Political News

‘కాపు’ కోటా లో రాజాకు మంత్రి పదవి?

Jakkampudi-Raja

తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌క‌టించిన నామినేటెడ్ ప‌ద‌వుల్లో అనేక సంచ‌నాలు చోటు చేసుకున్నాయి. అనేక మంది కీల‌క నేత‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తుతం ఉన్న ప‌ద‌వుల నుంచి త‌ప్పించారు. ఇలా త‌ప్పించిన వారికి కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం ఆయా ప‌దువుల్లో ఉన్న వీరంతా.. జ‌గ‌న్ కు అత్యంత సన్నిహితులుగా పేరుంది. ఇలాంటి వారిలో కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ జ‌క్పంపూడి రాజా ఒక‌రు. గ‌త రెండేళ్లుగా …

Read More »

పవార్ కు మోడి గాలమేస్తున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడితో మహారాష్ట్రలోని ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ భేటీ అవ్వటం ఆశ్చర్యంగా ఉంది. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాగే ఎన్డీయే కు బలమైన ప్రత్యర్ధిగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావటంలో పవార్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం అందరు చూస్తున్నదే. ఇలాంటి నేపధ్యంలో మోడి-పవార్ భేటీ జరగటం సంచలనంగా మారింది. ఎలాగైనా …

Read More »

బైరెడ్డికి బంప‌ర్ ప‌ద‌వి ఇచ్చేసిన జ‌గ‌న్‌..!

byreddy

హ‌మ్మ‌య్యా ఎట్ట‌కేల‌కు క‌ర్నూలు జిల్లాకు చెందిన యువ‌నేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు. బైరెడ్డికి క‌ర్నూలు జిల్లాకు చెందిన యువ‌నేతే కావ‌చ్చు. కానీ త‌న వాక్చాతుర్యం.. రాజ‌కీయ చ‌తుర‌త‌తో రాష్ట్ర వ్యాప్తంగానే పార్టీలోనూ, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ హైలెట్ అయిపోయాడు. బైరెడ్డి ఏం చేసినా… ఏం మాట్లాడినా ఓ సంచ‌ల‌న‌మే అవుతూ వ‌చ్చింది. చిన్న వ‌య‌స్సులోనే జ‌గ‌న్ ద‌గ్గ‌ర తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న బైరెడ్డి అంటే పార్టీలోనే …

Read More »

ఆ మూడు కార్పొరేష‌న్లూ.. రెడ్ల‌కే.. రీజ‌నేంటి?

రాష్ట్రంలో జ‌రిగిన నామినేటెడ్ ప‌ద‌వుల పందేరంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశామ‌ని.. మ‌హిళా సాధికార‌త‌కు ఇవి నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్న స‌ర్కారు.. వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగుల‌ పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. మొత్తం కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశామ‌ని చెబుతున్నా.. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చామ‌ని చెప్పుకొంటున్నా.. కీల‌క‌మైన ప‌దవుల‌ను మాత్రం త‌న సొంత సామాజిక వ‌ర్గానికే అప్ప‌గించార‌ని.. సీఎం జ‌గ‌న్‌పై ఇటు రాజ‌కీయంగా.. అటు సోష‌ల్ మీడియా ప‌రంగా కూడా …

Read More »

జగన్ వ్యూహాత్మక నిర్ణయం

ప్రభుత్వం భర్తీ చేసిన వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎంఎల్ఏల్లో ఎవరినీ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే కొన్ని కార్పొరేషన్లను నియమించారు. అప్పట్లో నియమించిన కార్పొరేషన్లకు ఛైర్మన్లకు ఎంఎల్ఏలను మాత్రమే నియమించారు. ఏపీఐఐసీ, తుడా, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మల్లాది విష్ణు, రాజాలను నియమించారు. అప్పట్లో ఛైర్మన్లుగా ఎంఎల్ఏలను నియమించటానికి కారణం మంత్రివర్గంలో …

Read More »

అందుకే సైలెంట్‌గా ఉన్నారా?

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం సాధార‌ణం. అధికారంలో ఉన్న పార్టీ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపుతూ ప్ర‌తి ప‌క్ష పార్టీలు గొంతు పెంచ‌డం అందుకు త‌గిన‌ట్లుగా ప్ర‌భుత్వంలో ఉన్న నేత‌లు స్పందించ‌డం చూస్తూనే ఉంటాం. కానీ తెలంగాణ‌లో త‌న తండ్రి పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన ష‌ర్మిల విమ‌ర్శ‌ల‌పై అధికార టీఆర్ఎస్ కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. టీఆర్ఎస్ అనే కాదు ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ …

Read More »

టీటీడీపీ కొత్త అధ్య‌క్షుడిపై క్లారిటీ…!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత దీనస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తన ఉనికిని చాటుకుంది. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మల్కాజ్‌గిరి నుంచి పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపి మల్లారెడ్డి కూడా పార్టీ మారిపోయారు. చివ‌ర‌కు 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాత్రమే …

Read More »

ఇది జ‌గ‌న్ వైఫ‌ల్యం.. గెజిట్‌పై చంద్ర‌బాబు ఫైర్‌

కృష్ణా, గోదావ‌రి న‌దుల జ‌లాల విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న వివాదం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకుని ప‌రిష్క‌రించాల్సింది పోయి.. ఏకంగా.. త‌నే పెత్త‌నం చేసేలా నిర్ణ‌యం తీసుకుని గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం జ‌గ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేయ‌గా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తీవ్ర అభ్యంత‌రం.. వ్య‌క్తం చేశారు. అంతేకాదు, దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఒప్పుకొనేది …

Read More »

రఘురామ విషయంపై టీడీపీలో చర్చా ?

Chandrababu

చంద్రబాబునాయుడు అండ్ కో వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. గురువారం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 19 వ తేదీనుండి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో టేకప్ చేయాల్సిన అంశాలపై చర్చించేందుకు సమావేశం జరిగింది. సరే ఇలాంటి సమావేశాలు అన్నీ పార్టీల్లోను జరగటం సహజమే కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలపైన, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి …

Read More »

ప‌వ‌న్‌కు టైం లేదు.. మ‌రి రాజ‌కీయాలు?

ప్ర‌జ‌ల కోస‌మే త‌న జీవిత‌మ‌ని.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు సినిమాల‌ను వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని ప్ర‌క‌టించి రెండేళ్ల పాటు జ‌న‌సేన‌ను ప్ర‌జ‌ల్లో ప‌రుగులు పెట్టించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు రాజ‌కీయాలు చేసే టైం లేదా? పూర్తిగా సినిమాల‌తోనే బిజీ అయిపోయారా? అంటే అవున‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి. ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో తీరిక లేకుండా ఉన్న ఆయ‌న‌.. ఇక పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి రాజ‌కీయాల్లో ఎదిగేది ఎప్పుడ‌నే మాటలు …

Read More »

వైవీకే టీటీడీ ప‌గ్గాలు.. జ‌గ‌న్ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం

YV Subba Reddy

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్‌గా మ‌ళ్లీ వైవీ సుబ్బారెడ్డికే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మొగ్గు చూపారు. పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. దీంతో జ‌గ‌న్ నిర్ణ‌యంపై ఒక‌వైపు సంతోషం వ్య‌క్త‌మ‌వుతున్నా.. వైవీ వ‌ర్గంలో మాత్రం ఒకింత నిరుత్సాహం క‌నిపిస్తోంది. నిజానికి టీటీడీ బోర్డు ప‌ద‌వికి ఇటీవ‌ల స‌మ‌యం గ‌డిచిపోవ‌డంతో జ‌గ‌న్‌.. బోర్డు ను ర‌ద్దు చేశారు. దీంతో వైవీ.. అటు రాజ్య‌స‌భ కానీ, ఇటు …

Read More »

అమ‌రావ‌తి ఐకానిక్ వంతెన.. ముగలెట్టకుండానే కూల్చేస్తున్నారు

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌రో షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో ఆయ‌న దీనికి కూల్చేసేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే రాజ‌ధానిని మారుస్తూ.. మూడు రాజ‌ధానులుగా నిర్ణ‌యించారు. దీనిపై ప్ర‌జ‌లు, రైతుల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా సీఎంగా చంద్ర‌బాబు గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా తిరిగితోడుతున్న జ‌గ‌న్‌.. రాజ‌ధాని ప‌రిధిలోని క‌ర‌క‌ట్ట స‌మీపంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల కోసం నిర్మించిన ప్ర‌జావేదిక‌ను …

Read More »