Political News

కేసీఆర్ ఆటలు సాగవు

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను మేడిగ‌డ్డ ప‌రిశీల‌నకు వెళ్తున్నాన‌ని తెలిసే.. కేసీఆర్ జ‌గిత్యాల‌లో స‌భ పెట్టుకున్నార‌ని వ్యాఖ్యానించారు. మేడిగ‌డ్డ‌ను ప‌రిశీలించి.. ప్ర‌జ‌ల‌కు నిజాల‌ను చెబుతాన‌న్న భ‌యం ఉంద‌ని.. అంద‌కే కేసీఆర్ డబుల్ స్టాండ‌ర్డ్ రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌ని విమ‌ర్శించారు. మేడిగడ్డ‌ను నంజుకుతిన్నార‌ని.. ల‌క్షా 50 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు ద్వారా రైతుల‌కు ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేద‌ని వ్యాఖ్యానించారు. …

Read More »

100 కోట్ల తేడా.. పోలింగ్‌కు ముందు విజ‌య్‌కు చిక్కులు!

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో ఒంట‌రి పోరుకు రెడీ అయిన‌.. ద‌ళ‌ప‌తి విజ‌య్‌కు ఆదిలోనే చిక్కులు ఎదుర‌వుతున్నాయి. ఒక‌వైపు స‌తీమ‌ణి విడాకుల కేసు విచార‌ణ కొన‌సాగుతుండ‌గా.. మ‌రోవైపు క‌రూర్ తొక్కిస‌లాట దుర్ఘ‌ట‌న కేసు కూడా.. ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు సాగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా విజ‌య్ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ల‌లో తేడా ఉంద‌ని పేర్కొంటూ.. మ‌ద్రాస్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దాదాపు 100 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే లెక్క‌లు తేడా చూపించార‌ని.. చెన్నైకి చెందిన విఘ్నేశ‌న్ అనే …

Read More »

శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయిన వెంకట్రామిరెడ్డి

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా కొనసాగుతున్న ఈ రెడ్డి గారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయనను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సాధారణ పరిపాలనా శాఖ జీవో ఎంఎస్ నెం:43 పేరిట ఉత్తర్వులను జారీ చేసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించడం చాలా …

Read More »

తమిళుల మనసు గెలుచుకున్న బాబు

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. అందులో భాగంగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలోకి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం దిగిపోయారు. సోమవారం తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్న చంద్రబాబు… ఎన్డీఏ పెద్దల వినతి మేరకు ఉదయాన్నే జన్మదిన వేడుకలను ముగించుకున్న చంద్రబాబు నేరుగా తమిళనాడులో వాలిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూరులో అడుగుపెట్టిన చంద్రబాబు అక్కడి ఓటర్లు ఎన్డీఏ వైపునకు తిరిగేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. …

Read More »

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ ఫ్యామిలీ..!

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా.. దేశ‌వ్యాప్తంగా ఒక‌ప్పుడు సంచ‌ల‌నం రేపిన వీర‌ప్ప‌న్ గురించి అంద‌రికీ తెలిసిందే. క‌ర్ణాట‌క నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు ఉన్న అట‌వీ ప్రాంతంలో ఒక‌ప్పుడు వీర‌ప్ప‌న్ ప్ర‌త్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్ర‌భుత్వాల‌ను సైతం గ‌డ‌గ‌డ‌లాడించిన ఆయ‌న‌ను ఎన్ కౌంట‌ర్‌లో పోలీసులు హ‌త‌మార్చారు. అయితే.. వీర‌ప్ప‌న్ పేరు త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంటుంది. ఆయ‌న కుమార్తె, భార్య కూడా.. త‌ర‌చుగా మీడియాలో క‌నిపిస్తూ ఉంటారు. తాజా ఎన్నిక‌ల్లో వీర‌ప్ప‌న్ మొద‌టి …

Read More »

అలా షాక్ ఇచ్చారేంటి మోదీ గారు

ఎన్నిక‌ల రాజ‌కీయాల్లో ఆరితేరిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. సమ‌యం.. సంద‌ర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అత్యంత‌చేరువ అయ్యేలా ఆయ‌న రాజ‌కీయ వ్యూహాలు.. అడుగులు ఉంటాయి. దాదాపు ప‌న్నెండు ఏళ్ల త‌ర్వాత‌.. ఆయ‌న ఇలాంటి రాజ‌కీయ అడుగులు వేశారు. అదికూడా కీల‌క‌మైన ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌ని బీజేపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. ఏం చేశారంటే.. ప్ర‌ధాన మంత్రి మోడీ.. …

Read More »

నాడు బాబు… నేడు స్టాలిన్

రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా పనిచేశాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయి విజయాన్ని కూటమి దక్కించుకుంది. నాడు కూటమిని విజయతీరాలకు చేర్చిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన వ్యూహాలు దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలను ఆకట్టుకున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులోని అధికార డీఎంకే …

Read More »

కేర‌ళ‌ల‌కు విస్త‌రించిన జ‌న‌సేన‌…

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన పార్టీ ఇప్పుడు కేర‌ళ‌కు కూడా విస్త‌రించింది. తాజాగా ఆ పార్టీ విస్త‌ర‌ణ‌పై దృష్టి పెట్టిన పార్టీ అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. .కేర‌ళ నుంచి ప‌లువురు అభిమానుల సూచ‌న‌లు.. అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. ఆ రాష్ట్రంలోనూ విస్త‌రించేలా ప్ర‌ణాళిక‌లు చేశారు. ఈ క్ర‌మంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగ‌బాబు సార‌థ్యంలో ఓ బృందం ఆదివారం కేర‌ళ రాజ‌ధాని …

Read More »

ఈ `ఐక్య‌త` కొన‌సాగితే.. మోడీకి క‌ష్ట‌మే!

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి ఐక్య‌తపై త‌ర‌చుగా అనేక చ‌ర్చ‌లుజ‌రుగుతున్నాయి. నిజానికి గ‌త 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ముందే.. ఇండియా కూట‌మి ఏర్పడింది. ప్ర‌ధాని మోడీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే జ‌రిగింది. అయితే.. ప‌ద‌వులు.. పంప‌కాల విష‌యంలో క్షేత్ర‌స్థాయిలో పార్టీల మ‌ధ్య నెల‌కొన్ని విభేదాల కార‌ణంగా.. ఈ ఐక్య‌త గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో నేతిబీరను త‌ల‌పించింది. ఇక‌, రాష్ట్రాల స్థాయిలో జ‌రిగిన‌, జ‌రుగుతున్న అసెంబ్లీ …

Read More »

అమ్మ పుట్టినరోజు గుర్తులేదా జగన్?

ఆదివారం(ఏప్రిల్ 19) వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమ‌ణి, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజ‌య‌మ్మ పుట్టిన రోజు. ఆమె తాజాగా 70 ఏళ్ల వ‌య‌సులోకి అడుగు పెట్టారు. అయితే.. విజ‌య‌మ్మ కుమారుడు, మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఆమెకు శుభాకాంక్ష‌లు తెల‌ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యం రాజ‌కీయంగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చింది. కానీ, ఇదేస‌మ‌యంలో మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాత్రం విజ‌య‌మ్మ‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. …

Read More »

జ‌గ‌న్ ను రాకుండా చేస్తానంటున్న 80 ఏళ్ల ఎమ్మెల్యే

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను అధికారంలోకి రాకుండా చేస్తాన‌ని.. అవ‌స‌ర‌మైతే.. చంద్ర‌బాబు ఓకే అంటే.. తాను కూడా పాద‌యాత్ర‌కు రెడీ అంటూ.. రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే, 80 ఏళ్ల‌కు పైబ‌డిన వ‌య‌సున్న సీనియర్ నాయ‌కుడు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌మండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. జ‌గ‌న్ పై నిప్పులు చెరిగారు. జ‌గ‌న్‌కు హ‌త్యారాజ‌కీయాలు అల‌వాటేన‌ని పేర్కొన్న గోరంట్ల‌.. ఓ మీడియా అధిప‌తికి జాగ్ర‌త్త‌లు చెప్పారు. ఆయ‌న …

Read More »

అజారుద్దీన్ మంత్రిగిరీ సేఫేనా…?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగిరీ ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ఈ నెలాఖరులోగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోతే… అజ్జూ భాయ్ మంత్రిగిరీ ఊడిపోయినట్టే. ఎందుకంటే…ప్రస్తుతం ఏ చట్టసభలోనూ సభ్యుడిగా లేకుండానే అజారుద్దీన్ మంత్రిగా కొనసాగుతున్నారు. మంత్రి పదవి చేపట్టిన నేత ఆరు నెలల్లోగా అటు ఎమ్మెల్యేగానో, లేదంటే ఎమ్మెల్సీగానో ఎన్నిక కావాల్సి ఉంది. అలా కాని పక్షంలో …

Read More »