Political News

స్టాలిన్ త‌ర‌ఫున వైసీపీ ప్ర‌చారం.. బీజేపీ సహిస్తుందా?

త‌మిళ‌నాట త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ ఎన్నిక‌లు రాష్ట్రంలోని అధికార పార్టీ డీఎంకేకు.. అత్యంత కీల‌కంగా మారున్నాయి. ఒక‌వైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, మ‌రోవైపు డీఎంకే, ఇంకోవైపు న‌టుడు విజయ్ సొంత పార్టీ వెర‌సి.. మొత్తంగా ఈ ఎన్నిక‌లు అత్యంత సంక్లిష్టంగా.. అదేస‌మ‌యంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళ‌నాడు.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో అతి పెద్ద సంఖ్య‌లో అసెంబ్లీస్థానాలు ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. …

Read More »

పది రోజుల స్టాక్ మాత్రమేనా? తర్వాత ఏమవుతుంది?

అదును చూసుకుని వ్యాపార సంస్థలు తమ నైజాన్ని బయట పెట్టుకుంటాయి. పది రూపాయలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు చమురు విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇరాన్ యుద్ధం సహా పాకిస్థాన్ – అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చమురు సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ పరిణామాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి అతి పెద్ద జనాభా ఉన్న దేశంలో చమురు వినియోగం తారస్థాయిలో ఉంది. …

Read More »

సామర్లకోట షాక్ తర్వాత శివకాశీ దారి పట్టిన బాబు

త‌మిళ‌నాడులోని శివ‌కాశీ పేరు దాదాపు అంద‌రికీ సుప‌రిచిత‌మే. దీపావ‌ళి వ‌చ్చిందంటే.. శివ‌కాశీ ప‌టాకుల కోసం ఎదురు చూస్తారు. వాటికి డిమాండ్ కూడా ఎక్కువే. దేశంలో ప‌టాకులు త‌యార‌య్యే మెజారిటీ ప్రాంతంగా కూడా శివ‌కాశీకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. శివ‌కాశీని అధికారికంగా త‌మిళ‌నాడు రాష్ట్రం ప‌టాకుల త‌యారీ కేంద్రంగా కూడా గుర్తించింది. ఇక్క‌డ అనేక వ‌స‌తులు కూడా క‌ల్పించారు. మందుగుండు సామ‌గ్రి నిల్వ నుంచి భ‌ద్ర‌త వ‌ర‌కు ఇక్క‌డ ప‌లు చ‌ర్య‌లు …

Read More »

శారదా భూముల పై రేవంత్ యూటర్న్..

కోకాపేటలో అత్యంత ఖరీదైన 2 ఎకరాల భూములను శారదా పీఠానికి కట్టబెట్టడం సరైంది కాదంటూ తెలంగాణ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీంతో శారదా పీఠానికి ఇచ్చిన భూములను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బీఆర్ ఎస్ హయాంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అప్పటి …

Read More »

ఖమేనీ హతం.. అయినా మారని ఇరాన్ తీరు!

కరడుగట్టిన మత ఛాందసవాదిగా, అమెరికా వ్యతిరేకిగా ముద్రపడిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. ఈ పరిణామం అనంతరం ఇరాన్ వీధుల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. తమకు భారమైన పాలన తొలగిపోయిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇంత జరిగినా ఇరాన్ తీరు ఏమాత్రం మారలేదు. పైగా అదే దూకుడు ప్రదర్శిస్తామని ప్రకటించడం గమనార్హం. అంతేకాదు ఖమేనీ చూపించిన బాటలోనే నడుస్తామని అధ్యక్షుడు మసూద్ …

Read More »

కొడాలి నాని.. మళ్ళీ మొదలు?

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. బూతుల నేత‌గా టీడీపీ నాయ‌కులు ముద్దుగా పిలుచుకుని కొడాలి నాని సుదీర్ఘ కాలం త‌ర్వాత‌.. మీడియా ముందుకు వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో గుడివాడ‌లో ఓడిపోయిన త‌ర్వాత‌..ఆయ‌న అజాలేకుండా పోయారు. కొన్నాళ్లు అనారోగ్యం అని చెప్పారు. ఆ త‌ర్వాత‌.. హైద‌రాబాద్‌లో చికిత్స తీసుకున్న‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆ త‌ర్వాత .. అక్క‌డెక్క‌డో క‌నిపించినా.. ఆయ‌న మీడియాకు దూరంగా ఉంటూ వ‌చ్చారు. తాజాగా మాజీ …

Read More »

ఖ‌మేనీని ఎందుకు చంపేశారు?.. ప్ర‌పంచం శోధించిన ప్ర‌శ్న‌!

ఇరాన్ సుప్రీం లీడ‌ర్‌(ఒక‌ర‌కంగా ప్ర‌ధాన‌మంత్రి) అయ‌తొల్లా అలీ ఖ‌మేనీని అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జ‌రిపిన దాడుల్లో హ‌తం చేశాయి. అయితే.. అస‌లు ఖ‌మేనీ చేసిన త‌ప్పేంటి? ఎందుకు ఆయ‌న‌ను హ‌త మార్చారు? అమెరికాకు-ఇరాన్‌కు మ‌ధ్య వివాదం ఏంటి? ఒక‌ప్పుడు ఒకే కంచం, ఒకే మంచం అన్న ట్టుగా ఉన్న ఇరాన్‌-ఇజ్రాయెల్ మ‌ధ్య యుద్ధం ఎందుకు చోటు చేసుకుంది? ఇవీ.. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు గూగుల్ లో శోధించిన ప్ర‌శ్న‌లు. వీటికి …

Read More »

హనుమంతన్న నోట ఒక్క ఛాన్స్ మాట

“ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం పోత‌ది.. పార్టీకి ఏం న‌ష్టం వ‌స్త‌ది. అందుకే తేల్చుకునేటందుకు వ‌చ్చా“ అంటూ.. కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ వీ. హ‌నుమంత‌రావు వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ సీట్లకు ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో చ‌డీచ‌ప్పుడు లేకుండానే ఆయ‌న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో వాలిపోయారు. ఆయ‌న ఢిల్లీకి వ‌చ్చే వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలోనే ఆయ‌న రాక‌పై ఎలాంటి సమాచారం లేద‌ని తెలిసింది. ఇప్ప‌టికే.. రాజ్య‌స‌భ …

Read More »

హుటాహుటిన పేలుడు ప్రాంతానికి.. బాధితులకు బాబు అండ!

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో సంభవించిన భారీ పేలుడు ఘటన రాష్ట్రం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య జరిగిన ఈ విస్ఫోటనంలో తొలుత నలుగురు మృతి చెందినట్లు వార్తలు వచ్చినా, ఆ సంఖ్య సాయంత్రానికి 24 మందికి చేరింది. పది సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు …

Read More »

నిర్లక్ష్యమే.. నిలువునా కాల్చేసింది!

చిన్నపాటి నిర్లక్ష్యమే కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పది సంఖ్యలో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వారం క్రితమే వాటిని అధికారులు పరిశీలించి, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేట్లపాలెంలోని సూర్యశ్రీ బాణాసంచా కేంద్రం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని చెబుతున్నారు. అయితే చిన్నపాటి నిర్లక్ష్యమే ఈ పెను ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం …

Read More »

`క‌డ‌ప` క‌దులుతోంది.. జ‌గ‌న్ స‌ర్‌!

వైసీపీ ప‌రిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అన్నట్టుగా మారుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పార్టీలో నాయ‌కులు పుంజుకోవ‌డం ఎలా ఉన్నా.. జంప్ చేస్తున్న‌వారి సంఖ్య మ‌రింత పెరుగుతోంది. పార్టీ అధినేత కంటికి క‌నిపించ‌క‌పోవ‌డం.. క‌నీసం త‌మ వాద‌న‌ను వినిపించుకునే తీరిక‌లోనూ జ‌గ‌న్ లేక‌పోవ‌డంతో నాయ‌కులు త‌మ దారులు తాము చూసుకుంటున్నారు. అయితే.. ఇత‌ర జిల్లాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేయొచ్చు. కానీ, జ‌గ‌న్ సొంత …

Read More »

బాబు మ‌న‌సు మెచ్చిన సాయి ప్ర‌సాద్‌.. ఎవ‌రీయ‌న‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబ మ‌న‌సు చూర‌గొనాలంటే.. అంత ఈజీకాదు. ఈ విష‌యాన్ని టీడీపీ నాయ‌కుల నుంచి అధికారుల వ‌ర‌కు అంద‌రూ చెప్పేమాట‌. ఎంతో క‌ష్ట‌ప‌డాలి. ఆయ‌న అంచ‌నాల‌ను అందుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు మెద‌డుకు ప‌దును పెంచుకోవాలి. ఐటీలో మేలిమిగా ముందుకు సాగాలి. ఆయ‌న ఇలా అడిగితే అలా స‌మాధానం చెప్పే ప‌రిస్థితి ఉండాలి. ఇంత ఉన్నా.. బాబు మ‌న‌సులో చోటు ద‌క్కు తుందా? అంటే.. బిహేవియర్‌ను కూడా బాబు అంచ‌నా వేసుకుని …

Read More »