Political News

పొత్తు లేదా? అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేస్తున్న బాబు, ప‌వ‌న్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా ఇత‌ర పార్టీల‌తోనూ క‌లిసి ప‌నిచేస్తామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అంటున్నారు. టీడీపీ అధినేత బాబు కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి జ‌న‌సేన‌, బీజేపీ, టీడీపీ పొత్తుతో బ‌రిలో దిగుతాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. వైసీసీ కూడా ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను విమ‌ర్శిస్తోంది. కానీ టీడీపీతో క‌లిసే ఉద్దేశం లేద‌ని జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్న …

Read More »

ఐవైఆర్‌.. మ‌ళ్లీ ఏసేశాడుగా.. వైసీపీ ఏం చేస్తుందో!

ఐవైఆర్ కృష్ణారావు గుర్తున్నారా? ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా చంద్ర‌బాబు హ‌యాంలో ప‌నిచేసిన ఆయ‌న త‌ర్వాత‌.. రిటైర‌య్యారు. అనంత‌రం బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా కూడా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు స‌ర్కారుపైనే విమ‌ర్శ‌లు గుప్పించ‌డంతో ఆయ‌న‌ను అప్పటిక‌ప్పుడు ప‌క్క‌న పెట్టారు. త‌ర్వాత ఆయ‌న బీజేపీలో చేరారు. ఇక‌, త‌ర‌చుగా ఏపీ స‌ర్కారుపై హైద‌రాబాద్‌లో ఉండి విమ‌ర్శ‌లు గుప్పి స్తూ ఉన్నారు. ఇప్పుడు చాన్నాళ్ల త‌ర్వాత‌.. ఐవైఆర్ స్పందించారు. ఏపీ ప్ర‌భుత్వం …

Read More »

సంత‌కం ఓకే.. ఆర్టీసీ విలీనానికి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం!

తెలంగాణ ప్ర‌భుత్వం స‌హా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఆశ‌గా ఎదురు చూస్తున్న తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ని ప్ర‌భుత్వంలో విలీనం చేసే బిల్లు విష‌యం కొలిక్కి వ‌చ్చింది. ఈ బిల్లుపై తీవ్ర‌స్థాయిలో నెల‌కొన్న ఉత్కంఠ‌కు తాజాగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై తెర‌దించారు. తాను ఈ బిల్లుకు వ్య‌తిరేకం కాద‌ని చెబుతూనే గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై.. ఈ బిల్లును మ‌రోసారి ప‌క్క‌న పెట్టేస్తార‌నే చ‌ర్చ సాగింది. అయితే.. అనూహ్యంగా ఆమె ఈ బిల్లుపై …

Read More »

కేంద్రం పై ఒత్తిడి .. జగన్ చేయాల్సింది చేస్తున్నారు

కేంద్రప్రభుత్వంతో ఉన్న సత్సబంధాల కారణంగా బాగా ఒత్తిడి తెచ్చి ప్రత్యేకహోదా, పెండింగ్ నిధులు, ప్రాజెక్టులను సాధించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసమని వ్యూహాత్మకంగా లోక్ సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ఎంపీ మార్గాని భరత్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును గనుక లోక్ సభ స్పీకర్ ఆమోదిస్తే బిల్లుపై చర్చ జరుగుతుంది. అప్పుడు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం. 2014లో విభజన హామీల అమలు చట్టం తదితరాలన్నీ చర్చకు వస్తాయి. విభజన …

Read More »

రుషికొండలో రెడీ అవుతున్న సీఎంవో

విశాఖపట్నంలోని రుషికొండలో ముఖ్యమంత్రి కార్యాలయం రెడీ అవుతోంది. క్యాంపు ఆపీసు భవనాల నిర్మాణం అయిపోయింది. ఇంటీరియర్ వ్యవహారాలే జరుగుతున్నాయి. ఇవికూడా మరో నెలరోజుల్లో పూర్తయిపోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇంటీరియర్ పనులు కూడా పూర్తయిపోతే వెంటనే జగన్మోహన్ రెడ్డి తన మకాంను విశాఖపట్నంకు మార్చేయటానికి రెడీగా ఉన్నారు. అన్నీ కలిసొస్తే అక్టోబర్ 24వ తేదీకి జగన్ విశాఖకు కుటుంబంతో పాటు తరలిపోవటం ఖాయమట. దీనిక సమీపంలోనే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు కూడా …

Read More »

బొత్సకు పోటీ ఎవరు? వెతుకుతున్న బాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారం చేప‌ట్టాల‌నే ప‌ట్దుద‌ల‌తో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ముందుగా వైసీపీ బ‌లాల‌పై దృష్టి పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. వైసీపీలోని బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఓడిస్తే ప‌ని మ‌రింత సులువు అవుతుంద‌ని బాబు అనుకుంటున్నారు. అందుకే వైసీపీలోని కీల‌క నేత‌ల‌పై ఆయ‌న ఫోక‌స్ పెట్టార‌ని తెలిసింది. ఇందులో భాగంగానే మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను ఓడించేందుకు బాబు క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు స‌మాచారం. కానీ అది అనుకున్నంత సులువేమీ …

Read More »

3 ఎక‌రాల కొండ‌.. పావు ఎక‌రానికి… నారా లోకేష్

“దాదాపు 3.5 ఎక‌రాల్లో ఉండాల్సిన కొండ‌. కానీ.. ఇప్పుడు పావు ఎక‌రంలోపే ఉంది. దీని చుట్టూ త‌వ్వ‌కాలు జ‌రిగిపోయాయి. మ‌ట్టి, రాళ్లు వంటివి త‌ర‌లించేశారు. అస‌లు.. మ‌రో నెల రోజులు గ‌డిస్తే.. ఇక్క‌డ ఒక కొండ ఉండేది-అని స్థానికులు చెప్పుకొనే ప‌రిస్తితికి వ‌చ్చేసింది. ఇదీ.. సైకో జ‌గ‌న్ పాల‌న “-అని టీడీపీ యువ నాయ‌కుడు.. మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర …

Read More »

నువ్వు ఎవడ్రా పుడింగి? పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఫైర్

అన్నమయ్య జిల్లాలోని అంగళ్లు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో జరిగిన ఘటనల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు శ్రీకాళహస్తిలో జరగబోయే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అయితే, అన్ని అడ్డంకులను అధిగమించి శ్రీకాళహస్తికి చేరుకున్న చంద్రబాబు అక్కడ రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు రోడ్ షోకు ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఈ సందర్భంగా …

Read More »

జగన్ హయాంలో కౌన్సిలర్ కూడా బెదిరిస్తున్నాడు : పవన్

ఏపీలోని జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పంచాయతీల నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని పవన్ ఆరోపించారు. తమ హక్కుల కోసం పంచాయతీల, నిధుల కోసం సర్పంచులు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదల, తమ సమస్యలు పరిష్కారం కోసం సర్పంచ్ లే ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ …

Read More »

బాబుకు ప్ల‌స్ అయ్యేనా?

వ‌చ్చే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం చంద్రబాబుకు అత్య‌వ‌స‌రం. పార్టీని తిరిగి అధికారంలోకి తేక‌పోతే మ‌నుగ‌డ ఇక క‌ష్ట‌మే. ఈ విష‌యం బాబుకూ బాగా తెలుసు. అందుకే ఈ ఎన్నిక‌ల‌పై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి సారించారు. వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధ‌మయ్యారు. ఈ క్ర‌మంలోనే తాజాగా పుంగ‌నూరు ఘ‌ట‌న బాబుకు క‌లిసొచ్చే అవ‌కాశ‌ముంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం సాగునీటి ప్రాజెక్టుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదంటూ బాబు …

Read More »

మ‌ళ్లీ మ‌ళ్లీ గెలిస్తేనే ద‌ళిత బంధా?

ద‌ళిత బంధు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించ‌డ‌మే లక్ష్యంగా కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌క‌మ‌ని దీన్ని అంటుంటారు. ఆ ఉప ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న కేసీఆర్‌.. ద‌ళితుల ఓట్ల కోసం 2021లో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఈ ప‌థ‌కం కింద ఒక్కో ద‌ళిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు అందిస్తారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ద‌ళిత బంధు కూడా ఊహించినంత వేగంగా సాగ‌డం …

Read More »

కాలేజీ రోజుల నుంచే బాబు, పెద్దిరెడ్డి వైరం

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత రాజ‌కీయ‌ వైరం ఇప్పుడుంద‌ని టాక్‌. తాజాగా పుంగ‌నూర్‌లో అడుగుపెట్ట‌కుండా బాబును పెద్దిరెడ్డి అడ్డుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర కూడా పుంగ‌నూరులోకి రాకుండా ప‌క్క నుంచి వెళ్లిపోవ‌డానికి కూడా పెద్దిరెడ్డే కార‌ణ‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ అనేదే లేకుండా చేయాల‌ని పెద్దిరెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే …

Read More »