Political News

బీజేపీకి గట్టి వాళ్ళే దొరుకుతున్నారా ?

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా తెలంగాణా బీజేపీకి గట్టి అభ్యర్ధులే దొరుకుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేయటానికి ఆర్ధికంగా బాగా స్ధితిమంతులే పోటీలు పడుతున్నారు. సహజంగా అయితే ఆర్ధికంగా గట్టిస్ధితిలో ఉన్న వాళ్ళు  ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్నపార్టీ తరపున పోటీచేయటానికి ప్రయత్నాలు చేసుకుంటారు. అయితే ఇక్కడ  రివర్సులో కొందరు కాంగ్రెస్ ను కాదని, బీఆర్ఎస్ ను వద్దనుకుని  బీజేపీ లో చేరటానికి ఎందుకింత ఇంట్రెస్టు …

Read More »

ప్రతిపక్షాలకు రేవంత్ షాకివ్వబోతున్నారా ?

లోక్ సభ ఎన్నికలకు ముందే రెండు భారీ హామీలను అమల్లోకి తేవటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో సిక్స్ గ్యారెంటీస్ అనే పేరుతో కాంగ్రెస్ ఆరు హామీలను ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ గెలుపులో ఈ ఆరుహామీలు కూడా కీలకపాత్ర పోషించాయి. వీటి అమలుకు వంద రోజులను పార్టీ గడువుగా పెట్టుకున్నది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే హామీలన్నింటినీ అమలుచేస్తామని రేవంత్ రెడ్డి పదేపదే ప్రకటించారు. అధికారంలోకి రాగానే …

Read More »

బీఆర్ఎస్ జీవోలకు బ్రేకులు

ఎన్నికలకు ముందు కేసీయార్ హడావుడిగా చాలా ఉత్తర్వులు ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు లేదని తెలిసి కూడా కేసీయార్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అప్పట్లో చాలా జీవోలను జారీచేసింది. ఇపుడు అలాంటి జీవోలన్నింటిని రేవంత్ రెడ్డి నిలుపేశారు. ఎన్నికల ముందు కేసీయార్ ఆదేశాలతో జారీ అయిన జీవోలన్నింటినీ హోల్డులో పెట్టాలని రేవంత్ చీఫ్ సెకట్రరీకి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. జీవోల ద్వారా పరిపాలనా అనుమతులతో మొదలైన పనులను కూడా హోల్డులో పెట్టమని …

Read More »

కాంగ్రెస్ గాలమేస్తోందా?

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కదలికలు మొదలయ్యాయి. ఒకవైపు వైసీపీ, టీడీపీ-జనసేన అధినేతలు పొత్తు చర్చల్లో జోరుపెంచారు. పోటీచేయాల్సిన సీట్లు, నియోజకవర్గాలు, ఉమ్మడి మ్యానిఫెస్టో తదితరాలపై చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి దాదాపు మూడున్నర గంటలు చర్చించారు. ఇక బీజేపీ కూడా అభ్యర్ధుల ఎంపికపై జిల్లాల వారీగా కమిటీలను వేసి ఆశావహులతో మీటింగులు పెట్టుకుంటోంది. వామపక్షాలు తదితర పార్టీలను పెద్దగా …

Read More »

చంద్ర‌బాబు-ప‌వ‌న్‌.. ఉమ్మ‌డి వేడుక‌..

క‌లివిడిగా.. ఉమ్మ‌డిగా ముందుకు సాగాల‌ని  నిర్ణ‌యించిన టీడీపీ, జ‌న‌సేన‌లు పండుగ‌ల‌ను కూడా.. ఉమ్మ‌డి గానే నిర్వ‌హించుకుంటున్నాయి. తాజాగా సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని తొలిరోజు నిర్వ‌హించే భోగి సంద‌ర్భంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. అమ‌రావ‌తి రాజధాని ప్రాంతం మందడంలో నిర్వ‌హించిన‌ భోగి మంటల వేడుకల్లో పాల్గొన్నారు. అడ్డ పంచె కట్టుకుని సంప్రదాయబద్దంగా కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు.. అంద‌రినీ పేరు పేరునా ప‌ల‌కరించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నుంచి పెద్ద …

Read More »

ఎంపీగా పోటీచేయటం ఖాయమేనా ?

ఈమధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయటం ఖాయమేనా ? అనే చర్చ పెరిగిపోతోంది. అదికూడా కడప ఎంపీగా పోటీచేయటానికి షర్మిల రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇందుకు ఆధారాలు ఏమిటంటే కడప పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నేతలతో రెండురోజులుగా షర్మిల భేటీ అవుతున్నారట. ఈ భేటీల్లో కాంగ్రెస్ నేతలు, తటస్తులే కాకుండా కొందరు వైసీపీ చోటా నేతలు కూడా …

Read More »

సంబ‌రాల రాంబాబు… అంబ‌టి రాంబాబు!

వైసీపీ నాయ‌కుడు, మంత్రి అంబ‌టి రాంబాబు… స్టెప్పులు వేశారు. తెలుగువారి సంప్ర‌దాయ పండుగ సంక్రాంతి పండుగ తొలిరోజు భోగిని పుర‌స్కరించుకుని మంత్రి సొంత నియోజ‌క‌వ‌ర్గం స‌త్తెన‌ప‌ల్లి లో కూడా భోగి మంట‌లు వేశారు. స‌త్తెన‌ప‌ల్లి గాంధీ చౌక్ సెంట‌ర్లో ఏర్పాటు చేసిన భోగి మంట‌ల‌ను అంబ‌టి రాంబాబు రాజేశారు. ఈ కార్య‌క్ర‌మానికి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌తోపాటు.. చుట్టుప‌క్క‌ల ఉన్న వారు కూడా పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాంబాబు అదిరిపోయేలా …

Read More »

15 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు… జ‌న‌సేన‌కు తేలిన లెక్క‌!

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు ఇచ్చే సీట్ల విష‌యాన్ని చంద్ర‌బాబు తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. మొత్తం 175 స్థానాల అసెంబ్లీలో 15 స్థానాల‌ను జ‌న‌సేన‌కు కేటాయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. దీనిపై సుదీర్ఘంగా శ‌నివారం రాత్రంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా రెండు పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా.. జ‌న‌సేన‌కు కేటాయించిన‌ట్టు తెలిసింది. అదేవిధంగా జంపింగుల విష‌యం కూడా ఇరు పార్టీల నేత‌ల …

Read More »

రేవంత్ బిజీబిజీ

ఢిల్లీలో రేవంత్ రెడ్డి బాగా బిజీబిజీగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇప్పటికే చాలాసార్లు రేవంత్ ఢిల్లీకి వచ్చారు. పార్టీ అగ్రనేతలు, అధిష్టానం ఢిల్లీలోనే ఉండటంతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయక రేవంత్ కు తప్పటంలేదు. రేవంత్ అనే కాదు జాతీయపార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఇది తప్పదు. అందుకనే అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే రేవంత్ కనీసం 15 రోజులు ఢిల్లీలోనే గడిపారు. సరే  …

Read More »

ఏపీ మొత్తం మీదే హీటెక్కిన కాన్‌స్టెన్సీ… స‌మఉజ్జీల ఫైటింగ్‌…!

ఎన్నిక‌లు అన‌గానే స‌హ‌జంగానే పార్టీల మ‌ధ్య పోరు ఉంటుంది. ఇక‌, ఆయా పార్టీలు టికెట్లు ఇచ్చే నాయ‌కు ల మ‌ధ్య కూడా ఆస‌క్తిక‌ర పోటీ నెల‌కొంటుంది. ఇది ఎక్క‌డైనా కామ‌న్‌. కానీ, రెండు అతి పెద్ద పార్టీల నుంచి రంగంలోకి దిగే నాయ‌కులుకూడా అతి పెద్ద నేత‌తైలే.. రాజ‌కీయంగా స‌మ ఉజ్జీలైతే.. ఆ పోరును ఊహించడం.. ఎవ‌రు గెలుస్తారు? అనేది అంచ‌నా వేయ‌డం అంత తేలిక‌కాదు. ఇప్పుడు ఇలాంటి పోరే.. …

Read More »

వైసీపీలో దొర‌బాబు దారి మారుతోందా…!

వైసీపీ ఎమ్మెల్యే, పిఠాపురం నాయ‌కుడు పెండెం దొర‌బాబు దారెటు?  ఆయ‌న ఏ పార్టీలో చేర‌నున్నారు? ఇదీ.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం స‌హా.. తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌రుగుతున్న భారీ చ‌ర్చ‌. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం దొరబాబుకు  టికెట్ నిరాకరించిన విష‌యం తెలిసిందే. ఈ టికెట్‌ను ఎంపీ వంగా గీత‌కు కేటాయించారు. టికెట్ కోసం దొర‌బాబు ఎంతో ప్ర‌య‌త్నించినా.. ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లే దు. వైసీపీ అధిష్టానం ఎంపీ గీత‌వైపు మొగ్గు …

Read More »

నాలుగేళ్ల త‌ర్వాత‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ర‌ఘురామ‌

ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్ల త‌ర్వాత‌.. వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురానికి వ‌చ్చారు. వైసీపీతో విభేదించిన త‌ర్వాత‌.. ఆయ‌న దాదాపు ఢిల్లీకే ప‌రిమితం అయ్యారు. సొంత నియోజ‌క‌వ‌ర్గానికి రావాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీ ప్ర‌భుత్వం ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేయ‌డం ఖాయ‌మ‌ని భావించిన ఆయ‌న‌.. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఇక్క‌డ అభివృద్ధి విష‌యంలో …

Read More »