Political News

తెలంగాణ మ‌ళ్లీ జంపింగులు.. స్టార్ట్‌!

రాజ‌కీయాల్లో జంపింగులు కామ‌న్‌గా మారిపోయాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా.. అన్ని పార్టీల‌దీ ఇదే ప‌రిస్థితిగా మారింది. గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్‌కు, ఈ రెండు పార్టీల నుంచి బీజేపీకి ఇలా.. నామినేష‌న్లు దాఖ‌లు చేసే రోజు వ‌ర‌కు కూడా జంప్ జిలానీల సంద‌డి క‌నిపిస్తూనే ఉంది. ఇక‌, …

Read More »

జనసేనలోకి ముద్రగడ..మాగంటితో భేటీ

ఏపీలో శాసన సభ ఎన్నికలకు ముందు వైసీపీకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న ముద్రగడ పద్మనాభం హఠాత్తుగా టీడీపీ-జనసేన కూటమికి మద్దతు తెలపడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లయింది. వైసీపీలో తప్ప మరే పార్టీలో అయినా చేరతా అంటూ ముద్రగడ చెప్పడం…వైసీపీపై ఆయనకున్న వ్యతిరేకతను చెప్పకనే చెబుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఏలూరు మాజీ ఎంపీ, …

Read More »

మంగ‌ళ‌గిరిలో అన్న క్యాంటీన్‌.. భువ‌నేశ్వ‌రి చేతుల మీదుగా!

ప్ర‌స్తుతం ‘నిజం గెలవాలి’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమణి.. నారా భువ‌నేశ్వ‌రి పార్టీ నేత‌ల‌తోనూ మ‌మేక‌మ‌వుతున్నారు. పార్టీ గురించి వారికి దిశానిర్దేశం చేస్తున్నా రు. తాజాగా గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో నారా భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె కీల‌క‌మైన ప‌థ‌కంగా గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో పేర్కొన్న అన్నా క్యాంటీన్‌ను ఇక్క‌డ ప్రారంభించారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిదిలోని రేవేంద్ర‌పాడు మండ‌లంలో భువ‌నేశ్వ‌రి ఈ …

Read More »

ఆ సీటుకు టీడీపీలో మంచి డిమాండ్

ఆ టికెట్ నాకే ఇవ్వండి.. కాదు నాకే ఇవ్వండి- ఇదీ ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఒక కీల‌క నియోజక‌వ‌ర్గం నుంచి వ‌స్తున్న, వినిపిస్తున్న డిమాండ్లు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు టికెట్ల కేటాయింపుపై యుద్ధ‌మే చేస్తున్నారు. అనేక మంది ఆశావ‌హులు, వార‌సులు, సీనియ‌ర్లు, పొత్తు పార్టీ.. ఇలా ఎటు చూసినా ఎన్నో అడుగులు ఆచి తూచి వేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఉమ్మ‌డి అనంత‌పురం(ప్ర‌స్తుతం స‌త్య‌సాయి జిల్లా)లోని మ‌డ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గం …

Read More »

కేసీఆర్ ఎలక్షన్ ప్లాన్ రెడీ అయ్యిందే !

రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొందరలోనే యాక్టివ్ కావాలని కేసీయార్ రెడీ అవుతున్నారు. 8వ తేదీన మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల తర్వాత 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగసభలకు ప్లాన్ చేస్తున్నారు. 15 లేదా 16 తేదీల్లో నల్గొండలో భారీ బహిరంగసభను నిర్వహించాలని అనుకున్నారట. ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలోని సీనియర్ నేతలతో కేసీయార్ భేటీ అయ్యారు. జిల్లాలోని పరిస్ధితులను సమీక్షించారు. బహిరంగసభకు తక్కువలో తక్కువ 2 లక్షల మంది …

Read More »

కూటమిదే పై చేయా ?

తొందరలోనే జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమిదే పైచేయా ? తాజాగా వెల్లడైన ఒక సర్వే ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రైజ్ అనే సంస్థ ఏపీలోని రాజకీయ పరిస్ధితులపై సర్వే జరిపించింది. అందులో రెండుపార్టీల కూటమిదే పై చేయని స్పష్టంగా తేలిందట. సర్వే వివరాల ప్రకారం కూటమికి 94 స్ధానాలు దక్కుతాయి. వైసీపీకి 46 సీట్లు వస్తాయి. మిగిలిన 35 నియోజకవర్గాల్లో మూడుపార్టీల మధ్య హోరాహోరీ జరుగుతుందని తేలిందట. …

Read More »

కాంగ్రెస్ లో ఇంత పోటీ ఉందా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం తెలంగాణా కాంగ్రెస్ లో పోటీ పెరిగిపోయింది. టికెట్ల కోసం ఇంతమంది దరఖాస్తులు చేస్తారని పార్టీ నాయకత్వమే ఊహించలేదు. మొత్తం 17 నియోజకవర్గాలకు 306 మంది నేతలు దరఖాస్తులు చేశారు. అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 18 దరఖాస్తులు వచ్చినట్లయ్యింది. వీటిల్లో అత్యధికంగా ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ నియోజకవర్గాల్లో పోటీకి పోటీ చాలా తీవ్రంగా ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. కారణం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ …

Read More »

మీడియా అధిపతికి రాజ్యసభ ?

తొందరలోనే బీజేపీ తరపున ఒక మీడియా అధిపతికి రాజ్యసభ ఎంపీ పదవి లభించబోతోందని సమాచారం. చాలామంది మీడియా అధినేతలు బీజేపీతో బాగా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ పద్దతి దక్షిణాదిలో తక్కువే కాని ఉత్తరాధిలో చాలా ఎక్కువ. మీడియా అధినేతల నుండి వివిధ మీడియాల్లో అత్యున్నత స్ధాయిలో పనిచేస్తున్న చాలామంది బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తుంటారు. ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో బీజేపీకి బాగా దగ్గరైన మీడియా అధిపతులు లేరనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణాను వదిలేస్తే …

Read More »

టీడీపీకి రెడ్డి నేతే దొరకటం లేదా ?

వినడానికి విచిత్రంగానే ఉన్నా నిజంగా నిజమనే అంటున్నాయి పార్టీ వర్గాలు. విషయం ఏమిటంటే నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు చంద్రబాబునాయుడు గట్టి అభ్యర్ధి కోసం వెతుకుతున్నారని సమాచారం. ఆ అభ్యర్ధి కూడా రెడ్డి సామాజికవర్గం నుండి కావాలని చంద్రబాబు అనుకున్నారట. ఇపుడు నరసరావుపేట నుండి వైసీపీ తరపున డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎంఎల్ఏగా ఉన్నారు. గోపిరెడ్డిని ఓడించాలంటే టీడీపీ నుండి కూడా బలమైన రెడ్డి సామాజికవర్గంకు చెందిన నేతే …

Read More »

ఏపీ ఎన్నికల ప్రచారంలో కొత్త ముఖాలు

ఏపీలో ఎన్నిక‌లకు స‌మ‌యం దూసుకువస్తున్న ద‌రిమిలా.. కీల‌క‌మైన పార్టీలు .. ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంబించాయి. వైసీపీ సిద్ధం పేరుతో పార్టీ ప్ర‌చారాన్ని భీమిలిలో ప్రారంభించింది. అక్క‌డే సీఎం జ‌గ‌న్ పార్టీ ప్ర‌చారాన్ని శంఖారావంతో ప్రారంభించారు. ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ ద‌ఫా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని రా..క‌ద‌లిరా! నినాదంతో ప్రారంభించారు. దాదాపు ఎన్నిక‌ల‌కు దీనినే కొన‌సాగించే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ‌.. జ‌న‌సేన ఇంకేదైనా సూచిస్తే.. మార్చ‌నున్నారు. ఇక‌, జ‌న‌సేన వారాహి …

Read More »

రేవంత్ ను చెప్పుతో కొట్టాలి.. రెచ్చిపోయిన బాల్క సుమ‌న్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ నోరు పారేసుకున్నారు. తీవ్ర‌స్థాయి లో రెచ్చిపోయి ఆయ‌న హుందా త‌నం విడిచి పెట్టి ప‌క్కా రోడ్డు సైడ్ రోమియో లాగా మాట‌లు తూలారు. క‌నీసం ముఖ్య‌మంత్రి అన్న గౌర‌వం కూడా లేకుండా విక్ష‌ణ మ‌రిచి వ్యాఖ్య‌లు సంధించారు. తాజాగా సోమ‌వారం మీడియాతో మాట్లాడిన బాల్కా సుమ‌న్‌.. సీఎం రేవంత్ రెడ్డికి చెప్పు చూపించారు. “కేసీఆర్‌ను రండ …

Read More »

వైరల్ పిక్ : ఒక చిరంజీవి.. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు!

తెలుగు సినీ రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థాయిని సంపాయించుకున్న మెగాస్టార్ కు తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ‘ప‌ద్మ‌విభూష‌ణ్‌’ వంటి దేశ రెండో అత్యున్న‌త పౌర పుర‌స్కారాన్ని అందించింది. దీనిని పుర‌స్క‌రించుకుని తెలంగాణ ప్ర‌భుత్వం ఆయ‌న‌తో పాటు.. ప‌ద్మ అవార్డులు సొంతం చేసుకున్న‌వారిని తాజాగా ఘ‌నంగా స‌త్క‌రించింది. ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న ఇటు తెలంగాణ రాజ‌కీయాల్లోనూ సినీ వ‌ర్గాల్లోనేకాకుండా..అటు ఏపీలోనూ చ‌ర్చ‌నీయాంశం అయింది. ‘ఒక చిరంజీవి ఇద్ద‌రు …

Read More »