ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలకు సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 59 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వక పోవడం.. లేదా.. కొందరిని సెగ్మెంట్లు మార్చడం చేసింది. టికెట్ ఇవ్వని వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చింది. అదేసమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు స్థాన చలనం కల్పించింది. ఇక, ఎంపీల్లోనూ దాదాపు 10 మంది వరకు మార్పులు చేర్పులు చేసింది. …
Read More »లావు ఎంట్రీ.. టీడీపీకి మరింత ఉత్సాహం?
వైసీపీ నాయకుడు, యువ ఎంపీ, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో ఇమడలేక, పార్టీలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలోనే తాను రాజీనామా చేసినట్టు ఆయన చెప్పారు. అయితే..ఇప్పుడు ఆయన చూపు టీడీపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది. లావు తండ్రి.. లావు పెదరత్తయ్య.. వాస్తవానికి టీడీపీకి అనుకూలం. వీరి యూవర్సిటీ ఏర్పాటు సహా అనేక సందర్భాల్లో టీడీపీ సర్కారు సహాయం …
Read More »కాంగ్రెస్ పార్టీ మా కుటుంబంలో చిచ్చు పెడుతోంది: జగన్
వైసీపీ అధినేత, సీఎం జగన్ తాజాగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు కనీసం కాంగ్రెస్ పేరు కూడా పలకని ఆయన ఇప్పుడు ఆకస్మికంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా గతం కూడా తవ్వుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేయడంలో ముందుందని అన్నారు. ప్రస్తుతం తమ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని జగన్ విమర్శలు గుప్పించారు. మంగళవారం తిరుపతిలో ఇండియా …
Read More »జనసేనకు గ్లాస్ గుర్తే.. ఎన్నికల సంఘం ఉత్తర్వులు
ఏపీలో కీలక పార్టీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి “గాజు గ్లాసు”ను గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ …
Read More »జనసేన-టీడీపీల మధ్య చిచ్చే టార్గెట్.. ఇది ఎవరి కుట్ర?
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు రెడీ అయిన.. ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనలు ఇప్పటికే ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి ముందుకు సాగుతున్నాయి.ఈ క్రమంలోనే యువగళం ముగింపు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఉమ్మడిగా పాల్గొన్నారు. ఇక, రా..కదలిరా! సభల్లోనూ కలిసి పాల్గొనేలా ప్లాన్ చే్స్తున్నారు. పరస్పరం ముందుకు దూసుకుపోతున్నారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి మరీ వ్యూహ ప్రతివ్యూహాలు రెడీ …
Read More »ఇండియా కూటమికి దీదీ గుడ్ బై
2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమిని గద్దె దించేందుకు ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన మోడీ సర్కార్ ను ఈ సారి ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది. అయితే, ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి అందులోని పార్టీల మధ్య ఐకమత్యం లోపించిందని విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ…ఇండియా కూటమికి అంటిముట్టునట్లు ఉంటున్నారని ముందు …
Read More »బీఆర్ఎస్ మళ్ళీ ఫోకస్ పెట్టిందా ?
తొందరలో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంపై బాగా ఫోకస్ పెట్టింది. ప్రచారానికి సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్ ఫారంను మ్యాగ్జిమమ్ ఉపయోగించుకోవాలన్నది టార్గెట్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రయత్నంచేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎందుకంటే అప్పట్లో సిట్టింగులపైన జనాల్లో ఉన్న విపరీతమైన వ్యతిరేకతే ప్రధాన కారణంగా నిలిచింది. సిట్టింగులపైన వ్యతిరేకత కారణంగా పార్టీ తరపున ఎంత పాజిటివ్ ప్రచారం చేయించినా ఉపయోగం కనబడలేదు. …
Read More »షర్మిల ఎంట్రీ: చంద్రబాబుకు పనితగ్గుతుందా?
టీడీపీ అధినేత చంద్రబాబుకు పనితగ్గుతుందా? ఆయన ఇక, తన ఆవేశాన్ని.. పార్టీకే పరిమితం చేసు కుంటే సరిపోతుందా? ఇక నుంచిఆయన వైసీపీ సర్కారుపై పెద్దగా నోరు చేసుకోవాల్సిన అవసరం కూడా తగ్గుతుందా?.. ఇవీ ప్రస్తుతం టీడీపీ రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్న అంశాలు. దీనికి ప్రధాన కారణం.. ఇప్పటి వరకు వైసీపీపైనా.. వైసీపీ పాలనపైనా ఎవరూ చేయని విధంగా విమర్శలు చేస్తూ.. ఎవరూ కార్నర్ చేయని అంశాలను కూడా కార్నర్ …
Read More »రాజకీయాలకు గల్లా దూరం.. 28న ఏం జరుగుతుంది?
ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీడీపీ నాయకుడు, గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ రాజకీయా లకు దూరం కానున్నట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారని కొన్నాళ్లుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అసలు ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయన వర్గం చెబుతోంది. తాజాగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు కూడా జరుగుతోందని సమాచారం. ఇప్పటికే గల్లా జయదేవ్ …
Read More »పార్టీల ఉచిత జపం రీజన్ ఇప్పుడు తెలిసిందా..!
ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేరుగా ప్రజలకు డబ్బులు పంచుతోంది. ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల పైచిలు కు సొమ్మును ప్రజలకు నేరుగా పంపిణీ చేసినట్టు సీఎం జగన్ స్వయంగా చెబుతున్నారు. ఈ లెక్క ఇంకా ఎక్కువగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో మరిన్ని పథకాల ప్రకటనకు కూడా వైసీపీ రెడీ అవుతోంది. ఇప్పటికే అమ్మ ఒడి, ఆసరా, నాడు-నేడు, ఇళ్లు వంటి …
Read More »లోకేష్ వద్ద రెడ్ డైరీ.. తన దగ్గర పీఆర్ డైరీ
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో సినీ అభిమానులను సంపాయించుకున్న క్యారెక్టర్ నటుడు పృధ్వీ రాజ్.. తాజాగా రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. గతంలో ఆయన వైసీపీ తరఫున ప్రచారం చేయ డం తెలిసిందే. అనంతరం.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎస్వీబీసీ చానెల్ చైర్మన్గా కూడా వ్యవహరిం చారు. అయితే.. కొన్ని ఆరోపణలతో ఆయనను పక్కన పెట్టారు. అయితే.. తను చెప్పేది వినకుండానే తనను పక్కన పెట్టారని.. అప్పట్లోనే పృధ్వీ ఆరోపించారు. …
Read More »కష్టపడ్డవారికే ప్రయారిటీయా ?
రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదవుల పంపిణీలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అందులోను మొన్నటి ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసినవారికి, పార్టీ గెలుపుకోసం కష్టపడిన వారికే పదవుల పంపిణీలో టాప్ ప్రాయారిటి ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని అధిష్టానంతో చెప్పి ఆమోదం పొందిన తర్వాత పదవుల కేటాయింపు మొదలుపెట్టారు. మల్లురవి, వేం నరేందర్ రెడ్డి, హర్కార వేణుగోపాల్, షబ్బీర్ ఆలీని ప్రభుత్వ సలహదారులుగా నియమించటం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates