శుక్రవారం ఉదయం చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో సుమారు 30 మంది టీడీపీ నేతలు, కార్యకర్తల పై కేసు నమోదు చేయగా..ఎవరినీ అదుపులోనికి మాత్రం తీసుకోలేదు. వారి పై ఐపీసీ 147,332, 353, 128 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వివరించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో …
Read More »ఆర్టీసీ బిల్లు వెనుక.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది. అయితే ఈ బిల్లు వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం దాగి ఉందని తెలుస్తోంది. ఏ రకంగా చూసినా ఈ బిల్లుతో కేసీఆర్కే ప్రయోజనమే కలిగే అవకాశాలు ఉన్నాయి. మూడో సారి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్న కేసీఆర్.. ఆర్టీసీ బిల్లుతో మాస్టర్ ప్లానే వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు 40 వేలకు పైగా ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల ఓట్లు …
Read More »సంచలన వ్యూహాలు సిద్దం చేసుకున్న పవన్
రాబోయే ఎన్నికల్లో దుష్టపాలకుడు (ఇది పవన్ మాట) జగన్మోహన్ రెడ్డి మీద సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. పార్టీ నేతలతో జరిగిన విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడుతూ జగన్ను గద్దె దింపాలంటే అందరు సమిష్టిగా పోరాటం చేయటం ఒకటే మార్గమన్నారు. రాష్ట్రాన్ని జగన్ పాలన నుండి కాపాడుకోవాలంటే అందరు సమిష్టిగా పోరాటం చేయటం ఒకటే మార్గమన్న విషయాన్ని గమనించాలన్నారు. ఒకవేళ పోరాటంలో విఫలమైతే మళ్ళీ …
Read More »సీమ టార్గెట్ వెనుక టీడీపీ వ్యూహం పసిగట్టారా..?
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు నిర్ణీత లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో లక్ష్యాల స్థాయి మారుతున్న విషయం కొంత నిశితంగా గమనిస్తే తప్ప అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. నిన్నమొన్నటి వరకు ప్రజలను మచ్చిక చేసుకుని.. చంద్రబాబు విజన్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా విజయం దక్కించు కోవాలని భావించింది. అయితే.. అనూహ్య కారణాలు.. పార్టీ పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా …
Read More »రుణమాఫీ ఫీవర్ పెరిగిపోతోందా ?
కేసీయార్ లో రైతు రుణమాఫీ ఫీవర్ పెరిగిపోతోంది. రైతులకు చేయాల్సిన సుమారు రు. 20 వేల కోట్ల రుణ మాఫీ చేయాలని కేసీఆర్ డిసైడ్ చేశారు. ఆ మేరకు నెలాఖరులోగా మొత్తం రుణమాఫీ జరిగిపోవాలని డెడ్ లైన్ కూడా ప్రకటించేశారు. కేసీయార్ది ఏముంది ఎంతైనా ప్రకటించేస్తారు, ఎలాగైనా ప్రకటిస్తారు. కానీ ప్రకటనలకు తగ్గట్లుగా, ఆదేశాలకు అనుగుణంగా ఖజానాలో నిధులుండాలి కదా. 2018 లో రైతు రుణమాఫీ ప్రకటించినపుడూ ఖజానాలో నిధులు …
Read More »నాగబాబు బాగా చెప్పారు.. అసలు సమస్య ఏంటంటే..!
పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి నాగబాబు.. రెండు కీలక విషయాలు చెప్పారు. ఈ రెండు కూడా ఆయన చెప్పినట్టు వాస్తవే. ఇందులో కల్పితం కానీ.. మెరమెచ్చు కానీ ఏమీ లేదు. 1) ఏ పార్టీకి లేనంత యువశక్తి జనసేనకు ఉంది. 2) అవినీతి రహిత వ్యక్తి కాబట్టి పవన్కు ఓటేయాలి. తాజాగా నాగబాబు ఈ రెండు విషయాలను కూడా బలంగా ప్రస్తావించారు. అంతేకాదు.. రాబోయే …
Read More »గవర్నర్ తీరుకు నిరసనగా తెలంగాణ ఆర్టీసీ బంద్
తెలంగాణ ప్రగతి రథం.. ఆర్టీసీ బస్సు సర్వీలు నిలిచిపోయాయి. ఈ రోజు ఉదయం 4 గంటలకే ప్రారంభం కావాల్సిన ఎంజీబీఎస్ లోని సిటీ సర్వీసులు సహా.. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డ్రైవర్లు, కండెక్టర్లు కూడా యూనిఫాం వేసుకుని.. బస్సుల్లో కూర్చున్నారే తప్ప వారు బస్సులను మాత్రం నడిపించలేదు. దీనికి కారణం.. ఉరుములు లేని పిడుగులా.. కార్మికులు ఉద్యమానికి పిలుపునివ్వడమే. తెలంగాణ …
Read More »పవన్ పీఆర్వోలు.. పేర్ని, వెల్లంపల్లి, అంబటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను నటించే సినిమాలను ఎంతమాత్రం ప్రమోట్ చేయడని అందరికీ తెలుసు. సినిమా మొదలైన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. అప్డేట్స్ ఇవ్వడం.. ప్రెస్ మీట్లు పెట్టడం.. మీడియా వాళ్లకు వన్ టు వన్ ఇంటర్వ్యూలు ఇవ్వడం.. రిలీజ్కు ముందు తర్వాత ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనడం.. ఇలాంటివి పవన్ నుంచి ఆశించలేం. మహా అయితే ప్రి రిలీజ్ ఈవెంట్ ఒకదానికి వస్తాడు. అందులోనూ ఆ …
Read More »బాబు, లోకేష్ల భద్రత ఎలా ఉంది? ..ప్రభుత్వానికి కేంద్రం లేఖ
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అగ్రనేతలు.. చంద్రబాబు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ల భద్రత విషయంపై కేంద్ర హోం శాఖ తాజాగా వైసీపీ ప్రబుత్వాన్ని వివరణ కోరింది. వారికి ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? వారి పర్యటనల్లో దాడులు ఎందుకు జరుగుతున్నాయి? వంటి విషయాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ.. తాజాగా డీజీపీకి లేఖ రాసింది. చంద్రబాబు, నారా లోకేష్ల భద్రత విషయంలో తీసుకున్న చర్యలను తమకు మినిట్స్ …
Read More »వైసీపీకి వైఎస్ఆర్ ముద్దు..విజయమ్మ వద్దు?
సీఎం వైఎస్ జగన్ సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయలేరంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. బాబాయి వివేకా హత్య కేసులో వైఎస్ సునీత న్యాయపోరాటం చేస్తుంటే…జగన్ మాత్రం అవినాష్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రం దగ్గర చేతులు కట్టుకు నిలుచుంటున్నారని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, సొంత చెల్లి షర్మిలను తెలంగాణకు పరిమితం చేసి, ఆమెతో పాటు తల్లి విజయమ్మను కూడా జగన్ పార్టీనుంచి సాగనంపారని ట్రోల్ …
Read More »బ్రో వివాదంపై పవన్ ఫస్ట్ రియాక్షన్
జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ నటించిన బ్రో మూవీపై కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్ తనదేనంటూ అంబటి రాంబాబు గొడవ చేయడం, దానికి నిర్మాత విశ్వ ప్రసాద్, సాయి ధరమ్ తేజ్, పృథ్వీ రాజ్ లు క్లారిటీనివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తొలిసారిగా ఆ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు. సినిమాను రాజకీయాల్లోకి తేవొద్దని జనసైనికులకు పవన్ …
Read More »వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ దాఖలకు సుప్రీం కోర్టు అనుమతినిచ్చింది. శుక్రవారం సుప్రీం కోర్టు లో పరిణామం జరిగింది. అయితే ట్రయిల్ కోర్టులో బెయిల్ దాఖలుకు ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏదైనా సందర్భంలో సెప్టెంబర్ వరకు కానీ విచారణ ప్రారంభం కాకపోతే బెయిల్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates