జనసేన ప్రధాన కార్యదర్శి, నటుడు నాగబాబు.. వైసీపీపై ఫైర్ అయ్యారు. ప్రజలకు ఏమీ చేయకుండా.. కనీసం రోడ్డు కూడా వేయకుండా.. నాయకులు ఎన్నికలకు రెడీ అవుతున్నారని విమర్శించారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “కనీసం ఒక్క రోడ్డు కూడా వేయని వైసీపీ నాయకులు మళ్లీ ఎన్నికలకు తయారయ్యారు. ఓటువేయాలంటూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రజలు వాళ్ల చెంప పగలగొట్టి.. కాలర్ పట్టుకుని, మాకు ఏం చేశారో చెప్పండి! …
Read More »కాంగ్రెస్ ఇక, ఒంటరి పోరే.. తేలిపోయింది!
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు చేయాల్సి రావడం ఖాయమైపోయింది. ఇండియా కూటమిని ఏర్పాటు చేసి కేంద్రంలోని నరేంద్ర మోడీని గద్దె దింపాలన్న ప్రయత్నం చేసిన కాంగ్రెస్కు అడుగడుగునా సంకటం ఏర్పడిన విషయం తెలిసిందే. పొత్తులకు.. టికెట్ల కేటాయింపు ప్రధాన అవరోధంగా మారిన దరిమిలా.. ఒక్కొక్క పార్టీ కట్టుతప్పి.. పక్కకు జరిగిపోయాయి. మొత్తం 28 పార్టీల సమాహారంగా ఉన్న ఇండియా కూటమిలో కీలకమైన పెద్దపార్టీలు దాదాపు తప్పుకొన్నాయి. …
Read More »రేవంత్ ఫోకస్ తో బీఆర్ఎస్ లో టెన్షన్
రాజ్యసభ ఎన్నికలపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టడంతో బీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ లో ఖాళీ అవబోయే మూడు స్ధానాలను భర్తీచేసేందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఈనెల 27వ తేదీ ఎన్నిక నిర్వహించబోతోంది. మూడు స్ధానాల్లో రెండింటిలో కాంగ్రెస్, ఒకదాన్ని బీఆర్ఎస్ గెలుచుకోగలవు. ఈ విషయంలో పై రెండు పార్టీలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇపుడు సమస్య ఏమిటంటే మూడోసీటును కూడా గెలుచుకునేందుకు రేవంత్ రెడ్డి …
Read More »టీడీపీతో పొత్తుపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయంపై బీజేపీ అగ్రనాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్షా సంచలన వ్యాఖ్యలు చేశారు. “అవును.. ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారు“ అని వ్యాఖ్యానించారు. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని చెప్పారు. అయితే.. ఈ పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలే నని అన్నారు. అయితే.. కేంద్ర స్థాయిలో ఎన్డీయేని బలోపేతం చేయాలని నిర్ణయించుకు న్నట్టు షా తెలిపారు. 400 స్థానాలు దక్కించుకుని మరోసారి విజయం …
Read More »పొత్తులపై కామెంట్లు చేసే జనసేన నేతలకు పవన్ వార్నింగ్
ఏపీలో త్వరలో జరగబోతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఓటమే లక్ష్యంగా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు మొదలు అనేక విషయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, టీడీపీ జనసేనలతో బిజెపి కూడా కలిసే అవకాశాలపై ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు మంతనాలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలోనే పొత్తుల వ్యవహారం …
Read More »కాంగ్రెస్ తొలి బడ్జెట్..ఎలా ఉంది?
ప్రత్యేక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభలో తొలిసారిగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక శాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు భట్టి. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క తమ ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోతోన్న పథకాల గురించి వివరించారు. రైతులకు రుణమాఫీ అమలు చేయబోతున్నామన్నారు. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తున్నామని అన్నారు.ప్రతి పంటకు …
Read More »ఒక్క ఉచితం.. ఎన్ని తిప్పలు పెడుతోంది!
రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇచ్చేందుకు, ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ఎంతో ఉబలాట పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే.. వైసీపీ అమలు చేస్తున్న అమ్మ ఒడి తదితర పథకాలకు దీటు గా తాము మరిన్ని పథకాలు అమలు చేస్తామని టీడీపీ చెబుతోంది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఉచితాల బాట పడితే ఎలా ఉంటుందో.. ఏం జరుగుతుందో.. ఏపీనే ఉదాహరణ. ఏపీలో ప్రభుత్వం అప్పులపై అప్పులు చేస్తోంది. కానీ, …
Read More »అసమ్మతి రాజుకుంటునే ఉందా ?
అధికారపార్టీ నరసరావుపేట నియోజకవర్గంలో అసమ్మతి రాజుకుంటునే ఉంది. ఇక్కడ ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డికి వ్యతిరేకంగా కొందరు నేతలు అంసతృప్తవాదులుగా తయారయ్యారు. వీళ్ళంతా ఏకంకాలేదు కాని ఎంఎల్ఏకి వ్యతిరేకంగా తమ గళాన్న గట్టిగానే వినిపిస్తున్నారు. గోపిరెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డిని కలిసినపుడు పదేపదే కోరుతున్నారు. అయితే గోపిరెడ్డికి టికెట్ ఇస్తానని కాని ఇవ్వనని కాని జగన్ నుండి నేతలకు ఎలాంటి సంకేతాలు అందలేదు. దాంతో నరసరావుపేటలో ఏమి జరుగుతున్నదో …
Read More »రేవంత్ నిర్ణయంపై ఉత్కంఠ
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ముసుగులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇప్పటికే విజెలన్స్ విచారణలో తేలింది. ఈ విచారణను మరింత ముందుకు తీసుకెళ్ళటంలో ప్రభుత్వం ఏమిచేస్తుందన్న విషయం ఎవరికీ అంతుబట్టడంలేదు. విజిలెన్స్ విచారణలో అవినీతికి ప్రాధమిక సాక్ష్యాలను సేకరించిన ప్రభుత్వం తర్వాత స్టెప్ గా జ్యుడీషియల్ విచారణ చేయించబోతోందనే ప్రచారం పెరిగుతోంది. జ్యుడీషియల్ విచారణ …
Read More »నేతలు జైలుకు వెళ్తే.. ఇంత సింపతీనా?
రాజకీయ పార్టీల నాయకులు ఏదో ఒక వివాదంలోనో.. అక్రమాలు, అవినీతిలోనో చిక్కుకుని జైలు పాలవడం పరిపాటిగా మారిన విషయం తెలిసిందే. ఇలా.. జైలు పాలైన నాయకులకు ప్రజల్లో సింపతీ పెరుగుతుండడం కూడా తెలిసిందే. గతంలో జైలుకు వెళ్లిన వారు.. తర్వాత కాలంలో కీలక పదవులు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ తరహా జైలు సింపతీ అనేది కేవలం మనకే పరిమితం కాలేదు. పొరుగు దేశం పాకిస్థాన్లోనూ కనిపించింది. అక్కడ …
Read More »సీఎం రేవంత్ ‘చారిత్రక’ నిర్ణయాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని చేపట్టిన రోజు నుంచి చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చారు. గద్దర్కు విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఇక, ఇప్పుడు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అసెంబ్లీ వేదికగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నట్లుసంచలన ప్రకటన చేశారు. దీనికి కారణం వివరిస్తూ.. ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని భావిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర …
Read More »ఐదేళ్ల పాలన తర్వాత కూడా.. వైఎస్ బొమ్మ వాడుకుంటారా?
ఏపీ అధికార పార్టీ వైసీపీపై వైఎస్ ఆత్మగా రాజకీయాల్లో గుర్తింపు పొందిన మాజీ ఎంపీ, సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా వైఎస్ బొమ్మను వాడుకుంటారా? అని ఆయన నిలదీశారు. “పథకాలు అమలు చేశాం.. సంక్షేమం అమలు చేశాం. లక్షల కోట్లు అప్పులు తెచ్చి మరీ.. ప్రజలకు పంచామని చెబుతున్న వైసీపీ ఇంకా వైఎస్ ఫొటోతోనే ఎన్నికలకు వెళ్ల డం ఎందుకు? ఇలా …
Read More »