మీ అభిమానులతో బండబూతులు తిట్టిస్తూ.. నాపైమెసేజ్లు పెట్టిస్తున్నారు.. అలా చేయడం వలన మీరు పెద్ద హీరో అనుకుంటున్నారేమో. ఆ మెసేజ్లకు భయపడి నేను లొంగిపోవడం ఈ జన్మకు జరగదు. పవన్ సినిమాలో హీరో తప్ప.. రాజకీయాలలో హీరో కాదన్నది గ్రహించాలి. నన్ను మీరు గాని, మీ అభిమానులు గాని తిట్టవలసిన అవసరం ఏమొచ్చింది?అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరో లేఖ …
Read More »షర్మిలకు రాజ్యసభ, ఏపీ బాధ్యతలు.. డీకే శివకుమార్ డీల్
ఇతర పార్టీలలో విలీనం చేయడానికి తాను పార్టీ పెట్టలేదని వైఎస్ షర్మిల చెప్తున్నప్పటికీ జరుగుతున్న రాజకీయం మాత్రం వేరేగా కనిపిస్తోంది. షర్మిల, కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ డీల్ కుదిర్చినట్లుగా రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. దాని ప్రకారం ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే కర్ణాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపిస్తారని.. అలాగే ఏపీలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగానూ నియమిస్తారని ప్రచారం …
Read More »చంద్రబాబు మాటలతో జగన్ కు కేసీఆర్ కౌంటర్?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేశారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో అమరావతితో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో కూడా భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, ఎకరం భూమి ధర భారీ రేటు పలికేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన మరు నిమిషం నుంచే ఏపీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని, …
Read More »ఎన్నికల ముందు జగన్ మాస్టర్ ప్లాన్
ఏపీలో కేబినెట్ విస్తరించనున్నారా? ముహూర్తంకూడా రెడీ అయిందా? అంటే.. ఔననే సంకేతాలు వస్తు న్నాయి. తాడేపల్లి వర్గాల నుంచి దీనికి సంబంధించిన ఆసక్తికర సమాచారం వస్తుండడం గమనార్హం. ప్రస్తుతం ఇద్దరి నుంచి ముగ్గరు మంత్రులకు సీఎం జగన్ ఉద్వాసన పలకనున్నారని కూడా తాడేపల్లి వర్గాల నుంచి వినిపిస్తోంది. వీరిలో ఒకరు మహిళా మంత్రి కూడా ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న.. మరో మంత్రి కూడా ఉన్నారని …
Read More »మార్గదర్శి ఖాతాదారులను రేప్ బాధితులతో పోలికా?
మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయంటూ రామోజీరావుతో పాటు ఆయన కోడలు శైలజ కిరణ్ ల పై ఏపీ సిఐడి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే రామోజీరావుతో పాటు శైలజా కిరణ్ ను కూడా సిఐడి అధికారులు హైదరాబాద్ లో విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామోజీరావు, శైలజ కిరణ్ లకు సీఐడీ అది అధికారులు సెక్షన్ 41ఏ కింద తాజాగా నోటీసులిచ్చారు. …
Read More »ఎమ్మెల్యే వస్తున్నారు.. జనాల్ని నవ్వుతూ ఉండమని చెప్పండి..!!
ఒకప్పుడు రాజు గారు వస్తున్నారు.. జనాలు జాగ్రత్తగా ఉండండి.. ముందు ఊళ్లలో టముకు వేసి మరీ చెప్పి నట్టుగా.. వైసీపీ పాలనలోనూ.. ఏపీలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. పైకి జాగ్రత్త అనే మాట బదులు నవ్వుతూ ఉండాలి అనే పదం చేర్చినా.. అంతర్గతంగా మాత్రం.. ప్రజలు ఎవరూ.. ఎమ్మెల్యేను ప్రశ్నించవద్దు.. వారి సమస్యలు ఏకరువు పెట్టొద్దు.. అంతేకాదు. ఎవరూ.. ఎమ్మెల్యేను ఎవరూ నిలదీయడానికి వీల్లేదు.. అనే అర్థంలో వైసీపీ …
Read More »దీనికి సమాధానం ఉందా.. సోము సర్?!
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గతంలో 50 రూపాయలకే చీప్ లిక్కర్ అమ్ముతామని ప్రకటించి ఇబ్బందుల్లో పడ్డారు. తర్వాత.. అమరావతిని తామే పూర్తి చేస్తామన్నా రు. ఇది రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను తెచ్చి పెట్టింది. ఇక, ఇప్పుడు తాజాగా.. సీఎం జగన్ను టీడీపీ, జన సేనలు విమర్శిస్తే.. ఆయన రియాక్ట్ కావడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పరిస్థితి ఏకంగా.. రాజకీయ …
Read More »పదవులన్నీ.. రెడ్లకేనా?.. ఇది ఉప్మా ప్రభుత్వం!
వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని వైసీపీ సర్కారుపై పంచ్లపై పంచ్ లు విసురుతున్నారు. కొబ్బరికి తెల్లదోమ సోకినట్లు.. రాష్ట్రానికి వైసీపీ వైరస్ సోకిందని అన్నారు. వైసీపీ వందమంది కష్టాన్ని 30 మందికి పంచి ఓటు బ్యాంకు చేసుకుంటోందని ఆరోపించారు. మనం అనైక్యంగా ఉంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని పేర్కొన్నారు. ఐక్యతతో ఉందాం.. ఏపీని అభివృద్ధి చేసుకుందాం అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి …
Read More »ఉద్యోగులపై మోడీ పెన్షన్ అస్త్రం?
పెన్షన్ విధానమన్నది ఉద్యోగుల విషయంలో పెద్ద వివాదమైపోతోంది. యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటివరకు ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్)ను 2004లో రద్దుచేసింది. దానిస్ధానంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానాన్ని తీసుకొచ్చింది. అయితే సీపీఎస్ పద్దతిని చాలారాష్ట్రాల్లో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెన్షన్ విధానంపై జాతీయస్ధాయిలో ఒకే విధానం అమలు కావటంలేదు. ఓపీఎస్ రద్దు చేయటం, సీపీఎస్ ను తీసుకురావటం వరకే కేంద్రం నిర్ణయించింది. దేన్ని అమలుచేస్తారనే విషయాన్ని రాష్ట్రాలకే …
Read More »జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు
తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని వైసీపీ చెప్పినట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ చెప్పింది. విశాఖపట్నంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో వైసీపీకి జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనను తప్పుపడుతు పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు. సజ్జల చేసిన ప్రకటన ఆధారంగా వైసీపీ గుర్తుంపు రద్దుచేయాలని ఎంపీ నానా రచ్చ చేశారు. ప్రకటన …
Read More »ఉరుము లేని పిడుగులా.. ‘జగనన్న సురక్ష’ అసలేంటిది?!
ఎలాంటి హడావుడీ లేకుండా.. ఎక్కడా ప్రచారం కూడా చేసుకోకుండానే తాజాగా ఏపీ సీఎం జగన్.. జగనన్న సురక్ష పథకాన్ని ప్రకటించారు. అదికూడా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలోనే ఆయన దీనిని ప్రకటించి.. వారిని కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో ఒక్కసారిగా జగనన్న సురక్ష అంటే ఏంటనే చర్చ ప్రారంభమైంది. మరి ఇదేంటో తెలుసుకుందాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. లబ్ధిదారులకు నిధులు అందిస్తోంది. అయితే.. …
Read More »జగన్ వల్ల 30 కోట్లు నష్టపోయా.. పవన్
ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కారణంగా తాను ఏకంగా 30 కోట్ల రూపాయలు నష్టపోయినట్టు ఆయన వెల్లడించారు. ఇది ఎవరిస్తారని.. ఆయన ప్రశ్నించారు. తన సినిమాలు విడుదలైనప్పుడు టికెట్స్ రేట్స్ తగ్గించడం, థియేటర్ల వద్ద ప్రభుత్వ అధికారులతో పహారా చేయించడం వంటి పనులను జగన్ రెడ్డి చేయించినట్లుగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఇలాంటి పనుల వల్ల.. తన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates