ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే.. దాని తాలూకు పర్యవసానం.. దాడులు.. హింస వంటివి కొన్నేళ్ల వరకు కూడా రాష్ట్రాన్ని వెంటాడనున్నాయి. అంటే.. ఆయా కేసుల్లో ఇరుక్కున్న నాయకులు.. చేసిన నేతలు.. అందరూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో.. పోలింగ్ వ్యవహారం.. ఇలా టెన్షన్ రేపింది. ఇక, ఇప్పుడు మరో కీలక విషయం తెరమీదికి వచ్చింది. అదే.. కౌంటింగ్. వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. రాష్ట్ర …
Read More »మాచర్లపై పవన్ ఎందుకు సైలెంట్ ?
మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన విధ్వంసకాండకు ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలవంచుకుంది. ఓ ఎమ్మెల్యే అయి ఉండి ఈవీఎంను, వీవీ ప్యాట్ను ధ్వంసం చేసిన తీరు అన్ని వర్గాల ప్రజలకూ ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రజస్వామ్య దేశంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదని, పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలూ ఈ ఘటనను తీవ్రంగా …
Read More »సీతక్కకు పార్టీ పగ్గాలు.. ఫలితాల తర్వాత ముహూర్తం!
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మారబోతున్నారా? అధ్యక్షురాలిగా సీతక్క బాధ్యతలు తీసుకోవడం ఖాయమా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ అధ్యక్షురాలిగా సీతక్కను కాంగ్రెస్ హైకమాండ్ నియమించే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫలితాల తర్వాత పీసీసీ మార్పు ఉంటుందని హైకమాండ్ సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో తర్వాత ప్రెసిడెంట్ ఎవరూ అనే చర్చ జోరందుకుంది. ఇందులో సీతక్క వైపే …
Read More »మోడీదే అధికారం.. కానీ.. తారుమారైన అంచనాలు!
పోలింగ్ జరుగుతున్న సమయంలో పార్టీల బలాబలాలను అంచనా వేయడం.. ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారనే విషయాలను చెప్పడం వంటివి కూడా.. నిబంధనలకు విరుద్ధం. అదేసమయంలో ప్రజలను, ఓటర్లను కూడా ప్రభావితం చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అందుకే.. ఎన్నికల పోలింగ్ ప్రారంభానికి ముందు 48 గంటల్లో ఎవరూ అలాంటి పనులు చేయరాదని సూచనలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఎవరూ ఆగడం లేదు. ప్రధాని మోడీ వంటివారే.. ఏదోఒక రూపంలో ఓటర్లను …
Read More »జూన్ 9.. ఫ్లైట్లు, హోటళ్లు ఫుల్!
జూన్ 9.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన డేట్ ఇది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, అధికారంలోకి వచ్చే పార్టీ తరపున ఓ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఇదే. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజున జగనే రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. మరోవైపు గెలిచేది కూటమినేనని, చంద్రబాబు …
Read More »తారక్ ఫ్యాన్స్ను గిల్లుడు అవసరమా?
రాజకీయాల్లో గెలుపు అత్యవసరం అయినపుడు అందరూ కావాలి. నాయకులు అందరినీ మచ్చిక చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. కానీ గెలుపు ఖాయం అయినపుడు, గెలిచేశాక కొందరిని తక్కువ చేసేలా మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 2014లో పవన్ కళ్యాణ్ సాయంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత ఆ పార్టీ నేతలు పవన్ను తక్కువ చేసి మాట్లాడడం వివాదాస్పదమైంది. కట్ చేస్తే ఇప్పుడు ఎన్నికలు అయి ఇంకా …
Read More »జూన్ 2… ఏపీని అనాధను చేస్తోందా?
ఈ మాట అనేందుకు ఒకింత ఇబ్బందిగానే ఉన్నా.. తప్పదు. ఎందుకంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి.. జూన్ 2వ తేదీకి 10 ఏళ్లు నిండుతున్నాయి. దీంతో విభజన ద్వారా ఏర్పడిన తెలంగాణలో అక్కడి ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఏపీవైపు ఒక్క నాయకుడు కూడా.. ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ఇక్కడ ఎలానూ సంబరాలు చేసుకునేది లేదు. కానీ, ఇక్కడ చర్చకు రావాల్సింది.. విభజన చట్టం. ఎందుకంటే.. పదేళ్ల …
Read More »క్రాస్ ఫైరింగ్ ఎవరికి తగిలేను ?!
ఏపీలో లోక్ సభ, శాసనసభ స్థానాలకు ఏకకాలంలో జరిగిన పోలింగ్ లో క్రాస్ ఓటింగ్ బెడద అభ్యర్థులను వణికిస్తున్నది. ఓటర్ల క్రాస్ ఫైరింగ్ కు బలయ్యే అభ్యర్థులు ఎవరు అన్న చర్చ జోరుగా నడుస్తున్నది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నంధ్యాల పార్లమెంటు స్థానాలలో ప్రధానంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది. శ్రీకాకుళంలో టీడీపీ అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడుకు, విజయనగరంలో టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు, విశాఖలో టీడీపీ …
Read More »2014లో జరిగింది మరిచారా?
ప్రతి ఒక్కరికి వారికంటూ ప్రత్యేక ధోరణి ఉంటుంది. ఏ స్థాయిలో ఉన్నా తమకు అలవాటుగా వచ్చే తీరును మార్చుకోవటం అంత తేలిక కాదు. తమ తీరు వల్ల తమకు చెడ్డపేరు వస్తుందని తెలుసుకొని తమను తాము మార్చుకునే వాళ్లు కొందరు ఉంటారు. మరికొందరు మాత్రం.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. తప్పును ప్రస్తావించినా ఊరుకోలేరు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే కోవకు చెందుతారని చెబుతారు. ఆయన అంచనాలు తప్పుగా …
Read More »యువగళం తెచ్చే ఓట్లెన్ని? లెక్కలు ఇవీ..!
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ గత ఏడాది 2023, జనవరి 27న ప్రారంభించిన యువగళం పాదయాత్ర.. రాష్ట్రంలో దుమ్మురేపింది. ఎక్కడో చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్రారంభించిన ఈ యాత్ర.. అనేక ఇబ్బందులు.. అనేకానేక విరామాల అనంతరం.. విశాఖపట్నంలో ముగిసింది. మధ్య మధ్య అనేక వివాదాలు కూడా తలెత్తాయి. మొత్తానికి యాత్రను ముగించారు. అయితే.. దీనివెనుక మూడు లక్ష్యాలు ఉన్నాయి. మరి ఇవి ఏమేరకు సక్సెస్ అయ్యాయి …
Read More »పిఠాపురంలో ఇలా ఎందుకు జరక్కూడదు?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై ఇప్పటికే వందల సంఖ్యలో అంచనాలు వచ్చాయి. ఎవరి వాదన వారే వినిపిస్తున్నారు. ఇక్కడ ఎవరు మాట్లాడినా.. ఎవరు విశ్లేషించినా.. కాపు ఓటు బ్యాంకు గురించి చర్చిస్తున్నారు. మంచిదే. 75 వేలుగా ఉన్న కాపుల ఓట్లలో 60 వేలు వరకు. పవన్కు పడతాయని చెబుతున్నారు. ఇక, 68 వేలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు విషయానికి వస్తే మాత్రం …
Read More »పిన్నెల్లి అష్టదిగ్భందం.. ఈ రోజు వస్తుందని ఊహించలేదా!
ఎంత ఎగిరితే.. అంతా కిందకే పడాలి.. తప్పదు! ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి వ్యవహారం కూడా అచ్చంగా అలానే ఉంది. నాకు తిరుగులేదు.. నేను చెప్పిందే వేదం.. అనుకున్న ఆయనకు అష్టదిగ్భంధం ఎదురైంది. కాలు కదిపితే.. కేసు పెట్టమంటూ.. హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు.. తన సొంత నియోజకవర్గం మాచర్లలోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదని తేల్చి చెప్పింది. ఎవరితోనూ మాట్లాడడానికి కూడా కోర్టు ఒప్పుకోలేదు. ఎవరి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates