Political News

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఇలా జ‌రిగిందా?  వైసీపీలో క‌ల‌క‌లం!

క‌ర్ణాట‌కలో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఊహించ‌ని విధంగా విజ‌యం అందుకుంది. నిజాని కి కాంగ్రెస్ నాయ‌కులు కూడా ఈ త‌ర‌హా అంచ‌నాలు వేయ‌లేదు. మ‌హా వ‌స్తే.. 115-120 మ‌ధ్యే ఆగిపోయారు. అది కూడా ఒక‌రిద్ద‌రే. కానీ, 39 ఏళ్ల చ‌రిత్ర‌నుతిర‌గ‌రాసిన క‌న్న‌డ ఓట‌రు ఏకంగా.. 136 స్థానాల్లో హ‌స్తం పార్టీ కి ఓట్ల‌తో అభిషేకం చేశారు. ఫ‌లిత‌గా క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. …

Read More »

తెలంగాణలో ఆక‌ర్ష‌ రాజ‌కీయాలు వ‌ర్క‌వుట్ అయ్యేనా?!

మ‌రో ఆరు మాసాల్లో ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్న తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారే అవ‌కాశం క‌నిపిస్తోందా? కీల‌క నేత‌ల‌కు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం ప‌లుకుతోందా? అంటే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా వివిధ పార్టీల‌కు దూరంగా ఉన్న నాయ‌కులు.. అధికార పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న నాయ‌కులు ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న …

Read More »

రేవంత్ ఆహ్వానంపై ఈట‌ల ఫైర్ .. ఏమ‌న్నారంటే..!

కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ.. ఈట‌ల రాజేంద‌ర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ వంటివారి ని.. హ‌స్తం పార్టీ తెలంగాణ చీఫ్‌ రేవంత్‌రెడ్డి  ఆహ్వానించ‌డం సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేన‌ని.. బీజేపీ స‌మ ఉజ్జీ కాద‌ని.. సో.. పార్టీ మారి వ‌చ్చేయాల‌ని వారికి రేవంత్ పిలుపునిచ్చా రు. అంతేకాదు.. క్ష‌ణికావేశంలో నేబీజేపీలో చేరి ఉంటార‌ని.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. బీజేపీకి, మోడీకి ఉన్న ఇమేజ్ కూడా తేలిపోయింద‌ని …

Read More »

సీబీఐ జోరు.. అవినాశ్ రెడ్డి కంగారు

వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబిఐతో దొంగాపోలీస్ ఆట ఆడుతున్నారు. ఇప్పటికే ఆరు సార్లు విచారించిన సీబిఐ ఏడోసారి విచారణకు రావాలని సోమవారం ఆయనకు నోటీసులు జారీ చేయగా షార్ట్‌ నోటీసు అంటూ అప్పటికే ముందస్తు షెడ్యూలు ఉన్నందున రాలేనని లేఖ రాసిన అవినాష్‌ రెడ్డి మంగళవారం నాటి విచారణకు డుమ్మా కొట్టారు. తనకు నాలుగురోజులు గడువు కావాలని లేఖలో కోరిన మేరకు …

Read More »

సిద్ధరామయ్యేమీ సుద్దపూస కాదు

డీకే శివకుమార్‌పై ఉన్న సీబీఐ కేసులు, ఈడీ కేసులను బూచిగా చూపించి కర్ణాటక సీఎం కుర్చీ కొట్టేశారు సీనియర్ లీడర్ సిద్ధరామయ్య. ఎన్నికలలో ఎంత ఖర్చు పెట్టినా, ఇప్పుడు అధిష్ఠానం దగ్గర ఎంత మొరపెట్టినా కూడా శివకుమార్ మాట మాత్రం కాంగ్రెస్ కుటుంబ పెద్దలు వినలేదు. సిద్ధరామయ్యనే సీఎం చేశారు. అయితే… తెల్లని బట్టలు వేసుకునే సిద్ధరామయ్య ఏమైనా సుద్ధపూసా అనే ప్రశ్న డీకే వర్గం నుంచి, ఆయన్ను ఇష్టపడేవారి …

Read More »

రేవంత్ రెడ్డికీ డీకే శివకుమార్‌ అనుభవమే?

ఏమాటకామాట చెప్పుకోవాలి తెలంగాణలో సీనియర్లు ఎవరూ సహకరించకపోయినా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ కేసీఆర్‌తో నిత్యం తలపడుతున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ఎలా అయితే అక్కడి బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ బట్టలూడదీయడంలోనూ రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నారు. అంతేకాదు.. డీకే తరహాలోనే ఎంత డబ్బయినా ఖర్చు చేసి ఎన్నికలలో విజయం సాధించడానికి ముందుకెళ్తున్నారు. సీనియర్ల …

Read More »

కొడాలి నానిపై రెచ్చిపోయిన బీజేపీ ఇన్‌ఛార్జ్‌

kodali

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ పేరుకే వైరి ప‌క్షాలు అన్న‌ది చాలామంది అనే మాట‌. జ‌గ‌న్ స‌ర్కారుతో లోపాయ‌కారీ ఒప్పందాల‌తో బీజేపీ ప‌ని చేస్తోంద‌ని.. వీరి మ‌ధ్య‌ ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం ఉంద‌ని.. ఒక‌రినొక‌రు తీవ్రంగా విమ‌ర్శించుకోవ‌డం.. ఇబ్బంది క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌డం చేయ‌ర‌నే విమ‌ర్శ‌లు గ‌ట్టిగానే వినిపిస్తుంటాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ‌ధ‌ర్.. వైసీపీ నేత‌లు, అలాగే జ‌గ‌న్ స‌ర్కారు గురించి తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో చేసిన …

Read More »

కర్నాటక సీఎం రేసులో ఊహించని పేరు

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందనే సామెత కర్నాటక కాంగ్రెస్ కు సరిగ్గా సరిపోతుందేమో. మొన్నటి ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి ఐదురోజులు అయినా ఇంతవరకు సీఎం ఎవరో తేల్చుకోలేకపోతున్నారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఇద్దరికీ ప్లస్సులున్నాయి మైనస్సులున్నాయి. దాంతో ఎవరిని నియమించాలో అర్ధంకాక అధిష్టానం నానా అవస్తలు పడుతున్నది. సరిగ్గా ఈ నేపధ్యంలోనే కొత్తగా మరోపేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ …

Read More »

వ‌చ్చేది కురుక్షేత్రం.. గెలిచేది పాండ‌వులే

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికలను ఆయ‌న కురు క్షేత్ర సంగ్రామంగా అబివ‌ర్ణించారు. ఈ కురుక్షేత్రంలో కౌరవ వధ చేసి.. గెలిచేది పాండ‌వులేన‌ని అన్నారు. అంతేకాదు.. మళ్లీ గౌర వంగా అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పారు. నవంబరు, డిసెంబరుల్లో ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ చూస్తున్నారని, రేపు ఎన్నికలు పెట్టినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..’ …

Read More »

కేసీఆర్ చెప్పినా నమ్మడం లేదట…

పార్టీ ఆఫీసులో జరిగిన విస్తృతస్ధాయి సమావేశంలో కేసీయార్ మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో పార్టీకి 105 సీట్లు వస్తాయని ప్రకటించారు. 119 సీట్లలో 105 సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయనటం మామూలు విషయం కాదు. కేసీయార్ చెప్పిన లెక్క కరెక్టయితే బీఆర్ఎస్ కు దాదాపు 90 శాతం సీట్లు వస్తాయని అనుకోవాలి. మరి నిజంగానే అన్ని సీట్లు వస్తాయా ? క్షేత్రస్ధాయిలో బీఆర్ఎస్ కు అంత సీనుందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. …

Read More »

50 ఎకరాల్లో మహానాడు

తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా జరుపుకునే పసుపు పండుగ మహానాడు ఏర్పాట్లు జోరందుకుంటున్నాయి. ఈనెల 27,28 తేదీల్లో మహానాడును ఘనంగా రాజమండ్రిలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28వ తేదీన మహానాడును జరుపుకోవటం పార్టీకి ఆనవాయితీగా వస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు వివిధ కారణాల వల్ల మహానాడు నిర్వహణకు అంతరాయాలు కలిగినా మొత్తం మీద రాబోయే పండుగను మాత్రం బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నారు. రాజమండ్రికి సమీపంలోని …

Read More »

జ‌గ‌న్‌కు త‌ల్లి-చెల్లి అందుకే దూర‌మ‌య్యారు

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఏపీ సీఎం జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ అధినేత‌న‌ని గొప్ప‌గా చెప్పుకొనే జ‌గ‌న్‌కు ఇప్పుడు త‌న త‌ల్లి-చెల్లి ఎందుకు దూర‌మ‌య్యారో చెప్పే ధైర్యం ఉందా? అని ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ అరాచ‌కాలు చూసి.. విసిగిపోయి వారంతా ఎప్పుడో జ‌గ‌న్‌ను వ‌దిలేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆస్తి వివాదాల్లో ఏకంగా.. త‌ల్లిని, చెల్లిని కూడా జ‌గ‌న్ దూషించార‌ని.. వైసీపీ నాయ‌కులే త‌న‌తో …

Read More »