Political News

కేంద్ర పోలీసులు పంపండి…సీఈసీకి చంద్రబాబు రిక్వెస్ట్

ఏపీలో మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన లకు చెందిన ఓట్లను వైసీపీ నేతలు తొలగిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం బృందం విజయవాడలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని సీఈసీ అధికారులతో …

Read More »

గుంటూరు ఎంపీగా ఆలపాటి ?

రాబోయే ఎన్నికల్లో సీనియర్ తమ్ముడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి ఆలపాటి తెనాలి అసెంబ్లీ సీటును దాటి ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ ఇపుడు పరిస్ధితులు మునుపటిలా లేవు. ఎందుకంటే తెనాలిలో టికెట్ దక్కేది దాదాపు అనుమానమే. కారణం ఏమిటంటే జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఇక్కడి …

Read More »

బాలయ్య‌కు లైన్ క్లియ‌ర్ చేస్తున్న వైసీపీ…!

టీడీపీ నాయ‌కుడు, న‌ట‌సింహం, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణకు వైసీపీ లైన్ క్లియ‌ర్ చేస్తోందా? ఆయ‌న‌కు మ‌రింత మెజారిటీ ద‌క్క‌డం ఖాయంగా క‌నిపిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ(2014, 2019) బాల‌య్య హిందూపురం నుంచి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. ఈ ద‌ఫా ఇక్క‌డ ఆయ‌న‌ను ఓడించాల‌ని వైసీపీ భావించింది. అయితే.. అంత‌ర్గ‌త‌కుమ్ములాట‌లు, వైసీపీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి కార‌ణంగా.. ఇక్క‌డ స‌రైన నాయ‌కుడు వైసీపీకి క‌నిపించ‌లేదు. ఈ …

Read More »

రేవంత్ కేబినెట్ ఇకపై కింగ్ సైజ్

ఈనెలాఖరులో క్యాబినెట్ విస్తరణకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారా ? పార్టీవర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రేవంత్ కాకుండా 11మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. అంటే మరో ఆరుగురికి మంత్రివర్గంలో అవకాశముంది. ఇపుడున్న మంత్రివర్గంలో ముస్లిం మైనారిటీల నుండి ప్రాతినిద్యం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ తరపున పోటీచేసిన మైనారిటి నేతలంతా ఓడిపోయారు కాబట్టే. ఓడిపోయిన వారిలో షబ్బీర్ ఆలీ, మహ్మడ్ అజహరుద్దీన్ ముఖ్యులు. అందుకనే మంత్రివర్గాన్ని విస్తరించి …

Read More »

కోదండరామ్ కు కన్ఫర్మ్ అయ్యిందా ?

కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. దేనికంటే తొందరలోనే భర్తీ అవబోయే రెండు ఎంఎల్సీ స్ధానాలకోసం. ఈనెలాఖరులో ఎంఎల్ఏ కోటాలో ఖాళీ అయిన రెండు ఎంఎల్సీ స్ధానాల భర్తీకోసం కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిపికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. కమీషన్ జారిచేసిన నోటిఫికేషన్ ప్రకారం రెండుస్ధానాలూ కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయి. అందుకనే ఇంత ఒత్తిడి పెరిగిపోతోంది. కొందరు నేతలు రేవంత్ రెడ్డిపైన మరికొందరు నేతలు డైరెక్టుగా …

Read More »

క‌మ్మ నేత కోసం.. వైసీపీ రెడ్ల ఉద్య‌మం..

ఏపీ అధికార పార్టీ వైసీపీ అంటే.. కొన్నాళ్లుగా క‌మ్మ సామాజిక వర్గానికి వ్య‌తిరేక‌మ‌నే టాక్ ఉంది. ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో క‌మ్మ‌ల‌ను టార్గెట్ చేస్తూ.. వైసీపీ నాయ‌కులు అనేక వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా అప్ప‌టి రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌కు కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గం పేరును అంట‌గ‌డుతూ.. తీవ్ర‌విమ‌ర్శ‌లు గుప్పించారు. స్థానిక‌ల‌ను క‌రోనా కార‌ణంగా నిలిపివేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఇక‌, …

Read More »

టీడీపీతో టచ్ పై బాలినేని కామెంట్స్

మాజీ మంత్రి, సీఎం జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారం కొంతకాలంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రెండోసారి మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీ అధిష్టానంపై అలకబూనిన బాలినేని ఇంకా అలకపానుపు దిగలేదని ప్రచారం జరుగుతుంది. దాంతోపాటు, ఈసారి ఎన్నికల్లో బాలినేనికి జగన్ టికెట్ వేరే నియోజకవర్గం నుంచి కేటాయించబోతున్నారని, అది ఇష్టంలేని బాలినేని పార్టీ వీడేందుకు కూడా సిద్ధమయ్యారని పుకార్లు వచ్చాయి. తన సిట్టింగ్ స్థానం ఒంగోలు …

Read More »

ఆ రోజు కాంగ్రెస్ మా మాట విని ఉంటే.. ల‌గ‌డ‌పాటి

ఏపీ రాజ‌కీయాల్లో త‌ర‌చుగా వినిపించే పేరు విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేరే. ఆయ‌న ఎక్క‌డున్నారు.. ఏం చేస్తున్నారు.. అనేది ప‌క్క‌న పెడితే.. విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రి, హైద‌రాబాద్‌.. ఇలా ఆయ‌న ఎక్క‌డ మీడియాకు తార‌స‌ప‌డినా.. వెంట‌నే ఆయ‌న చుట్టూ రాజ‌కీయాలు ముసురుకుంటాయి. మీరు ఏ పార్టీలో చేరుతున్నారు? ఎక్క‌డ నుంచి పోటీ చేస్తున్నారు? అంటూ.. మీడియా ఆయ‌న‌ను ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేయ‌డం.. తెలిసిందే. తాజాగా ఏపీలో అసెంబ్లీ …

Read More »

కాబోయే సీఎం చంద్రబాబే: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్ది నెలల క్రితం వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీపై, సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై కోటంరెడ్డి సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. పార్టీకి రెబల్ గా మారిన కోటంరెడ్డి…తమ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. తాజాగా, చంద్రబాబు గురించి కోటంరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, టీడీపీ …

Read More »

వారికి ఏపీలో ఎంపీ సీట్లు ఇప్పిస్తా: సీఎం రేవంత్

ఏపీలో ఎంపీ టికెట్ల విష‌యంపై తెలంగాణ సీఎం, కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి చెందిన‌ కొంద‌రు అభ్య‌ర్థులు త‌న‌ను క‌లుసుకున్నార‌ని, టికెట్లు కోరుతున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ విష‌యంలో వారికి టికెట్లు ఇవ్వ‌క‌పోతే.. ష‌ర్మిల ద్వారా అయినా.. వారికి టికెట్లు వ‌చ్చేలా చేస్తానని ఆయ‌న చెప్పారు. అయితే, ఆయ‌న ఏ పార్టీ అనేది స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. ఇక‌, ఏపీ సీఎం జ‌గ‌న్ తో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా …

Read More »

ఈ సీట్ల‌న్నీ ఎన్నారైల‌కేనా…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఎన్నారైల‌కు పెద్ద‌పీట వేయ‌నుందా? మెజారిటీ స్థానాల్లో ఎన్నారై టీడీపీ నాయ‌కు ల‌కు సీట్లు కేటాయించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారా? అంటే.. ఔన‌నే చ‌ర్చే తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టికే కీల‌క‌మైన గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఎన్నారై నాయ‌కుడు వెనిగ‌ళ్ల రాముకు చంద్ర‌బా బు కేటాయించారు. దీంతో రాము ప్ర‌చారంలోనూ దూసుకుపోతున్నారు. పార్టీని గాడిలో పెట్టే కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. మినీ మేనిఫెస్టోను తీసుకుని ప్ర‌జ‌న‌లు కూడా క‌లుస్తున్నారు. ఇక‌, ఒక్క …

Read More »

అప్ప‌ట్లో వంగ‌వీటి.. ఇప్పుడు యార్ల‌గ‌డ్డ‌.. అంతా బాబు కోసం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోసం.. యాగాలు.. య‌జ్ఞాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుని.. ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయాల‌న్న ల‌క్ష్యంతో గ‌న్న‌వ‌రం టీడీపీ ఇంచార్జి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. యాగం త‌ల‌పెట్టారు. దీనిని ఆయ‌న త‌న స‌తీస‌మేతంగా ప్రారంభించారు కూడా. యాగాల‌లో కెల్లా శ్రేష్ట‌మైన‌ది.. కార్యం త‌ల‌పెట్టిన వెంట‌నే సాకారం చేసుకోగ‌లిగిందిగా పేరున్న శ‌త చండీ యాగాన్ని యార్ల‌గ‌డ్డ నిర్వ‌హిస్తున్నారు. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని …

Read More »