Political News

వైసీపీకి మ‌రో ఎంపీ రాజీనామా..

ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీ కీల‌క నాయ‌కుడు, వివాద ర‌హితుడు, గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు స‌భ్యుడు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు రాజీనామా చేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీల జాబితా మూడుకు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌ర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌.. త‌న‌కు టికెట్ ద‌క్క‌లేద‌నే అసంతృప్తితో పార్టీ కి గుడ్ బై చెప్పారు. ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఆయ‌న చేస్తున్నారు. …

Read More »

మేడిగడ్డ పై విజిలెన్స్ సంచలన నివేదిక ?

అత్యంత వివాదాస్పదమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై విజిలెన్స్ ఉన్నతాధికారులు రెడీచేస్తున్న నివేదిక సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలోని నాసిరకమంతా నివేదికలో బయటపడిందిట. బ్యారేజి పిల్లర్లు కొన్ని కుంగిపోవటం సంచలనమైంది. బ్యారేజి నాణ్యతపై కాంగ్రెస్, బీజేపీలు సంధించిన ప్రశ్నలకు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు సమాధానం కూడా చెప్పుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి అండ్ కో ఎన్నిసార్లు ప్రశ్నించినా కేసీయార్ మేడిగడ్డ ప్రాజెక్టుపై మాట్లాడకపోవటమే కాకుండా ఎవరినీ మాట్లాడద్దని …

Read More »

ఆపరేష్ ఆకర్ష్ మొదలుపెట్టిన షర్మిల

కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోగానే వైఎస్ షర్మిల ఆపరేషన్ ఆపర్ష్ మొదలు పెట్టినట్లున్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా సీనియర్ నేత, రెండుసార్లు ఎంఎల్ఏగా పనిచేసిన మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ లో చేరారు. అహ్మదుల్లా 2004, 2009లో కాంగ్రెస్ తరపున కడప ఎంఎల్ఏగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే మంత్రిగా కూడా పనిచేశారు. వైఎస్సార్ మరణంతో అహ్మదుల్లా రాజకీయాలకు …

Read More »

జన్ మత్ జోస్యం నిజమవుతుందా ?

తొందరలోనే జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలపై జన్ మత్ సర్వే సంస్ధ తన జోస్యాన్ని రిలిజ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లాగానే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కంటిన్యు అవుతుందని చెప్పింది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటి స్ధానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు రెడీ అవుతున్నాయి. ప్రతిపార్టీ దేనికదే ప్రత్యేక వ్యూహాన్ని రెడీ చేసుకుంటున్నాయి. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో తక్కువలో తక్కువ 15 సీట్లను గెలుచుకోవాలని …

Read More »

ప‌వ‌న్‌ పై ఆశ‌లు.. కాపుల మౌనం.. మౌనం…!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను రాజ‌కీయంగా ఉన్నత స్థాయిలో చూడాల‌నేది కాపు సామాజిక వ‌ర్గం అభిలాష.. ఆశ కూడా. ఈ క్ర‌మంలోనే కాపులు అంతా సంఘ‌టితం కూడా అవుతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు గ‌త రెండు వారాలుగా కాపులు మౌనంగా ఉన్నారు. ఇంత‌కు ముందుకు.. ఇప్ప‌టికి.. చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. గ‌తంలో ప‌వ‌న్ కోసం.. ఏమైనా చేసేందుకు రెడీ అన్న కొంద‌రు నాయ‌కులు …

Read More »

వైసీపీలో కొత్త భ‌యం.. రంగంలోకి అధిష్టానం!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొత్త భ‌యం ప‌ట్టుకుంది. ఔను ఇది నిజ‌మే. గ‌త 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌పై వ‌చ్చిన నివేదిక‌లు, అందిన స‌మాచారం నేప‌థ్యంలో వైసీపీ ఇప్పుడు ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డింది. దీనికికార‌ణం.. త‌మ‌కు ఎవ‌రో ప్ర‌త్యేకంగా శ‌త్రువులు రాలేదు. త‌మ వారే త‌మ‌కు శ‌త్రువులుగా మారుతుండ‌డ‌మే! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజ‌మేన‌ని ఐప్యాక్ టీం తాజాగా వెల్ల‌డించింది. విష‌యం ఏంటంటే.. మార్పులు …

Read More »

మాజీ మంత్రి ‘పేట’ మారుతున్నారా ?

తెలుగుదేశంపార్టీకి సంబంధించి రెండుపేటల్లోను ఇపుడిదే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఇపుడు విషయం ఏమిటంటే గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాలు చాలా కీలకం. చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బాగా సీనియర్ నేత. మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు. 2014-19 మధ్య మంత్రిగా కూడా పనిచేశారు. ఇంతటి చరిత్రున్న ప్రత్తిపాటికి రాబోయే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ లేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి అంటే పార్టీనేతల్లోనే బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని …

Read More »

ఆళ్ల‌తో మొద‌లు.. ఇక‌, చేరిక‌లు షురూ!

ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల‌కు.. కొత్త చేరిక‌ల ప్రారంభం బూస్ట్ ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోం ది. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే, ఇటీవ‌ల వైసీపీకి రాజీనామ చేసిన ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి ష‌ర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్‌లో చేరిన తొలి నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ష‌ర్మిల బాద్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ఆళ్ల రామ‌కృ ష్ణారెడ్డి కూడా అక్క‌డ‌కు చేరుకుని ఆమె …

Read More »

మణిపూర్‌ను అడ్డుపెట్టి.. ష‌ర్మిల వ్యూహం అర్ధ‌మైందా?

రాజ‌కీయాలు రాజ‌కీయాలే.. అనుబంధాలు అనుబంధాలే అన్న‌ట్టుగా కాంగ్రెస్ కొత్త చీఫ్ వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. ఏపీలోకి అడుగు పెడుతూనే.. ఆమె అన్న వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే కొన్ని సీరియ‌స్ కామెంట్లు కూడా చేశారు. ఎక్క‌డో ఈశాన్య రాష్ట్ర‌మైన‌ మ‌ణిపూర్‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. అక్క‌డ దాడులు జ‌రిగితే.. ఇక్క‌డ జ‌గ‌న్ ఎందుకు స్పందించ‌లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలోనే మ‌తం కార్డును కూడా …

Read More »

రామ మందిరం సాక్షిగా.. అప్పుడు 300.. ఇప్పుడు 400?

రాజకీయాల్లో రామ‌మందిరం చేరిపోయింది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అయో ధ్య రామమందిర ప్ర‌తిష్టా ప‌నులు.. దీనికి సంబంధించి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్న చ‌ర్య‌లు.. ప‌డిన క‌ష్టం వంటివి ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌నీయాంశం కానున్నాయి. మెజారిటీ హిందువులు ఉన్న భార‌త దేశంలో వారి సెంటిమెంటును రెచ్చ‌గొట్ట‌డం ద్వారా.. ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందాల‌నేది ప్ర‌స్తుతం కేంద్రంలోని బీజేపీ వ్యూహం. అందుకే.. అయోధ్య రామ‌మందిర నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న నిర్మించ‌డం.. అహ‌ర‌హం.. …

Read More »

క‌డ‌ప‌పై ష‌ర్మిల ఎఫెక్ట్ ఎంత‌..!

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా బాధ్య‌తలు చేప‌ట్టే వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె.. వైఎస్ ష‌ర్మిలకు భారీ ఎత్తున బాధ్య‌త‌లు ఉన్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని అదికారంలోకి తీసుకురావ‌డం ఒక ఎత్త‌యితే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పార్టీ సీనియ‌ర్ల‌ను తిరిగి పార్టికి సానుకూలంగా మార్చాల్సి న అవ‌స‌రం ఉంది. దీంతో పాటు.. వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి క‌డ‌ప పైనా ష‌ర్మిల ఎలా వ్య‌వ‌హరిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. రాష్ట్ర …

Read More »

చంద్ర‌బాబు ఇలా చేసి ఉంటే.. చిక్కులు త‌ప్పేవా..!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక‌వైపు అదికార పార్టీ వైసీపీ దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. అభ్య‌ర్థుల‌ను ప్ర‌జ‌ల నాడికి.. స‌ర్వేల స‌మాచారానికి అనుకూలంగా మారుస్తోంది. ఈ క్ర‌మంలో చిన్నపాటి వ్య‌తిరేక‌త‌లు వ‌చ్చినా.. పార్టీ ప్ర‌జ‌ల న‌నాడికి అనుగుణంగానే నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఎక్క‌డా ఎవ‌రి డిమాండ్ల‌కు త‌లవంచే ప‌రిస్థితి లేకుండా ముందుకు సాగుతోంది. మ‌రి ఇదే ప‌రిస్థితి టీడీపీలో లేదు. ఎటు చూసుకున్నా అంద‌రూ సీనియ‌ర్లే. పైగా.. నియోజ‌క‌వ‌ర్గాల్లో తిష్ట‌వేశారు కూడా. ఈ …

Read More »