Political News

  `మ‌హాస్వాప్నికుడు`-చంద్ర‌బాబుపై పుస్త‌కం

టీడీపీ అధినేత చంద్రబాబు జీవిత విశేషాల‌తోపాటు, ఆయ‌న పాల‌న‌, దూర‌దృష్టి వంటి కీల‌క అంశాల‌పై సీనియర్ జ‌ర్న‌లిస్టు పూల విక్రమ్‌ రచించిన ‘మహా స్వాప్నికుడు’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ ఆవిష్కరించారు. కువైట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్‌ కోడూరి ఈ పుస్తకాన్ని రూ.50 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో ప్రచురించారు. పుస్త‌క నేప‌థ్యం ఇదీ..ఈ పుస్త‌కంలో చంద్ర‌బాబు జీవిత విశేషాల‌ను, ఆయ‌న రాజ‌కీయంగా ఎదిగిన తీరును క‌ళ్ల‌కు క‌ట్టారు. ముఖ్యంగా …

Read More »

మ‌ళ్లీ అదే పంథా.. బాల్క మార‌లేదు బ్రో!

బీఆర్ఎస్ యువ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ త‌న పంథాను ఏమాత్రం మార్చుకోలేదు. ఇటీవ‌ల ఆయ‌న సీఎం రేవంత్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. మీడియా ముందు రేవంత్‌ను ఉద్దేశించి చెప్పు చూపించిన వ్య‌వ‌హారం మంటలు రేపింది. దీంతో ఆయ‌న‌ పై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలో బాల్క కొన్ని రోజులు త‌ప్పించుకుపోయారు. తాజాగా పోలీసులు ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కూడా …

Read More »

కృష్ణా నుంచి గోదావ‌రి వ‌ర‌కు.. టీడీపీ వ‌దులుకోవాల్సిందేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ పెట్టుకుంటున్న పొత్తుల‌తో ఆ పార్టీ నాయ‌కులు చాలా వ‌ర‌కు సీట్ల ను వ‌దులుకోవాల్సి వ‌స్తోంది. ఇది ఎంత‌గా అంటే.. కృష్నా జిల్లా నుంచి ఉభ‌య గోదావ‌రి జిల్లాల వ‌ర‌కు కూడా.. పెద్ద ఎత్తున కీల‌క స్థానాల‌ను వ‌దిలేయాల్సి వ‌స్తోంది. గ‌తంలో అయితే.. టీడీపీకి అటు ఇటుగా ఉన్న స్థానాల‌ను మిత్ర‌ప‌క్షాల‌కు కేటాయించార‌నే అప‌వాదు ఉంది. కానీ, ఇప్పుడు మిత్ర‌ప‌క్షాలు కూడా.. తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. త‌మ‌కు …

Read More »

లోకేశ్ నోటి నుంచి ‘రెడ్ బుక్’ మాట వచ్చినంతనే..?

ఏపీలో అసెంబ్లీ.. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ‘శంఖారావం’ పేరుతో మలిదశ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించిన లోకేశ్.. ఇప్పుడు శంఖారావం పేరుతో సభల్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు.. కార్యకర్తలు.. మద్దతుదారుల పై వైసీపీ ప్రభుత్వంలో దాడులు జరుగుతున్నాయని.. వేధింపులకు గురి చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన రెడ్ బుక్ ప్రస్తావన తేవటం తెలిసిందే. …

Read More »

మోడీ వారి పొత్తుల.. `ప‌ర‌మార్థం` ఇదే!

పొత్తులు.. ఇప్పుడు దేశంలో ఎటు చూసినా.. ఎక్క‌డ విన్నా ఈ మాటే వినిపిస్తోంది. ఒక్క కాంగ్రెస్‌, ఎంఐ ఎం వంటి పార్టీలు మిన‌హా.. ఏ పార్టీ క‌లిసి వ‌చ్చినా.. చెంత‌కు చేర్చుకునేందుకు చంక ఎక్కించుకునేందు కు బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. “కుటుంబ నియంత్ర‌ణ వ్య‌క్తుల‌కే. సంఖ్యాబ‌లం త‌గ్గించుకునేందుకే. కానీ, పార్టీల‌కు కుటుంబ నియంత్ర‌ణ వ‌ర్తించ‌దు. ఎంత మంది  ఉన్నా.. అంత లాభం“ అని కేంద్ర మంత్రి అమిత్‌షా వెల్ల‌డించారు. దీంతో ఇంకేముంది.. …

Read More »

గ్రేటర్లో ఖాళీ అయిపోతోందా ?

గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్ననే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సడెన్ గా రేవంత్ రెడ్డిని కలిసారు. ముఖ్యమంత్రితో తన సమావేశం పూర్తిగా అధికారికమే అని గద్వాల చెబుతున్నా ఎవరు నమ్మటంలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిని ఎవరు ఏ కారణంతో కలిసినా చెప్పేది మాత్రం అధికారికమని, నియోజకవర్గాలకు నిధుల కోసమనే చెబుతారు. …

Read More »

జోరు పెంచబోతున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు పెంచుతున్నారు. మూడు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. 14వ తేదీన మొదలయ్యే పర్యటనలో మొదట భీమవరంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. పైనాలుగు నియోజకవర్గాల్లో కూడా అచ్చంగా బహిరంగసభలనే కాకుండా పార్టీ ముఖ్యులు, సమాజంలో వివిధ రంగాల్లోని ప్రముఖులు, ప్రభావశీలురతో భేటీ అవబోతున్నారు. అలాగే పార్టీలోని వీరమహిళలు, వార్డు స్ధాయిలో పనిచేసే …

Read More »

బాబుపై ‘ఫ్యామిలీ టిక్కెట్స్’ ప్రెజర్

రాబోయే ఎన్నికల్లో కొందరు సీనియర్ తమ్ముళ్ళకి చంద్రబాబునాయుడు పెద్ద షాకే ఇచ్చారు. తొందరలో జరగబోయే ఎన్నికల్లో సూపర్ సీనియర్ల కుటుంబాల్లో ఒక్క టికెట్ మాత్రమే ఇవ్వబోతున్నట్లు చెప్పేశారు. సీనియర్ తమ్ముళ్ళు చింతకాయల, జేసీ, పరిటాల, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలు రెండు టికెట్ల కోసం బాగా ప్రయత్నిస్తున్నారు. జనసేనతో పొత్తులోనే టీడీపీ పోటీచేయబోయే సీట్లు తగ్గిపోతున్నాయి. తాజా డెవలప్మెంట్లలో బీజేపీ కూడా చేరుతుందనే అంటున్నారు. ఒకవేళ కమలంపార్టీ కూడా పొత్తులో …

Read More »

ఆ రెడ్డిగారి రాజ‌కీయం ముగిసిన‌ట్టేనా?

ఔను.. గుంటూరు జిల్లాలో ఈ మాటే వినిపిస్తోంది. “రెడ్డిగారు క‌నిపించ‌డం లేదు. ఆయ‌న రాజ‌కీయం మాటేంటి? ” అని ప‌లువురు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌నే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. పార్టీలు మారిన ఫ‌లిత‌మో.. లేక వ్యూహం లేక పోవ‌డ‌మో.. ఇవ‌న్నీ కాకుండా.. తాను ప‌ట్టిన కుందేలు కు మూడుకాళ్లే అన్న‌టైపులో రాజ‌కీయాలు చేయ‌డ‌మో.. ఏదేమైనా.. మోదుగుల రాజ‌కీయాలు ముందుకు సాగ‌డం లేదు. తొలుత ఈయ‌న రాజ‌కీయం టీడీపీతో …

Read More »

క‌మ్మ వ‌ర్సెస్ బీసీ.. జ‌గ‌న్ ఫార్ములా ఇది..!

రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ చేసిన మార్పులు సంచ‌ల‌నం రేపుతున్నాయి. అవి కూడా పార్ల‌మెంటు స్థానాలే కావ‌డం గ‌మ‌నార్హం. బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా చేసిన మార్పులు.. రాజ‌కీయాల్లో చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. అవే.. ఒక‌టి ఏలూరు పార్ల‌మెంటు స్థానం, రెండు.. విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంటు స్థానం. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ప్ర‌స్తుతం క‌మ్మ నేత‌ల చేతిలోనే …

Read More »

కాంగ్రెస్ లో హాట్ సీటిదేనా ?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీపై సీనియర్ నేతలు, వాళ్ళ వారసులు దృష్టి కేంద్రీకరించారు. ఉన్న 17 పార్లమెంటు సీట్లలో టికెట్ కోసం పార్టీలో బాగానే పోటీ మొదలైపోయింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అన్నీ నియోజకవర్గాల్లోకి ఖమ్మం పార్లమెంటు సీటే చాలా హాట్ సీటట. ఎందుకంటే ఇక్కడ నామినేషన్ వేస్తే చాలు కాంగ్రెస్ గెలుపు గ్యారెంటీ అనే ప్రచారం ఉంది కాబట్టే. నిజానికి ఖమ్మం పార్లమెంటు సీటు అంటేనే …

Read More »

‘ దేవినేని అవినాష్‌ ‘ … అసెంబ్లీలో అడుగు పెడతాడా ?

తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లిన యువ నాయ‌కుడు… దేవినేని అవినాష్ అనతి కాలంలోనే  సీఎం జ‌గ‌న్‌కు  స‌న్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారని లోకల్ టాక్. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌యక‌ర్త దేవినేని అవినాష్ ఈ సారి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఆయ‌న ఈ సారి విజ‌యంతో అసెంబ్లీలో అడుగు పెట్ట‌నున్నార‌న్న టాక్ బెజ‌వాడ రాజ‌కీయాల్లో బ‌లంగా వినిపిస్తోంది. బెజ‌వాడ రాజ‌కీయాల్లో కాక‌లు తీరిన దివంగ‌త నేత దేవినేని నెహ్రూ రాజ‌కీయ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన అవినాష్  ఇప్ప‌టికే రెండుసార్లు ఎన్నిక‌ల్లో పోటీ …

Read More »