Political News

విలీనానికి షర్మిల షరతు పెట్టారా ?

కాంగ్రెస్ లో వైఎస్సార్టీపి విలీనం రెండు అడుగులు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. పార్టీవర్గాల తాజా సమాచారం ఏమిటంటే విలీనం చేయటానికి అంగీకరించిన షర్మిల కాంగ్రెస్ అధిష్టానం ముందు ఒక షరతు విధించారట. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఐదు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అడిగారట. గడచిన రెండు సంవత్సరాలుగా తననే నమ్ముకుని, తనతో పాటు ప్రయాణిస్తున్న నేతల్లో కొందరికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని షర్మిల స్పష్టంగా …

Read More »

సబితలో టెన్షన్ పెరిగిపోతోందా ?

మంత్రి సబితా ఇంద్రారెడ్డిలో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే చిరకాల ప్రత్యర్ధి, ప్రస్తుతం పార్టీలోనే ఉన్న తీగల కృష్ణారెడ్డి నుండి టికెట్ విషయంలో తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుండటమే. నిజానికి సబిత-తీగల చాలాకాలంగా ప్రత్యర్ధులు. సబిత కాంగ్రెస్ లో ఉండేవారు, తీగల తెలుగుదేశంపార్టీలో ఉండేవారు. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో తీగల టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. పోయిన ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా తీగల …

Read More »

జగన్ కు పవన్ 48 గంటల అల్టిమేటం

సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్..తాజాగా నేడు భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. ఎర్ర మట్టి దిబ్బలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పవన్ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ క్రమంలోనే జగన్ పై పవన్ మండిపడ్డారు. ఎర్రమట్టి దిబ్బలు విశాఖ వారసత్వ సంపద. అని, వాటిని కాపాడుకోవడం మన …

Read More »

వైసీపీ ‘పుష్ప’ల వల్లే అలిపిరిలో చిరుతలు: బోండా ఉమ

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు చిరుత, ఎలుగుబంటి వంటి వన్యప్రాణుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిన్నారులపై చిరుత దాడి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. ఈ క్రమంలోనే భద్రతా చర్యల పేరుతో టీటీడీ కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడికి ఒక ఊతకర్ర ఇస్తామంటూ టీటీడీ నూతన …

Read More »

చంద్రబాబుది సుత్తి..దిక్కుమాలిన విజన్‌: పేర్ని నాని!

టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గతంలో విజన్‌ 2020 అన్న వాడు ఇప్పుడు విజన్‌ 2047 అంటున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన పేర్ని నాని..చంద్రబాబుది అంతా సుత్తి విజన్‌, ఓ దిక్కుమాలిన విజన్‌ అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఇరవై ఏళ్ల క్రితం పెరిగిన ఛార్జీలను తగ్గించమని నిరసన చేపట్టిన …

Read More »

బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందా ?

అవుననే అంటోంది ఒక రీసెంట్ సర్వే ఫలితం. తెలంగాణా ఇంటెన్షన్.కామ్ పేరుతో మొత్తం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సర్వే జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ 1024 శాంపిల్స్ తీసుకున్నారు. ఆగష్టు 6-12 తేదీల మధ్య విస్తృతమైన సర్వే నిర్వహించారు. శాంపిల్స్ ఆధారంగా రాష్ట్రంలో పొలిటికల్ మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు మాత్రమేచేసిన సర్వే ఇది. దాని ప్రకారం చూస్తే గతంతో పోలిస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పడిపోయినట్లు అర్ధమవుతోంది. 2018 ఎన్నికల్లో …

Read More »

రికార్డు సరే… షర్మిలకు ఏంటి లాభం ?

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరుదైన రికార్డు సాధించారు. 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తొలి మహిళగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఇంతవరకు సంతోషించాల్సిన విషయమే. గతంలో కూడా షర్మిల పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా ఏపీలో షర్మిల పాదయాత్ర చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇపుడు తెలంగాణాలో పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి పాదయాత్ర చేస్తున్నారు. వివిధ …

Read More »

కేసీయార్ ఎందుకు తప్పుకున్నారు ?

ఇపుడి విషయంపైనే ప్రభుత్వ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆరోగ్యశ్రీ ట్రస్టు ఛైర్మన్ బాధ్యతలనుండి కేసీయార్ తప్పుకున్నారు. వరంగల్ కు చెందిన డాక్టర్ సుధాకరరరావుకు ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ ట్రస్టు నియమ, నిబంధనలకు కేసీఆర్ నిర్ణయం విరుద్ధం. అయినా సరే ఎందుకు తప్పుకున్నారు ? ఎందుకని డాక్టర్ సుధాకర్ కు బాధ్యతలు అప్పగించారు ? ఆరోగ్యశ్రీ ట్రస్టు ఏర్పాటైన దగ్గర నుండి …

Read More »

ఎంపీగా శ్రీదేవి.. అదే బాబు ప్లాన్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యేగా తాడికొండ నుంచి గెలిచిన ఉండ‌వ‌ల్లి శ్రీదేవి టీడీపీలో చేర‌డం ఖాయ‌మైంది. ఇటీవ‌ల టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర తాడికొండ చేరుకుంది. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి రైతుల‌తో లోకేష్ ముఖాముఖీలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉండ‌వ‌ల్లి శ్రీదేవి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మైన ఆమె.. వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీకి మేలు …

Read More »

సునీత‌మ్మా.. మీరు కూడా ప‌వ‌న్‌ను అనేయ‌డ‌మేనా? : పొలిటిక‌ల్ టాక్‌

“ఏం సునీత‌మ్మా.. మీరు కూడా ప‌వ‌న్‌పై వ్యాఖ్య‌లు చేసే స్థాయికి వ‌చ్చారే!” అని పొలిటిక‌ల్ అన‌లిస్టులు పెద‌వి విరుస్తున్నారు. అంతేకాదు.. ఏ పార్టీ నుంచి ఆఫ‌ర్లు వ‌స్తే.. ఆ పార్టీలోకి జంప్ చేసే ఏకైక మ‌హిళ‌గా గుర్తింపు తెచ్చుకున్న మీరు.. ప‌వ‌న్ గురించి మాట్లాడు నైతిక అర్హ‌త ఉందా? అని ప్ర‌శ్నించారు. ఇంకా.. మీరు ప‌వ‌న్‌ను అనే స్థాయికి ఎద‌గ‌లేద‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏం జ‌రిగిందంటే.. పోతుల సునీత‌. ఈ …

Read More »

వ‌చ్చే 100 ఏళ్లు.. యువ‌త‌దే: చంద్ర‌బాబు .. విజ‌న్ డాక్యుమెంట్

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా 2047 విజ‌న్ డాక్యుమెంటును విడుద‌ల చేశారు. వ‌చ్చే 25 సంవ‌త్స‌రాల పాటు ఏం చేస్తే.. ఈ రాష్ట్రం డెవ‌ల‌ప్ అవుతుంది? ఉపాధి, వ‌న‌రులు పెరుగుతాయి? అనే కీల‌క విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. విశాఖ‌లో మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ‌న్‌-2047 డాక్యుమెంట్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా డాక్యుమెంటులోని కీల‌క విష‌యాల‌ను …

Read More »

టీడీపీలో నాయకులు లేరు.. జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్

వైసీపీ ప్రభుత్వంపై, జగన్ సర్కారుపై, పోలీసులపై, టీడీపీపై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న జేసీ దివాకర్ రెడ్డిపై చిందులేసినందుకే గోరంట్ల మాధవ్‌కు ఎంపీ టికెట్‌ ఇచ్చారని షాకింగ్ కామెంట్లు చేశారు జేసీ. ఇక, టీడీపీలో కార్యకర్తలున్నారని, నాయకులు లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళా పోలీసును ఎస్ఈబీ పోలీస్ స్టేషన్లో అవమానిస్తే మాట్లాడే దిక్కే లేదా తెలుగుదేశానికి …

Read More »