Political News

బీజేపీని ఇరికించేసిన రేవంత్ రెడ్డి.. విష‌యం ఇదీ!

రాజ‌కీయాలు.. రాజ‌కీయాలే. ఏం చేసినా.. దాని వెనుక మ‌ర్మం.. ఖ‌చ్చితంగా ఉంటుంది. తాజాగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు అవినీతి, అక్ర‌మాల‌పై.. నియ‌మించిన జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ రిపోర్టు అంశం.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. తెలంగాణ‌లోని ఏ కూడ‌లిలో చూసినా.. ఏ బ‌స్తీలో క‌నిపించినా.. ఇదే చ‌ర్చ‌. ఏ ఇద్ద‌రు క‌లిసినా.. ‘కేసీఆర్ స‌ర్‌’ గురించే చ‌ర్చ‌. ఇక‌, ఈ క‌మిష‌న్ రిపోర్టుపై.. ఆదివారం సాయంత్రం 4 గంట‌ల నుంచి …

Read More »

పులివెందుల‌లో జ‌గ‌న్‌.. సెల్ఫీలు తీసుకుని వెళ్లిపోయారు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో సోమ‌వారం ప‌ర్య‌టించారు. ఇటీవ‌ల జ‌రిగిన పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. ఆయ‌న ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. అయితే.. సాధార‌ణంగా జ‌గ‌న్ అన‌గానే.. భారీ జ‌న‌సందోహం కామ‌నేక‌దా. అలానే వ‌చ్చారు. పార్టీ సీనియ‌ర్లు రాక‌పోయినా.. వారి అనుచ‌రులు , ద్వితీయ శ్రేణి నాయ‌కులు కూడా జ‌గ‌న్ కోసం వ‌చ్చారు. అయితే.. జ‌గ‌న్ …

Read More »

సీబీఐకి ఇస్తే.. పోయేదేంటి?: బీఆర్ ఎస్ చర్చ

కాళేశ్వరం అవినీతి, అక్రమాల నిగ్గు తేల్చేందుకు నియమించిన పినాకి చంద్రఘోష్ (పీసీ ఘోష్) కమిషన్ రిపోర్టుపై చర్చ అనంతరం తెలంగాణ అసెంబ్లీ దీనిపై సీబీఐ విచారణ జరిపించేలా నిర్ణయించింది. దీనిపై కేంద్రానికి లేఖ రాయనున్నారు. ఏయే విషయాల్లో అక్రమాలు జరిగాయో, ఎలాంటి అక్రమాలో వివరించడంతోపాటు ఎంత దుర్వినియోగం జరిగిందో, ఎవరు లబ్ధి పొందారని అనుమానిస్తున్నారన్న విషయాలను కూడా పేర్కొంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయనున్నారు. అనంతరం దీనిపై సీబీఐ దృష్టి …

Read More »

అద్భుత పాలనా దక్షుడు చంద్రబాబు: పవన్ కళ్యాణ్

ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు అద్భుత పాలనా దక్షుడు అని వ్యాఖ్యానించారు. ఆయన విజన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ప్రగతి మార్గంలో నడిపించారని తెలిపారు. రాబోయే 30 ఏళ్ల కాలాన్ని ముందుగానే అంచనా వేసి చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తారని, ఇది భవిష్యత్తు …

Read More »

వైసీపీకి సవాల్ సబకు వచ్చేందుకు సిద్ధమా?: చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు ఆయన గట్టి సవాల్ విసిరారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాను ఒంటరిగా వస్తున్నానని, కూటమి పార్టీలు మూకుమ్మడిగా వస్తున్నాయని, అయినా సిద్ధమేనని ఆయన ప్రస్తావించి ప్రజల మధ్యకు వెళ్లారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఇప్పటి వరకు ఈ విషయంలో మౌనంగా ఉన్న …

Read More »

చీరలు పంపిస్తా కట్టుకోండి: వైసీపీ నేతల పై మంత్రి కామెంట్స్

వైసీపీ నేతలపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు తన సొంత ఖర్చుతో చీరలు పంపిస్తానని, వాటిని కట్టుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో 16 వేల బస్సులు ఉంటే కేవలం 4 వేల బస్సుల్లోనే ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం అనుమతి ఇస్తోందని వైసీపీ నాయకులు …

Read More »

నేడు, రేపు ఒకే చోట లోకేశ్, జగన్!

నిజమేనండోయ్…. నేటి రాత్రి, రేపు పగలంతా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకే చోట అంటే…మరీ ఒకే చోట అని కాదు… ఒకరికి ఒకరు అత్యంత సమీపంలోనే పర్యటించనున్నారు. ఈ ఆసక్తికర పరిణామానికి జగన్ సొంత జిల్లా కడప జిల్లానే వేదిక కానుంది. సోమవారం మధ్యాహ్నానికే …

Read More »

ఫస్ట్ టైమ్!… నిండుసభలో తలదించిన హరీశ్!

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు అన్ని అంశాలపైనా సంపూర్ణ అవగాహన ఉందని చెప్పాలి. టీఆర్ఎస్ గా ప్రస్థానం ప్రారంభించిన బీఆర్ఎస్ లో ఆదిలో పార్టీ అదినేత కేసీఆర్ తరఫున అన్నీ తానై చూసుకున్న నేతగా హరీశ్ కు మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలో పాలనలో దిట్టగా హరీశ్ ఎదిగారు. ఒకానొక దశలో హరీశ్ లేకుంటే …

Read More »

హరీశ్..ఇది ఆరడుగుల బుల్లెట్టు: బీఆర్ఎస్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రాజకీయ మంటలు రేగిన వేళ… బీఆర్ఎస్ కీలక నేత, కాళేశ్వరం నిర్మాణ సమయంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును ఆ పార్టీ ఓ రేంజిలో ఎలివేట్ చేసింది. హరీశ్ ను ఆరడుగుల బుల్లెట్టుగా ఆ పార్టీ అభివర్ణించింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని రూలింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, కేసీఆర్ కుమార్తె …

Read More »

“ప్ర‌జ‌ల‌ను మోసం చేసే వాడే… నాయకుడు!“

“ప్ర‌జ‌ల‌ను ఎంత బాగా మోసం చేసే ల‌క్ష‌ణం ఉంటే.. వారే నాయ‌కులు అవుతారు“ అని కేంద్ర మంత్రి… బీజేపీ నేత నితిన్ గ‌డ్క‌రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ర‌చుగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. పైగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి వ్య‌తిరేకంగా ఆయ‌న వ్యాఖ్య‌లు చేస్తార‌న్న పేరు కూడా తెచ్చుకున్నారు. అయినా.. త‌ను చెప్పాల‌ని అనుకున్న‌ది నిర్మొహ‌మాటంగా చెప్పారు. ఇలానే తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ …

Read More »

హరీష్ రావు పై కవిత సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి హరీష్ రావు, మేఘా అధినేత కృష్ణారెడ్డిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వారివల్లే తన తండ్రి కేసీఆర్ కాళేశ్వరం కేసులో సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందని షాకింగ్ ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సమయంలో హరీష్ రావు ఇరిగేషన్ శాఖా మంత్రి అని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వల్లే హరీష్ రావును మంత్రి పదవి నుంచి తొలగించారని కవిత చేసిన ఆరోపణలు తెలంగాణ …

Read More »

హరీశ్, సంతోష్ లే అసలు నిందితులు: కవిత

కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఈ వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ మంటలను రాజేసింది. నిన్నటిదాకా విదేశీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత సోమవారం వచ్చీరాగానే ఈ వ్యవహారంపై పెను కలకలమే సృష్టించారు. జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కవిత… కాళేశ్వరంలో అవినీతికి పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ …

Read More »