టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ దేశంలోనే నెంబర్ 1గా ఉందని అన్నారు. ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమే. అయితే.. ఏ విషయంలో అంటే.. గంజాయి పంట, రవాణాల విషయంలో ఏపీ ముందుందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదే వైసీపీ పాలనలో గొప్ప విషయమని ఆయన ఎద్దేవా చేశారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ …
Read More »మోడీ సర్కారుపై ఇండియా అవిశ్వాసం!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు రెడీ అయింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో భేటీ అయిన.. విపక్షాలు.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అవిశ్వాస తీర్మానం కనుక లోక్సభలో ప్రవేశ పెడితే.. విపక్షాలకు పైచేయి లభించినట్టు అవుతుందని భావిస్తున్నారు. లోక్సభ నిబంధనలలోని రూల్ 198 ప్రకారం.. అవిశ్వాస తీర్మానంపై ఎన్నిరోజులైనా చర్చించవచ్చు. …
Read More »ఓ.. లోకేష్ రెడ్బుక్ సంగతి అదా!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. యువగళం పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ను చుట్టేస్తున్నారు. వర్షంలోనూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో ఆయన ప్రదర్శించిన ఓ ఎర్ర రంగు అట్టతో ఉన్న పుస్తకం చర్చనీయాంశంగా మారింది. ఆ రెడ్బుక్ ఏమిటీ? అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై ఎట్టకేలకు లోకేష్ సమాధానమిచ్చారు. ఆ రెడ్బుక్ గుట్టు ఏమిటో బయటపెట్టారు. ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న జగన్ మెప్పు పొందేందుకు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని …
Read More »బీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు
మరికొద్ది నెల్లల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ ఎస్కు గట్టి ఎదురు దెబ్బతగి లింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సంచలన తీర్పును తాజాగా వెలువరించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా హైకోర్టు నిర్ధారించింది. అదేసమయంలో సెకండ్ ప్లేస్లో నిలిచిన జలగం వెంకట్రావును …
Read More »మైనారిటీలకు కేసీయార్ ‘లక్ష’ తాయిలం ?
ఎన్నికలకు దగ్గరపడుతున్న నేపధ్యంలో కేసీయార్ కు ఎక్కడెక్కడి మైనారిటీలు, సామాజికవర్గాలు గుర్తుకొచ్చేస్తున్నాయి. ఒకసారి ఉద్యోగులంటారు. మరోసారి నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ అంటారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనులకు ఆర్ధిక సాయమంటారు. ఏదిచేసినా రాబోయే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడం కోసమే అన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా మైనారిటిలకు నూరుశాతం సబ్సిడితో లక్షరూపాయల రుణాలను ఇవ్వటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మైనారిటీలంటే ముస్లింలు, క్రిస్తియన్లు మాత్రమే …
Read More »ఈ నియోజకవర్గాలు ఇంతే.. మారడం కష్టమే!
ఏపీలో అధికార పార్టీ మరోసారి విజయం దక్కించుకుంటుందా? లేదా.. అనే విషయం కన్నా ముందు క్షేత్ర స్థాయిలో మాత్రం రాజకీయం వేడెక్కింది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఇబ్బందిగానే మారింది. స్థానిక నేతల ఆధిపత్యాలు.. గత ఎన్నికల సమయంలో చేసిన ప్రయోగాలు వంటివి.. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారి ఆందోళనలు వెరసి.. వైసీపీ పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో ఇబ్బందుల్లోనే ఉందని అంటున్నారు పరిశీలకులు. నందికొట్కూరు, హిందూపురం, ప్రత్తిపాడు, రామచంద్రపురం, రాజమండ్రి …
Read More »పొలిటికల్ పెట్టుబడులు.. ఇచ్చేదెవరు!
ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఎన్నికలు అనగానే.. పెట్టుబడులు కావాల్సిందే. ఓటు-నోటుకు మధ్య విడదీ యలేని బంధాన్ని పెంచేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికలు మరీ కాస్ట్లీగా మారిపోతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. పార్టీలు,నాయకులు పైకి ఎన్ని మాటలు చెప్పినా.. అన్నింటి దారీ ఇదే నని అంచనా వేస్తున్నారు. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వరకు అనేక చర్యలు తీసుకున్నా.. ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. కర్ణాటకలో జరిగిన …
Read More »పవన్, చంద్రబాబులది రాజకీయ ఆత్మహత్య
ఏపీలో బీజేపీ, జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీతో బీజేపీకి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను తాను సెట్ చేస్తానని, మూడు పార్టీలు కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ, టీడీపీల మధ్య పవన్ రాయబారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై …
Read More »జగన్ కు పవన్ ‘పుష్ప విలాపం’
ఏపీలో సీఎం జగన్ పర్యటన అంటే చాలు…ఇటు అధికారులు..అటు పోలీసులు…మరోవైపు సామాన్య ప్రజలు, దుకాణదారులు హడలెత్తుతున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ టూర్ అంటే చాలు…ఆయన వెళ్లే దారిలో చెట్లు నరికివేయడం…పరదాలు కట్టడం…దుకాణాలు మూయడం వంటివి పరిపాటిగా మారాయి. ఇక, జనం మధ్యలో తిరిగే సమయంలో కూడా జగన్ పరదాల మధ్యనే పర్యటిస్తాని విపక్ష నేతలు విమర్శిస్తుంటాయి. ఈ క్రమంలోనే జగన్ కు పరదాల మహారాణి …
Read More »గరం గరంగా గన్నవరం వైసీపీ
ఏపీ రాజకీయాలలో గన్నవరం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో వైసీపీపై ఒంటికాలి మీద లేచిన వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి…ఆ తర్వాత వైసీపీకి మద్దతిచ్చారు. అయితే, 2019లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన యార్లగడ్డ వెంకట్రావు…వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు. వంశీ వైసీపీకి మద్దతిచ్చేనాటికి గన్నవరంలో వైసీపీ కీలకనేతగా ఆయన కొనసాగుతున్నారు. అయితే, వంశీ రాకతో గన్నవరం వైసీపీలో రాజకీయాలు గరంగరంగా మారాయి. ఆల్రెడీ …
Read More »రఘురామ, పవన్ లపై జోగి షాకింగ్ కామెంట్లు
వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంతకాలంగా చేస్తున్న విమర్శలు ఏపీ రాజకీయాలలో కాక రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతిలోని వెంకటపాలెంలో జరిగిన ఆర్5 జోన్ ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభలో పవన్ పై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు భార్యలను …
Read More »వివేకా కేసులో రహస్య సాక్షి ఎవరంటే.. సీబీఐ వెల్లడి
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి.. తమ వద్ద రహస్య సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఉందని.,. అదే కేసును కీలక మలుపు తిప్పిందని గతంలో సీబీఐ తెలిపిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో రహస్య సాక్షి ఎవరు? అంటూ.. అనే కథనాలు తెరమీదికి వచ్చాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల అని.. కాదుకాదు.. ఆయన బంధువులని ఇలా అనేక కథనాలు తెరమీదికి వచ్చాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates