Political News

చంద్ర‌బాబు అదిరిపోయే హ‌మీ.. జ‌నాలు ఫిదా!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న హామీ ఇచ్చారు. నిజానికి ఇప్ప‌టికే మినీ మేనిఫెస్టో రూపంలో ఆరు గ్యారెంటీల‌ను చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే.. పూర్తిస్థాయిలో హామీల విష‌యంలో ఇంకా ఆయ‌న క‌స‌రత్తు చేస్తున్నారు. వీటిలో తాజాగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన హామీ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన రా.. క‌ద‌లిరా! స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి వైసీపీ …

Read More »

“వైసీపీ టికెట్ ఇవ్వ‌లేదు.. అయినా పోటీ చేస్తా”

“వైసీపీకి ఏళ్ల త‌ర‌బ‌డి సేవ చేశా. నిజాయితీగా ఉన్నా. అయినా నాకు పార్టీ టికెట్ ఇవ్వ‌లేదు. దీనికి కార‌ణం ఎవ‌రో అంద‌రికీ తెలుసు. అయితే.. నేను పోటీ నుంచి విర‌మించుకోవ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తా” అని ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు ర‌క్ష‌ణ నిధి అన్నారు. తాజాగా ప్ర‌క‌టించిన వైసీపీ నాలుగో జాబితాలో తిరువూరు టికెట్‌ను పార్టీ ఇటీవ‌ల టీడీపీ నుంచి …

Read More »

మోడీ క‌న్నీటి ప‌ర్యంతం.. చిన్న‌నాటి సంగ‌తులు గుర్తు చేసుకుని!

ఎప్పుడూ గంభీరంగా క‌నిపించే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఈ రోజు నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అయితే.. క‌న్నీళ్ల‌ను ఆపుకుని.. గ‌ద్గ‌ద స్వ‌రంతో ఆయ‌న ప్ర‌సంగించారు. దీనికి కార‌ణం.. చిన్న‌నాటి సంగ‌తులు.. త‌మ కుటుంబం క‌ష్టాలు ఆయ‌న క‌ళ్ల‌ముందు క‌ద‌లాడ‌డ‌మే. గుర్తుకు రావ‌డ‌మే. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్‌లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న …

Read More »

జ‌గ‌న్ ఆస్తుల కేసులు ఇంకెన్నాళ్లు సాగ‌దీస్తారు: సుప్రీంకోర్టు

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు సంబంధించి న‌మోదైన అక్ర‌మాస్తుల కేసుల‌ను ఇంకెన్నాళ్లు సాగ‌దీస్తార‌ని సుప్రీం కోర్టు ప్ర‌శ్నించింది. ప్ర‌జాప్ర‌తినిధుల అక్ర‌మాల‌కు సంబంధించిన కేసుల‌ను సాగ‌దీస్తూ పోవ‌డం ఫ్యాష‌న్‌గా మారిపోయింద‌ని వ్యాఖ్యానించింది. పిటిష‌నర్‌(వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు) చుట్టూ ఎన్ని రాజ‌కీయ వివాదాలు ఉన్నా.. ఆయ‌న లేవ‌నెత్తిన ఒకే ఒక్క విష‌యం త‌మ‌ను ప్ర‌శ్నార్థకం చేసింద‌ని.. పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు అవ‌కాశం క‌ల్పించింద‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏం జ‌రిగిందంటే.. కొన్నాళ్ల కింద‌ట ఎంపీ …

Read More »

తెలంగాణ బీజేపీలో భారీ ట్విస్టులు

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణా బీజేపీ భారీ ప్రక్షాళన మొదలుపెట్టింది. ముందుగా రాష్ట్ర మోర్చాలతో పాటు 12 మంది జిల్లాల అధ్యక్షులను మార్చేసింది. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగిలిన ఆరు మోర్చాలను కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మార్చేశారు. ఇపుడు మార్చిన వాళ్ళంతా చాలా కాలంగా పదవుల్లో ఉన్న వాళ్ళే. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నపుడు కిషన్ వీళ్ళని మార్చటంపై దృష్టిపెట్టలేదు. ఎందుకంటే …

Read More »

ఈటల పోటి ఇక్కడి నుండేనా ?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారా ? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఎందుకంటే మల్కాజ్ గిరి స్ధానం నుండి పోటీచేస్తానని ఈటల పార్టీ అగ్రనేతలను అడిగారు. ఈ విషయాన్ని ఈటలే స్వయంగా చెప్పారు. తనకు కరీంనగర్ పార్లమెంటుకు పోటీచేయాలని బలంగా ఉందట. ఎందుకంటే కరీంనగర్ జనాలతో తనకు ప్రత్యేక అనుబంధముందట. అయితే ఇక్కడ సిట్టింగ్ …

Read More »

పోటీకే భయపడుతున్నారా ?

బీఆర్ఎస్ లో నేతల మాటలు వింటుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులను ఫైనల్ చేయటంతో పాటు నియోజకవర్గాల్లో పరిస్ధితులను సమీక్షించేందుకు ఈమధ్యనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. దాదాపు ఆరునియోజకవర్గాల్లోని నేతలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చాలామంది నేతలు ఎంపీగా పోటీచేసే విషయంలో ఆసక్తిచూపలేదని సమాచారం. అలాగే గెలుపు అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నట్లు చెప్పారని పార్టీవర్గాలు …

Read More »

వాసిరెడ్డి ప‌ద్మ‌కు అసెంబ్లీ టికెట్‌.. గెలిచేనా..!

గ‌త రెండు రోజులుగా.. వైసీపీ వ‌ర్గాల్లో వాసిరెడ్డి ప‌ద్మ పేరు మార్మోగుతోంది. తాజాగా ఆమెకు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి పిలుపు కూడా వ‌చ్చింది. ఈ రోజో రేపో.. ఆమె ముఖ్య‌మంత్రిని కూడా క‌ల‌వ‌నున్నారు . రాబోయే ఎన్నికల్లో ఆమెకు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఆమె పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. కీల‌క‌మైన జ‌గ్గ‌య్య పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమెను బ‌రిలో నిలుపుతార‌ని కూడా …

Read More »

నాలుగో జాబితా విడుదల చేసిన వైసీపీ

jagan

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల మార్పుపై వైసీపీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్చార్జిలను మూడు విడతలుగా వైసీపీ ప్రకటించింది. సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. అయినా సరే వెనక్కి తగ్గని జగన్ తాజాగా ఇన్చార్జిల మార్పునకు సంబంధించి నాలుగో …

Read More »

టీడీపీ-జ‌న‌సేన విజ‌యం అన్ స్టాప‌బుల్‌: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సినీ డైలాగుల‌తో ఉర్రూత‌లూగించారు. తాజాగా ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్కరించుకుని, ఆయ‌న జ‌న్మించిన గ‌డ్డ‌పై ‘రా.. క‌ద‌లిరా!’ స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ స‌భ ఏర్పాట్ల నుంచి నిర్వ‌హణ‌కు వ‌ర‌కు ఆద్యంత ఉద్రిక్త వాతావ‌ర‌ణంలోనే సాగింది. అయితే.. చివ‌రి మూడు గంట‌లు మాత్రం.. పోలీసులు న‌చ్చజెప్ప‌డంతో ఎమ్మెల్యే కొడాలి నాని వ‌ర్గం శాంతించింది. దీంతో స‌భ స‌జావుగా సాగిపోయింది. ఈ స‌భ‌లో తాజాగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో …

Read More »

నాపై పోటీ చేసే అభ్య‌ర్థిని వెతుక్కోండి: ర‌ఘురామ

వైసీపీ రెబ‌ల్ ఎంపీ, న‌ర‌సాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు తాజాగా వైసీపీపై స‌టైర్లు వేశారు. తన‌కు టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం టికెట్ ఇచ్చేందుకు నిరాక‌రిస్తోంద‌ని వైసీపీలో కొందరు ప్ర‌చారం చేస్తున్నార‌ని చెప్పారు. అయితే.. వాస్త‌వానికి ఈ సీటు ఎప్పుడో త‌న‌కే రిజ‌ర్వ్ అయింద‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌నసేన మిత్రప‌క్షం త‌ర‌ఫున తాను న‌ర‌సాపురం ఎంపీ సీటు నుంచే పోటీ చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ఈ విష‌యంలో రెండో మాటేలేద‌న్నారు. “అయితే.. …

Read More »

కేసీఆర్ ప‌థ‌కానికి.. రేవంత్ సొమ్ము!

మాజీ సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించి అమ‌లు చేసిన‌.. కీల‌క ప‌థ‌కానికి ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సొమ్ములు చెల్లించాల్సి వ‌స్తోంది. అప్ప‌ట్లో కేసీఆర్ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు.. ‘బ‌తుక‌మ్మ చీర‌లు’ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. అప్ప‌ట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌థ‌కానికి అర్హులైన వారిని ఎంపిక చేసి.. ఇంటికో చీర చొప్పున పంపిణీ చేసింది. ఇది కూడా కొన్ని చోట్ల వివాదాల‌కు దారితీసిన విష‌యం తెలిసిందే. …

Read More »