రెండు కీల‌క విష‌యాల్లో సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి మ‌రోసారి త‌న కేబినెట్‌ను విస్త‌రించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో ముందస్తుగా ఎన్నిక‌లకు కూడా వెళ్లాల‌ని చూస్తున్నారు. అయితే.. ఈ రెండు విష‌యాల‌పైనా కొన్నాళ్లుగా త‌ర్జ‌న భ‌ర్జ‌న అయితే సాగుతోంది. ఎటూ నిర్ణ‌యం తీసుకోలేక పోతున్నారు. అయితే.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు.. సీఎం జ‌గ‌న్ ఆ దిశ‌గానే అడుగులు …

Read More »