Political News

మోడీ పంజాబ్ టూర్ భ‌గ్నం.. మరో కుట్ర‌?

పంజాబ్లో ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాల కార‌ణంగా.. ఆయ‌న ప‌ర్య‌ట‌న నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. ఇది దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌కు దారితీసింది. ఇక‌, ఇప్పుడు ఈ అంశంపై జరుగుతున్న దర్యాప్తు కీల‌క మ‌లుపు తిరిగింది. మోడీ ప‌ర్య‌ట‌న‌ను భ‌గ్నం చేయ‌డం వెనుక‌.. వేర్పాటు వాద‌.. సిక్కు సంస్థ ఖ‌లిస్థానీ ఉన్న‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలోనే ద‌ర్యాప్తును  నిలిపివేయాలంటూ బెదిరింపు సందేశాలు వచ్చాయని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. …

Read More »

ఇదేం న్యాయం జ‌గ‌న‌న్నా?

సంక్రాంతి ముంగిట‌.. ఏపీ ప్ర‌బుత్వం తీసుకున్న నిర్ణ‌యం.. సానుభూతి ప‌రుల‌ను కూడా విస్మ‌యానికి గురి చేస్తోంది. సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌లోపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో సినిమా టికెట్ల వివాదం కొన‌సాగుతూనేఉంది.  సినిమా నిర్మాణాల‌కు సంబంధం లేకుండా.. అన్ని సినిమాల‌కు ఒకే టికెట్ ధ‌ర ఉండాల‌నే నిర్ణ‌యానికి తోడు.. సినిమా టికెట్ల‌ను 1970ల స్థాయికి దింపేశారంటూ.. నెటిజ‌న్లు ఫైర‌వుతున్నారు. దీనివ‌ల్ల క్వాలిటీ దెబ్బ‌తింటుందని కూడా అంటున్నారు. ఈ విష‌యంపై …

Read More »

టీడీపీ యంగ్ టైగర్.. ప్లాన్ చేంజ్?

రాబోయే ఎన్నిలకు సంబంధించి శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీలో పెద్దమార్పులే జరగబోతున్నాయట. టీడీపీ యంగ్ టైగర్ గా క్రేజ్ అందుకుంటున్న శ్రీకాకుళం ఎంపీ ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో లేరని సమాచారం. నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. మరి ఎంపీ సీటును కాదని అసెంబ్లీకి ఎందుకు పోటీ చేయాలని కింజరాపు అనుకుంటున్నారనే విషయంలో క్లారిటి లేదు. …

Read More »

షర్మిల పార్టీ గురించి బొత్స షాకింగ్ కామెంట్స్

అధికార వైసీపీలో ఒక్కొక్కళ్ళు వైఎస్ షర్మిల పార్టీపై మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు మంత్రులు, సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులు ఎవరు కూడా షర్మిల గురించి మాట్లాడటానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే రెండుసార్లు కామెంట్లు చేశారు. మిగిలిన వారిని మీడియా అడిగినా మౌనంగా సమాధానంగా చెప్పేవారు. తాజాగా మంత్రి బొత్సా సత్యనారాయణ మాట్లాడుతూ షర్మిల ఏపీలో పార్టీ పెట్టినా తమకొచ్చే నష్టం ఏమీలేదన్నారు. ఇప్పటికే …

Read More »

చంద్రబాబుకు జనసేన చాలెంజ్

ఒకవైపు జనసేనతో పొత్తుకు చంద్రబాబునాయుడు లవ్ ప్రపోజల్ పంపితే రిటర్న్ లో జనసేన చంద్రబాబునాయుడుకు షరతులు విధిస్తున్నది. జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము చంద్రబాబుకుందా అంటు చాలెంజ్ చేశారు. 2014లో రాష్ట్రం కోసం పవన్ భేషరతుగా చంద్రబాబుకు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని బొలిశెట్టి గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో భేషరతుగా పవన్ కు మద్దతిచ్చి ముఖ్యమంత్రిని …

Read More »

జ‌గ‌న్ ఇమేజ్.. వైసీపీని కాపాడుతుందా?

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్(పీకే) పని చేశారు. ఆ ఎన్నికల్లో జగన్ ఇమేజ్ కు తోడు పీకే వ్యూహాలు పనిచేశాయి. ముఖ్యంగా ఒక్క ఛాన్స్‌.. పాద‌యాత్ర వంటివి వైసీపీకి ప్ల‌స్ అయ్యాయి. గత ఎన్నికల్లో జగన్ వేవ్ తుఫానులా కొనసాగడంతో ప్రతిపక్ష పార్టీలు అడ్ర‌స్ కోల్పోయాయ‌నే చెప్పాలి. వైసీపీకి ఏకంగా 151 సీట్లు రాగా, టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. జనసేనకు ఒక్క …

Read More »

మ‌రోసారి రెచ్చిపోయిన బండి

తెలంగాణ బీజేపీ సార‌థి బండి సంజ‌య్ మ‌రోసారి రెచ్చిపోయారు. కేసీఆర్‌కు వార్నింగుల‌పై వార్నింగులు సంధించారు. అధికారంలో ఉన్నామని సీఎం కేసీఆర్ విర్రవీగుతున్నారని, కొమ్ములు విరిచేస్తామ‌ని హెచ్చ‌రించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామేనని ఈ విష‌యం గుర్తుంచుకోవాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. జైలుకు వెళ్లడం తమకు కొత్తేమీ కాదన్నారు. హనుమకొండలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై బీజేపీ నిరసన సభ నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, …

Read More »

ఏపీ స‌ర్కారుకు మ‌రో సెగ‌

Jagan

ఏపీ స‌ర్కారుకు కొత్త సెగ తగిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు తాము ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చామం టూ.. ప‌దే ప‌దే చెప్పుకొంటున్న వైసీపీ స‌ర్కారుకు పెద్ద ఇబ్బందే వ‌చ్చింది. అదే స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌. గ‌త ఏడాదిన్న‌ర కింద‌ట‌.. ఈ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన స‌ర్కారు గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల పేరిట‌.. ఏర్పాటు చేసింది. దీనికి గాను ఉద్యోగుల‌ను కొత్త‌గా నియ‌మించారు. తాజాగా సీఎం జ‌గ‌న్ చేసిన పీఆర్సీ ప్రకటనతో స‌చివాల‌య ఉద్యోగులు.. …

Read More »

డిపాజిట్లు కూడా రాని పార్టీ బీజేపీ: క‌విత

తెలంగాణ బీజేపీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లు తెలిసిన‌వే. పార్టీ చీఫ్ బండి సంజ‌య్ నుంచి నాయ‌కులు అంద‌రూ కూడా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు  అధికార టీఆర్ ఎస్ నుంచి కీల‌క నేత‌లు ఎవ‌రూ పెద్ద‌గా కౌంట‌ర్ ఇవ్వ‌లేదు. బండి వ్యాఖ్య‌ల‌పై కొన్నాళ్ల కింద‌ట సీఎం కేసీఆర్ రియాక్ట్ అయ్యారు త‌ప్ప‌.. మిగిలిన నాయ‌కులు ఎవ‌రూ స్పందించ‌లేదు. కానీ, తాజాగా.. అస్సో సీఎం హిమంత బిస్వ‌శ‌ర్మ‌.. తెలంగాణ‌కు వ‌చ్చారు. …

Read More »

ఎన్నికల కోసం కొత్త ప్లాన్?

వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంతో చంద్రబాబునాయుడు సరికొత్త వ్యూహాన్ని వర్కవుట్ చేయబోతున్నారు. అంటే ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించినా ఎందుకనో లాంచ్ చేయలేదు. అందుకనే తొందరలోనే తన సరికొత్త వ్యూహాన్ని అమల్లోకి తేవాలని డిసైడ్ అయ్యారు. ఇంతకీ సరికొత్త ప్లాన్ ఏమిటంటే సేవామిత్ర అనే వ్యవస్ధను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని కుప్పంలో చంద్రబాబు ప్రకటించారు. ప్రతి వందమంది ఓటర్లకు ఒక యువకుడిని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. పార్టీలోకి యువత …

Read More »

జ‌గ‌న్‌కు ఒక్క ఛాన్సే.. ఆఖ‌రి ఛాన్స్‌: CBN

రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పంలో మూడోరోజు పర్యటించిన ఆయన.. వైసీపీ నాయకుల వేధింపులు భరించలేక ఎస్సీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బెదిరింపు రాజకీయాలకు అలవాటు పడిన జగన్.. పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులతో పులివెందుల పంచాయతీ చేశారని ఆరోపించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్సే..ఆఖరి ఛాన్స్‌ కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రిటైర్‌మెంట్‌ బెన్‌ఫిట్స్‌ను రెండేళ్లు వాయిదా వేసేందుకే.. జ‌గ‌న్ ప్రభుత్వం పదవీ విరమణ …

Read More »

అందుకేనా అమ‌రావ‌తి నినాదం!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన ర‌ఘురామ కృష్ణంరాజు తాజాగా మ‌రో బాంబు పేల్చారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న ఆయ‌న ఇప్పుడు త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ఘురామ‌పై అనర్హ‌త వేటు వేయాల‌ని వైసీపీ ఎంపీలు లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. …

Read More »