ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వ్యవహారంపై ఇటు నెటిజన్లు, అటుతెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు నివ్వెర పోతున్నారు. శనివా రం ఉదయం స్వర్గస్తులైన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు నివాళులు అర్పించేందుకు ఎక్కడెక్కడ నుచో అనేక మంది నాయకులు హైదరాబాద్కు క్యూకట్టారు. ఆరోగ్యం బాగోక పోవడంతో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం.. తన తరఫున కర్ణాటకకు చెందిన మల్లిఖార్జున ఖర్గేను పంపించి.. నివాళులర్పించారు. …
Read More »కేసీఆర్కు ఆ ఎన్నికల భయం?
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో విజయంతో కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే విజయాలు దక్కాయి. ఇక 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం కేసీఆర్ సొంతమైంది. దీంతో రాష్ట్రంలో తనకు తన పార్టీకి తిరుగులేదని ఆయన అనుకున్నారు. కానీ గత రెండేళ్లుగా పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు ఎలాంటి ఎన్నిక అయినా భయం …
Read More »ఆర్ ఆర్ ఆర్ పై వైసీపీ కత్తి!
లోక్సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును వైసీపీ ఎంపీలు.. తీవ్రంగా టార్గెట్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి ఆర్ ఆర్ ఆర్ కు మధ్య పెద్ద వారే జరిగింది. ఇద్దరూ ఢీ అంటే ఢీ అన్నట్టుగా మాటల యుద్ధం చేశారు. జీరో అవర్లో ఏపీలో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర విషయాన్ని రఘురామ లేవనెత్తారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు రెండేళ్లుగా చేస్తున్న ఉద్యమాన్ని వివరించారు. ఈ క్రమంలోనే …
Read More »జగన్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసుల్లో సీఎం జగన్ విచారణ ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన జగన్ బెయిల్ పై బయట ఉన్నారని, సీఎం హోదాలో ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని కోర్టు కొట్టవేసింది. ఇక, ప్రతి శుక్రవారం కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలన్న జగన్ …
Read More »జగనన్న ఓటీఎస్ – ఉరితాడు పథకం: CBN
ఏపీ ప్రభుత్వంపైనా.. సీఎం జగన్ నిర్ణయాలపైనా ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. ఇదేం ప్రభుత్వం అంటూ.. ఆయన నిలదీశారు. జగనన్న ఓటీఎస్-ఉరితాడు పథకాన్ని తీసుకువచ్చారంటూ.. ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ఇళ్లకు ఓటీఎస్.. పేదల మెడకు ఉరితాడుగా మారుతోందని చంద్రబాబు ఆరోపించారు. తప్పనిసరి కాదంటూనే ఓటీఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. బలవంతంగా ఓటీఎస్ పేరుతో సొమ్ము వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు వసూళ్లను విమర్శిస్తే.. కేసులు …
Read More »ఆ బూతుతో తిడతారా? వైసీపీ ఎంపీలపై రఘురామ ఫైర్
వైసీపీ నేతలకు, ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, మీడియా సమావేశాల్లో, ప్రెస్ మీట్ లలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం, దూషణలకు దిగడం చూశాం. కానీ, ఈ రోజలు లోక్ సభలో రఘురామ, ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం పెను వివాదానికి దారి తీసింది. పార్లమెంటు సాక్షిగా తనను అసభ్య పదజాలంతో …
Read More »ట్రూ అప్ చార్జీలపై యూటర్న్
ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి కూడా నెలకు దాదాపు వెయ్యి రూపాయల కరెంటు బిల్లు రావడంతో జనానికి షాక్ తగిలినట్లయింది. ఇలా హఠాత్తుగా కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ ఎందుకు కొడుతోందని అడిగితే…ట్రూ ఆప్ ఛార్జీలంటూ ఏపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో, తడిసి మోపెడవుతున్న కరెంటు బిల్లులు కట్టలేక…చేసేదేమీ లేక జనం …
Read More »జగన్ హిట్ సాంగ్ ను తెగ వాడేస్తోన్న టీడీపీ
ఏపీలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఓ పాట మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్..’ అంటూ వైసీపీ నేతలు ఆ పాటతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన ఏకైక పొలిటికల్ చార్ట్ బస్టర్ గా రికార్డు కూడా క్రియేట్ చేసింది. వాస్తవానికి కూడా, జనానికి జగన్ …
Read More »టీడీపీ సెట్టవ్వాలంటే.. వాళ్లను బయటకు పంపాల్సిందే!
ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో విజయం సాధించకపోతే తెలుగు దేశం పార్టీ పరిస్థితి ఇక అంతే అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జగన్ చేతిలో చావుదెబ్బ తిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఆ దిశగా పార్టీని సంసిద్ధం చేస్తున్నారు. కానీ పార్టీలోని కొంతమంది నాయకుల వ్యవహార శైలి ఆయనకు తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీలోనే ఉంటూ కొంతమంది నేతలు …
Read More »మేము తలచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చగలం
ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్లుగా తలపడుతున్నారు. పీఆర్సీ, పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. పది రోజుల్లో పీఆర్సీ సమస్యను పరిష్కరిస్తామని జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అందుకు సంబంధిన పత్రాలు ఇవేవి ఉద్యోగులకు అందలేదు. ఈ వివాదం ఇలా నడుస్తూ ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మాయ మాటలు నమ్మి వైసీపీకి …
Read More »కేసీఆర్ను మమతను కలిపేందుకేనా?
రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే సంకేతాలు ఇప్పటి నుంచే కనిపిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమరం మహా రంజుగా సాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓ వైపు వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే వ్యాఖ్యలు. మరోవైపు కాంగ్రెస్ను పక్కనపెట్టి మోడీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ …
Read More »టాప్ 5: రోశయ్య సత్తా చాటే 5 ఉదంతాలు
మన మధ్య ఉన్నప్పుడు గొప్పతనం తెలీదు. తిరిగి రాని లోకాలకు పయనమైన తర్వాత.. సదరు వ్యక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు వారిసత్తా తెలీటమే కాదు.. ఇలాంటి వారు ఇకపై ఉండరేమోనన్న భావన అప్పుడప్పడు కలుగుతుంది. ఎన్ని రంగాలు ఉన్నా.. సామాన్యుడి మొదలు అసమాన్యుడు వరకు అందరిని ప్రభావితం చేసే రంగం ఏదైనా ఉందంటే అది రాజకీయ రంగమే. ఎవరితో సంబంధం లేకుండా తన మానాన తాను బతికే వ్యక్తి సైతం.. రాజకీయంగా …
Read More »