ఏపీ సీఎం జగన్పై టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సటైర్లు వేశారు. “జగన్ పాలనలో మ్యాటర్ వీక్… పబ్లిసిటీ పీక్” అంటూ సంచలన కామెంట్లు చేశారు. “తాడేపల్లి ప్యాలెస్కు అతుక్కుపోయే బల్లి” అని వ్యాఖ్యానించారు. చేసేది తక్కువ.. ప్రచారం చేసుకునేది ఎక్కువ అంటూ.. తనదైన శైలిలో నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గూడురు నియోజకవర్గంలో ఆయన మత్స్యకారులతో మాట్లాడారు. “ఫిష్ ఆంధ్రా అని …
Read More »నేను ముఖ్యమంత్రి కావడం పరిష్కారం కాదు.. : పవన్
“నేను ముఖ్యమంత్రి కావాలని మీకే కాదు..నాకు కూడా ఉంది. కానీ, నేను ముఖ్యమంత్రి అయినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు” అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం అయితే.. ఏదో ఒరిగిపోతుందని అనుకోవడం సరికాదన్నారు. అయితే.. తాము అధికారంలోకి వస్తే.. కొంత మేలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాపుల్లో తూర్పుకాపులు చాలా వెనుక …
Read More »ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ గ్రాఫ్ ఢమాల్…!
ఎస్సీ నియోజకవర్గాలు అంటే.. ప్రస్తుత అధికార పార్టీ వైసీపీకి కంచుకోటలు. 2014, 2019 ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ భారీ ఎత్తున మెజారిటీ దక్కించుకుంది. 2014లో కన్నా.. 2019లో ఒక్క కొండపి నియోజకవర్గం, రాజోలు(జనసేన) మినహా.. అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయం సాధించింది. ఇది ఒకరకంగా వైసీపీ సాధించిన రికార్డనే చెప్పాలి. అయితే.. అనూహ్యంగా.. ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు గ్రాఫ్ తగ్గుతోందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »వైసీపీలో డేంజర్ జోన్లో ఉన్న లీడర్లు వీళ్లే…
ఇటీవల ఏపీ సీఎం జగన్.. వైసీపీలో ప్రజలకు చేరువ కాని నేతలు అంటూ.. సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో వైసీపీ చేపట్టిన గడపగడపకు కార్యక్రమం ద్వారా నాయకులు ప్రజలకు చేరువ కావాలనేది వైసీపీ లక్ష్యం. దీంతో ప్రజలకు, నేతలకు మధ్య ఉన్నగ్యాప్ తగ్గుతుందని ఆయన అంచనా వేశారు, ఈ క్రమంలో నే గడపగడప కు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఆగస్టు 31 …
Read More »రూ.20కోట్లతో ఈటల హత్యకు కుట్ర..
తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర పన్నారని… సతీమణి జమున సంచలన ఆరోపణలు చేశారు. అనూహ్యంగా మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ ఉందంటూ ఈటల సతీమణి నుంచి మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. శామీర్ పేటలోని తన నివాసంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంపై బోలెడన్ని అంచనాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈటల నిర్ణయానికి జస్టిఫికేషన్ ఇచ్చేందుకు జమున సిద్ధమవుతున్నట్లుగా వాదనలు …
Read More »అంతా హై కమాండే నడిపిస్తోందా ?
తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకపుడు ఇతర పార్టీల నుండి ఎవరైనా కాంగ్రెస్ లో చేరాలంటే వ్యవహారం అంతా దాదాపుగా హైదరాబాద్ లోనే జరిగిపోయేది. ఏదో లాంఛనంగా ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్ ను కలిసొచ్చేవాళ్ళంతే. నిజానికి హైకమాండ్ దాకా వెళ్ళే నేతల సంఖ్య చాలా తక్కువగానే ఉండేది. ఎంతో ముఖ్యమైన నేతలు మాత్రమే ముందుగా హైకమాండుతో మాట్లాడుకుని ఢిల్లీలోనే పార్టీ కండువా కప్పుకునేవారు. అలాంటిది …
Read More »ఆ లెక్కన బీజేపీని జగనే మేనేజ్ చేస్తున్నారా?
రాజకీయాల్లో ఉన్న నాయకులు ఆచితూచి మాట్లాడాలి. పైగా.. సీనియర్లు, గతంలో మంత్రులుగా చేసిన వారు అయితే.. మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు మాజీ మంత్రి, బీజేపీ మాజీ నాయకుడు.. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు.. సంచలనం గా మారాయనే చెప్పాలి. ప్రస్తుతం ఇవి.. రాజకీయంగా ప్రకంపనలు కూడా పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్గా నియమితుల య్యారు. …
Read More »జగన్ కు మోడీ ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఇదేనా?
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్ 5 జోన్ లో వేలాది ఇళ్ళ నిర్మాణాలకు వచ్చేనెలలో భూమిపూజ జరగబోతోంది. జూలై 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. ఆర్ 5 జోన్ లో ఏకకాలంలో 47 వేల ఇళ్ళ నిర్మాణాలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. 47 వేల ఇళ్ళనిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నుండి ప్రతిపాదన అందగానే కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇళ్ళనిర్మాణ …
Read More »కదిలించేస్తున్న పవన్ అభిమాని వీడియో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. చాలా కాలానికి పవన్ కొన్ని రోజుల పాటు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ హాట్ హాట్ ప్రసంగాలతో కాక రేపుతుండటంతో ఏపీ రాజకీయం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతోంది. జనం కూడా పవన్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి పవన్ కూడా ఎమోషనల్ అవుతున్నాడు. మరింత ఉత్సాహంగా యాత్రలో ముందుకు సాగుతున్నారు. తాజాగా నరసాపురంలో పవన్ …
Read More »ఎంపీ ఎఫెక్ట్: విశాఖలో వైసీపీకి మైనస్ నిజమేనా ?
వైసీపీ కీలకనాయకుడు.. తొలిసారి ఎంపీ అయిన.. విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యానారాయణ కుటుంబం, ఆయన స్నేహితుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు సాగిన ఈ వ్యవహారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా.. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అయితే. . మొత్తానికి పోలీసులునిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోంది. అయితే.. ఈ పరిణామం తర్వాత.. వైసీపీపై ప్రభావం పడుతోందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే …
Read More »ఎవరికోసం.. ఎందుకీ కామెంట్లు.. సింపతీ వస్తుందా?!
రాజకీయాలలోకి వచ్చారంటే.. అన్నీ వదులుకుని రావాల్సిన పరిస్థితులు నేడు ఉన్నాయి. సిగ్గు, అభిమానం.. వంటివి అసలే ఉండకూడదు. ఎవరు ఏమన్నా భరించాలి.. అదే రేంజ్లో తిప్పికొట్టాలి. తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా అనే రాజకీయాలుకనిపిస్తున్నాయి. ఎవరు రాజకీయ గోదాలోకి దిగినా.. వీటికి సిద్ధమయ్యే రావాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఇవననీ తట్టుకోలేకే.. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. తాను అనలేనని, …
Read More »టీడీపీ కొత్త వ్యూహం.. త్వరలోనే మరో కార్యక్రమం..
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల కాలంలో పలుకార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. మొత్తంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. తాజాగా మరో కార్యక్రమంతో చంద్రబాబు ముందుకు వచ్చారు. టీడీపీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates