మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లో వేస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. యువత కోసం యువగళం కార్యక్రమం ప్రకటించారు. ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. రైతుల కోసం ‘అన్నదాత’ కార్యక్రమం తెస్తామని చంద్రబాబు తెలిపారు. మహానాడు …
Read More »అవినాష్కు హక్కులు లేవా? ఎందుకీ వ్యాఖ్యలు..
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు సహకరిస్తున్నప్పటికీ.. కడప ఎంపీ అవినాష్రెడ్డిని టార్గెట్ చేసుకుని.. టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న చర్చలను మేధావులు, రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. సీబీఐ ఎప్పుడు నోటీసులు ఇచ్చినా.. సాద్యమైనంత వరకు ఆయన హాజరవుతున్నారని వారు చెబుతున్నారు. అయితే, కొన్ని కొన్ని సందర్భాల్లో విచారణకు హాజరు కాలేకపోతే.. ఆ విషయాన్ని దాచకుండా సీబీఐకి వెల్లడిస్తున్నారని.. దీనిని …
Read More »ఎన్టీఆర్ 100 – అనితరసాధ్యమైన కీర్తిశిఖరం
ఎందరో మహానుభావులు. కానీ కొందరే చరితార్థులు. వాళ్ళలో ఎన్టీఆర్ ది ప్రత్యేక స్థానం. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎందరో గొప్ప నటీనటులను చూసింది. కానీ ప్రేక్షకుల మీద విపరీతమైన ప్రభావం చూపించి దశాబ్దాలు కాదు శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని స్థానం సంపాదించుకోవడం ఎన్టీఆర్ లాంటి అతి కొందరికే సాధ్యమయ్యింది. కేవలం సినిమాల్లో నటించడం వల్ల ఆ ఘనతను అందుకోలేదు . అనితరసాధ్యమైన నట సాహసాలకు నెలవుగా నిలవడం వల్లే …
Read More »ఎన్నికల కోసం వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే…!
వచ్చే ఎన్నికలు కీలకంగా మారడం.. పెద్ద ఎత్తున పోటీ ఉంటుందని లెక్కలు రావడంతో అధికార పార్టీ వైసీపీ అలెర్ట్ అవుతోంది. సామదాన భేద దండోపాయాలతో అయినా..వచ్చే ఎన్నికల్లోవిజయం దక్కించుకునేం దుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఎన్నికల వ్యూహాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఏకాకిని చేసి.. మిగిలిన పార్టీలు జతకట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ ప్లాన్ మార్చింది. ప్రస్తుతం ఈ విషయంపై …
Read More »ఎన్టీఆర్.. విజయశాంతి.. ఒక క్షమాపణ కథ
ఈ రోజు లెజెండరీ నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు వందో పుట్టిన రోజు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన గొప్పదనాన్ని చాటే ఎన్నో ఉదంతాల గురించి ఎంతోమంది ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ లాగే సినిమాల్లో గొప్ప పేరు తెచ్చుకుని.. రాజకీయాల్లో అడుగు పెట్టిన విజయశాంతి ఈ మహా నటుడు, నాయకుడితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన గొప్పదనాన్ని చాటుతూ ట్విట్టర్లో పెట్టిన పోస్టు అందరి …
Read More »కొత్త పార్లమెంటు… `శవపేటిక`.. దారి తప్పిన ప్రతిపక్షం విమర్శలు!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తూ..కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష నేతలకు కొన్ని వర్గాల నుంచిమద్దతు లభిస్తోంది. అదేసమయంలో మేధావి వర్గాల నుంచి మాత్రం కొంత మద్దతు తగ్గింది. ఇప్పటికే 58 మంది మేధావులు.. ఉన్నత విద్యావంతులు.. ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా ఆయా పార్టీలకు లేఖలు సంధించారు. ఇదిలావుంటే.. ఇప్పుడు పార్లమెంటు అయితే.. ప్రారంభం అయిపోయింది. రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా. ప్రధాని దీనిని ప్రారంభించారు. అయితే..ఇప్పుడు ప్రతిపక్షాలపై …
Read More »అన్నా.. అంటూ కన్నీరు పెట్టేసుకున్న కేసీఆర్
కాలం మహా విచిత్రమైనది. సాదాసీదా నేతల్ని సైతం సమయం సూపర్ పవర్ గా మార్చేస్తుంటుంది. తెలుగు నేలను ఏలిక ఎన్టీఆర్ హయాంలో ఎంతో మంది నేతల్ని ఆయన తయారు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ప్యూచర్ నేతల్ని తయారు చేసిన క్రెడిట్ ఎన్టీఆర్ కు దక్కుతుంది. ఈ రోజున తెలంగాణ రాజకీయాల్లో సూపర్ పవర్ గా ఉంటూ.. ఆయనకు సమీప దూరానికి రాలేని మేరునగంగా ఉన్న అధినేత కేసీఆర్. అలాంటి …
Read More »తొందరలోనే రాయలసీమ రోడ్ మ్యాప్
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది చంద్రబాబునాయుడు ప్రయత్నం. అధికారంలోకి రాకపోతే పార్టీ భవిష్యత్తు ఏమిటో మిగిలిన వారికన్నా చంద్రబాబుకే ఎక్కువగా తెలుసు. అందుకనే 74 ఏళ్ళ వయసులో కూడా శ్రమ అనుకోకుండా రెగ్యులర్ గా జనాల్లోనే ఉంటున్నది. ఒకవైపు చంద్రబాబు జిల్లాల్లో పర్యటిస్తుండగానే మరోవైపు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర రాయలసీమలో జరుగుతోంది. మహానాడు సందర్భంగా నాలుగురోజులు విరామమిచ్చారు. మహానాడులో లోకేష్ మాట్లాడుతు రాయలసీమకు …
Read More »యువతకు 40 శాతం టికెట్లు..మహానాడులో సంచలన తీర్మానం
రాజమండ్రి వేదికగా జరుగుతున్న మహానాడులో సంచలన తీర్మానాలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు దోపిడీదారుడికి, పేదలకు మధ్య ఇక యుధ్ధమేనని తొలి తీర్మానం చేశారు. సంపద దోచుకుం టున్న దోపిడీ దారులకు, పేదలకు మధ్య రాబోయే రోజుల్లో జరిగే యుద్ధం కీలక రాజకీయ పరిణామంగా పేర్కొంది. ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన ఈ తీర్మానాన్ని మరో సీనియర్ నేత …
Read More »వైసీపీ వర్సెస్ జనసేన.. విశాఖలో టెన్షన్ టెన్షన్
విశాఖపట్నం సిటీలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ తీవ్ర టెన్షన్ రేపుతోంది. వైసీపీ ఫ్లెక్సీల ధీటుగా జనసేన నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాక్షస పాలన అంతం.. ప్రజా పాలన ఆరంభమంటూ జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో వివేకా మొండెం ఉండేలా ఫ్లెక్సీలను తయారీ చేయించారు. జగన్ షర్ట్పై 6093 నంబర్, వైసీపీ నేతలతో కూడిన జగన్ …
Read More »అవినాశ్ తల్లి ‘సర్జరీ’పై టీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సంచలన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసే అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా అవినాశ్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించే వేళలో.. చివర్లో అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి ప్రస్తావనను తీసుకొచ్చారు. సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వర్ రావు తన వాదననలు వినిపిస్తూ.. పిటిషనర్ తల్లి శ్రీలక్ష్మీ హైదరాబాద్ లోని …
Read More »జగన్ ఇచ్చిన `10 లక్షల పట్టా` వెనుక చంద్రబాబు ధైర్యమేనా?!
రెండు రోజుల కిందట వైసీపీ అధినేత, సీఎం జగన్ అమరావతిలోని ఆర్ – 5 జోన్లో పేదలకు పట్టాలు పంచారు. దాదాపు 1,486 ఎకరాల్లో నిర్మించిన 25 లే అవుట్లలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని లబ్ధిదారులైన పేదలకు సీఎం జగన్ స్వయంగా పట్టాలు అందించారు. అయితే..దీనిపై కోర్టు గతంలోనే ఆంక్షలు విధించింది. అమరావతి రాజధాని విషయంలో కోర్టులు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఈ పట్టాలు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates