టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా సాగిపోయింది. సీనియర్ల నుంచి జూనియర్ కార్యకర్తల వరకు పెద్ద ఎత్తున మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చారు. పసుపు పండుగను విజయవంతం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో కలిసి విందు కూడా ఆరగించారు. ఇక దీంతో కార్యక్రమం ముగిసింది. కానీ అసలు విషయం అక్కడే మొదలైంది. విందు భేటీలో చాలా మంది సీనియర్ కార్యకర్తలు టికెట్ల ప్రస్తావన చేశారు. …
Read More »నిజమైన సైనికుడి తల్లిదండ్రుల కోరికను మన్నించాలి పవన్
మన జనాలకు సినిమా హీరోలు గుర్తున్నంతగా.. దేశం కోసం ప్రాణాలు వదిలిన సైనికులు గుర్తుండరు అన్నది కఠిన వాస్తవం. కొన్నేళ్ల ముందు గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్.. గత ఏడాది పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ లాంటి రియల్ హీరోల గురించి ఎంతమందికి తెలుసు అన్నది ప్రశ్నార్థకం. ప్రాణాలకు భరోసా లేదని తెలిసి కూడా సైన్యంలో చేరి సరిహద్దుల్లో పహరా కాసే.. దేశ …
Read More »వైసీపీ రెడీనా: స్థానికంలో సత్తా ఎంత..!
స్థానిక ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలలే ఉన్నాయి. ఎప్పుడో 2029లో జరిగే ఎన్నికలపై దృష్టి పెట్టిన వైసీపీ అధినేత జగన్.. స్థానికంలో విజయం పై మాత్రం పెద్దగా స్పందించడం లేదు. 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అప్పట్లో అధికారంలో ఉన్న కారణంగా వైసీపీ భారీ విజయం దక్కించుకుంది. కొన్నికొన్ని జిల్లాల్లోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో అసలు వేరే పార్టీ నాయకులను నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకున్నారన్న చర్చ ఉంది. ఫలితంగా …
Read More »‘కేసీఆర్, హరీష్రావును జైల్లో పెట్టాక మాట్లాడండి’
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, దీనికి సంబంధించి నియమించిన పీసీ ఘోష్ నివేదిక అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో నిన్న స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సహా బీఆర్ ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో కాసులు మేసిందెవరో.. లక్షల కోట్లు దండుకున్నదెవరో నివేదిక స్పష్టం చేసిందన్నారు. దీనిపై సీబీసీఐడీ వేస్తామని అంటే.. బీజేపీ నాయకులే(కిషన్ రెడ్డి) సీబీఐకి ఇస్తే.. వేగంగా విచారణ పూర్తవుతుందన్నారని.. సీబీఐకి …
Read More »ప్రభుత్వంపై అధికారిక ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆగ్రహానికి, ఆవేదనకు గురయ్యారు. నిన్న మొన్నటి వరకు తనకు కేబినెట్లో చోటు దక్కలేదని పెద్ద ఎత్తున సర్కారుపై ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఒక వర్గానికే పదవులు దక్కుతున్నాయన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇవ్వడం తప్పెలా అవుతుందని గతంలో ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయినా.. ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా …
Read More »రాకెట్ బాణంతో రాజా సింగ్… జస్ట్ మిస్
రాజా సింగ్… ఈ పేరు వింటేనే ఒక రకమైన భావన కలుగుతుంది. హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని గోషా మహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్న ఈ మాజీ బీజేపీ నేత ఏం చేసినా సంచలనంగానే మారుతుంది. తాను చేసిన పనుల వల్ల బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన సింగ్… నిత్యం వార్తల్లో ఉండేలా రకరకాల ఫీట్లు చేస్తుంటారు. తాజాగా శ్రీరామ నవమి నాడు ఏకంగా దీపావళి వేడుకలకు యత్నించిన ఆయన తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నవమి …
Read More »బరిలోకి విజయ్… నిర్ణయాలు కఠినమైనవే!
తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలోకి మరో పార్టీ ఎంట్రీ ఇచ్చేసింది. వచ్చే నెలలో జరగనున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళ వెట్రిగ కగజం(టీవీకే) పార్టీ బరిలోకి దిగబోతోంది. ఈ మేరకు ఆదివారం చెన్నైలో నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ తన పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అంతేకాకుండా తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నదానిపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. అభ్యర్థుల ప్రకటనతో పాటుగా తమ …
Read More »నెల తర్వాతా.. నెరవేరని `ట్రంప్ సంకల్పం!`
ఇరాన్పై అమెరికా+ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం ప్రారంభించి 29వ తేదీకి నెల పూర్తవుతుంది. గత నెల 28న తెలతెల వారుతూనే ప్రారంభించిన డ్రోన్ దాడి ఇరాన్ రాజధాని టెహ్రాన్ను అతలాకుతలం చేసింది. వాస్తవానికి ఇలాంటి యుద్ధాలు ఎప్పుడైనా రాత్రి వేళలలో జరుగుతాయి. భారత్.. పాకిస్థాన్పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కూడా రాత్రివేళలోనే సాగింది. అలాంటిది పట్టపగలు.. ప్రజలు ఇంకా నిద్ర నుంచి మేల్కొనకముందే.. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడి ప్రారంభించాయి. …
Read More »మంత్రులకు తొలిసారి సీఎం విలువ తెలిసి వచ్చిందా?
మిగిలిన పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు ఒక స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. మిగిలిన పార్టీలో హీరోలు కొందరు.. సూపర్ హీరో పార్టీ అధినేత మాత్రమే అన్న విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అధినేత అధిక్యతను గుర్తించేందుకు.. ఎలాంటి ఇబ్బందులకు గురి కారు. కానీ.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇందుకు భిన్నమైన సీన్ కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ సమస్య.. ఆ పార్టీలో ముందు నుంచి కనిపిస్తూనే ఉంటుంది. తిరుగులేని నాయకుడు …
Read More »మండలి లేకుండా తీర్మానం.. రూల్స్ ఏమంటున్నాయ్!
ఏపీలోని కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్న సంకల్పంతో తాజాగా ప్రత్యేకంగా అసెంబ్లీని కొలువు దీర్చింది. సుమారు 7 గంటలపాటు సాగిన సభలో ఏకైక అజెండాగా అమరావతికి చట్టబద్దతను సభ్యులు చర్చించారు. అనంతరం.. దీనిని గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించారు. అయితే.. అసెంబ్లీ భేటీ అయింది కానీ.. మండలిని హాజరు పరచలేదు. ఈ వ్యవహారంపై వైసీపీ నాయకులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ.. అసలు మండలిని హాజరు పరచకుండా అసెంబ్లీలో …
Read More »నాయకులకు మరింత ఫ్రీడమ్… రీజనిదే!
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక మంది నాయకులు ఉన్నారు. అయితే ఎవరి అవకాశం ఎవరి అనుకూలతను బట్టి వారు రాజకీయాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. గత ఎన్నికలకు ముందు అనేకమంది నాయకులు తమకు నచ్చిన పార్టీలను ఎంచుకున్నారు. పార్టీలు మారారు. గెలిచిన వారు గెలిచారు ఓడిన వారు ఓడారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో నాటికి ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. నాయకులకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని …
Read More »వైసీపీ ఆణిముత్యం.. నానీ నోట అదే పాత క్యాసెట్
వైసీపీ తరఫున తరచుగా మీడియా ముందుకు వచ్చే మాజీ మంత్రి పేర్నినాని.. అమరావతి రాజధానిపై మళ్లీ పాత రికార్డే వినిపించారు. అమరావతిపై జగన్కు ధ్వేషం ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఆయన ఏపీకి చెందిన నాయకుడు కాదా? ఏపీని ఐదు సంవత్సరాలు పాలించలేదా? ప్రజలు ఆయనకు ఓటేయలేదా? అని వరుస ప్రశ్నలు సంధించారు. అంతేకాదు.. అసలు చంద్రబాబు కంటే కూడా జగనే రాజధాని ప్రాంతంలో ఇంటిని నిర్మించుకున్నారని గుర్తు చేస్తూ.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates