ఏపీలో వాలంటీర్ల పై, వాలంటీర్ల వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రజల సున్నితమైన డేటాను వాలంటీర్లు సేకరించి ప్రైవేటు వ్యక్తులకు చేరవేస్తున్నారని, ఏపీలో వాలంటీర్లు సేకరించిన డేటా హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో ఉందని పవన్ ఆరోపించడం కలకలం రేపింది. ఆ డేటానుపయోగించి హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. …
Read More »జగన్..రా చూసుకుందాం: పవన్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వాడీవేడిగా సాగిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరైన పవన్ బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యి ఏపీ రాజకీయాలపై చర్చలు జరిపారు. ఈ రోజు మధ్యాహ్నం ఏపీకి తిరిగి వచ్చిన పవన్…తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై వ్యాఖ్యల నేపథ్యంలో తనను ప్రాసిక్యూట్ చేయాలని జగన్ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, తాను దేనికైనా రెడీ …
Read More »జగన్ పై చెక్ బౌన్స్ కేసు?
అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని చెప్పిన జగన్…సీఎం అయిన తర్వాత మాట మార్చారు. ప్రతి తల్లికి అమ్మఒడి కాస్తా..ప్రతి పిల్లవాడికి అమ్మఒడి అంటూ జగన్ మాట తప్పి మడమ తిప్పారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇక, ఆ పథకం నిధులైనా సరిగ్గా ఇస్తున్నారా అంటే ..అదీ లేదు. అమ్మఒడి పథకం …
Read More »జంపిగుల జాబితా పెరుగుతోంది.. జాగ్రత్త పడండి కేసీఆర్ సర్!
కీలకమైన ఎన్నికల సమయం దూసుకు వస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా కార్యాచరణ ప్రారంభించింది. మరో మూడు మాసాల్లో ఎన్నికల ముఖచిత్రంపై స్పష్టత వచ్చేస్తోంది. మరి ఇలాంటి సమయంలో ఏ పార్టీలో అయిన చేరికలే ఉండాలి. ముఖ్యంగా మూడో సారి కూడా తెలంగాణ కోటలో కారును పదిలంగా పరుగులు పెట్టించాలని, రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు అప్రకటిత సెగ తగులుతోంది. పైకి …
Read More »కిషన్ రెడ్డి అరెస్టు… హై టెన్షన్
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాటసింగారంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. అయితే, ఆ వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ పరిశీలనకు వెళ్లకుండా బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ తదితరరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. …
Read More »తన జాతకం తానే రాసుకుంటున్న కేతిరెడ్డి
నిత్యం అక్కడ రాజకీయం రగులుతూనే ఉంది. నువ్వురెండంటే.. నేను నాలుగంటా.. అంటూ.. అధికార, విపక్ష నాయకులు ఢీ అంటే ఢీ అన్నట్టుగా రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. రోడ్డున పడుతున్నారు. నువ్వా-నేనా సై! అంటూ.. కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆ నియోజకవర్గమే.,. ఉమ్మడి అనంతపురంలోని తాడిపత్రి. అప్రతిహత విజయంతో 35 సంవత్సరాల పాటు జేసీ కుటుంబం ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కింది. అలాంటి నియోజకవర్గంలో తొలిసారి వైసీపీ విజయం దక్కించుకుంది. కేతిరెడ్డి …
Read More »కేసీయార్ నో చెప్పేశారా ?
రాబోయే ఎన్నికల్లో కొంతమంది ప్రజా ప్రతినిధులు పోటీ చేయడానికి కేసీయార్ నో చెప్పేశారట. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని కొంతమంది ఎంఎల్సీలు రెడీ అయిపోయారు. తమ నియోజకవర్గాల్లో తమకు గెలిచే అవకాశాలున్నాయి కాబట్టి టికెట్లు ఇవ్వాలని కొందరు కోరితే మరికొందరు బాగా ఒత్తిడి పెట్టారట. అయితే ఎంఎల్సీల్లో ఎవరికీ టికెట్లు ఇచ్చేది లేదని కేసీయార్ కచ్చితంగా చెప్పేశారని పార్టీ వర్గాల టాక్. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్లిచ్చినా వాళ్ళ …
Read More »పురందేశ్వరి సినిమా యుద్ధం చేస్తున్నారా ?
బీజేపీకి కొత్త అధ్యక్షురాలైన దగ్గుబాటి పురందేశ్వరి సినిమా యుద్ధం మొదలుపెట్టారు. సినిమాల్లో ఫైటింగ్ సీన్లు ఎలా తీస్తారో అందరికీ తెలిసిందే. అక్కడ కొట్టేవాడు కొట్టినట్లు నటిస్తాడు. దెబ్బలు తినేవాడు తిన్నట్లు నటిస్తాడు. కొట్టేవాడు నిజంగా కొట్టడు. తినేవాడు నిజంగా తినడు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పురందేశ్వరి యుద్ధం కూడా అచ్చం సినిమా యుద్ధం లాంటిదే. మీడియాతో పురందేశ్వరి మాట్లాడుతు జగన్ ప్రభుత్వం పై చాలా ఆరోపణలు, విమర్శలు చేశారు. …
Read More »ఈరోజు పార్లమెంటు- ఈసారి అన్నీ హాట్ టాపిక్సే
గురువారం నుండి మొదవ్వబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మంటలు తప్పేట్లు లేదు. ఒకవైపు ఎన్డీయే మరోవైపు కొత్తగా ఏర్పాటైన ఇండియా కూటమి మధ్య మంటలు పెట్టబోతోంది. ఈ సమరానికి పార్లమెంటు వేదిక కాబోతోంది. కొత్తగా ఏర్పాటైన కూటమి ఇండియా తమ సత్తాను చాటాలని పార్లమెంటు సమావేశాలను ఉపయోగించుకోబోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ సమావేశాల్లోనే కేంద్రప్రభుత్వం రెండు వివాదాస్పదమైన బిల్లులను ప్రవేశపెడుతోంది. అవేమిటంటే మొదటిది కామన్ సివిల్ కోడ్ బిల్లు. …
Read More »మచిలీపట్నం పాలిటిక్స్ మారుతున్నాయ్.. పేర్నికి కష్టాలేనా?
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మచిలీపట్నం. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పేర్ని నాని గెలుపు గుర్రం ఎక్కారు. తర్వాత ఆయన సీఎం జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే.. గత ఏడాది రెండో సారి మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు.. పేర్నిని తప్పించారు. ఇక, ఇప్పుడు పేర్ని కూడా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)కి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు.. ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయి. …
Read More »టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు.. త్వరలో ముహూర్తం!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి కంచుకోటగా పేర్కొనే జిల్లా కడప. అయితే.. ఈ జిల్లాలో బలపడాలని ప్రతిపక్షం టీడీపీ ఎప్పటి నుంచో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో నాయకులను కూడా కదిలిస్తోంది. దీంతో టీడీపీని బలపరి చేందుకు కడప నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు వైసీపీలో నెలకొన్న వివాదాలు, విభేదాల కారణంగా కొందరు నాయకులు బయటకు వస్తున్నారు.ఈ పరంపరలో నిన్న మొన్నటి వరకు వైసీపీకి జైకొట్టిన …
Read More »ఏపీ ప్రజలు మార్పు కోరుతున్నారు.. అమిత్ షాకు పవన్ వెల్లడి
ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా బుధవారం రాత్రి పొద్దు పోయాక కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంట సేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను పవన్ కళ్యాణ్.. అమిత్ షా కు పూసగుచ్చినట్టు వివరించారని తెలిసింది. ముఖ్యంగా ఇటీవల తాను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates