Political News

చీప్ లిక్క‌ర్ హామీ.. మ‌హిళ‌ల కోస‌మే.. సోము కామెంట్లు

బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మాట‌ల తూటాలు పేల్చ‌డంలో ఎక్క‌డా వెనుక‌డుగు వేయడం వేయ‌డం లేదు. విజ‌య‌వా డ‌లో నిర్వ‌హించిన ప్ర‌జా ఆగ్ర‌హ స‌భ‌లో సోము మాట్లాడుతూ.. కోటి మంది త‌మ‌కు ద‌న్నుగా నిల‌వాల‌ని అన్నారు. అదేస‌మయం లో తాము అధికారంలోకి వ‌స్తే.. చీప్ లిక్క‌రును 70 రూపాయ‌ల‌కే విక్ర‌యిస్తామ‌ని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఆర్థిక ప‌రిస్థితి బాగుంటే.. ఈ ధ‌ర‌ను 50 రూపాయ‌ల‌కే త‌గ్గిస్తామ‌ని వ్యాఖ్యానించారు. అయితే.. …

Read More »

సీఎం సార్ స‌హ‌క‌రిస్తారా? ఎమ్మెల్యేల ఎదురు చూపు!

రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేల ఎదురు చూపులు త‌ల‌కో విధంగా ఉన్నాయి. ఎవ‌రి స‌మ‌స్య‌లు వారివి. ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గాలు వారివి. ఎక్క‌డ ఉండాల్సిన స‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయి. అయితే.. కొంద‌రు ఎమ్మెల్యేల స‌మ‌స్య‌లు చాలా చిత్రంగా ఉన్నాయి. త‌మ‌కు ఓటు బ్యాంకుతో సంబంధం లేక‌పోయినా.. స‌ద‌రు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అంతేకాదు.. ఆయా స‌మ‌స్య‌లు త‌మ‌పై ప్ర‌భావం చూపుతున్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. అదే.. స‌రిహ‌ద్దు ప్రాంత ఎమ్మెల్యేలు. మ‌న …

Read More »

రాజుగారి లాయర్లు ఫుల్ హ్యాపీ

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం భలే విచిత్రంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు విషయంలో తొందరలోనే సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికి ఇదే విషయమై సీబీఐ ప్రత్యేక కోర్టులో వేసిన పిటీషన్ను కొట్టేశారు. అక్కడ నుండి హైకోర్టులో కేసు వేశారు. ఇక్కడ విచారణ అయిపోయి తీర్పును రిజర్వులో ఉంచారు. అయితే చివరి రోజు విచారణలో న్యాయమూర్తి చాలా తీవ్రంగానే స్పందించారు. రాజు లాయర్ కు సాక్ష్యాలు ఏవంటూ …

Read More »

నోరు జారి.. ఇచ్చిన హామీ.. సోముకు ప‌ద‌వీ గండం!

Somu Veeraju

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ప‌రిస్థితి చేయి దాటి పోవ‌డం ఖాయం. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. ఆర్ ఎస్ ఎస్ వాది సోము వీర్రాజు చేసిన‌ ఒకే ఒక్క కామెంట్‌.. సంప్ర‌దాయ బీజేపీ వాదుల‌ను పార్టీకి దూరం చేసే ప్ర‌మాదాన్ని తీసుకువ‌చ్చింది. అంతేకాదు.. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వ‌ర‌కు మీడియా ఇప్పుడు ఆయ‌న‌ను ఏకేస్తోంది. దీంతో సోము వ్యాఖ్య‌ల‌పై …

Read More »

రాధా నామాట విను.. చంద్ర‌బాబు స‌ల‌హా

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సాధార‌ణంగా.. ఉద‌యం 8 గంట‌ల త‌ర్వాత కానీ.. ఏ ప‌నినీ మొద‌లు పెట్ట‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న విప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి.. కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. అదే అధికారంలో ఉండి ఉంటే.. ఆ లెక్క వేరు. ఉద‌యం 6 గంట‌లకే ప‌నులు ప్రారంభించేవారు. అయితే.. ఆయన బుధ‌వారం అనూహ్యంగా ఉద‌యం 6 గంట‌ల‌కే లైన్‌లోకి వ‌చ్చేశారు. తెల‌తెల వారుతూనే ఆయ‌న చ‌ర్య‌లు ప్రారంభించారు. ఒక‌వైపు పార్టీ కీల‌క …

Read More »

టీడీపీలో మూడు ముక్క‌లాట‌!

ఏపీలో ఖాళీగా ఉన్న ఇన్చార్జ్ పదవులను పార్టీ అధినేత చంద్రబాబు వేగంగా భర్తీ చేస్తూ వస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గాలపై కూడా ఆయన సమీక్షించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల‌ ఇన్చార్జి పదవులను భ‌ర్తీ చేస్తున్న బాబు పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు – చింతలపూడి నియోజకవర్గాల‌పై దృష్టి పెట్ట‌డంలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త ఇన్చార్జిలుగా ఎవ‌రిని ఎంపిక‌ చేస్తారా ? …

Read More »

31 కేసులున్న జ‌గ‌న్‌కు సీఎం పోస్ట్ ఇచ్చి త‌ప్పు చేశారు.. సోము వీర్రాజు

రాష్ట్ర బీజేపీ నాయ‌కులు విజయవాడలో నిర్వ‌హిస్తున్న‌ ప్రజాగ్రహ సభ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు, హాట్ కామెంట్ల‌కు వేదిక‌గా మారింది. ఈ సభలో వైసీపీ సర్కారు వైఫల్యాలను పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ఎండగట్టారు. సీఎం జగన్.. లేనిపోని వైరాలతో ఏపీని అభివృద్ధికి దూరం చేశారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతేకాదు.. 31 సీబీఐ కేసులున్న జ‌గ‌న్‌కు సీఎం పోస్టు …

Read More »

చిరు సినిమాకు చంద్ర‌బాబు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంకే స‌మ‌స్యా లేన‌ట్లు సినిమా టికెట్లు, థియేట‌ర్ల వ్య‌వ‌హారాన్ని నెత్తికెత్తుకుంది అక్క‌డి యంత్రాంగం. ఉన్న‌తాధికారులు థియేట‌ర్ల మీద దాడులు చేస్తుంటే.. మంత్రులు టికెట్ల ధరల అంశం మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్ర‌భుత్వ తీరుకు వ్య‌తిరేకంగా ఎవ‌రు కాస్త నోరు విప్పినా.. వారిని గ‌ట్టిగా కౌంట‌ర్ చేస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రుల టార్గెట్‌గా మారాడు నేచుర‌ల్ స్టార్ నాని. టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వ తీరును …

Read More »

వివేకా హ‌త్య‌లో అరెస్టులు ఉన్నాయి.. మాజీ మంత్రి

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చిన్నాన్న హ‌త్య కేసుపై బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, క‌డ‌ప జిల్లాకు చెందిన కీల‌క నేత .. ఆది నారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో వైసీపీ ప్ర‌భుత్వంపైనా ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో తన పేరు ప్రచారం చేశారని.. కానీ కోర్టుల జోక్యంతో అసలు కథ బయటికి వచ్చిందన్నారు. …

Read More »

ఇంకొక్క ఏడాదే జ‌గ‌న్ పాల‌న‌

విజ‌య‌వాడ‌లో జ‌రుగుతున్న బీజేపీ ప్రజాగ్ర‌హ స‌భ‌లో ఆ పార్టీ నేత‌లు ఏపీ స‌ర్కారుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ నాయ‌కుడు, తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ శార‌దా పీఠం అధిప‌తి ప‌రిపూర్ణానంద స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2022 చివర్లో కానీ.. 2023 మొదట్లోనే వైసీపీ పాలన పోతుందన్నారు. జ‌గ‌న్‌కు శంక‌రగిరి మాన్యాలు త‌ప్పేలా లేవ‌ని వ్యాఖ్యానించారు. 2022 జనవరి తర్వాత ఏపీలో వేసే ప్రతి అడుగు..  2024లో …

Read More »

అధికారంలోకి వ‌స్తే.. రూ.70కే చీప్ లిక్క‌ర్‌

రాష్ట్ర బీజేపీ నాయ‌కులు విజయవాడలో నిర్వ‌హించిన‌ ప్రజాగ్రహ సభ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు, హాట్ కామెంట్ల‌కు వేదిక‌గా మారింది.  ఈ సభలో వైసీపీ సర్కారు వైఫల్యాలను పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ఎండగట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్ర‌జాగ్ర‌హ‌ సభను చూసి చాలామంది ఇబ్బంది భయపడుతున్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు. జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే …

Read More »

బెయిల్‌పై ఉన్న నేతలు ఎప్పుడైనా జైలుకే

ఏపీ బీజేపీ నాయ‌కులు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హిస్తున్న ప్ర‌జాగ్ర‌హ స‌భ‌లో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్‌నేత ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి.. ప‌రోక్షంగా మ‌రింత తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బెయిల్‌పై ఉన్న‌వారు.. ఎప్పుడైనా.. జైలుకు వెళ్లొచ్చ‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఏపీలో చాలామంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. వాళ్లు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చని జావదేకర్‌ అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నా …

Read More »