Political News

జ‌డ్జిల‌పై బూతులు.. ఆపై కోర్టుకు అబ‌ద్దాలు.. హైకోర్టు సీరియ‌స్‌..!!

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌ను హైకోర్టు తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌ట్టింది. గ‌డిచిన రెండున్న‌రేళ్ల పాల‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 177 కేసుల్లో హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ త‌గిలింది. అయితే.. ఇలాంటి స‌మస్య‌లు వ‌చ్చిన‌ప్పుడు.. ప్ర‌భుత్వం ఆత్మ ప‌రిశీల‌న చేసుకుని.. ఆయా నిర్ణ‌యాల‌ను వెన‌క్కి తీసుకుని.. స‌రిచేసుకోవ‌డం అనేది ఏ స‌ర్కారుకైనా.. క‌నీస ధ‌ర్మం. కానీ.. ఘ‌న‌త వ‌హించిన వైసీపీ స‌ర్కారు మాత్రం.. ఆ ప‌నిచేయ‌లేదు. పైగా.. వైసీపీ నాయ‌కులు.. గ‌తంలో …

Read More »

వైసీపీ డిమాండ్ లో అర్ధముందా ?

‘రాజ్యాంగబద్దంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ లాంటి అసాంఘీక పార్టీ ఉండకూడదు’ ఇది తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన డిమాండ్. ఎన్నికల్లో టీడీపీ పాల్గొనకుండా బ్యాన్ చేయాలని తాజాగా సహచర ఎంపీలతో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతోందో ఆధారాలతో సహా ఇచ్చామని విజయసాయి మీడియాతో చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా టీడీపీని అడ్డుకునే అధికారం …

Read More »

బాంబ్ పేల్చిన పీకే… రాహుల్ ఇప్పట్లో ప్రధాని కాలేరు!

సోనియాగాంధీ గారాల పట్టి రాహుల్ గాంధీ ఇప్పట్లో ప్రధాని అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే చాలా దశాబ్దాలపాటు బీజేపీనే దేశాన్ని పరిపాలించబోతోంది. ఒక వేళ అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే.. అప్పుడు కూడా రాహుల్ గాంధీకి పోటీ లేక పోతే ఆయన జీవిత చరమాంకంలో ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా ఎందుకు చెబుతున్నామంటే.. బీజేపీ రాజకీయ భవిష్యత్తుపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. భారత రాజకీయాల్లో …

Read More »

ష‌ర్మిల‌కు కేసీఆరే అస్త్రాలు ఇస్తున్నారా?

ఔను! ఇప్పుడు ఈ మాటే తెలంగాణ స‌హా ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా వైఎస్ త‌న‌య‌ ష‌ర్మిల పెట్టిన పార్టీవైపు క‌న్నెత్తి చూడ‌ని నాయ‌కులు.. ఆమె గురించిపెద్ద‌గా ప‌ట్టించుకోని వారు కూడా ఇప్పుడు.. సానుభూతి చూపించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆమె వైపు.. ఆలోచించే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనికి కార‌ణం.. కేసీఆర్ మంత్రివ‌ర్గంలోని అమాత్యుడు..నిరంజ‌న్‌రెడ్డి, పోలీసు శాఖే అని అంటున్నారు ప‌రిశీల‌కు లు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆరే.. …

Read More »

డామిట్ … కథ అడ్డం తిరిగిందా?

రాజ‌కీయాల్లో చ‌ర్చ‌లు, అంచ‌నాలు.. విశ్లేష‌ణ‌లు.. విమ‌ర్శ‌లు కామ‌న్‌. అయితే.. ఒక్కొక్క‌సారి అనుకున్న విధంగా.. ఈ విశ్లేష‌ణ‌లు.. ముందుకు సాగ‌క‌పోతే.. పెద్ద ఎత్తున దెబ్బ త‌గ‌ల‌డం ఖాయం. ఇప్పుడు ఇదే అంశం టీడీపీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. టీడీపీ మంచికోసం.. లేదా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని అధికారంలోకి రాకుండా.. వైసీపీ ఎలా అడ్డుకుంటోంద‌నే విష‌యాన్ని చెప్ప‌డం కోసం.. తాజాగా టీడీపీ నేత‌లు ఓ విశ్లేష‌ణ చేశారు. అదేంటంటే.. వైసీపీ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిషోర్‌.. …

Read More »

కేసీఆర్‌ పై సెటైర్లు వేస్తున్న ఏపీ మంత్రులు

ఏపీలోనూ టీఆర్‌ఎస్ పార్టీని పెట్టాలని అక్కడి నుంచి వేలాదిగా ఆహ్వానాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో పార్టీ పెట్టాలని తాము గెలిపించేందుకు సిద్ధంగా ఉండామని ఏపీ ప్రజలు తనను కోరుతున్నారని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఏపీలో కూడా అమలు చేయాలని కోరుతున్నారని కేసీఆర్ ప్రకటించి కలకలం రేపారు. కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. …

Read More »

కేబినెట్‌లో గంజాయి ప్ర‌స్తావ‌న లేన‌ట్టే!!

రాష్ట్రాన్ని ప్ర‌స్తుతం కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంటే.. అది గంజాయే! తాజాగా తూర్పుగోదావ‌రి స‌హా.. అనంత‌పురంలోనూ గంజాయిని పోలీసులు పెద్ద మొత్తంలో ప‌ట్టుకున్నారు. అదేస‌మ‌యంలో పెళ్లి స‌హా వివిధ శుభ‌కార్యాలకు పిలిచే ఆహ్వాన ప‌త్రిక‌లమాటున కూడా పెద్ద ఎత్తున మాద‌క ద్ర‌వ్యాల‌ను త‌ర‌లిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఇవ‌న్నీ..ఏపీ కేంద్రంగానే జ‌రుగుతున్న‌ట్టు ఇత‌ర రాష్ట్రాల పోలీసులు మ‌రోసారి కూడా చెప్పారు. అయితే.. ఇంత కీల‌క విష‌యంపై కేబినెట్ …

Read More »

ఢిల్లీలో బాబుక‌న్నా ముందే.. వైసీపీ చ‌క్క‌బెట్టేస్తోందిగా..!

చంద్ర‌బాబు క‌ద‌ల‌డానికి ముందే.. వైసీపీ ఢిల్లీని చుట్టేస్తోంది! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజం. ఇటీవ ల టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి.. చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అధికార-విప‌క్ష పార్టీల మ‌ధ్య చెల‌రేగిన మాట‌ల యుద్ధం.. అనేక రూపాల్లోకి మారింది. బంద్‌-నిర‌స‌న‌, దీక్ష‌-నిర‌స‌న దీక్ష‌.. అంటూ.. రెండు పార్టీలూ.. యుద్ధం ప్ర‌క‌టించుకున్నాయి. ఇక‌, ఈ విష‌యాన్ని.. ఢిల్లీకి తీసుకు వెళ్తాన‌ని చెప్పిన‌.. చంద్ర‌బాబు.. అన్నంత ప‌నీ చేశారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న …

Read More »

‘టీడీపీ నేత పట్టాభిని పోలీసులు కొట్టారు’

ఏపీ ప్రభుత్వంపై, వైసీపీ అధినేత, సీఎం జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొంతకాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎయిడెడ్ పాఠశాలల విలీనం వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ఆ విషయంలో బడికి వెళ్లే విద్యార్థులు కూడా జగన్ పై గుర్రుగా ఉన్నారని రఘురామ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ నేత పట్టాభిపై దాడి విషయంలో రఘురామ సంచలన ఆరోపణలు …

Read More »

మంగళవారం మరదలు.. షర్మిలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వ్యక్తిగత దూషణలు, విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. కొందరు నేతలు పొరపాటున నోరుజారితే…మరికొందరేమో అధికారం ఉంది కదా అన్న ధీమాతో వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ నేత, మంత్రి నిరంజన్ రెడ్డి….వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. మంగళవారం మరదలు అంటూ షర్మిలనుద్దేశించి నిరంజన్ రెడ్డి చేసిన …

Read More »

సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు షాక్

మనదేశంలోని రాజకీయ నాయకుల్లో చాలామంది పలురకాల కేసులు ఎదుర్కొంటున్నారు. కొందరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటుండగా, మరికొందరు ఆర్థికపరమైన, అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు. పరిమిత సంఖ్యలో కోర్టులుండడం…అపరిమిత సంఖ్యలో కేసులున్నాయి. దీంతో, పొలిటిషియన్లపై ఉన్న కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో, సదరు రాజకీయ నాయకులపై విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటోంది. ఆ విచారణ పెండింగ్ లో ఉండగానే చాలా మంది నేతలు…ఒకటికి రెండుసార్లు సాధారణ …

Read More »

సీఎం జ‌గ‌న్‌తో అక్కినేని నాగార్జున భేటీ.. ఏం చ‌ర్చిస్తారు?

సినీ హీరో.. అక్కినేని నాగార్జున స‌హా.. ప‌లువురు ముఖ్య నిర్మాత‌లు.. నేడు సాయంత్రం 3-5 గంట‌ల మ‌ధ్య ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో భేటీ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఈ బృందం చేరుకుంది. హీరో అక్కినేని నాగార్జునతోపాటు.. ముఖ్య‌ నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి. కూడా రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయల్దేరిన అక్కినేని నాగార్జున …

Read More »