Political News

ఆ ‘కమ్మ’టి కామెంట్లతో బీజేపీకి సంబంధం లేదా?

బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అది స్వపక్షమైనా..విపక్షమైనా.. ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడి కొన్ని సందర్భాల్లో ఆయన చిక్కుల్లో పడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా తమ మిత్రపక్షమైన టీడీపీని, కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కమ్మగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. గతంలో ఎన్టీఆర్ పాలన …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ మాస్టర్ ప్లాన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హాజరు నమోదు విధానంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసుకున్న కీలక నిర్ణయంతో మాన్యువల్ రిజిస్టర్ సంతకాల పద్ధతికి స్వస్తి పలుకుతూ పూర్తిస్థాయి డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఇకపై సభ్యులు సభలోకి వచ్చి తమకు కేటాయించిన సీటులో కూర్చున్నప్పుడే హాజరు నమోదు కానుంది. ఇప్పటివరకు సమావేశ మందిరం వెలుపల ఉన్న రిజిస్టర్‌లో సభ్యులు సంతకాలు చేసి హాజరు నమోదు చేసుకునేవారు. అయితే …

Read More »

పిఠాపురానికి పెద్ద కొడుకుగా పవన్ కల్యాణ్

పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండాలనే ధ్యేయంతో ఆయన నిరంతరం స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. చిన్న సమస్యైనా, పెద్ద సమస్యైనా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం ఆయన పని తీరుకు ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు తన …

Read More »

చంద్రబాబు ర్యాంకుపై జగన్ సెటైర్లు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కూటమి పార్టీల నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75 శాతం వృద్ధి సాధించిందని, 2025-26లో 10.75 శాతం వృద్ధి సాధించబోతున్నామని అంచనా వేస్తూ ప్రభుత్వం ఓ నివేదికను కూడా విడుదల చేసింది. అయితే, ఆ నివేదికను ఏపీ మాజీ సీఎం జగన్ తప్పుబట్టారు. ఈ గణాంకాలు …

Read More »

ఒక బుక్ తో మోదీని ఇరుకున పడేసిన రాహుల్

మాజీ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన “ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ” పుస్తకం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో చైనాతో యుద్దం వేళ ప్రత్యర్థి సైనికులు, యుద్ధ ట్యాంకులు భారత సరిహద్దుల వరకూ వచ్చిన విషయాన్ని తాను కేంద్రానికి చెప్పినా స్పందించలేదని నరవణే ఆ పుస్తకంలో ప్రస్తావించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ తర్వాత ఆర్మీ ఈ పుస్తకం రిలీజ్ కు …

Read More »

అంబటికి ఉండవల్లి సపోర్ట్

దివంగత వైఎస్సార్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అత్యంత విశ్వాస పాత్రుడు అన్న సంగతి తెలిసిందే. ఆ విశ్వాసాన్ని వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ కు కూడా ఉండవల్లి సందర్భానుసారంగా మద్దతుగా నిలుస్తుంటారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన చాలామంది నేతలతో ఉండవల్లికి సత్సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ పై ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉండవల్లి పరామర్శించారు. …

Read More »

తెల్లారేస‌రికే వ్యూహం మార్చేసిన జగన్..?

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ నెల 14న 2026-27 వార్షిక బ‌డ్జెట్‌ను కూడా స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. అయితే.. ఈ స‌భ‌కు హాజ‌ర‌య్యే వ్య‌వ‌హారంపై వైసీపీ అధినేత జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా.. సోమ‌వారం ప్ర‌త్యేక వార్త చక్కర్లు కొట్టింది. స‌భ తొలిరోజు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలోఆయ‌న ప్ర‌సంగానికి హాజ‌రు కావాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వైసీపీ కార్యాల‌యం తెలిపినట్టు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. వాస్త‌వానికి …

Read More »

కమల్ మాట్లాడింది జగన్ గురించి కాదు స్వామి

టీవీ5 సాంబ…సోషల్ మీడియాలో బాగా పాపులర్. టీవీ5 తెలుగు న్యూస్ ఛానెల్లో సాంబ చదివే వార్తలకు సెపరేట్ ట్రోలర్స్ ఫ్యాన్ బేస్ ఉంది. సాంబ టంగ్ స్లిప్ అయ్యి చేసే కామెంట్ల వీడియోలు సోషల్ మీడియాలో చాలాకాలంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి సాంబ తన మార్క్ కామెంట్లతో ట్రోలర్స్ కు మంచి స్టఫ్ ఇచ్చారు. రాజ్యసభలో కమల్ హాసన్ చేసిన కామెంట్లు ఏపీ మాజీ సీఎం …

Read More »

జగన్ అసెంబ్లీకి వస్తున్నారు కానీ…

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు.. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో అంద‌రి దృష్టీ స‌హ‌జంగా ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుంది? ఎలాంటి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెడుతుంది? అనే చ‌ర్చ ఉంటుంది. అయితే.. దీనిని మించి ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు అన‌గానే.. ప్ర‌తిప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీ ఎమ్మెల్యేల గురించి చ‌ర్చే జ‌రుగుతోంది. ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వ‌స్తారా? రారా? అనేది ప్ర‌ధాన చ‌ర్చ‌నీయాంశంగా మారింది. …

Read More »

అభిమానం అంతదూరం నడిపించింది..

సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర అలిపిరికి చేరుకుంది. మెట్ల మార్గంలో ఆయన శ్రీవారి సన్నిధికి బయలుదేరారు. జనవరి 19న హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌ నివాసం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సుమారు 507 కిలోమీటర్లు సాగి సోమవారం తిరుపతికి చేరింది. మార్గమధ్యంలో పలుచోట్ల అభిమానులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు కలిసి ఆయనకు మద్దతుగా నడిచారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అభిమానంతోనే ఈ సంకల్పయాత్ర చేపట్టినట్లు బండ్ల గణేశ్ …

Read More »

‘సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలి…’ స‌ర్కారుపై ఒత్తిడి

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారంలో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. టీడీపీ నేత‌ల ఆధ్వ‌ర్యంలో ప‌లు జిల్లాల్లో సోమ‌వారం.. నిర‌స‌న కార్య‌క్ర‌మాలు జోరుగా సాగాయి. ఈ కేసులో త‌ప్పు ఒప్పుకొన్న టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాలంటూ.. పెద్ద ఎత్తున నాయ‌కులు నిన‌దించారు. రెండు రోజుల కింద‌ట ఢిల్లీలో మీడియా స‌మావేశం నిర్వ‌హించిన వైవీ సుబ్బారెడ్డి.. క‌ల్తీ జ‌రిగిన …

Read More »

భారత్ కు చిరకాల మిత్రుడు దూరం అవుతున్నాడా?

భారత్ కు ఇబ్బంది ఎదురైతే తాను అండగా ఉన్నట్లుగా వ్యవహరించే రష్యా.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇటీవల యూఎస్ తో జరిగిన వాణిజ్య డీల్ మాస్కోకు కోపం తెప్పించిందా? భారత్ కు చిరకాల మిత్రుడిగా ఉన్న రష్యా ఇప్పుడు భారత్ కు క్రమక్రమంగా దూరమవుతుందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణం.. తాజాగా పాక్ లో చోటు చేసుకున్న పరిణామాలపై పాక్ ప్రధానికి రష్యా అధినేత పుతిన్ …

Read More »