తాను పుట్టిన ఊరు మీదా.. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతం మీదా ప్రేమాభిమానాలు లేకుంటే ఏమవుతుందన్న మాటకు కొద్ది కాలం క్రితం వరకు సరైన ఉదాహరణ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. ప్రాంతం మీద అభిమానం ఉంటే.. ఎంత మేలు జరుగుతుందో తెలంగాణను చూస్తే.. అర్థమవుతుంది. కులాల కుంపట్లతో తరచూ రాజకీయ కుస్తీలకు దిగే ఆంధ్రాకు ఎంత నష్టం వాటిల్లుతుందో ఇప్పుడు అందరికి అర్థమయ్యే పరిస్థితి. అయినప్పటికీ.. …
Read More »జగన్ సర్కారు అంత హడావుడి చేసి..
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ బాధితుల కోసమని అనంతపురం జిల్లాలో 1500 పడకలతో ఓ భారీ తాత్కాలిక ఆసుపత్రిని జగన్ సర్కారు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తోందని సోషల్ మీడియాలో వైకాపా అభిమానులు హోరెత్తించేసిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబును దెప్పిపొడుస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఒక సందర్భంలో ఈ ఆసుపత్రి గురించి ప్రస్తావించారు. అనంతపురంలో అద్భుతమైన కోవిడ్ ఆసుపత్రి రెడీ అయింది. చంద్రబాబుకు కరోనా సోకినా అక్కడికెళ్లి చికిత్స చేయించుకోవచ్చు అంటూ …
Read More »అమెరికాకు తెలుగంటే ఎంత గౌరవమంటే..
ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం. ఈ సంగతి తెలుగు వాళ్లు చాలామందికి గుర్తుండదు. ఎవరైనా గుర్తు చేసినా పట్టింపు ఉండదు. అదే పొరుగున ఉన్న తమిళనాడులో తమిళ భాషా దినోత్సవం అంటే సందడి మామూలుగా ఉండదు. వాళ్ల భాషాభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మరో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కన్నడ ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది. కానీ మన వాళ్లకే సొంత భాష మీద …
Read More »నూతన్ నాయుడు.. ఏ పార్టీ?
రెండేళ్ల కిందట బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన వ్యక్తి నూతన్ నాయుడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించాడు. రాజకీయ వ్యవహారాల్లో కూడా అతడి పేరు వినిపించింది. ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ మీద స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కించిన పరాన్నజీవి సినిమాతో అతను మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. అదే పనిగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్న వర్మను టార్గెట్ చేస్తూ నూతన్ తీసిన సినిమా ఇది. …
Read More »ట్రంప్ టైం బాగోలేదా? ఈ అపశకునాల సంకేతాలేంటి?
గడిచిన కొన్ని దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయాన్ని చెప్పే పెద్ద మనిషి.. ఈసారి ట్రంప్ కు వ్యతిరేకంగా తన అంచనాను చెప్పటం తెలిసిందే. కీలకమైన ఎన్నికల వేళలో.. అదే పనిగా నల్లజాతీయులపై శ్వేతజాతీయ పోలీసులు విరుచుకుపడుతున్న తీరు.. వారి కారణంగా పోతున్న ప్రాణాలు అమెరికన్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి సరిపోనట్లుగా.. ఇటీవల కాలంలో ట్రంప్ కు ఏదీ కలిసి రావటం లేదంటున్నారు. తాజాగా ఉత్తర కరోలినాలో …
Read More »కేటీఆర్ లాంటోడు ఏపీలో ఎవరూ లేరా?
విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలిక ప్రతి విషయంలోనూ కనిపిస్తుంటుంది. అటు రాజకీయ నేతలు కావొచ్చు.. సామాన్య ప్రజలు కానీ పలు అంశాల్ని తమ రాష్ట్రంతో పోల్చుకుంటుంటారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గా నడుస్తూ ఉంటుంది. తెలంగాణలో రాజకీయాలు ఏకపక్షంగా మారగా.. ఏపీలో ఇంకా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. బలమైన ప్రతిపక్షంగా బాబు అండ్ కో పోరాటం చేస్తున్నారు. వారు చేసే …
Read More »వారి వ్యాపారాలు… పార్టీకి శాపమా
రాజకీయ పార్టీలకు ఫండ్ వ్యాపారవేత్తలు ఫండ్ ఇవ్వడం….బదులుగా ఆ వ్యాపారవేత్తలకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలుగా పట్టం కట్టడం రాజకీయాల్లో సర్వసాధారణం. అయితే, తమ పార్టీ విజయం సాధిస్తే ఫండ్ ఇచ్చిన వ్యాపారవేత్తల పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. ఎటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి వారి వారి వ్యాపారాలు కాపాడుకుంటూనే అడపాదడపా తమతమ నియోజకవర్గాల్లో కనిపిస్తే చాలు. ఒకవేళ తమ వ్యాపారాల్లో బిజీగా ఉండి పార్టీ కార్యక్రమాలు, …
Read More »ఆ ట్రబుల్ షూటర్ పైనే మరోసారి చంద్రబాబు గురి
రాజకీయ పార్టీల్లో రకరకాల రాజకీయ నాయకులుంటారు. ఇటు అధిష్టానం, అటు ప్రజలను మెప్పించడంలో ఎవరి ప్రత్యేకత వారిది. కొందరు తమ వాగ్దాటితో నెగ్గుకు వస్తుంటారు. మరికొందరికి జనంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది….మరి కొందరు తమకున్న చాణక్య నీతితో ఇటు పార్టీ అధిష్టానాన్ని అటు కేడర్ ను, ప్రజలను మెప్పిస్తుంటారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో శివ కుమార్ ఈ తరహా నేతగా గుర్తింపు పొంది ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. …
Read More »టి గవర్నర్ ఇంట విషాదం…కాంగ్రెస్ ఎంపీ మృతి
తెలంగాణ గవర్నర్ తమిళసై గవర్నర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎంపీకి బాబాయి వరుస అయ్యే కన్యాకుమారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ హెచ్ వసంత్ కుమార్ కరోనాతో మరణించారు. కరోనా సోకడంతో అయన ఆగష్టు 10 వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే మరణించారు. కరోనాతో మృతి చెందిన తొలి ఎంపీ వసంత్ కుమార్. వసంత కుమార్ జీవితంలో …
Read More »ఎవరీ ఓం ప్రతాప్.. చిత్తూరు జిల్లాలో అసలేం జరుగుతోంది?
చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ అలజడి ఇప్పుడు అంతకంతకూ పెరుగుతోంది. రాజకీయంగా అధికార.. విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇంతకూ అసలేం జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓం ప్రతాప్ అనే దళితుడు.. ఒక వీడియోను పోస్టు చేశాడు. అందులో.. రూ.140 ఉన్న బీరును రూ.260 పెంచటం ఏమిటంటూ జగన్ సర్కారు మీద ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ …
Read More »ఏపీ డిప్యూటీ సీఎం మౌనం.. ఇప్పుడు హాట్ టాపిక్ ఎందుకు?
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి మౌనం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అనూహ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అవకాశాన్ని సొంతం చేసుకున్న పుష్ప శ్రీవాణి.. చాలా చిన్న వయసులోనే పెద్ద పదవిని సొంతం చేసుకున్నారని చెప్పాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తుండేవారు. ముఖ్యమంత్రి మీదా.. ప్రభుత్వం మీద ఎవరు పల్లెత్తు మాట అన్నా కస్సుమనేవారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. దీంతో.. …
Read More »రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి కేసీఆర్ సర్కారు..?
కరోనా పుణ్యమా అని వ్యక్తిగతంగానే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడిన వైనం తెలిసిందే. ఈ కారణంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు భారీగా ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల గడిచేసరికి చెల్లించాల్సిన నిధులు పెద్ద ఎత్తున ఉంటాయి. మరోవైపు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ మార్గాలు తగ్గిపోవటంతో.. కొత్త …
Read More »