జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది అనేకన్నా వాళ్ళ రియాక్షన్ తో అనేక వివాదాలు పుట్టుకువస్తున్నాయి. సాధారణంగా ఇవి తరచు ఇతరులకు ఇబ్బంది కలిగించేవి. కానీ ఇపుడు అభిమానుల తీరు పవన్ కే ఇబ్బందిని కలిగించింది. తాజాగా రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరైన పవన్ మాట్లాడటం మొదలుట్టడమే ఆలస్యం. వెంటనే సీఎం…సీఎం అంటు ఒకటే గోల. కాసేపు నిశ్శబ్దంగా ఉండమని …
Read More »వేటుపడే మంత్రులకు ఆ బాధ్యతలు!
2024 ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారా? ఆ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? ఆ దిశగానే త్వరలో ప్రకటించబోయే మంత్రివర్గంలో మార్పులు ఉండనున్నాయా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరో ఏడాదిన్నర ఆగితే మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. దీంతో ఆ లోపే ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. …
Read More »నా సహనాన్ని పరీక్షించొంద్దు…పవన్ వార్నింగ్
ఏపీలో కొద్ది రోజులుగా జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో ‘శ్రమదానం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఆ కార్యక్రమానికి, బహిరంగ సభకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్ కల్యాణ్ ఎయిర్పోర్టులో అడుగుపెట్టింది మొదలు…సభా ప్రాంగాణానికి వెళ్లి …
Read More »ఆనంకు వచ్చే ఎన్నికల్లో అనుమానమే
సీనియర్ నేత, మాజీమంత్రి, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారం పార్టీలో పెద్ద తలనొప్పిగా తయారైంది. గతకాలపు తన వైభవాన్ని తలచుకుంటు ప్రస్తుతం తనను ఎవరు లెక్కచేయటం లేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. దాంతో అధికారులపైన, మంత్రులు, సహచర ఎంఎల్ఏలపై రెగ్యులర్ గా ఏదోఒక వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. తానుచేసే వ్యాఖ్యలు ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా చేటు తెస్తాయన్న విషయం బాగాతెలిసి కూడా తన పద్దతిని మార్చుకోవటంలేదు. అంటే ఏదోరకంగా …
Read More »రాంగ్ రూట్లో కేటీఆర్ వాహనం ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు
సాదారణంగా మనం యూటర్న్ దూరంగా ఉంటేనో.. లేక తొందరగా పోవాలనో తప్పు అని తెలిసినా కొన్ని సందర్భాల్లో వాహనంపై రాంగ్రూట్లో వెళ్తుంటాం. ఆ సమయానికి అక్కడ ట్రాఫిక్ పోలీసులుంటే.. ఒకవేళ పట్టుబడితే మన వాహన చిట్టాను విప్పుతారు. చలానాలు పెండింగ్లో ఉన్నాయంటే చాలు.. పోలీసులు నిర్దాక్షిణ్యంగా సీజ్ చేసేస్తారు. ఎంత వేడుకున్నా ఊరుకోరు. మనకు కాస్త పలుకుబడి ఉందనుకో అప్పటికి సులభంగా బయటపడొచ్చు. అదే పలుకుబడి లేని కాస్త అమాయకంగా …
Read More »ఈటలకు వరుస షాక్లు
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. అధికారంలో ఉన్న పార్టీ తలుచుకుంటూ ప్రత్యర్థుల పని పట్టడం ఎంత సేపు! డబ్బు అధికారం హోదా ఇలా ఏదో ఒక ఆశ చూపించి ప్రత్యర్థి చుట్టూ ఉన్న వాళ్లను తమ వైపునకు తిప్పుకుని ప్రత్యర్థిని ఒంటరి చేయాలనే ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇప్పుడీ విషయం ఎందుకు అంటారా? హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం ప్రాణం పెట్టి ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి ఈటల …
Read More »గోదావరి సాక్షిగా జనసేనానికి జనం పోటెత్తారు..!
ఏపీలో రోడ్ల దారుణస్థితి నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు రెండు జిల్లాల్లో రోడ్లపై శ్రమదానం చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు ఉదయం రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు వస్తున్నా కూడా పవన్ మాత్రం పట్టు విడవకుండా రాజమండ్రిలో ఎంట్రీ ఇచ్చారు. పవన్కు అభిమానులు, జనసేన సైనికులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి పవన్ …
Read More »బిగ్ బ్రేకింగ్: బద్వేల్ జనసేన అభ్యర్థి ఖరారు..?
ఏపీలోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎలాంటి ట్విస్టులు ఉండవని అనుకుంటే… అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకునే వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి సుధ పోటీలో ఉంటున్నారు. ఇక టీడీపీ నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్ మరోసారి బరిలో ఉంటున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరు …
Read More »ఎంఎల్ఏలను మార్చకపోతే కష్టమేనా ?
తాజాగా వెల్లడైన ఓ సర్వే రిపోర్టు ప్రకారం అధికార వైసీపీలో కొంతమంది ఎంఎల్ఏలను మార్చకపోతే గెలుపు కష్టమే. ఆత్మసాక్షి అనే గ్రూపు కోసమని ఐఐటి విద్యార్ధులు ఏపిలో ఓ సర్వే చేశారు. మార్చి-సెప్టెంబర్ మధ్య జరిగిన సర్వేలో 13 జిల్లాల్లోని 68,200 మందిని టచ్ చేశారు. ఈ సర్వే ఫలితాలు అధికారపార్టీకి వార్నింగ్ ఇస్తున్నట్లే ఉంది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. కాబట్టి సర్వే …
Read More »పాదయాత్రతో బండి ఏం సాధించారు ?
బీజేపీ తెలంగాణా చీఫ్ బండి సంజయ్ పాదయాత్రతో ఏమి సాధించారో అర్ధం కావటంలేదు. మామూలుగా ఎవరైనా పాదయాత్ర చేశారంటే ప్రజల బాధలు వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు, పరిష్కార మార్గాలు చర్చించేందుకే. తాము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను పరిష్కారిస్తామని భరోసా ఇవ్వటం మామూలే. గతంలో పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి చేసిందిదే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేశారనేది వేరే విషయం. అయితే తాజాగా బండి సంజయ్ చేసిన …
Read More »ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మళ్లీ లగడపాటి పేరు
లగడపాటి రాజగోపాల్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి చెప్పిన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకున్న నాయకుడు. మరి ఇప్పుడు ఆయన గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా? ఆయనను తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే దిశగా పరిణామాలు మారుతుండడమే అందుకు కారణం. 2004లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ నుంచి …
Read More »పవన్ కేం తెలుసు గోంగూర కట్ట.. మంత్రి బొత్స
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వరుసగా వైసీపీ మంత్రులు, ఆ పార్టీ కీలక నేతలు విరుచుకు పడుతూనే ఉన్నారు. పవన్ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వాన్ని, జగన్ను టార్గెట్ చేసిన మరుక్షణం నుంచే వైసీపీ వాళ్లు తీవ్రస్థాయిలో పవన్పై ఎటాక్ చేస్తున్నారు. పోసాని కృష్ణమురళీ విమర్శలతో అది తారాస్థాయి వెళ్లింది. ఇప్పటికే పవన్ను మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని పవన్పై భారీగా విరుచుకుపడ్డారు. ఇక ఇప్పుడు బొత్స, …
Read More »