తాజాగా కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో కొందరు ఎంఎల్ఏలు అవినీతికి పాల్పడినట్లు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నారు. అలాంటి ఎంఎల్ఏల పేర్లు బయటకు చెప్పడం భావ్యం కాకపోయినా వాళ్ళెవరో అందరికీ తెలుసన్నారు. దళితులు, బీసీల అభివృద్ధకి అమలుచేస్తున్న పథకాల్లో కూడా అవినీతికి పాల్పడతారా ? అంటు ఫుల్లుగా క్లాసుపీకారు. అవినీతికి పాల్పడ్డ ఎంఎల్ఏలంతా రాబంధుల్లాగ పీక్కుతున్నట్లని …
Read More »‘గన్నవరం’లో రజినీకాంత్ కు స్వాగతం పలికిన బాలకృష్ణ
ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభలో పాల్గొనేందుకు ఆయన రాగా, ఎన్టీఆర్ కుమారుడు, హీరో నందమూరి బాలకృష్ణ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం విజయవాడలోని పోరంకి అనుమోలు గార్డెన్స్లో ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ సభ జరగనుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ సభలో రజినీకాంత్ పాల్గొంటున్నారు. కాగా నందమూరి …
Read More »చంద్రబాబుపై తిట్లు పనిచేయడం లేదా?
రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు కామనే. ఏ పార్టీ అయినా.. ప్రజల మనసు దోచుకునేందుకు.. తమ పార్టీ పుంజుకునేం దుకు ప్రత్యర్థి పార్టీపైనా.. నేతలపై విమర్శలు చేయడం సహజమే. దీంతో గత నాలుగేళ్లుగా.. అధికార పార్టీ నేతలు..చంద్రబాబు, టీడీపీ నేతలను విమర్శించడంతోపాటు.. అనేక రకాల మాటలతో ప్రజల్లోకి వెళ్లారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ కూడా.. ఇదే పంథాలో ముందుకు సాగారు. సీఎంగా ఆయన ఏసభలో పాల్గొన్నా.. కూడా.. చంద్రబాబు ను …
Read More »విజన్కు పట్టం.. చంద్రబాబు నమ్మకం ఇదే!
రాజకీయాల్లో మార్పులు సహజం. అయితే.. ఇప్పటి వరకు ఎక్కడా కనివినీ ఎరుగని విధంగా వైసీపీలో ముసలం పుడితే. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మాత్రం వికసిత రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇంకే ముంది.. మాకు తిరుగులేదు.. వైనాట్ 175 అని చెప్పిన వైసీపీ అధినేత, సీఎం జగన్.. ఇప్పుడు ఆత్మ రక్షణలో పడిపోయారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన విధానాలను తూర్పారబడుతున్నారు. కనీసం ఎమ్మెల్యేలకు ఎలాంటి విలువా లేకుండా చేయడంపై …
Read More »తమ్ముళ్లూ.. జాగ్రత్త..: చంద్రబాబు మెసేజ్ ఇదే!!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో జోష్ పెరిగింది. 2019 ఎన్నికల తర్వాత.. ఇంకేముంది.. పార్టీ పరిస్థితి అయిపోయిందని అందరూ అనుకున్నారు. అలాంటి పార్టీ ఇప్పుడు దూసుకుపోతోంది. దీంతో ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చి చేరేందుకు క్యు కట్టారంటే ఆశ్చర్యం అనిపించక మానదు. ప్రస్తుతం చంద్రబాబు కు అనేక వర్గాల నుంచి సిఫారసులు సైతం పోటెత్తుతున్నాయని సమాచారం. ఇటీవల జరిగిన.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. అదేసమయంలో …
Read More »ఎమ్మెల్యేల అవినీతిపై కేసీఆర్ ఫైర్
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. చాలా మంది ఎమ్మెల్యేలు అవినీతి బాట పట్టారని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు.. ఇలా చేయడం సరైన చర్యకాదన్నారు. ముఖ్యంగా దళితులకు ఉద్దేశించిన కీలకమైన పథకం.. దళిత బంధును ఆసరా చేసుకుని సొమ్ములు బొక్కేయడం సరికాదన్నారు. కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, వాళ్లెవరో కూడా తన దగ్గర చిట్టా ఉందని చెప్పుకొచ్చారు. ఇదే చివరి వార్నింగ్.. మళ్లీ రిపీట్ …
Read More »చంద్రబాబు చెప్పినా పర్సు తీయరు.. ఖర్చు చేయరు..
జగన్ పాలనకు ముగింపు పలికి ఎలాగైనా అధికారంలోకి వస్తామని టీడీపీ రోజురోజుకీ తన నమ్మకం పెంచుకుంటున్నా కొన్ని నియోజకవర్గాలలో నాయకులు మాత్రం వెనుకడుగు వేస్తున్నారట. దానికి కారణం వారు తమకు టికెట్ వస్తుందని నమ్మకపోవడమేనట.. ముఖ్యంగా జనసేన, టీడీపీ పొత్తు ఉంటే తమ సీటు జనసేనకు ఇస్తారన్న అనుమానాలున్న నియోజకవర్గాలలోని టీడీపీ నేతలు యాక్టివ్గా తిరగడం లేదని చెప్తున్నారు. టికెట్ వస్తుందో రాదోనని.. జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో ఇన్చార్జులు డైలమాలో …
Read More »ఏం చేస్తాం.. తిరుమలపై హెలికాప్టర్లు తిరిగాయి: వైవీ సంచలన వ్యాఖ్యలు
రెండు రోజుల కిందట తిరుమల ఆనంద నిలయంపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టిన విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు హెలికాప్టర్లు ఆనంద నిలయం మీదుగా వెళ్లాయి. అయితే.. ఆగమ శాస్త్రం ప్రకారం ఇలా ఆనంద నిలయం మీదుగా వెళ్లరాదని ఎప్పటి నుంచో టీటీడీ పండితులు చెబుతు న్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా.. కేంద్రానికి అనేక సందర్భాల్లో లేఖలు రాసింది. అయినా కూడా తరచుగా ఆనంద నిలయం మీదుగా …
Read More »సునీతమ్మ మౌనం వెనుక ఏముంది? : అవినాష్రెడ్డి
వివేకా హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా వరుస సెల్ఫీ వీడియోలు విడుదల చేశారు. అన్నీ నిజాలే చెబుతున్నానంటూ.. ప్రకటించిన ఆయన.. వివేకా కుమార్తె సునీత, ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు 7(2019) వరకు.. ఈ కేసులో దస్తగిరిని సీబీఐ అరెస్టు చేయలేదని.. ఆ తర్వాత కూడా.. అతనికి సహకరించేలా వ్యవ హరించిందని అవినాష్రెడ్డి చెప్పారు. …
Read More »జేడీఎస్ నుంచి ఫోన్.. నేడో రేపో.. రంగంలోకి కేసీఆర్!
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రచారం చేసేందుకు.. ముందుకు వస్తానని.. గతంలోనే ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రచారం పీక్ స్టేజ్కు చేరుకున్నా.. ఇప్పటి వరకు మౌనంగా నే ఉన్నారు. పైగా ఆయన దృష్టంగా మహారాష్ట్రపై ఉంది. ఇదే కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. కర్ణాటకకు చెందిన ప్రాంతీయ పార్టీ జేడీఎస్ చీఫ్ కుమారస్వామి.. కేసీఆర్ అనుంగు మిత్రుడుగా మారారు. కేసీఆర్ ఎప్పుడు పిలిచినా వచ్చి.. బీఆర్ఎస్ …
Read More »‘ఈసారి మీరు ముఖ్యమంత్రి కాకుంటే మేం అడుక్కోవాల్సిందే’
ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు తాను వెళుతున్న దారిలో తన కారును ఆపిన సందర్భంగా ఆయనకు అనుకోని రీతిలో ఎదురైన మద్దతు ఆసక్తికరంగా మారింది. పల్నాడు జిల్లా అమరావతి నుంచి సత్తెనపల్లి వెళుతున్న చంద్రబాబు ధరణి కోట – లింగాపురం మధ్య పొలాల్లో పని చేసుకుంటున్న రైతు కూలీల్ని చూసిన ఆయన తన వాహనాల్ని రోడ్డు పక్కన ఆపారు. రోడ్డు …
Read More »శైలజ టీడీపీలో చేరబోతున్నారా ?
పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా ? కాంగ్రెస్ కు రాజీనామా చేసి తొందరలోనే తెలుగుదేశంపార్టీలో చేరబోతున్నారా ? పార్టీ సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి బుధవారం సాకే ఇంటికి వెళ్ళారు. వీళ్ళభేటీలో సాకేను టీడీపీలో చేరమని జేసీ ఆహ్వానించినట్లు సమాచారం. శింగనమల నియోజకవర్గంలో పార్టీ బలమైన అభ్యర్ధికోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే పీసీసీ అధ్యక్షుడిగాను అంతకుముందు మంత్రిగా కూడా పనిచేసిన శైలజానాధ్ ను టీడీపీలోకి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates